Publish Date:Jan 30, 2025
ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్ల జగన్ పాలనకు చరమగీతం పాడుతూ రాష్ట్ర ప్రజలు తీర్పు ఇచ్చారు. వారి తీర్పు మేరకు అఖండ మెజారిటీతో విజయం సాధించిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. అలా చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం కూటమి కొలువుదీరి కూడా ఏడు నెలలు గడిచిపోయింది. పాలన సజావుగా సాగుతోంది. అభివృద్ధి పరుగులు పెడుతోంది. జగన్ ఐదేళ్ల హయాంలో క్షణంక్షణం భయపడుతూ బితుకు బితుకు మంటూ గడిపిన జనం ఇప్పుడు స్వేచ్ఛగా ఆనందంగా ఉన్నారు. తమ ఆస్తులకు భ్రదత లేదన్న భయం నుంచి బయటపడ్డారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. శాంతి భద్రతల సమస్య లేదు. అయితే ఇది మాత్రం సరిపోతుందా? అంటే ఏ మాత్రం సరిపోదంటున్నారు జనం. మరి వారేం కోరుకుంటున్నారు? జగన్ హయాంలో అడ్డగోలు దోపిడీలకు, కబ్జాలకు పాల్పడిన వారిని చట్టం ముందుకు తీసుకు వచ్చి శిక్ష పడేలా చేయాలని కోరుకుంటున్నారు. అయితే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపించడం లేదు. జగమెరిగిన కబ్జాదారులపై కూడా ఇప్పటి వరకూ కేసులు నమోదు కావడం లేదు. అలాంటి కబ్జాదారుల గురించిన సమాచారం ప్రభుత్వానికి తెలియదా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక వేళ తెలిసినా ప్రభుత్వ యంత్రాంగం వారిపై కేసులు నమోదు చేయడానికి ఇసుమంతైనా సుముఖంగా లేదా? యంత్రాంగంపై ప్రభుత్వానికి పట్టు లేదా అన్న అనుమానాలు బలంగా వ్యక్తం అవుతున్నాయి.
ఇందుకు తాజాగా వెలుగులోకి వచ్చిన మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల కబ్జా ఉదంతమే నిదర్శనం. ఒక ప్రముఖ దిన పత్రికలో పెద్ది రెడ్డి భూ కబ్జాలపై, అటవీ భూముల ఆక్రమణలపై వార్తా కథనం వచ్చింది. ఆ కథనంలో పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి విలాసవంతమైన ఫామ్ హౌస్ నిర్మాణం కోసం అటవీ భూములను ఎలా దోచుకున్నారో?, ఆ ఫామ్ హౌస్ కోసం అటవీ భూములలో రోడ్డు వేయడానికి మార్కెట్ కమిటీ నిధులను ఎలా మళ్లించారో విపులంగా వివరణ ఉంది. దీంతో అలర్ట్ అయిన చంద్రబాబు ప్రభుత్వం పెద్దిరెడ్డి అటవీ భూముల ఆక్రమణ, మార్కెట్ కమిటీ నిధుల మళ్లింపుపై దర్యాప్తునకు ఓ జాయింట్ కమిటీని ఏర్పాటు చేసిందిన. చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ, అనంతపురం ఫారెస్ట్ కన్సరేటర్ లు ఈ కమిటీలో ఉన్నారు. ఇక్కడ వరకూ బానే ఉంది, కానీ అధికార పగ్గాలు చేపట్టిన ఏడు నెలల తరువాత, అదీ ఒక పత్రికలో పెద్దిరెడ్డి భూ కబ్జాలు, అటవీ భూముల ఆక్రమణల గురించిన వార్త వస్తే తప్ప చంద్రబాబు సర్కార్ కు ఆ విషయం తెలియలేదా? ఇంత కాలం ఆ ప్రాంతంలో అధికారులుగా ఉన్న వారు ఈ విషయాన్ని ప్రభుత్వానికి ఎందుకు నివేదించలేదు. వారంతా పెద్దిరెడ్డికి తొత్తులుగా వ్యవహరించారా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.
అంతే కాదు పేరుకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా, పాలనా యంత్రాంగం అంతా ఇంకా జగన్ మనుషులతోనే నిండిపోయి ఉందా? జగన్ హయాంలో ఆయన అండ చూసుకుని దోపిడీలకు, కబ్జాలకూ పాల్పడిన పెద్దిరెడ్డి వంటి వారిని కాపాడటం కోసమే ప్రభుత్వ యంత్రాంగం పని చేస్తోందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. ఒక్క పెద్ది రెడ్డి ఉదంతమే కాదు.. కొద్ది రోజుల కిందట వైఎస్ వెంకటరెడ్డి అనే జగన్ సమీప బంధువుకు నిబంధనలకు తిలోకాలిచ్చి మరీ అధికారులు సున్నపురాయి గని లీజును కట్టబెట్టారు. తెలుగుదేశం కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ తరువాత ఆ లీజును రద్దు చేశారనుకోండి అది వేరే విషయం. కానీ వరుసగా స్వల్ప వ్యవధిలో వెలుగులోకి వచ్చిన ఈ రెండు ఉదంతాలనూ చూస్తుంటే.. చంద్రబాబు సర్కార్ కు ప్రభుత్వ యంత్రాంగంపై పట్టే లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తం ప్రభుత్వ యంత్రాంగానికి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని లేకుంటే ప్రభుత్వ ప్రతిష్ఠ మసకబారడం తధ్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ycp-politics-in-kutami-government-39-192084.html
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.