‘గడపగడపకూ’కు ద్వితీయ విఘ్నం.. జనాగ్రహానికి జడిసి మొహం చాటేసిన వైసీపీ నేతలు

Publish Date:May 12, 2022

Advertisement

ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు చేర్చాలంటూ ఆర్భాటంగా ప్రారంభమైన గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమానికి ద్వితీయ విఘ్నం తప్పలేదు. అసలు గడప గడపకూ వైసీపీ అంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నది జగన్ యోచన. కానీ పార్టీ పట్ల ప్రజలలో ఉన్న వ్యతిరేకతను అంచనా వేసిన ఆయన ఈ కార్యక్రమం పేరును గడప గడపకూ ప్రభుత్వంగా మార్చారు. ఇలా అయితే అధికారిక కార్యక్రమం అవుతుంది. జనం నిరసనలు వ్యక్తం చేసినా, కార్యక్రమాన్ని అడ్డుకున్నా.. పోలీసు కేసులతో వారిని దారిలోకి తీసుకురావచ్చన్న ఉద్దేశంతోనే గడప గడపకూ వైసీపీ కార్యక్రమం పేరును గడప గడపకూ ప్రభుత్వంగా మార్చారన్నది పరిశీలకుల విశ్లేషణ.

అయితే ఈ ఎత్తు కూడా పారలేదు. ప్రభుత్వ పథకాల లబ్ధి దారుల జాబితా తీసుకుని మరీ వెళ్లిన వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలకు ప్రజల నుంచి నిరసనల స్వాగతం లభించింది. నిలదీతల హారతులు దక్కాయి. శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా ఎక్కడికక్కడ వైసీపీ నేతలకు ప్రజా నిరసన జ్వాలల స్వాగతమే లభించింది. రోడ్లు, పథకాలు, పింఛన్లపై గడప గడపలోనూ నిలదీతలే, నిరసనలే. మూడేళ్ల పాటు జనం ఊపే పట్టని ప్రభుత్వానికి ఇప్పుడు అభిమానం తన్నుకొచ్చిందంటే నమ్మేందుకు సిద్ధంగా లేమంటూ గడప గడపలోనూ తిరస్కారాలే, ఛీత్కారాలే ఎదురయ్యాయి. మా గడప తొక్కద్దంటూ అడ్డగింతతో జనం వారిని వెనక్కు పంపారు.

పథకాల లబ్ధిదారుల జాబితా ప్రకారమే వెళ్లినా, లబ్ధిదారుల నుంచీ ఆదరణ లభించకపోవడంతో నేతలకు గడప గడపకూ కొనసాగించడమెలాగో అర్ధం కాలేదు. దీంతో బుధవారం మొదలైన ఈ కార్యక్రమం గురువారం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నిలిచిపోయింది. వైసీపీ నేతలెవరూ బయటకే రాలేదు. ముఖం చాటేశారు. అధికారుల నుంచి సమగ్ర సమాచారం అందలేదంటూ సాకులు చెప్పుకున్నారు. కొందరైతే ప్రజాగ్రహం ముందు నిలవడం కష్టమని ఒప్పేసుకున్నారు. గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా జగన్ సర్కార్ పై ప్రజలలో ఉన్న వ్యతిరేకత తీవ్రత బహిర్గతమైందని విశ్లేషకులు చెబుతున్నారు.

ముందు ముందు కూడా ఈ వ్యతిరేకతను తట్టుకుని నేతలు ప్రజలలోకి వెళ్లే పరిస్థితి ఉండే అవకాశాలు కనిపించడం లేదని అంటున్నారు. ఒక వైపు తెలుగుదేశం బాదుడే బాదుడు కార్యక్రమానికి అశేష జనవాహిని మద్దతు పలుకుతూ కదులుతుంటే.. ప్రభుత్వ కార్యక్రమానికి నిరసనల సెగ తగులుతుండటంతో అధికార పార్టీ నేతలలో తమ రాజకీయ భవిష్యత్ పై ఆందోళన ప్రారంభమైందంటున్నారు. 

By
en-us Political News

  
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు, సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభ లో సభ్యత్వం లేని వ్యక్తి ఆరు నెలల కాల పరిమితి మించి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. దీంతో మోడీ ఆదేశాల మేరకు రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా సమర్పించారు.
పరీక్షల్లో పారదర్శకత, విద్యారంగంలో సంస్కరణలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో యువత చేపట్టిన పోరాటానికి మద్దతు ప్రకటించడమే కాకుండా.. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరగనున్న ధర్నాలో స్వయంగా పాల్గొంటానని వెల్లడించారు.
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి.
రాజకీయం గురించి కాదు. పార్టీ గురించి కాదు.ఒక నాయకుడి గురించి కూడా కాదు....ఒక తరం గురించి. విజృంభించిన లాఠీల్లో రక్తం చిందించిన ఈ తరం గురించి.
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలతో చెలరేగిన వల్లభనేని వంశీ తాజా లేఖలో మాత్రం చంద్రబాబుకు గౌరవం ఇస్తూ అయ్యా చంద్రబాబుగారూ అని మర్యాదగా సంభోధించారు. అంతే కాకుండా చంద్రబాబు చొరవను, రైతుల పట్ల ఆయనకు ఉన్న అక్కరనూ ప్రశంసలతో ముంచెత్తారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు తిలోదకాలిచ్చి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు కేసుల చిక్కుల్లో నిండా ఇరుక్కుంది. అధికారంలో ఉండగా చట్టాలకు మనం అతీతులం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఒక్కరొక్కరుగా పోలీసు కేసులను, సీఐడీ విచారణలను ఎదుర్కొంటూ, అరెస్టులు, బెయిళ్లు అంటూ న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి పరిస్థితిలో ఉన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.