వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు వెయ్యి కోట్ల రూపాయల భూకుంభకోణానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రహ్మనాయుడు గత కొన్ని రోజులుగా పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ముందస్తు బెయిల్ కోసం బ్రహ్మనాయుడు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే.. అక్కడ ఆయనకు చుక్కెదురైంది. దీంతో, కాంచీపురంలో బ్రహ్మనాయుడు ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు అక్కడ అరెస్ట్ చేసారు.
నకిలీ జీవోలు, దొంగ పత్రాల ఆధారంగా గండిపేటలో వెయ్యి కోట్లుకు పైగా విలువైన భూమిని కబ్జా చేయాలని ప్రయత్నించిన కేసులో బ్రహ్మనాయుడు నిందితుడు. హైదరాబాద్ పరిధిలోని నార్సింగ్ పరిధిలో భూములు అక్రమంగా సొంతం చేసుకునేందుకు బ్రహ్మనాయుడు, మరి కొందరు కుట్ర చేసారు. తాము ఏ భూమికి సంబంధించి కొనుగోలు ఒప్పందం చేసుకుంటున్నామో అది ప్రభుత్వ భూమి అని తెలిసి కూడా.. బ్రహ్మనాయుడు దాన్ని అక్రమంగా సొంతం చేసుకునే యత్నం చేశారని.. నకిలీ జీవోల సంగతి ఆయనకు తెలుసని పోలీసు అధికారులు చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ycp-former--mla-bolla-brahma-naidu-arrested-36-221934.html
భాగ్యనగర ప్రజలకు అలర్ట్. నగరంలోని నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ప్రయాణించే వాహనదారులకు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ విభాగం కీలక సూచనలు చేసింది.
తెలంగాణ క్రికెట్లో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది
హైదరాబాద్ నగర గుండెకాయ లాంటి నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సరికొత్త ప్రస్థానానికి సిద్ధమైంది.
న్యూ చండీగఢ్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో టీమిండియా పరుగుల పండగ చేసుకుంది.
తనను చూడాలని ఉందటూ.. సోషల్ మీడియాలో వైరల్గా మారిన వృద్ధుడి వీడియోపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు.
కూకట్పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్లో అర్ధరాత్రి నిర్వహించిన ఓ సీక్రెట్ ఆపరేషన్ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణవ్యాప్తంగా వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు రాష్ట్ర విద్యాశాఖ ఒక అతి ముఖ్యమైన శుభవార్తను అందించింది.
ఏపీలో కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతున్నట్టే 108 అంబులెన్స్ సర్వీసులూ లక్షలాదిమందికి ప్రాణదాతగా నిలుస్తూ సమర్థతను చాటుకుంటున్నాయి.
సినీ రంగంలో నటుడిగా, అద్భుతమైన కొరియోగ్రాఫర్గా, విలక్షణ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ చుట్టూ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
భాష్యం విద్యాసంస్థల చైర్మన్గా సుపరిచితులైన భాష్యం రామకృష్ణ.
ఒడిశా రాష్ట్రంలో వెలుగుచూసిన ఒక ప్రభుత్వ ఇంజనీర్ అవినీతి ఉదంతం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
కూకట్పల్లి మంజీరా మాల్లోని కింగ్ & క్వీన్స్ పబ్ రాత్రి సాధారణంగా హడావుడిగా ఉండే ప్రదేశమే.
గతంలో కంప్యూటర్లు కొత్తగా వచ్చినప్పుడు కూడా ఇలాంటి భయాలే వ్యక్తమయ్యాయి. కంప్యూటర్లు వస్తే అకౌంటెంట్లు, క్లర్కుల ఉద్యోగాలు పోతాయని అంతా భావించారు. కానీ వాస్తవంగా జరిగిందేమిటి? కంప్యూటర్ల వల్ల పాత ఉద్యోగ పద్ధతులు మారాయి తప్ప ఉద్యోగాలు తగ్గలేదు.. సరికదా మరిన్ని అవకాశాలు వచ్చాయి. సాఫ్ట్వేర్ అనే రంగం తెరమీదకు వచ్చింది. కోట్లాది మందికి సరికొత్త ఉపాధి లభించింది.