తిరుమల లడ్డూ ప్రసాదం విక్రయాలు పెరిగాయి.. ఎందుకంటే?

Publish Date:Sep 23, 2024

Advertisement

తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై తార స్థాయిలో  చర్చ జరుగుతున్న వేళ కూడా లడ్డూ ప్రసాదాల విక్రయాలు తగ్గలేదు సరికదా గణనీయంగా పెరిగాయి. ఈ వివాదం వెలుగులోకి రాకముందు.. అంటే జగన్ హయాంతో పోలిస్తే.. గత పది రోజులుగా లడ్డూ విక్రయాలు విపరీతంగా పెరిగాయి.  జగన్ హయాంలో లడ్డూ ప్రసాదం నాణ్యత గణనీయంగా తగ్గిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. నాణ్యత లేనందున భక్తులు లడ్డూ ప్రసాదాల కొనుగోలు విషయంలో కొంచం ముందు వెనుకలాడారు. గతంలోలా శ్రీవారిని దర్శించుకుని లడ్డూ ప్రసాదాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేయకుండా నియంత్రణ పాటించారు. పెద్ద సంఖ్యలో లడ్డూ ప్రసాదాలను కొనుగోలు చేసి తమ తమ ఊర్లకు తీసుకు వెళ్లి బంధు మిత్రులకు పంచే సంప్రదాయానికి జగన్ హయాంలో చెక్ పడింది. ఎందుకంటే అప్పట్లో లడ్డూ నిలవ ఉండేది కాదు. నాణ్యతా లోపం కారణంగా రెండు మూడు రోజులకే పాడైపోయేది. తిరుమల యాత్ర ముగించుకని తమ తమ ఊళ్లకు వెళ్లిన తరువాత లడ్డూ ప్రసాదాన్ని బంధు మిత్రులకు పంచాలంటే భక్తులు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి వచ్చేది. ఆ కారణంగానే జగన్ అధికారంలో ఉండగా లడ్డూ ప్రసాదాల విక్రయాలు పడిపోయాయి.

అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత లడ్డూ ప్రసాదంలో నాణ్యత పెరిగిన విషయాన్ని భక్తులు గుర్తించారు. సామాజిక మాధ్యమం ద్వారా పలువురు ఈ విషయాన్ని చాటారు. దీంతో కూటమి సర్కార్ కొలువుదీరిన తరువాత తిరుమల లడ్డూ ప్రసాదాల విక్రయాలలో పెరుగుదల కనిపించింది.

అయితే అప్పటికి లడ్డూ ప్రసాదంలో  వినియోగించే నెయ్యి జంతువుల కొవ్వుతో కల్తీ అయ్యిందన్న విషయం వెలుగులోనికి రాలేదు. అయితే  కూటమి ప్రభుత్వం కొలువుదీరగానే తిరుమల ప్రక్షాళన ప్రారంభించింది. అన్న ప్రసాదం నుంచి, తిరుమల కొండపై హోటళ్లలో పారిశుద్ధ్యం, తినుబండారాలలో నాణ్యత విషయంలో రాజీపడకుండా ముందుకు సాగడంతో మార్పు ప్రస్ఫుటంగా కనిపించింది. జనం, భక్తులు కూడా అదే అనుకున్నారు. అయితే ఎప్పుడైతే తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు అవశేషాల వినియోగం వెలుగుచూసిందో... భక్తులు నివ్వెర పోయారు. దిగ్భ్రాంతికి గురయ్యారు. జగన్ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో నాణ్యతా లోపానికి కారణం తెలిసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అదే సమయంలో  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నాణ్యత విషయంలో రాజీ పడబోమన్న చంద్రబాబు ఆ మాట నిలబెట్టుకుని కల్తీని నివారించారని భక్త జనం నమ్ముతున్నారు. అందుకే ఇంతటి వివాదంలోనూ గతం కంటే లడ్డూ విక్రయాలలో పెరుగుదల కనిపిస్తోంది.  ఈ నెల 19న భక్తులు 3 లక్షల 59 వేల 650 లడ్డూలు కొనుగోలు చేస్తే.. 20వ తేదీన ఆ సంఖ్య 3లక్షల 17 వేల 954గా ఉంది. ఇక 21వ తేదీనైతే అది 3 లక్షల 67 వేల 607కు పెరిగింది. 

 దీనిని బట్టి చూస్తే లడ్డూ ప్రసాదం వివాదం వాటి విక్రయాలపై ఇసుమంతైనా ప్రభావం పడలేదని స్పష్టమౌతోంది.  ఇందుకు కూటమి కొలువుదీరిన తరువాత తిరుమల తిరుపతి దేవస్థానం పారదర్శకంగా వ్యవహరించడం, నాణ్యత పెంపు స్ఫష్టంగా కనిపిస్తుండటం కారణంగా చెప్పవచ్చు. అలాగే తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో మళ్లీ నంది నెయ్యే వినియోగిస్తున్నట్లే టీటీడీ ప్రకటించడం కారణంగా చెప్పొచ్చు.  

By
en-us Political News

  
తెలంగాణ సాధించుకున్న తర్వాత పక్క రాష్ట్రంతో పోలికలు పెట్టాల్సిన అవసరం హరీష్ రావుకు ఎందుకో అర్థం కావడం లేదు.
జగన్ పరిపాలన జరిగిన ఐదేళ్ళ కాలంలో శ్రీవారి దర్శనం టికెట్లు గోల్ మాల్ చేసి మాజీమంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా కోట్ల రూపాయలు దండుకొన్నారని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు.
ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసు దర్యాప్తులో సోమవారం (సెప్టెంబర్ 23) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్టైన వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ రిమాండ్ రిపోర్ట్‌లో ముగ్గురు ఐపీఎస్ అధికారుల పేర్లను పోలీసులు చేర్చారు. ఇదే కేసుకు సంబంధించి ఈ ముగ్గురినీ అంటే ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ కమిషనర్ కాంతి రాణా తాతా, మరో ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ పేర్లను కుక్కల విద్యాసాగర్ రిమాండ్ రిపోర్టులో చేర్చారు.
హైడ్రా బీద బిక్కి ప్రజానీకం మీద కరుణించినట్లు తెలుస్తోంది. ఆదివారం నుంచి చేపట్టిన హైడ్రా కూల్చివేతల్లో పేద ప్రజల జోడికి హైడ్రా వెళ్లడం లేదు. చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ దూకుడుగా వెళుతున్నారు. ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ లో నిర్మించే అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నప్పటికీ గత రెండు రోజుల నుంచి పేదల ఇళ్లను ముట్టుకోవడం లేదు
జగన్మోహన్ రెడ్డి వేడి వేడి కల్తీ నెయ్యిలో పడ్డారు. ఇక అందులో మునిగిపోవడం తప్ప చేయగలిగిందేమీ లేదు.
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రధాన అంశంగా చర్చల్లో నిలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులంతా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
తీన్మాన్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ హోరాహోరీగా పోరాడి ఎమ్మెల్సీ అయ్యారు. అంత పోరాడి ఎమ్మెల్సీ అయ్యాను కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పోరాటపటిమను మెచ్చి ఏదైనా మంచి పదవి ఇస్తారేమోనని మల్లన్న ఆశించి వుండవచ్చు.
జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చారా? ఆ ఈవెంట్ రద్దు కావడానికి రేవంత్ రెడ్డే కారణమా అంటే అంటే ఎన్టీఆర్ అభిమానులు ఔననే అంటున్నారు. ఎంతో ముందుగా ఫిక్స్ అయిన దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆగిపోవడానికి రేవంత్ రెడ్డి అదే రోజు మాదాపూర్ లోని ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు రావడంతో దేవర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను క్యాన్సిల్ చేశారని అంటున్నారు.
చంద్రబాబు ప్రభుత్వం పరిస్థితిని పూర్తిగా మార్చింది. లడ్డూ తయారీకి ఉపయోగించే నేతిని మార్చింది. ఇప్పుడు శ్రీవారి లడ్డూని ఎలాంటి ఇబ్బంది లేకుండా, పవిత్రత విషయంలో ఎలాంటి అనుమానాలకు గురికాకుండా మహాప్రసాదాన్ని హాయిగా స్వీకరించవచ్చు.
బిఆర్ఎస్ పార్టీలో బావ,బామ్మర్దుల మధ్య ఆధిపత్య పోరాటం ముమ్మరమైనట్టు తాజా ఘటనలు,సన్నివేశాలు రుజువు చేస్తున్నవి.చాలాకాలంగా పార్టీపై ఆధిపత్యం కోసం అంతర్గత పోరాటం జరుగుతున్నప్పటికీ ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ,కౌశిక్ రెడ్డిల గొడవలో మాజీ మంత్రి హరీశ్ రావు పైచేయి సాధించినట్టు ఆ పార్టీ క్యాడర్ భావిస్తున్నది
ఈసారి జరిగే ఎన్నికలలో తన ప్రజాబలాన్ని నిరూపించుకుని, ఆ తర్వాతే ముఖ్యమంత్రి స్థానం మీద కూర్చుంటానని కేజ్రీవాల్ శపథం చేశారు.
తిరుమల తిరుపతి లడ్డూ వివాదంతో దేశం అట్టుడికిపోతున్నది. లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం జరిగిందన్న విషయం ల్యాబ్ నివేదికతో నిర్ద్వంద్వంగా తేలిపోయింది. జగన్ హయాంలో దేవాలయాలపై జరిగిన అరాచకాలు, దాడులను మించి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు వినియోగం.. ప్రజల మనోభావాలను తీవ్రాతి తీవ్రంగా దెబ్బతీసింది.
నిన్న మొన్నటి వరకూ భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆంధ్రప్రదేశ్ కు మరో సారి భారీ వర్షాల ప్రమాదం పొంచి ఉంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.