ప్రజాప్రతినిధులుగా ప్రజల ఇబ్బందులు తెలుసుకుని పరిష్కరించడానికి స్వేచ్ఛ ఉండాలి. అలాంటి స్వేచ్ఛలేనపుడు మంత్రిమండలిలో ఉండి ప్రయోజనమేమిటని టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే చింత మనేని ప్రభాకర్ అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రులకు ఏమాత్రం స్వేచ్ఛా లేదని, వారికి ఏ సందర్భంలోనూ తమ అభప్రాయాలను స్వంతంగా చెప్పలేని పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన వ్యాఖ్యా నించారు. కేవలం వారంత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రాసిచ్చిన మాటలను చెప్ప డానికే తప్ప స్వయంగా మాట్లాడడానికి అవకాశం లేకుండా పోయిందని చింతమనేని ఘాటుగా విమర్శించారు.
మంత్రులు కేవలం ముఖ్యమంత్రి జగన్ చెప్పిన దాన్ని అమలు చేయడం, ఆయన మాటలకు చప్పట్లు కొడుతూ భజన చేయడం తప్ప వారంతట వారుగా ఎలాంటి సూచనలు సలహాలివ్వలేని స్థితిలో ఉండ టం శోచనీయమన్నారు. కేవలం సజ్జల మాటే వారు మంత్రించినట్టు చెప్పడం జరుగుతోందని చింత మనేని అన్నారు. దీనికి తోడు వైసీపీ మంత్రులుగాని, ఎమ్మెల్యేలుగాని ఎక్కడా ప్రజాక్షేత్రంలో కాన రారని ఎద్దేవా చేశారు. దళితులను ఆదుకుంటున్నాం, వారికి పదవులిచ్చి వారిని గౌరవిస్తున్నామని డంబాలు పలకడం తప్ప నిజానికి వారికి ఎలాంటి అధికారమూ ఇవ్వలేదని అన్నారు. పైరుకు వారికి పదవులి చ్చినప్పటికీ పెత్తనం మాత్రం వేరే వారు చెలాయిస్తున్నారని చింతమనేని మండిపడ్డారు. దళితులను ఇంతకంటే ఎవ్వరూ తక్కువ చూడరని అన్నారు.
గోరంట్ల ఎపిసోడ్ గురించి ప్రస్తావిస్తూ, ఎంపీ చేసిన పనిని కప్పిపుచ్చుకోవడానికి అది తమ ఎంపీ పనికాదని, మార్ఫింగ్ చేశారని వేరేవాళ్లమీద నేరం నెట్టే ప్రయత్నాలు చేయడం దారుణమని చింత మనేని విమర్శించారు. దీనికితోడు అసలా ఎపిసోడ్పై హోం మంత్రి ఇంతవరకూ స్పందించక పోవడాన్ని ఆయన తప్పుపట్టారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ycp-mlas-not-freebirds-says-chintamaneni-39-141566.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!