ఆంధ్రప్రదేశ్ అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మను ఫ్యాన్ పార్టీలోని నేతలే మరిచిపోయారా? అంటే ఆ పార్టీలోని ఓ వర్గం నుంచి అవుననే సమాధానం వస్తోంది. తాజాగా హైదరాబాద్లోని లోటస్పాండ్లో వైయస్ విజయమ్మతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఇరువురు మధ్య పలు అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో మంత్రి కావాలనుకున్న నీ ఆశయం.. ఎలాగైనా సాధించావంటూ ఈ సందర్బంగా ఆర్కే రోజాను వైయస్ విజయమ్మ భుజం తట్టి మరీ అభినందించినట్లు సమాచారం.
అలాగే వైయస్ విజయమ్మను కూడా ఆర్కే రోజా.. తన మాటల పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేసినట్లు సమాచారం. అయితే విజయమ్మను మంత్రి రోజా కలవడం సరే... మిగిలిన మంత్రులంతా ఏమయ్యారని సదరు వర్గంలోని వారు ప్రశ్నించుకొంటున్నారట. ఓ రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉంది.. ఈ నేపథ్యంలో విజయమ్మ అధికార పార్టీ గౌరవాధ్యక్షురాలిగా ఉన్నారు. అలాంటి ఆమెను జస్ట్ ఓ కర్టసీగా కలిస్తే ఏమవుతోందనే ఓ చర్చ అయితే వారి మధ్య హాట్ హట్గా నడుస్తోందట. గౌరవాధ్యక్షురాలిగా ఆమెకు గౌరవం ఇవ్వకుంటే.. పోని ఓ మహానేత భార్యగా ఆమెకు ఇప్పటికి ఓ గౌరవం అయితే అలాగే ఫిక్స్ అయి ఉంది. ఆ గౌరవాన్ని ఆ పార్టీలోని వారే తుంగలోకి తొక్కితే ఎలా అనే ప్రశ్న సదరు వర్గం నేతలు ప్రశ్నిస్తున్నారట. పోని జగన్ కేబినెట్లో కొనసాగుతోన్న బొత్స, ధర్మానలు సైతం నాడు మహానేత కేబినెట్లో ఉన్నారు.. వీళ్లు కూడా ఆమెను కలవకపోవడం ఏమిటనే సదరు వర్గం సందేహం వ్యక్తం చేస్తోంది.
అయితే మంత్రులుగా వీరంతా మహా బిజీ బిజీగా ఉన్నారనుకుందాం.. కానీ వీరంతా మంత్రులు కాగానే వీరిలో చాలా మంది విశాఖ శారదా పీఠానికి క్యూ కట్టి.. మరీ ఆ మఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర స్వామిని కలిసి.. ఆయనకు సాస్టాంగ నమస్కారాలే కాదు.. ఫలం, పుష్పం, తొయం అంటూ అన్ని సమర్పించేశారన్న విషయం అటు మీడియాలోనే కాదు ఇటు సోషల్ మీడియాలో సైతం వైరల్ అయిందన్న సంగతి అందరికీ తెలిసిందే.
దీంతో ఈ స్వామిలోరి విలువ అంత కూడా పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చేయలేదా? అనే సందేహాలు అయితే పార్టీలోని వారిలోనే కాదు.. ప్రజల్లో సైతం వ్యక్తమవుతోంది. పోని వైయస్ విజయమ్మను కలిస్తే... తమ పార్టీ అధినేత, సీఎం జగన్ ఫీలవుతారనే ఓ భావన ఈ కేబినెట్ మంత్రుల్లో ఉందేమోననే ఓ చర్చ కూడా సదరు వర్గంలో మహా రంజుగా నడుస్తోంది.
గతంలో సీఎం వైయస్ జగన్ సమీప బంధువు... తాజాగా మాజీ అయిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. గతంలో తెలంగాణలో పార్టీ పెట్టి.. పాదయాత్ర చేపట్టిన వైయస్ షర్మిలను కలిశారు. ఈ విషయం సీఎం జగన్ దృష్టికి రావడంతో బాలినేని శ్రీనివాస్ రెడ్డిని పక్కన పెట్టారని సమాచారం. ఆ క్రమంలోనే ఆయన తాజా కేబినెట్లో ఆయన మంత్రి పదవికి దూరమయ్యారనే ఓ చర్చ కూడా ఉంది. మరోవైపు తాను జగన్ బంధువు కావడం వల్లే మంత్రి పదవి దక్కలేదంటూ బాలినేని స్వయంగా మీడియా ముందు పేర్కొనడం గమనార్హం. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మను కలిస్తే.. తమకు కూడా బాలినేని శ్రీనివాస్ రెడ్డికి పట్టిన గతే పడుతుందనే ఓ విధమైన భయాందోళనలో సదరు మంత్రులకు ఉందని అందుకే... వారు ఆమెను కలవడం లేదనే ఓ చర్చ అయితే ఫ్యాన్ పార్టీలోని ఓ వర్గంలో యమ జోరు జోరుగా నడుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ycp-forgort-jagans-mother-25-135435.html
వచ్చినది పోగాకు రైతుల కష్టాలు విని, వారికి అండగా ఉన్నానని సంఘీభావం తెలపడం. అయితే ఈ పర్యటనలో జనగ్ రైతులను కలవడం, వారి కనీస హామీ ధర డిమాండ్ల కోసం పోరాడటం కంటే, బల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తన ప్రసంగం కూడా పరమ రొట్టకొట్టుడు పద్ధతిలో సాగింది.
2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనప్పటి నుంచీ తమ్మినేని రాజకీయంగా ఒకింత ఇన్ యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా తమ్మినేనిని ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలక బాధ్యతలను అప్పగించారు. ఈ నిర్ణయం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
వైఎస్ జగన్ ఆదేశిస్తే ఏమైనా చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే బోరుగడ్డ అనిల్ తన నోటి దురుసు, అనుచిత వ్యాఖ్యల కారణంగా తొమ్మిది నెలలపాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది.
తంజావూరు వేదికగా కావేరీ జలాల వివాదంపై మాట్లాడుతున్న సమయంలో ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్, నటి త్రిషను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. తమ అధినేత విజయ్ను అవమానించారంటూ టీవీకే శ్రేణులు తంజావూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడమే కాకుండా, జాతీయ మహిళా కమిషన్కు కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే చెన్నైలోని ఉదయనిధి నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
రాష్ట్రం వెనుకబాటుతనం నుంచి బయటపడాలంటే.. క్షేత్రస్థాయిలో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దశాబ్దాలుగా బీహార్ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందనీ, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రాజకీయ పొత్తులతో కాలక్షేపం చేస్తే రాష్ట్ర భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు.
రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, నిధుల కొరత నడుమ ఈ బడ్జెట్ను రూపకల్పన చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఒకవైపు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, మరొకవైపు అభివృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా సాధించడం మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంది. పరిమితమైన ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని, ఏ రంగాలకు ఎంత మేరకు నిధుల కేటాయింపులు చేయనున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి. మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి. ఈ ఫలితాలు కేవలం ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి.
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్కు చెందిన ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.