వైసీపీ నుంచి వలసల వరద.. గేట్లెత్తేసినట్లేనా?

Publish Date:Aug 11, 2023

Advertisement

ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఆశావహులు పార్టీలు మారడం అత్యంత సహజమైన అంశం. అయితే, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే నేతల పార్టీల మార్పు భారీగా ఉంటుంది. ఇప్పుడు ఏపీలో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తున్నది. ఇప్పటికే వచ్చిన కొన్ని సర్వేల ఫలితాలు, ప్రతిపక్ష నేతల రోడ్ షోలకు సభలకు తండోపతండాలు వస్తున్న జనాలను చూస్తుంటే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రజలలో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో క్లియర్ కట్ గా కనిపిస్తున్నది. ఈ క్రమంలోనే ఈసారి వైసీపీ నుండి భారీగా వలసలు ఉండడం గ్యారంటీగా కనిపిస్తున్నదని రాజకీయ వర్గాలలో గట్టిగా వినిపిస్తుంది. ఒక్కో నియోజకవర్గంలో పడకేసిన అభివృద్ధితో ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తిలో ఉండగా వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు సరైన సమయం కోసం చూస్తున్నారని . ఒక్కసారి ఎన్నికల మూడ్ మొదలైతే వీరంతా పొలోమని వలసలు మొదలు పెట్టడం ఖాయంగా కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. 

వైసీపీ నుండి బహిష్కరణకు గురైన నలుగురు ఎమ్మెల్యేలు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో చేరడం ఖరారైనట్లే. ఉమ్మడి నెల్లూరు జిల్లా నుండి ఇప్పటికే సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును కలవగా నెల్లూరు జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర బాధ్యతలను కూడా చూసుకున్నారు. ఇ దే జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా లోకేష్ పాదయాత్రలో పాల్గొనగా.. మేకపాటి ఈసారి టీడీపీ నుండి ఉదయగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే అని కూడా లోకేష్ ప్రకటించారు. మరోవైపు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా టీడీపీ నేతలతో టచ్ లోనే ఉన్నారు. కాగా, ఇప్పుడు తాజాగా మరో బహిష్కృత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఏకంగా గుంటూరు నుండి ఉత్తరాంధ్రకి వెళ్లి మరీ చంద్రబాబును కలిసిన శ్రీదేవి లోకేష్ పాదయాత్ర తన నియోజకవర్గంలోకి వచ్చే సమయానికి తన కార్యాచరణ ప్రకటిస్తానని కూడా చెప్పారు.

కాగా వైసీపీ ఈ నలుగురు ఎమ్మెల్యేలపై బహిష్కరణ వేటు సందర్భంగా ఇంకా ఇటువంటి వారు 56 మంది వరకూ ఉన్నారని పార్టీ వర్గాలలోనే గట్టిగా చర్చ జరిగింది. కచ్చితంగా సంఖ్య ఇదీ అని చెప్పకుండా ప్రభుత్వ ముఖ్య సలహాదారు, సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పార్టీలో అసంతృప్తుల గురించి ప్రస్తావించారు. సరే వైసీపీ సస్పెండ్ చేసిన నలుగురి దారి తెలుగుదేశం పార్టీ వైపే అని తేలిపోయింది. ఇక ఇప్పుడు పార్టీలో అసంతృప్తులుగా ఉన్నారని చెబుతున్న మిగిలిన 56 మంది పరిస్థితి ఏమిటన్న ప్రశ్న వైసీపీ వర్గాలలో గట్టిగా వినిపిస్తున్నారు. వారంతా కూడా పార్టీని వీడటం ఖాయమేనా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.  ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఈసారి  వైసీపీకి భారీ ఝలక్ తప్పేలా లేదు. ఇప్పటికే టీడీపీలో ఉన్న మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నారాయణలతో పాటు ఇప్పుడు సీనియర్లు ఆనం రామనారాయణ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా తోడైతే జిల్లాలో  వై ఎట్ లీస్ట్ వన్ సీట్ అన్న పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం లేదని పరిశీలకులు అంటున్నారు. గత ఎన్నికలలో ఈ జిల్లాలో పది పది స్థానాలలో వైసీపీ విజయం సాధించింది.   కావలి నుండి బీద రవిచంద్ర తన సతీమణిని రంగంలోకి దింపనుండడం.. సిటీలో మాజీ మంత్రి అనిల్ కుమార్ పై అసంతృప్తితో ఇప్పటికే వైసీపీ అధిష్టానం ఆయనను దూరం పెట్టడం అన్నీ వెరసి ఇక్కడ ఈసారి టీడీపీ ఉమ్మడి జిల్లాను క్లీన్ స్వీప్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పార్టీకి దగ్గరైన ముగ్గురితో పాటు మరో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా టీడీపీతో టచ్ లో ఉన్నట్లు ఇప్పటికే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రకటించారు.

ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. గత ఎన్నికల సమయంలో వైసీపీలో చేరిన సిద్దా రాఘవరావు, ఆయన తనయుడు సుధీర్, మరో నేత కదిరి బాబురావు ఇప్పటికే టీడీపీతో టచ్ లోకి వచ్ాచరు. వారు ఇక కండువా కప్పుకోవడమే తరువాయి అంటున్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కలిపిన కందుకూరు నుండి ఎమ్మెల్యేగా ఉన్న మానుగుంట మహీధర్ రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉండగా అసలు జిల్లాకే పెద్దన్నయ్య పాత్ర పోషించిన బాలినేని శ్రీనివాసరెడ్డిని పార్టీయే పొమ్మనలేకపోగ బెట్టడంతో ఆయనా ఆంటీ ముట్టనట్లే ఉంటున్నారు. గిద్దలూరు ఆనం రాంబాబుకు అధిష్టానమే టికెట్ ఇచ్చే పరిస్థితి లేకపోగా ఇచ్చినా ఆయన గెలిచే పరిస్థితి లేదని పార్టీ శ్రేణులు బాహాటంగానే చెబుతున్నాయి. చీరాల నుండి ఆమంచి తన సోదరుడిని ఇప్పటికే జనసేనకు పంపగా.. తాను కూడా సరైన సమయం కోసం చూస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. సీనియర్ నేత కరణం బలరాం మళ్ళీ టీడీపీకి దగ్గరయ్యేందుకు పావులు కదుపుతున్నట్లు జిల్లా రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.

ఇక, ఉమ్మడి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలలో అయితే వైసీపీ నుండి భారీగా వికెట్లు పడడం గ్యారంటీగా కనిపిస్తున్నది. ఇప్పటికే వల్లభనేని వంశీ, మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే లాంటి వారే ఈ మధ్య పత్తా లేకుండా పోగా.. ఉండవల్లి శ్రీదేవి, వసంత కృష్ణ ప్రసాద్ ఇప్పటికే టీడీపీకి టచ్ లో ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన వారితో సహా మరో ఏడెనిమిది మంది వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నది. ఉత్తరాంధ్ర నుండి కూడా ఈసారి భారీగా వలసలు ఉండే అవకాశం ఉంది. శ్రీవాణి, అప్పల నాయుడు, అప్పల నరసయ్య, వీరభద్రస్వామి, గొల్ల బాబురావు, ఉమా శంకర్ గణేష్ ఇలా చాలా పేర్లు వలసల జాబితాలో వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి అవంతి పార్టీ జంప్ చేసినా ఆశ్చర్యం లేదన్నది ఉత్తరాంధ్ర రాజకీయాలలో ఆసక్తికరంగా వినిపిస్తున్న మాట.

By
en-us Political News

  
జన్ సూరాజ్ పార్టీని స్థాపించి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికలలో ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. 2014 ఎన్నికలలో మోడీ నాయకత్వంలో ఎన్డీయే ఘన విజయం సాధించడం నుంచి మొదలు పెడితే.. 2019లో ఆంధ్రప్రదేశ్ లో జగన్ నాయకత్వంలోని వైసీపీ, ఆ తరువాత పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ లను అధికారంలోకి తీసుకురావడానికి తన వ్యూహాలే కారణమని తన భుజాలను తానే చరిచేసుకుని మరీ చెప్పుకున్న ప్రశాంత్ కిషోర్.. తన సొంత రాష్ట్రంలో సొంత పార్టీని గెలిపించుకోలేక చతికిల పడ్డారు.దీంతో ప్రశాంత్ కిశోర్ ప్రతిష్ఠ మసకబారింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎండగట్టారు. అమరావతిని జగన్ నిరంతరం ప్రయత్నిస్తున్నారనీ, ఇప్పుడు కొత్తగా మావిగన్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు
ఏపీకి రాజధాని ఏది? అమరావతి శాశ్వతమా లేక మావిగాన్ అంటూ జగన్ చేసిన ప్రతిపాదనతో మళ్లీ రాజధానిపై జనంలో అనుమానాలు మొదలయ్యాయా? అన్న చర్చ మొదలైంది. ఏపీ రాజధాని విషయంలో మరో ప్రయోగం మొదలుకాబోతోందా? అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబా ఫూలే 200వ జయంతి వేడుకలు దేశరాజధానిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్లమెంటు ఆవరణలోని ప్రేరణా స్థల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేశాధినేతలు, రాజకీయ దిగ్గజాలు ఒకే వేదికపైకి వచ్చారు. రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొని ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
బీజేపీకి ఓటేస్తే.. సామాజిక న్యాయానికి పాడె కట్టడమేనన్నారు. రాష్ట్రంలోని బీజేపీని అడుగుపెట్టనీయవద్దని, ఒక్క సీటు కూడా వారికి ఇవ్వకుండా తమిళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరకాల కోరారు.
అమరావతికి సాక్షాత్తూ పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధ రాజధానిగా గుర్తింపు లభించిన తరువాత కూడా సజ్జల మౌలిక వసతులు లేని ప్రాంతంలో వేలకోట్టు కుమ్మరిస్తోందంటూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఇప్పుడు కూడా అమరావతి అభివృద్ధి కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నా.. గ్రాఫిక్స్ రాజధాని అంటూ పాత పాటే పాడారు సజ్జల.
ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన ఈ సమావేశం అత్యంత ఆత్మీయంగా, భావోద్వేగాల మధ్య సాగింది. చాలా కాలం తర్వాత తన పాత మిత్రుడిని కలిసిన జీవన్ రెడ్డి ఒ ఉద్వేగానికి లోనయ్యారు.
గత కొంతకాలంగా తనపై సాగుతున్న అభిశంసన ప్రక్రియ, అలాగే నివాసంలో లభించిన లెక్కకు రాని నగదు వివాదం నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.
రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన అనంతరం నితీశ్ కుమార్ ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి పదవికి మరో మూడు నాలుగు రోజుల్లో రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. తాను లేని పక్షంలో రాష్ట్ర బాధ్యతలను కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల బృందం సమర్థవంతంగా నిర్వహిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
వైసీపీ సోషల్ మీడియా మాజీ కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డిపై జారీ అయిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. విచారణలో భాగంగా న్యాయమూర్తులు రాజకీయ ఫ్లెక్సీలపై స్పందిస్తూ.. ఎవరిని ధ్వంసం చేయాలని చూస్తున్నారు? 2029లో రాష్ట్రాన్నా లేక ప్రజలనా? అంటూ ప్రశ్నించారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తమకు ఉన్న అనుబంధం ఎంతో గొప్పదని చెప్పుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. వైఎస్ మరణం వెనుక వైఎస్ జగన్ హస్తం ఉందంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై బొత్స తీవ్రంగా స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురైన రోజున జరిగిన పరిణామాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేరాలని ఆహ్వానించారన్నారు.
ల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.