కౌంటింగ్ రోజు గలాభాకు వైసీపీ ప్రణాళికలు క్లియర్.. అడ్డుకునుందుకు ఈసీ రెడీ అయ్యిందా?

Publish Date:May 30, 2024

Advertisement

ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం గ‌ద్దె దిగేందుకు స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ఐదేళ్లుగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అరాచ‌క పాల‌న‌కు మే 13న జ‌రిగిన పోలింగ్‌లో ప్ర‌జ‌లు ఓటు ద్వారా చెక్‌పెట్టారు. ఆ ఫ‌లితాలు జూన్‌ 4న వెల్ల‌డి కానున్నాయి. పోలింగ్ జ‌రిగిన తీరును బ‌ట్టి త‌మ ఓట‌మి ఖాయ‌మైంద‌ని ఇప్ప‌టికే వైసీపీ ఓ అంచ‌నాకు వ‌చ్చింది. పోలింగ్ రోజు బెదిరింపుల‌తో, ఘ‌ర్ష‌ణ‌ల‌తో ఓటింగ్ శాతం పెర‌గ‌కుండా వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశారు. కానీ, ప్ర‌భుత్వ ప్ర‌జావ్య‌తిరేక పాల‌న‌పై ఆగ్ర‌హంతో ఉన్న ప్ర‌జ‌లు అర్ధ‌రాత్రి 2గంట‌ల వ‌ర‌కు క్యూలైన్ల‌లో వేచి ఉండి మరీ త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. అయినా ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ నేత‌లు రెచ్చిపోయారు. పోలింగ్ బూత్‌ల‌లో ఈవీఎంల ద్వంసంతోపాటు, త‌మ‌కు అనుకూలంగా పోలింగ్ జ‌రిగేలా ప్ర‌య‌త్నాలు చేశారు. అయితే, రాష్ట్రం మొత్తం ప‌రిస్థితిని చూస్తే పోలింగ్ రోజు వైసీపీ అధిష్టానం ప్లాన్ కు పోలీసులు, ఎన్నిక‌ల అధికారులు కొంత‌మేర‌ అడ్డుక‌ట్ట వేశారు.

దీంతో ఓట‌మి ఖాయ‌మ‌ని త‌మ అంత‌ర్గ‌త స‌ర్వేల ద్వారా  జ‌గ‌న్ ఆయ‌న వ‌ర్గానికి స్ప‌ష్ట‌త వ‌చ్చేసింది. కూట‌మి విజ‌యం ఖాయ‌మైన క్ర‌మంలో.. కూట‌మి విజ‌యానికి అడ్డుక‌ట్ట వేసేలా వైసీపీ కుట్ర‌ల‌కు తెర‌లేపింది. ఇందుకోసం రెండు ప్లాన్ల‌ను సిద్దం చేసింది. కౌంటింగ్ రోజు కూట‌మి విజ‌యాన్ని అడ్డుకొనేందుకు ప్ర‌య‌త్నాలు చేయడం , అలాకాని ప‌క్షంలో కూట‌మి అభ్య‌ర్థులు ప్ర‌జా మ‌ద్ద‌తుతో కాదు.. ఈసీ స‌హ‌కారం, దొంగ ఓట్ల ద్వారా గెలిచారంటూ ముద్ర‌వేయ‌డం. ఈ రెండు ప్లాన్లుకూడా వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఆధ్వ‌ర్యంలో అమ‌లుకాబోతున్న‌ట్లు వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. 

 ఏపీలో పోలింగ్ జ‌రిగిన తీరునుచూస్తే వైసీపీ ఓట‌మి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఆ విష‌యం వైసీపీ అధిష్టానంతో పాటు ఆ పార్టీ నేత‌ల‌కు కూడా అర్ధం అయిపోయింది. కానీ, వైసీపీ అధిష్టానం, పెద్ద‌లు మాత్రం మ‌న‌మే గెలుస్తున్నామ‌ని కార్య‌క‌ర్త‌ల‌కు భ‌రోసా ఇస్తున్నారు. ఇలా ఏ రాజ‌కీయ పార్టీ నేత‌లైనా చేస్తారు. అందులో త‌ప్పుప‌ట్టాల్సిన ప‌నిలేదు. కానీ, వైసీపీ అధిష్టానం మరో అడుగు ముందు కేసి కౌటింగ్ రోజు పెద్ద ఎత్తున అల్ల‌ర్లు సృష్టించాల‌ని ప్లాన్ వేసింది. ఆ విషయం  ప‌సిగ‌ట్టిన ఇంటెలిజెన్స్  వ‌ర్గాలు, ఈసీ  రాష్ట్ర పోలీస్ బ‌ల‌గాల‌ను అప్ర‌మ‌త్తం చేశాయి. వైసీపీ నేత‌లు కౌంటింగ్ రోజు అల్ల‌ర్లు సృష్టించ‌టానికి సిద్ధ‌మ‌య్యార‌న్న విష‌యం ఆ పార్టీ నేత స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మాట‌ల ద్వారా తేట‌తెల్ల‌మైంది.  రెండు రోజుల క్రితం రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న వైసీపీ పోలింగ్ ఏజెంట్ల‌తో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ  స‌మావేశంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం రూల్స్ మ‌నం పాటించాల్సిన ప‌ని లేద‌ని, ప్ర‌తి అంశంపై అభ్యంత‌రాలు లేవ‌నెత్త‌డం ద్వారా కౌటింగ్ స‌మ‌యంలో గంద‌ర‌గోళం సృష్టించాల‌న్న రీతిలో దిశా నిర్దేశం చేయ‌డం ఏపీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అంతేకాదు.. రూల్స్ ఫాలో అయ్యే వారు ఏజెంట్లుగా వెళ్లొద్దు.. గొడ‌వ‌లు చేసే వారే కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లాలని సజ్జల చెప్ప‌డం హాట్ టాపిక్ గా మారింది.

వైసీపీ కౌంటింగ్‌ ఏజెంట్ల స‌మావేశం అనంత‌రం స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి కూట‌మి అభ్య‌ర్థులు విజ‌యం సాధించేందుకు 100శాతం అవ‌కాశాలు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో కౌంటింగ్ ఏజెంట్ల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశం అయిన‌ట్లు తెలుస్తోంది. ఈ స‌మావేశంలో వారికి కీల‌క  సూచ‌న‌లు చేసిన‌ట్లు వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. కౌంటింగ్ హాల్‌లో ఈవీఎంలు సీల్ తీసే విష‌యంలో, లెక్కించే విష‌యంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా పెద్ద రాద్దాంతం చేయాల‌ని స‌ద‌రు ఏజెంట్ల‌కు చెప్పిన‌ట్లు స‌మాచారం. కౌంటింగ్ కేంద్రాల వ‌ద్ద‌కు తాము ఎంపిక చేసిన వైసీపీ నేత‌లు వ‌స్తారు. వారి వెంట‌ భారీగా కార్య‌క‌ర్త‌ల‌ను తీసుకొని కౌంటింగ్‌ కేంద్రాల వ‌ద్ద ఉంటారు. కౌంటింగ్ హాల్‌లో ఏ చిన్న అవ‌కాశం దొరికినా అభ్యంత‌రాలు లేవ‌నెత్తండి. గొడ‌వ చేయండి. అవ‌స‌ర‌మైతే ఈవీఎంల‌ను బ‌ద్ద‌ల‌కొట్టేయండి. వెంట‌నే కౌంటింగ్ హాల్ నుంచి బ‌య‌ట‌కువ‌చ్చి వైసీపీ నేత‌ల‌కు సిగ్న‌ల్ ఇవ్వండి.. త‌రువాత జ‌ర‌గాల్సిన గొడ‌వ‌ను వారు చూసుకుంటారు. కొంద‌రు పోలీసులు, అధికారులు మ‌న‌కు మ‌ద్ద‌తుగా ఉంటారు. వారి స‌హ‌కారంతో కౌంటింగ్ కేంద్రం వ‌ద్ద వీరంగం సృష్టించండి. వీలుప‌డితే ఈవీఎం బాక్సుల‌ను మాయం చేసేందుకు సైతం వెనుకాడొద్దు. అలాంటివారే కౌంటింగ్ కేంద్రంలోకి ఏజెంట్లుగా వెళ్లండి.. అంతా ప‌క్కా ప్లాన్‌తో జ‌రిగిపోవాలి. ఏజెంట్లపై కేసులైనా వారిని కాపాడుకునే బాధ్య‌త‌ను వైసీపీ అధిష్టానం తీసుకుంటుంద‌ని స‌జ్జ‌ల క్లియ‌ర్ క‌ట్‌గా చెప్పిన‌ట్లు వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది.   

స‌జ్జ‌ల వ్యాఖ్య‌ల‌తో వైసీపీ అధిష్టానం రెండు వ్యూహాల‌ను సిద్ధం చేసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. మొద‌టిది కౌంటింగ్ కేంద్రంలో ప్ర‌తి చిన్న విష‌యానికి అభ్యంత‌రం చెప్ప‌డం ద్వారా గొడ‌వ‌ను సృష్టించి కౌంటింగ్ ప్ర‌క్రియ‌ను నిలిపివేయ‌డం. అదే స‌మ‌యంలో వీలుదొరికితే ఈవీఎంల‌ను  ద్వంసం చేయడం. రెండోది.. కౌంటింగ్ స‌మ‌యంలో అభ్యంత‌రాలు లేవ‌నెత్తి గంద‌ర‌గోళం సృష్టించండం. త‌ద్వారా ప్ర‌జా మ‌ద్ద‌తుతో కాదు.. ఈసీ అండ‌దండ‌ల‌తో, దొంగ ఓట్ల‌తో కూట‌మి అధికారంలోకి వ‌చ్చింద‌నే వాద‌న‌ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లడం. కౌంటింగ్ కేంద్రం వ‌ద్ద‌ గొడ‌వ మొద‌లుపెట్టిన వెంట‌నే దానిని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతం ప్ర‌చారం చేసేందుకు వైసీపీ సోష‌ల్ మీడియా, పార్టీ అనుకూల చానెల్స్‌ సిద్ధంగా ఉంటాయి. కూట‌మి అభ్య‌ర్థులు వంద శాతం గెలుస్తార‌ని వైసీపీ అధిష్టానం భావిస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ రెండింటిలో ఏదోఒక ప్లాన్ అమ‌లు జ‌ర‌గాల‌ని వైసీపీ త‌ర‌పున కౌంటింగ్ కేంద్రాల్లో పాల్గొనే ఏజెంట్ల‌కు స‌జ్జ‌ల స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. అయితే కౌంటింగ్ రోజు వైసీపీ అధిష్టానం ప్లాన్‌ను ఎన్నిక‌ల సంఘం ఎలా ఎదుర్కొంటుంద‌నేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. స‌జ్జ‌లతోపాటు వైసీపీలోని కీల‌క నేత‌ల‌ను అరెస్టు చేయ‌డం లేదా హౌస్ అరెస్ట్ చేయ‌డం ద్వారా కౌంటింగ్ ప్ర‌క్రియ ప్ర‌శాంతం జ‌రిగే అవ‌కాశం ఉంటుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.  ఈసీ సైతం వైసీపీ కీల‌క నేత‌ల‌ను ముంద‌స్తుగా హౌస్ అరెస్టులుచేసే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. మొత్తానికి కౌంటింగ్ రోజు నేష‌న‌ల్ మీడియాసైతం ఏపీపైనే ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్ట‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

By
en-us Political News

  
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది...
ఈ సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే.
కేసీఆర్ పేరు చెప్పుకుని కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
ఈ సారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రేవంత్ కూడా ప్రతి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.