ఏదో సినిమాలో లవ్ చేయాలా వద్దా అని ఓ పాట ఉంది. హీరోయిన్ ను ప్రేమించాలా వద్దా అన్న సందిగ్ధంలో హీరో ఆ పాట పాడతాడు. కానీ ఇప్పుడు వైసీపీ కూడా ఒక సందిగ్ధంలో ఉంది. అది సభ్య సమాజం తల దించుకునేలా ప్రవర్తించి అడ్డంగా దొరికిపోయిన దగుల్బాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై చర్య తీసుకోవాలా వద్దా అన్నదే ఇప్పుడు వైసీపీ సందిగ్ధత. మహిళలో న్యూడ్ గా వీడియో కాల్ మాట్లాడుతూ అడ్డంగా బుక్ అయిన ఎంపీ మాధవ్ ను క్షణం ఆలస్యం చేయకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించాల్సింది పోయి, చర్య తీసుకోవాలా, తీసుకుంటే ఏ చర్య తీసుకోవాలి అంటూ గురువారం(ఆగస్టు4) సాయంత్రం నుంచి వైసీపీ అధినేత జగన్ మల్ల గుల్లాలు పడుతున్నారు.
పార్టీ సీనియర్లతో మాధవ్ పై చర్య తీసుకోవాలా వద్దా, తీసుకుంటే ఎలాంటి చర్య తీసుకోవాలి అని ఎడతెగకుండా చర్చిస్తున్నారు. మహిళతో అసభ్యంగా ప్రవర్తించి దొరికిపోయిన గోరంట్ల మాధవ్ పై చర్య తీసుకునే విషయంలో ఇంతగా తర్జన భర్జన పడుతున్న వైసీపీ అధినేత జగన్.. తనపైనా, తన సర్కార్ పైనా సామాజిక మాధ్యమంలో విమర్శిస్తూ పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదు చేయించే విషయంలో ఒక్క క్షణం కూడా ఆలోచించలేదని పరిశీలకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. తొలుత సీఎంవో నుంచి గోరంట్ల మాధవ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు లీకులు ఇచ్చారు.
మళ్లీ కొద్ది సేపటికే ఆయన చేత రాజీనామా చేయించాలని యోచిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే అది కూడా ఖరారు కాలేదు. అసలు చర్య తీసుకోవాలా వద్దా అన్న విషయంపైనే జగన్ పార్టీ ముఖ్య నేతలతో చర్చిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ లోగా ప్రభుత్వ సలహాదారు సజ్జల మీడియా ముందుకు వచ్చి.. గోరంట్లపై చర్య తీసుకోవాలా వద్దా అన్ని నిర్ణయానికి ఇంకా రాలేదనీ, ఆయన ఆ వీడియోలో ఉన్నది తాను కాదని ఖండించారనీ, మార్ఫింగ్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారనీ చెప్పారు. ఒక వేళ ఆ వీడియో మార్ఫింగ్ కాలేదని తేలితే మాధవ్ పై కఠిన చర్యలు తప్పవని మీియా ముందు సజ్జల చెప్పారు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని తొలుత నేతలు లీకులిచ్చారు. అయితే మాధవ్తోనే రాజీనామా చేయించాలని కొందరు నేతలు సూచించారనీ, దాంతో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదనీ వైసీపీ వర్గాలే చెబుతున్నాయి.
కాగా ఎంపీ గోరంట్ల మాధవ్ఓ మహిళ తో గోరంట్ల న్యూడ్ గా వీడియో కాల్ లో మాట్లాడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమం ద్వారా వెలుగులోనికి రావడంతో ఆయన పై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. గతంలో అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ లు కూడా మహిళలతో అసభ్యంగా ప్రవర్తించి దొరికిపోయిన సంగతి తెలిసిందే. వైసీపీ నేతలకు మహిళల పట్ల గౌరవం లేదనడానికి గతంలో అంబటి, అవంతి శ్రీనివాస్ లు, ఇప్పుడు గోరంట్ల మాధవ్ లే నిదర్శనమని సామాజిక మాధ్యమంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ycp-is-in-dilema-weather-to-take-action-on-gorantla-on-not-39-141254.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.