ఏడుపుగొట్టు ముఖాలతో ఇంట్లోనే ఉండండి బాబు అండ్ బ్యాచ్.. రోజా సెటైర్లు

Publish Date:Aug 1, 2020

Advertisement

ఏపీలో రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపటం పట్ల నగరి ఎమ్మెల్యే రోజా హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలతో పాటు రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులు అవసరమని నమ్మి సీఎం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల బిల్లు తీసుకొచ్చారని రోజా తెలిపారు. ఈ బిల్లుల ఆమోదంతో ఒక్క ఉత్తరాంధ్ర ప్రజలే కాక రాయలసీమ, అమరావతి ప్రాంత రైతులు తో సహా అందరూ సంతోషంగా ఉన్నారని ఆమె అన్నారు. ఇక దీంతో ఏమాత్రం సంతోషంగా లేనిది కేవలం చంద్రబాబునాయుడు, లోకేష్ అండ్ కో బ్యాచ్ అని విమర్శించారు.

గతంలో అధికారాన్ని ఒకే చోట కేంద్రీకరణ చెయ్యటం వల్ల తెలంగాణ ఆంధ్ర విడిపోయాక ఏపీ ప్రజలు దిక్కులేని పరిస్థితి లో పడ్డారని కానీ సీఎం జగన్ నిర్ణయంతో భవిష్యత్ లో మళ్ళీ ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆమె తెలిపారు. ఇదే సమయంలో అమరావతి ప్రజలకు ఎటువంటి పరిస్థితుల్లో అన్యాయం జరగదని, గత ప్రభుత్వం ఇక్కడి ప్రజలను మోసం చేసిందని ఆమె విమర్శించారు. ఇప్పటికైనా చంద్రబాబు లోకేష్ లు ఏడుపు ముఖాలు వేసుకుని ఇంట్లోనే ఉండాలని అలా కాకుండా బయటకు వచ్చి అభివృద్ధి ని అడ్డుకోవాలని చూస్తే ప్రజలు ఏమాత్రం సహించరని ఆమె హెచ్చరించారు.

By
en-us Political News

  
తెలంగాణ సాధించుకున్న తర్వాత పక్క రాష్ట్రంతో పోలికలు పెట్టాల్సిన అవసరం హరీష్ రావుకు ఎందుకో అర్థం కావడం లేదు.
జగన్ పరిపాలన జరిగిన ఐదేళ్ళ కాలంలో శ్రీవారి దర్శనం టికెట్లు గోల్ మాల్ చేసి మాజీమంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా కోట్ల రూపాయలు దండుకొన్నారని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు.
ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసు దర్యాప్తులో సోమవారం (సెప్టెంబర్ 23) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్టైన వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ రిమాండ్ రిపోర్ట్‌లో ముగ్గురు ఐపీఎస్ అధికారుల పేర్లను పోలీసులు చేర్చారు. ఇదే కేసుకు సంబంధించి ఈ ముగ్గురినీ అంటే ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ కమిషనర్ కాంతి రాణా తాతా, మరో ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ పేర్లను కుక్కల విద్యాసాగర్ రిమాండ్ రిపోర్టులో చేర్చారు.
హైడ్రా బీద బిక్కి ప్రజానీకం మీద కరుణించినట్లు తెలుస్తోంది. ఆదివారం నుంచి చేపట్టిన హైడ్రా కూల్చివేతల్లో పేద ప్రజల జోడికి హైడ్రా వెళ్లడం లేదు. చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ దూకుడుగా వెళుతున్నారు. ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ లో నిర్మించే అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నప్పటికీ గత రెండు రోజుల నుంచి పేదల ఇళ్లను ముట్టుకోవడం లేదు
జగన్మోహన్ రెడ్డి వేడి వేడి కల్తీ నెయ్యిలో పడ్డారు. ఇక అందులో మునిగిపోవడం తప్ప చేయగలిగిందేమీ లేదు.
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రధాన అంశంగా చర్చల్లో నిలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులంతా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
తీన్మాన్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ హోరాహోరీగా పోరాడి ఎమ్మెల్సీ అయ్యారు. అంత పోరాడి ఎమ్మెల్సీ అయ్యాను కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పోరాటపటిమను మెచ్చి ఏదైనా మంచి పదవి ఇస్తారేమోనని మల్లన్న ఆశించి వుండవచ్చు.
జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చారా? ఆ ఈవెంట్ రద్దు కావడానికి రేవంత్ రెడ్డే కారణమా అంటే అంటే ఎన్టీఆర్ అభిమానులు ఔననే అంటున్నారు. ఎంతో ముందుగా ఫిక్స్ అయిన దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆగిపోవడానికి రేవంత్ రెడ్డి అదే రోజు మాదాపూర్ లోని ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు రావడంతో దేవర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను క్యాన్సిల్ చేశారని అంటున్నారు.
చంద్రబాబు ప్రభుత్వం పరిస్థితిని పూర్తిగా మార్చింది. లడ్డూ తయారీకి ఉపయోగించే నేతిని మార్చింది. ఇప్పుడు శ్రీవారి లడ్డూని ఎలాంటి ఇబ్బంది లేకుండా, పవిత్రత విషయంలో ఎలాంటి అనుమానాలకు గురికాకుండా మహాప్రసాదాన్ని హాయిగా స్వీకరించవచ్చు.
బిఆర్ఎస్ పార్టీలో బావ,బామ్మర్దుల మధ్య ఆధిపత్య పోరాటం ముమ్మరమైనట్టు తాజా ఘటనలు,సన్నివేశాలు రుజువు చేస్తున్నవి.చాలాకాలంగా పార్టీపై ఆధిపత్యం కోసం అంతర్గత పోరాటం జరుగుతున్నప్పటికీ ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ,కౌశిక్ రెడ్డిల గొడవలో మాజీ మంత్రి హరీశ్ రావు పైచేయి సాధించినట్టు ఆ పార్టీ క్యాడర్ భావిస్తున్నది
తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై తార స్థాయిలో చర్చ జరుగుతున్న వేళ కూడా లడ్డూ ప్రసాదాల విక్రయాలు తగ్గలేదు సరికదా గణనీయంగా పెరిగాయి. ఈ వివాదం వెలుగులోకి రాకముందు.. అంటే జగన్ హయాంతో పోలిస్తే.. గత పది రోజులుగా లడ్డూ విక్రయాలు విపరీతంగా పెరిగాయి.
ఈసారి జరిగే ఎన్నికలలో తన ప్రజాబలాన్ని నిరూపించుకుని, ఆ తర్వాతే ముఖ్యమంత్రి స్థానం మీద కూర్చుంటానని కేజ్రీవాల్ శపథం చేశారు.
తిరుమల తిరుపతి లడ్డూ వివాదంతో దేశం అట్టుడికిపోతున్నది. లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం జరిగిందన్న విషయం ల్యాబ్ నివేదికతో నిర్ద్వంద్వంగా తేలిపోయింది. జగన్ హయాంలో దేవాలయాలపై జరిగిన అరాచకాలు, దాడులను మించి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు వినియోగం.. ప్రజల మనోభావాలను తీవ్రాతి తీవ్రంగా దెబ్బతీసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.