వైసీపీ నేత‌ల కొత్త‌రాగం.. జగన్ కొత్త వ్యూహమేనా!?

Publish Date:Feb 14, 2025

Advertisement

వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఆ పార్టీ నేత‌లు అధికార మ‌దంతో వ్య‌వ‌హ‌రించారు.  వైఎస్ జ‌గ‌న్ ద‌గ్గ‌ర నుంచి కింది స్థాయి కార్య‌క‌ర్త‌ల వ‌ర‌కు మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంద‌న్న ధీమ‌తో హ‌ద్దులు మీరి ప్ర‌వ‌ర్తించారు. ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌ను ఇబ్బందుల‌కు గురిచేయ‌డంతోపాటు.. సామాన్య ప్ర‌జ‌ల‌నుసైతం నానా ర‌కాలుగా ఇబ్బందులు పెట్టారు. సీన్ క‌ట్ చేస్తే గ‌త ఎన్నిక‌ల్లో ఓటు ద్వారా వైసీపీకి ప్ర‌జ‌లు గ‌ట్టి గుణ‌పాఠం చెప్పారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత కూడా కొంద‌రు వైసీపీ నేత‌లు నోరుపారేసుకుంటున్నారు. ఇంకా మేమే అధికారంలో ఉన్నామ‌న్న భ్ర‌మ‌ల్లోనే ఉన్నారు. అయితే ఇప్పుడు   సీన్ రివ‌ర్స్ అవుతోంది. ఐదేళ్లు అధికారం మ‌త్తులో హ‌ద్దులు మీరి ప్ర‌వ‌ర్తించిన వైసీపీ నేత‌ల‌పై కూట‌మి ప్ర‌భుత్వం కొర‌డా ఝుళిపిస్తోంది.

వైసీపీ హ‌యాంలో అవినీతి అక్ర‌మాల‌ను వెలికితీస్తూ ఒక‌వైపు.. అధికారం మ‌త్తులో నోరుపారేసుకున్న నేత‌ల‌పై మ‌రో వైపు కేసులు న‌మోదు చేసి చ‌ట్ట‌ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకుంటున్నది. దీంతో వైసీపీ నేత‌ల్లో భ‌యం ప‌ట్టుకుంది. చాలా మంది వైసీపీ నేత‌లు తమ వంతు ఎప్పుడొస్తుందోన‌న్న భ‌యంతో వ‌ణికిపోతున్నార‌ు. ఈ క్ర‌మంలో వైసీపీ నేత‌లు కొత్త‌రాగం అందుకుంటున్నారు. వ‌ల్ల‌భ‌నేని వంశీ అరెస్టుతో ఒక్కొక్క‌రుగా బ‌య‌ట‌కు వ‌చ్చి త‌మ‌కు జ్ఞానోద‌యం అయింద‌న‌ట్లుగా మాట్లాడుతున్నారు. అయితే, వైసీపీ నేత‌లు అందుకున్న కొత్త‌రాగం వెనుక ఏమైనా వ్యూహం ఉందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పరిశీలకులు కూడా పక్కా వ్యూహంతోనే వైసీపీ నేతలు కొత్త రాగం అందుకున్నారని విశ్లేషిస్తున్నారు. 

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత వైసీపీ హ‌యాంలో అవినీతికి పాల్ప‌డిన పార్టీ నేత‌ల‌పై కేసులు న‌మోదు చేస్తోంది. మ‌రోవైపు ఐదేళ్ల కాలంలో అధికార మ‌దంతో హ‌ద్దులుమీరి మాట్లాడిన వారిపైనా కేసులు న‌మోదు చేసి జైళ్ల‌కు పంపిస్తోంది. ఈ క్ర‌మంలోనే మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వ‌ల్ల‌భ‌నేని వంశీపై పోలీసులు కేసు న‌మోదు చేసి అరెస్టు చేశారు. గ‌తంలో గ‌న్న‌వ‌రం టీడీపీ కార్యాల‌యంపై దాడి కేసులో వంశీ నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసు విచార‌ణ జ‌రుగుతున్న స‌మ‌యంలోనే ఆయన ముంద‌స్తు బెయిల్  కోసం హైకోర్టు పిటీష‌న్ దాఖ‌లు చేశారు. టీడీపీ కార్యాల‌యంపై దాడి కేసులో కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్ స‌త్య‌వ‌ర్ద‌న్ ఫిర్యాదుదారుడిగా ఉన్నాడు. అయితే, స‌త్య‌వ‌ర్ధ‌న్ ను కిడ్నాప్ చేసి బెదిరింపుల‌కు గురిచేయ‌డంతో త‌న‌కు టీడీపీ కార్యాల‌యంపై దాడి కేసుకు ఎలాంటి సంబంధం లేద‌ని ఇటీవ‌ల కోర్టులో చెప్పించారు. ఆ త‌రువాత స‌త్య‌వ‌ర్ధ‌న్ కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు అస‌లు విష‌యంపై కూపీలాగ‌గా.. స‌త్య‌వ‌ర్ధ‌న్ ను కిడ్నాప్ చేసి, బెదిరించి అలా చెప్పించార‌ని పోలీసులు గుర్తించారు. దీంతో స‌త్య‌వ‌ర్ధ‌న్ ఎస్సీ కులానికి చెందిన వ్య‌క్తి కావ‌డంతో కిడ్నాప్ కేసు కింద వంశీతో పాటు మ‌రికొంద‌రిపై అట్రాసిటీ కేసును న‌మోదు చేసిన పోలీసులు.. వ‌ల్ల‌భ‌నేని వంశీని అరెస్టు చేశారు. కోర్టు ఆయనకు 14రోజులు రిమాండ్ విధించింది. దీంతో వంశీతో పాటు మ‌రో ఇద్ద‌రిని పోలీసులు విజ‌య‌వాడ‌లోని జిల్లా జైలుకు త‌ర‌లించారు. వంశీని త‌మ క‌స్ట‌డీలోకి తీసుకొని పోలీసులు విచారించ‌నున్నారు. ఈ ఘ‌ట‌న త‌రువాత వైసీపీ నేత‌ల్లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొంద‌రు వంశీకి మ‌ద్ద‌తుగా మాట్లాడుతుండ‌గా.. మ‌రికొంద‌రు వంశీని పార్టీనుంచి బ‌హిష్క‌రించాల‌న్న వాద‌న‌ను తెర‌పైకి తెస్తున్నారు.

గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ ఓట‌మి త‌రువాత ఆ పార్టీకి చెందిన ప‌లువురు నేత‌లు వ‌ల్ల‌భ‌నేని వంశీ, కొడాలి నాని, రోజా వంటి నేత‌ల తీరుతోనే వైసీపీ ఓట‌మి పాలైంద‌ని ప‌లు సంద‌ర్భాల్లో చెప్పుకొచ్చారు. గ‌తంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సైతం ఇలాంటి వ్యాఖ్య‌లే చేశారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి టార్గెట్‌గా తమ పార్టీ నేతలు చేసిన కామెంట్స్‌ను..టీడీపీ అస్త్రంగా మల్చుకుందని కేతిరెడ్డి గతంలో కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.  చంద్రబాబు కంటతడి పెట్టుకోవడంతో ఆ ఇష్యూను సానుభూతిగా మల్చుకోవడంలో కూటమి సక్సెస్ అయిందని కేతిరెడ్డి చెప్పుకొచ్చారు. ప్ర‌స్తుతం వ‌ల్ల‌భ‌నేని వంశీ అరెస్టు త‌రువాత కొంద‌రు వైసీపీ నేత‌లు వంశీ, కొండాలి నాని, రోజా మాట తీరు వ‌ల్ల‌నే ఓడిపోయామ‌ని బ‌హిరంగంగా చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వాసుపల్లి గణేష్ అయితే.. తమ పార్టీ నేతలు ప్రత్యర్థులను వ్యక్తిగతంగా టార్గెట్‌ చేయడం వల్లే గత ఎన్నికల్లో ఓడిపోయామ‌ని చెప్పారు. విజయసాయిరెడ్డి మాదిరిగా వల్లభనేని వంశీ, కొడాలి నాని కూడా పార్టీని వీడి వెళ్లిపోతే మంచిదన్నట్లుగా ఆయన మాట్లాడారు. మాజీమంత్రి రోజా ఆచితూచి మాట్లాడితే మంచిదని సూచించారు. విజయసాయిరెడ్డి పార్టీని వీడటం శుభసూచకమన్న వాసుపల్లి.. ఆయన ఇచ్చిన తప్పుడు సమాచారం వల్లే ఉత్తరాంధ్రలో పార్టీ ఓడిపోయింద‌న్నారు. పార్టీ కార్యకర్తల సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాల్సిన సాయిరెడ్డి.. పార్టీకి సమస్యగా మారారని అన్నారు. సాయిరెడ్డి జగన్‌ను మిస్ గైడ్ చేశారని చెప్పారు. సాయిరెడ్డి వల్లే రుషికొండ ప్యాలెస్ కట్టాల్సి వచ్చిందంటూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వాసుప‌ల్లితో పాటు ప‌లువురు వైసీపీ నేత‌లు వంశీ అరెస్టును స‌మ‌ర్ధిస్తున్నారు. 

వ‌ల్ల‌భ‌నేని వంశీ అరెస్టు త‌రువాత వైసీపీ నేత‌లు కొత్త‌రాగం అందుకోవ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వైసీపీ ఓట‌మికి ప్ర‌ధాన కార‌ణం.. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీసుకున్న నిర్ణ‌యాలే. ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌తో పాటు వైసీపీ ప్ర‌భుత్వ త‌ప్పుడు విధానాల‌ను ప్ర‌శ్నించిన సామాన్య ప్ర‌జ‌ల‌ను జ‌గ‌న్ తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. రాజ‌ధాని లేని రాష్ట్రంగా ఏపీని త‌యారు చేశారు. పోల‌వ‌రం ప‌డ‌కేసింది. రాష్ట్రంలో క‌నీసం రోడ్ల‌పై గుంతలు కూడా పూడ్చకుండా జగన్ ఐదేళ్ల పాలన అంతా కక్ష సాధింపునకే కేటాయించారు. జగన్ తీరు కారణంగా  ప‌నులులేక ల‌క్ష‌లాది మంది పేద ప్ర‌జ‌లు ప‌క్క‌రాష్ట్రాల‌కు   వ‌ల‌స‌ వెళ్లిన ప‌రిస్థితి.  వైసీపీ ఐదేళ్ల కాలంలో ఏపీ అన్నిరంగాల్లో వెనుక‌బ‌డి పోయింది. దీంతో వైసీపీ మ‌రోసారి అధికారంలోకి వ‌స్తే రాష్ట్రాన్ని జ‌గ‌న్ తాక‌ట్టు పెట్టేస్తారన్న భ‌యంతో ప్ర‌జ‌లు కూట‌మి ప్ర‌భుత్వానికి ఓటువేసి వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదాను కూడా ఇవ్వ‌లేదు. అయితే, దారుణ ఓట‌మి త‌రువాత కూడా ప్ర‌జ‌ల‌కు నేను మంచే చేశానంటూ జ‌గ‌న్ స్టేట్‌మెట్లు ఇస్తుండ‌టం గ‌మ‌నార్హం. తాజాగా వల్ల‌భ‌నేని వంశీ అరెస్టు త‌రువాత వైసీపీ నేత‌లు కొత్త‌రాగం అందుకున్నారు. జ‌గ‌న్ మెరుగైన పాల‌న అందించారని, కానీ, వ‌ల్ల‌భ‌నేని వంశీ, కొడాలి నాని, విజ‌య‌సాయిరెడ్డి, రోజా వంటి నేత‌లు హ‌ద్దులు మీరి మాట్లాడి వైసీపీపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త భావం ఏర్ప‌డేలా చేశారంటూ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. త‌ద్వారా వైసీపీ ఓడిపోయింది జ‌గ‌న్  వల్ల కాదు కొందరు వైసీపీ నేత‌లు నోరుపారేసుకోవ‌టం వ‌ల్ల‌నేన‌న్న వాద‌న‌ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లేలా ప్ర‌య‌త్నిస్తున్నారు.  వంశీ అరెస్టుపై జగన్ స్పందించకపోవడం చూస్తుంటే.. ఈ వ్యూహాన్ని రచించి, పార్టీ నేతల చేత అమలు చేయిస్తున్నది స్వయంగా జగనేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తద్వారా ఐదేళ్ల పాలనలో తన తప్పిదాలకు కొందరు పార్టీ నేతలను బలిచ్చేసి తాను సుద్దపూసగా మళ్లీ జనం ముందుకు రావాలని జగన్ ప్రయత్నిస్తున్నారంటున్నారు. 

By
en-us Political News

  
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
ప్రజాస్వామ్య విలువలతో కూడిన పాలనకు, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎలాంటి అరమరికలూ లేకుండా మిత్రధర్మాన్ని తప్పకుండా నడపిన వాజ్ పేయి స్ఫూర్తిగా ముందుకు సాగాలన్న సంకేతాన్ని ఈ విగ్రహావిష్కరణ ద్వారా చంద్రబాబు ఇచ్చారని అంటున్నారు.
బెంగ‌ళూరు టు ఢిల్లీ అన్నట్లుగా ప్ర‌త్యేక ఎపిసోడ్లు న‌డిచాయి. రాహుల్ గాంధీ డీకేకి స్పెష‌ల్ మెసేజీలు పెట్టారు. క‌ట్ చేస్తే ఏదో అనుకుంటే ఏమీ కాలేదు అన్నట్లుగా క‌ర్ణాట‌క‌లో సీఎం మార్పు జరగలేదు. కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది.
2022 నవంబర్ లో అప్పటి వైసీపీ సర్కార్ రోడ్డు విస్తరణ పేరుతో మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఇప్పటం అనే కుగ్రామంలో ఇళ్ల ను కూల్చివేసింది. ఆ సమయంలో పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటించి బాధితులకు అండగా నిలిచారు. అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ గ్రామాన్ని సందర్శిస్తానని అప్పట్లో మాట ఇచ్చారు.
పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను ఇంత కాలం వ్యతిరేకిస్తూ వచ్చిన లొంగిపోయిన మావోయిస్టు నేతలు ఇప్పుడు అదే వ్యవస్థ ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని భావిస్తున్నారు. ఇందుకు తాజాగా మావోయిస్టు మాజీ అగ్రనేత మల్లోజుల ఇక ఆయుధాలు చేపట్టబోమంటూ చేసిన ప్రకటనే సాక్ష్యంగా నిలుస్తోంది.
దానం విషయంలో మాత్రం ఆయన అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం, ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీలోకి దిగడంతో.. ఇవే కోర్టులో , అలాగే స్పీకర్ ఎదుట తిరుగులేని ఆధారాలుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో దానంపై అనర్హత వేటు పడటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
మొత్తం మీద ఆ కేసులో కీలక మలుపునకు ఈ పెన్ డ్రైవ్ ఆధారం అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని దర్యాప్తు అధికారులు అంటున్నారు. ఈ కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి నివేదికను కోర్టుకు సమర్పించాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో 9 మంది అధికారులతో కలిసి ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
పార్టీ పగ్గాలు చేపట్టడానికీ, ప్రధాని మంత్రి పదవిని అధిష్టించడానికి కాంగ్రెస్ లో సమర్థత ఉన్న నేత తన సతీమణి ప్రియాంక వధేరా గాంధీ మాత్రమేనంటూ రాబర్ట్ వధేరా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఈ కార్యక్రమానికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. అలాగే వైఎస్ కుటుంబీకులంతా హాజరయ్యారు. అయితే ఈ వేడుకలకు వైఎస్ తనయ వైఎస్ షర్మిల మాత్రం హాజరు కాలేదు.
తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ పార్టీలకు ఫండ్స్ బాగానే గిట్టుబాటయ్యాయి. అయితే.. ఏపీలో పవర్‌లో ఉన్న టీడీపీ, జనసేన కంటే వైసీపీ కలెక్షన్లే ఎక్కువగా ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది.
అంబటి ఏమన్నారంటే.. 2024 ఫలితాలను అర్ధం చేసుకోవడంలో తెలుగుదేశం కూటమి పార్టీలు విఫలమయ్యాయట. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల కారణంగానే కూటమి ఆ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిందట.. ఇప్పుడు ఈ ఏడాదిన్న కాలంలో జనానికి తత్వం బోధపడి.. జగన్ పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారట. అంబటి భాష్యం విన్న వైసీపీయులే ఆశ్చర్యపోతున్నారు.
ఆదివారం తన 53వ పుట్టిన రోజు జరుపుకున్న జగన్ కు చంద్రబాబు, నారా లోకేష్, వైఎస్ షర్మిల తదితరులు సామాజిక మాధ్యమం ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు ప్రతిగా జగన్ కూడా ఒక్క మంత్రి లోకేష్ కు తప్ప మిగిలిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ రిప్లై ఇచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.