నందికొట్కూరు మార్కెట్ యార్డు చైర్మన్ పీఠం కోసం పోరు కొనసాగుతోంది. నాలుగు దశాబ్ధాలకు పైగా చరిత్ర ఉన్న మార్కెట్ యార్డ్ ఛైర్మన్ పదవి అధికార వైసీపీలో సెగలు రాజేస్తోంది. 1975 లో మార్కెట్ యార్డు ఏర్పాటైనప్పటి నుంచి ఎన్నడూ లేని విధంగా ఈ సారి టఫ్ ఫైట్ కొనసాగుతోంది. మార్కెట్ యార్డ్ ఆరంభం నుంచి నేటి వరకు ఈ కుర్చీలో మిడుతూరు మండలానికి చెందిన నేతలే కూర్చుంటూ వచ్చారు.
అయితే మార్కెట్ కమిటీ రిజర్వేషన్ల ప్రకారం నందికొట్కూరు మార్కెట్ యార్డును ఓసీ జనరల్ కు కేటాయించింది కొత్త ప్రభుత్వం. దీంతో ఆశావహుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది.నందికొట్కూరు శాసన సభ్యుడు ఆర్ధర్, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, నందికొట్కూరు నియోజక వర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అనుచరులు ప్రధానంగా బరిలో నిలిచారు. నామినేటెడ్ పోస్టు కావడం దీనికి తోడు సొంత నియోజకవర్గం కనుక తమకే ఈ పీఠం దక్కుతుందని ఎమ్మెల్యే ఆర్థర్ వర్గం ధీమాగా ఉంది. మరో వైపు శ్రీశైలం నియోజక వర్గ శాసన సభ్యుడు శిల్పా చక్రపాణి రెడ్డి బంధువర్గం జూపాడు బంగ్లా మండలంలో ఎక్కువగా ఉన్నారు. వీరు కూడా ఈ పదవిపై కన్నేశారు. ఇదే సమయంలో నందికొట్కూరు నియోజక వర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కర్త బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వర్గం సైతం బరిలోకి దిగింది. ఈ ముగ్గురు నేతల అనుచరులు మార్కెట్ యార్డు చైర్మన్ పీఠం కోసం హోరాహోరీకి దిగడంతో స్థానిక రాజకీయం రక్తికడుతోంది.
40 దశాబ్దాల తరువాత రిజర్వేషన్ మారడంతో నందికొట్కూరు మార్కెట్ యార్డు చైర్మన్ పదవి కోసం పోటీ తీవ్రమైంది. ఇప్పటికే కొంత మంది గ్రామ మండల స్థాయి నాయకులు రేస్ లోకి దిగి ముఖ్యనేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరి కొందరు మంత్రుల స్థాయిలో పైరవీలు చేస్తున్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో సత్తా చాటుకోగల నాయకుడికే మార్కెట్ యార్డు చైర్మన్ పీఠం కట్టబెట్టాలని వైసీపీ అధిష్టానం ఆలోచిస్తోంది. జూపాడు బంగ్లా , మిడ్తూరు నాయకుల మధ్య గట్టి పోటీ నెలకొనడంతో ఎవరిని ఎంపిక చేయాలో ముఖ్యనేతలకు సైతం తెలియడం లేదు. మార్కెట్ యార్డు చైర్మన్ అభ్యర్థిని స్థానిక ఎన్నికలకు ముందే డిక్లేర్ చేయండి లేదా మీ మండలానికే ఇస్తామని గట్టి హామీ ఇవ్వమని జూపాడుబంగ్లా ప్రజలు అంటున్నారు. దీంతో ఆ ముగ్గురు నేతలు ఈ విషయం పై జిల్లా ఇన్ చార్జి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో చర్చించారు. మొత్తానికి ఈ వ్యవహారం స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సెగ రాజేస్తున్న మాట వాస్తవం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ycp-leaders-eyes-on-nandikotkur-market-yard-chairman-post-25-92868.html
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.
ఇంత కాలం కల్వకుంట్ల కవిత తన విమర్శలను హరీష్ రావు, సంతోష్, జగదీశ్వరరెడ్డి వంటి నాయకులకే పరిమితం చేసిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, సవాళ్లు సంధిస్తున్నారు.
తాజా చిట్ చాట్ లో ఆమె తన తండ్రి కేసీఆర్ నే నేరుగా నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఖతమేనన్నారు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోతే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు.
గత కొంత కాలంగా తన స్వంత కుమారుడు, కుమార్తెల మధ్య పంచాయతీని పరిష్కరించే విషయంలో విఫలమైన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంచాయతీలు, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గాలి జనార్ధన్ రెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ప్రతిగా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు.
Publish Date:Dec 31, 2025
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
Publish Date:Dec 31, 2025
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.