గోరంట్ల మాధవ్ వ్యవహారంలో వైసీపీ హైకమాండ్ ఎటువంటి చర్యా తీసుకోకపోవడంతో వైసీసీ నేతలు ఇక బరితెగించనున్నారా? అంటే విపక్షాలు ఔననే అంటున్నాయి. విపక్షంలో కూర్చుంటే వైసీపీ నేతలకు ఇక తమ విశృఖలత్వానికి అవకాశం ఉండదన్న యోచనలో పార్టీ అధికారంలో ఉండగానే తమ విశ్వరూపం చూపించేయాలన్న ఆత్రుత వారిలో పెరిగిపోతోందని అంటున్నారు.
చిన్నా చితకా నేతల వ్యవహారాలు అటుంచితే పార్టీలో కీలక పదవులలో ఉన్న వారి అసభ్య, అనుచిత వర్తనను నియంత్రించలేని వైసీపీ అధినేత తీరును అలుసుగా తీసుకున ఇక పార్టీలో ఇలాంటి విశృంఖలత పెరిగిపోయే అవకాశాలే ఎక్కువ అని పరిశీలకులు కూడా అంటున్నారు. వైసీపీలో ఏం చేసినా చెల్లిపోతుందన్న భావన శ్రేణుల్లో ఎక్కువయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. ఎమ్మెల్యేగా ఉండగా అంబటి ఒక మహిళలో అసభ్యంగా మాట్లాడిన నాడే ఆయనపై చర్య తీసుకుని ఉండి ఉంటే ఆ తరువాత మంత్రి అవంతి శ్రీనివాస్.. ఇప్పుడు గోరంట్ల మాధవ్ లు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించి ఉండే వారు కాదని అంటున్నారు. సభ్యత, సంస్కారం, నైతికత వంటి వాటి పట్ల పార్టీ హైకమాండ్ కు పెద్దగా పట్టింపు లేకపోవడం వల్లే పార్టీలో ఇటువంటి ధోరణి ప్రబలుతోందని అంటున్నారు. ఇక ప్రతి విషయంలోనూ ఎదురుదాడే మంత్రంగా భావించే వైసీపీ ఇప్పుడు గోరంట్ల మాధవ్ విషయంలో పార్టీ పరువు పోయిందని పెద్దగా బాధపడటం లేదనీ, ఇలానే విపక్షం పరువు తీయడం ఎలా అన్న యోచనే చేస్తుందని ఆ పార్టీ శ్రేణులే అంటున్నాయి.
ఎవరో ఒకరు, ఏదో ఒక తప్పు చేసిన ఆధారం దొరక్కపోదా అని విపక్ష నేతల వ్యవహారాలపై నిఘా పెట్టిందనీ, వారి కార్యకలాపాలను జల్లెడ పడుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మాధవ్ విషయంలో చర్య తీసుకోకపోవడం అటుంచి.. పార్టీ సమాధానం చెప్పుకోలేని దుస్థితిలో పడిపోయిన మాట మాత్రం వాస్తవమని పార్టీ వర్గాలు అంటున్నాయి.
ఈ విషయంలో విపక్షాల విమర్శలను నోరేసుకు పడిపోయి ఖండించేసే అంబటి వంటి వారు మాట్లాడడానికి కూడా సాహసించకపోవడం, మాజీ మంత్రులు, అవకాశం ఉన్నా లేకున్నా విపక్ష నేతలపై బూతుల పంచాంగంతో విరుచుకుపడిపోయే కొడాలి నాని వంటి వారు మౌనముద్ర వహించడమే గోరంట్ల విషయంలో వైసీపీ ఎంత డిఫెన్స్ లో పడిందో అవగతమౌతోందని అంటున్నారు. ఇంతగా పరువు బజారున పడినా గోరంట్లపై ఈగ కూడా వాలకుండా పార్టీ వ్యవహరిస్తోందంటే.. గోరంట్లపై చర్య తీసుకుంటే ఇంకెన్ని బాగోతాలు బయటపడతాయో అన్న భయమే కారణమని చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ycp-leaders-tp-cross-boundaries-here-after-39-141375.html
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.