వైసీపీ నేత‌ల కొత్త‌రాగం.. జగన్ కొత్త వ్యూహమేనా!?

Publish Date:Feb 14, 2025

Advertisement

వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఆ పార్టీ నేత‌లు అధికార మ‌దంతో వ్య‌వ‌హ‌రించారు.  వైఎస్ జ‌గ‌న్ ద‌గ్గ‌ర నుంచి కింది స్థాయి కార్య‌క‌ర్త‌ల వ‌ర‌కు మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంద‌న్న ధీమ‌తో హ‌ద్దులు మీరి ప్ర‌వ‌ర్తించారు. ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌ను ఇబ్బందుల‌కు గురిచేయ‌డంతోపాటు.. సామాన్య ప్ర‌జ‌ల‌నుసైతం నానా ర‌కాలుగా ఇబ్బందులు పెట్టారు. సీన్ క‌ట్ చేస్తే గ‌త ఎన్నిక‌ల్లో ఓటు ద్వారా వైసీపీకి ప్ర‌జ‌లు గ‌ట్టి గుణ‌పాఠం చెప్పారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత కూడా కొంద‌రు వైసీపీ నేత‌లు నోరుపారేసుకుంటున్నారు. ఇంకా మేమే అధికారంలో ఉన్నామ‌న్న భ్ర‌మ‌ల్లోనే ఉన్నారు. అయితే ఇప్పుడు   సీన్ రివ‌ర్స్ అవుతోంది. ఐదేళ్లు అధికారం మ‌త్తులో హ‌ద్దులు మీరి ప్ర‌వ‌ర్తించిన వైసీపీ నేత‌ల‌పై కూట‌మి ప్ర‌భుత్వం కొర‌డా ఝుళిపిస్తోంది.

వైసీపీ హ‌యాంలో అవినీతి అక్ర‌మాల‌ను వెలికితీస్తూ ఒక‌వైపు.. అధికారం మ‌త్తులో నోరుపారేసుకున్న నేత‌ల‌పై మ‌రో వైపు కేసులు న‌మోదు చేసి చ‌ట్ట‌ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకుంటున్నది. దీంతో వైసీపీ నేత‌ల్లో భ‌యం ప‌ట్టుకుంది. చాలా మంది వైసీపీ నేత‌లు తమ వంతు ఎప్పుడొస్తుందోన‌న్న భ‌యంతో వ‌ణికిపోతున్నార‌ు. ఈ క్ర‌మంలో వైసీపీ నేత‌లు కొత్త‌రాగం అందుకుంటున్నారు. వ‌ల్ల‌భ‌నేని వంశీ అరెస్టుతో ఒక్కొక్క‌రుగా బ‌య‌ట‌కు వ‌చ్చి త‌మ‌కు జ్ఞానోద‌యం అయింద‌న‌ట్లుగా మాట్లాడుతున్నారు. అయితే, వైసీపీ నేత‌లు అందుకున్న కొత్త‌రాగం వెనుక ఏమైనా వ్యూహం ఉందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పరిశీలకులు కూడా పక్కా వ్యూహంతోనే వైసీపీ నేతలు కొత్త రాగం అందుకున్నారని విశ్లేషిస్తున్నారు. 

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత వైసీపీ హ‌యాంలో అవినీతికి పాల్ప‌డిన పార్టీ నేత‌ల‌పై కేసులు న‌మోదు చేస్తోంది. మ‌రోవైపు ఐదేళ్ల కాలంలో అధికార మ‌దంతో హ‌ద్దులుమీరి మాట్లాడిన వారిపైనా కేసులు న‌మోదు చేసి జైళ్ల‌కు పంపిస్తోంది. ఈ క్ర‌మంలోనే మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వ‌ల్ల‌భ‌నేని వంశీపై పోలీసులు కేసు న‌మోదు చేసి అరెస్టు చేశారు. గ‌తంలో గ‌న్న‌వ‌రం టీడీపీ కార్యాల‌యంపై దాడి కేసులో వంశీ నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసు విచార‌ణ జ‌రుగుతున్న స‌మ‌యంలోనే ఆయన ముంద‌స్తు బెయిల్  కోసం హైకోర్టు పిటీష‌న్ దాఖ‌లు చేశారు. టీడీపీ కార్యాల‌యంపై దాడి కేసులో కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్ స‌త్య‌వ‌ర్ద‌న్ ఫిర్యాదుదారుడిగా ఉన్నాడు. అయితే, స‌త్య‌వ‌ర్ధ‌న్ ను కిడ్నాప్ చేసి బెదిరింపుల‌కు గురిచేయ‌డంతో త‌న‌కు టీడీపీ కార్యాల‌యంపై దాడి కేసుకు ఎలాంటి సంబంధం లేద‌ని ఇటీవ‌ల కోర్టులో చెప్పించారు. ఆ త‌రువాత స‌త్య‌వ‌ర్ధ‌న్ కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు అస‌లు విష‌యంపై కూపీలాగ‌గా.. స‌త్య‌వ‌ర్ధ‌న్ ను కిడ్నాప్ చేసి, బెదిరించి అలా చెప్పించార‌ని పోలీసులు గుర్తించారు. దీంతో స‌త్య‌వ‌ర్ధ‌న్ ఎస్సీ కులానికి చెందిన వ్య‌క్తి కావ‌డంతో కిడ్నాప్ కేసు కింద వంశీతో పాటు మ‌రికొంద‌రిపై అట్రాసిటీ కేసును న‌మోదు చేసిన పోలీసులు.. వ‌ల్ల‌భ‌నేని వంశీని అరెస్టు చేశారు. కోర్టు ఆయనకు 14రోజులు రిమాండ్ విధించింది. దీంతో వంశీతో పాటు మ‌రో ఇద్ద‌రిని పోలీసులు విజ‌య‌వాడ‌లోని జిల్లా జైలుకు త‌ర‌లించారు. వంశీని త‌మ క‌స్ట‌డీలోకి తీసుకొని పోలీసులు విచారించ‌నున్నారు. ఈ ఘ‌ట‌న త‌రువాత వైసీపీ నేత‌ల్లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొంద‌రు వంశీకి మ‌ద్ద‌తుగా మాట్లాడుతుండ‌గా.. మ‌రికొంద‌రు వంశీని పార్టీనుంచి బ‌హిష్క‌రించాల‌న్న వాద‌న‌ను తెర‌పైకి తెస్తున్నారు.

గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ ఓట‌మి త‌రువాత ఆ పార్టీకి చెందిన ప‌లువురు నేత‌లు వ‌ల్ల‌భ‌నేని వంశీ, కొడాలి నాని, రోజా వంటి నేత‌ల తీరుతోనే వైసీపీ ఓట‌మి పాలైంద‌ని ప‌లు సంద‌ర్భాల్లో చెప్పుకొచ్చారు. గ‌తంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సైతం ఇలాంటి వ్యాఖ్య‌లే చేశారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి టార్గెట్‌గా తమ పార్టీ నేతలు చేసిన కామెంట్స్‌ను..టీడీపీ అస్త్రంగా మల్చుకుందని కేతిరెడ్డి గతంలో కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.  చంద్రబాబు కంటతడి పెట్టుకోవడంతో ఆ ఇష్యూను సానుభూతిగా మల్చుకోవడంలో కూటమి సక్సెస్ అయిందని కేతిరెడ్డి చెప్పుకొచ్చారు. ప్ర‌స్తుతం వ‌ల్ల‌భ‌నేని వంశీ అరెస్టు త‌రువాత కొంద‌రు వైసీపీ నేత‌లు వంశీ, కొండాలి నాని, రోజా మాట తీరు వ‌ల్ల‌నే ఓడిపోయామ‌ని బ‌హిరంగంగా చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వాసుపల్లి గణేష్ అయితే.. తమ పార్టీ నేతలు ప్రత్యర్థులను వ్యక్తిగతంగా టార్గెట్‌ చేయడం వల్లే గత ఎన్నికల్లో ఓడిపోయామ‌ని చెప్పారు. విజయసాయిరెడ్డి మాదిరిగా వల్లభనేని వంశీ, కొడాలి నాని కూడా పార్టీని వీడి వెళ్లిపోతే మంచిదన్నట్లుగా ఆయన మాట్లాడారు. మాజీమంత్రి రోజా ఆచితూచి మాట్లాడితే మంచిదని సూచించారు. విజయసాయిరెడ్డి పార్టీని వీడటం శుభసూచకమన్న వాసుపల్లి.. ఆయన ఇచ్చిన తప్పుడు సమాచారం వల్లే ఉత్తరాంధ్రలో పార్టీ ఓడిపోయింద‌న్నారు. పార్టీ కార్యకర్తల సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాల్సిన సాయిరెడ్డి.. పార్టీకి సమస్యగా మారారని అన్నారు. సాయిరెడ్డి జగన్‌ను మిస్ గైడ్ చేశారని చెప్పారు. సాయిరెడ్డి వల్లే రుషికొండ ప్యాలెస్ కట్టాల్సి వచ్చిందంటూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వాసుప‌ల్లితో పాటు ప‌లువురు వైసీపీ నేత‌లు వంశీ అరెస్టును స‌మ‌ర్ధిస్తున్నారు. 

వ‌ల్ల‌భ‌నేని వంశీ అరెస్టు త‌రువాత వైసీపీ నేత‌లు కొత్త‌రాగం అందుకోవ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వైసీపీ ఓట‌మికి ప్ర‌ధాన కార‌ణం.. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీసుకున్న నిర్ణ‌యాలే. ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌తో పాటు వైసీపీ ప్ర‌భుత్వ త‌ప్పుడు విధానాల‌ను ప్ర‌శ్నించిన సామాన్య ప్ర‌జ‌ల‌ను జ‌గ‌న్ తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. రాజ‌ధాని లేని రాష్ట్రంగా ఏపీని త‌యారు చేశారు. పోల‌వ‌రం ప‌డ‌కేసింది. రాష్ట్రంలో క‌నీసం రోడ్ల‌పై గుంతలు కూడా పూడ్చకుండా జగన్ ఐదేళ్ల పాలన అంతా కక్ష సాధింపునకే కేటాయించారు. జగన్ తీరు కారణంగా  ప‌నులులేక ల‌క్ష‌లాది మంది పేద ప్ర‌జ‌లు ప‌క్క‌రాష్ట్రాల‌కు   వ‌ల‌స‌ వెళ్లిన ప‌రిస్థితి.  వైసీపీ ఐదేళ్ల కాలంలో ఏపీ అన్నిరంగాల్లో వెనుక‌బ‌డి పోయింది. దీంతో వైసీపీ మ‌రోసారి అధికారంలోకి వ‌స్తే రాష్ట్రాన్ని జ‌గ‌న్ తాక‌ట్టు పెట్టేస్తారన్న భ‌యంతో ప్ర‌జ‌లు కూట‌మి ప్ర‌భుత్వానికి ఓటువేసి వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదాను కూడా ఇవ్వ‌లేదు. అయితే, దారుణ ఓట‌మి త‌రువాత కూడా ప్ర‌జ‌ల‌కు నేను మంచే చేశానంటూ జ‌గ‌న్ స్టేట్‌మెట్లు ఇస్తుండ‌టం గ‌మ‌నార్హం. తాజాగా వల్ల‌భ‌నేని వంశీ అరెస్టు త‌రువాత వైసీపీ నేత‌లు కొత్త‌రాగం అందుకున్నారు. జ‌గ‌న్ మెరుగైన పాల‌న అందించారని, కానీ, వ‌ల్ల‌భ‌నేని వంశీ, కొడాలి నాని, విజ‌య‌సాయిరెడ్డి, రోజా వంటి నేత‌లు హ‌ద్దులు మీరి మాట్లాడి వైసీపీపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త భావం ఏర్ప‌డేలా చేశారంటూ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. త‌ద్వారా వైసీపీ ఓడిపోయింది జ‌గ‌న్  వల్ల కాదు కొందరు వైసీపీ నేత‌లు నోరుపారేసుకోవ‌టం వ‌ల్ల‌నేన‌న్న వాద‌న‌ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లేలా ప్ర‌య‌త్నిస్తున్నారు.  వంశీ అరెస్టుపై జగన్ స్పందించకపోవడం చూస్తుంటే.. ఈ వ్యూహాన్ని రచించి, పార్టీ నేతల చేత అమలు చేయిస్తున్నది స్వయంగా జగనేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తద్వారా ఐదేళ్ల పాలనలో తన తప్పిదాలకు కొందరు పార్టీ నేతలను బలిచ్చేసి తాను సుద్దపూసగా మళ్లీ జనం ముందుకు రావాలని జగన్ ప్రయత్నిస్తున్నారంటున్నారు. 

By
en-us Political News

  
ఆ నక్కల కారణంగానే తాను తన మార్గాన్ని ఎంచుకుని బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలోని తన మాజీ సహచరులపై తీవ్ర విమర్శలు గుప్పించిన కవిత.. బీఆర్ఎస్‌లోని కొందరు గుంటనక్కల వంటి నేతల బృందం తనను ఒంటరిని చేసి, పక్కన పెట్టడానికి పద్ధతి ప్రకారం పనిచేశారని కవిత చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ అత్యంత కీలకమైన మలుపుగా మారబోతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అత్యంత ఉత్కంఠభరిత వాతావరణంలో ప్రారంభం కానున్నాయి.
శాంతిభద్రతల విఘాతం కలగకుండా ఉండేందుకు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందస్తు భద్రతా వ్యూహంలో భాగంగా సెంట్రల్ ఢిల్లీని దాదాపు తమ అధీనంలోకి తీసుకున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఈ చలో పార్లమెంట్ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో తనదైన విలక్షణ శైలితో నిత్యం వార్తల్లో నిలిచే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేసినట్లేనా.. అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. గత కొంతకాలంగా ఆయన కారు దిగిపోనున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియో ఆ ప్రచారానికి బలం చేకూర్చింది. సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న వేదికపై ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా ఉన్నారు. ఆ వేదికపై ప్రసంగిస్తున్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నా.. మల్లారెడ్డి పట్టించుకోకుండా చిరునవ్వులు చిందిస్తూ ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. సొంత పార్టీ అధినేతను అంతగా విమర్శిస్తున్నా మల్లారెడ్డిలో స్పందన లేకపోవడంతో ఆయన కారు దేగేయడం ఖాయమన్న ప్రచారానికి బలం చేకూర్చింది. అలాగే ఇటీవలే.. ఆయన ఒక ప్రైవేటు కార్యక్రమంలో కూడా తాను బీఆర్ఎస్ ను వీడనున్నట్లు సంకేతాలిచ్చారు. వాస్తవానికి.. గత ఎన్నికలలో పరాజయం పాలై బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన నాటి నుంచీ కూడా మల్లారెడ్డి పొలిటికల్ గా ఒకింత ఇనాక్టివ్ అయ్యారనే చెప్పారు. చాలా కాలంగా మల్లారెడ్డి అధికార కాంగ్రెస్ లేదా కమలం గూటికి చేరే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా తన వ్యాపార, విద్యారంగ సంస్థల పరిరక్షణతో పాటు నియోజకవర్గంలో రాజకీయ ఉనికి కోసం ఆయన అధికార పార్టీతో సత్సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నారని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. ఒకప్పుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించిన చామకూర మల్లారెడ్డి.. ఇప్పుడు ఆయన ప్రసంగిస్తున్న వేదికపై కనిపించడం పట్ల కమలం శ్రేణుల్లో కూడా ఆగ్రహం వ్యక్తమౌతోంది. మొత్తం మీద మల్లారెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పడం ఖాయమన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతోంది. అయితే ఆయన కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా? కాషాయ తీర్థం పుచ్చుకుంటారా అన్న విషయంపై అయితే రాజకీయవర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే అనేకమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు హస్తం గూటికి చేరిన నేపథ్యంలో, మల్లారెడ్డి కూడా అదే బాట పడతారన్న అభిప్రాయమే పరిశీలకులలో కూడా వ్యక్తమౌతోంది. chamakura malla reddy latest news, medchal mla malla reddy, telangana political updates
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ కీలక సమీక్ష నిర్వహించింది.
తెలంగాణ భారతీయ జనతా పార్టీల్లో ఒక్కసారిగా పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి ఎన్నో పనులను కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో పూర్తి చేస్తున్నట్లు వివరించారు.
వైసీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాకపోగా, ఉన్న ఉపాధి వనరులను పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని సువేరా మండిపడ్డారు. అమరరాజా, లూలూ గ్రూప్, జాకీ వంటి దిగ్గజ సంస్థలను కక్షపూరిత రాజకీయాలు, ఆర్థిక వేధింపులతో రాష్ట్రం సరిహద్దులు దాటించారని విమర్శించారు.
రమణమూర్తి గతంలో తిరుమలలో అన్నమయ్య నివాసాన్ని తొలగించినప్పుడు జరిగిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారనీ, చినజీయర్ స్వామి వంటి ప్రముఖులతో కలిసి హిందూ ధర్మ ప్రచారంలో నడిచిన చరిత్ర రమణమూర్తిది అని భరద్వాజ చెప్పారు. అయితే, హిందూ మతం వేరు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే హిందుత్వ వేరు అంటూ రమణమార్తి ఇటీవల పలు సందర్భాలలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారన్న భరద్వాజ.. ఈ నేపథ్యంలోనే ఆయన గొంతు నొక్కడానికి పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు.
ముంబై కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ తరువాత కోలుకున్న జగన్ తొలి పర్యటనకు తన సొంత నియోజకవర్గం పిఠాపురాన్ని ఎంచుకోవడం రాజకీయంా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా ఉండగా పవన్ రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన నాయకులు, శ్రేణులు భారీ ఏర్పాటు చేశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.