నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా ఉంది వైసీపీ ధోరణి. ఆ పార్టీ సోషల్ మీడిాయా వేదికగా అసత్యాలు, అభూతకల్పనలతో జనాలను మభ్యపెట్టాలని చేస్తున్న ప్రయత్నాలు నవ్వులపాలై, పార్టీ పరువును నిలువునా ముంచేస్తున్నది. అయినా వైసీపీ తీరు మార్చుకోవడానికి ప్రయత్నించడం లేదు. తాజాగా సచివాలయంలో సిఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం కేబినెట్ భేటీ జరిగింది. ఓ వైపు మంత్రివర్గ సమావేశం జరుగుతుండగానే, వైసీపీ సరికొత్త ఫేక్ ప్రచారం మొదలెట్టింది. అత్యంత కీలకమైన కేబినెట్ భేటీకి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ డుమ్మా కొట్టారంటూ తన సోషల్ మీడియాలో పోస్టులు గుప్పించింది. ఒక వైపు కబినెట్ భేటీ జరుగుతుండగా పవన్ కల్యాణ్ హస్తిన వెళ్లడమేంటి? కేంద్ర మంత్రితో భేటీ కావడమేంటి? అంటూ ప్రశ్నలు గుప్పించింది.
చంద్రబాబు హస్తిన పర్యటనపై చంద్రబాబు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారనీ, పవన్ కల్యాణ్ హస్తిన పర్యటనపై, ఆయన కదలికలపై నిఘా పెట్టారనీ, ఆరాలు తీస్తున్నారంటూ తన కల్పనా చాతుర్యాన్ని ప్రదర్శించింది. వాస్తవానికి కేబినెట్ భేటీలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఆ భేటీలో తాను రాష్ట్రంలో పోలీసుల తీరుపై చేసిన వ్యాఖ్యలకు కారణాలేమిటో సవిరంగా చెప్పారు. జిల్లా ఎస్పీలకు మంత్రులు ఫోన్ చేస్తే కనీసం స్పందించడం లేదని, ఒకవేళ స్పందించినా ఏదైనా సమస్య గురించి అడిగితే సీఐ, ఎస్ఐలే అందుకు బాధ్యులంటూ బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారనీ సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఆ కారణంగానే తాను మాట్లాడాల్సి వచ్చిందని ఇచ్చారు.
సోషల్ మీడియాలో వైసీపి తమపైనా, ప్రభుత్వంపైనా, చివరికి ఇళ్ళలో ఉండే తమ ఆడవాళ్ళపైనా కూడా అసభ్యకరంగా పోస్టులు పెడుతుంటే సంబంధిత పోలీస్ అధికారులు పిర్యాదులు చేస్తున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేశారు.
కేబినెట్ భేటీలో ఓ వైపు పవన్ కళ్యాణ్ వైసీపి దుష్ప్రచారం గురించి, వారికి అండగా నిలుస్తున్న పోలీస్ అధికారుల గురించే మాట్లాడుతుంటే, వైసీపీ సోషల్ మీడియా మాత్రం పవన్ కల్యాణ్ కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టి హస్తినలో చంద్రబాబుపై అమిత్ షాకు ఫిర్యాదు చేయడానికి వెళ్లారంటూ దుష్ప్రచారం చేసింది.
వైసీపీ సోషల్ మీడియా వింగ్ లో చేస్తున్న ఫేక్ ప్రచారంపై జనం నవ్వుకుంటున్నారు. ఆ పార్టీ తీరే అంత.. ఇక మారదు అంటూ పట్టించుకోవడం మానేశారు. అయినా వైసీపీలో మార్పు రావడం లేదు. ఇప్పటికే ఇక దిగజారడానికి ఏం మిగలలేదన్నట్లుగా దిగజారిపోయిన ఆ పార్టీ ఇంకెన్ని పతనాలను చూడాల్సి వస్తుందోనన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ycp-fake-propaganda-became-laughing-stock-25-188002.html
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు.
ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్స్టార్ రజనీకాంత్తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న పవన్ కల్యాణ్ ప్రకటనపై స్పందించిన ప్రకాశ్ రాజ్ సింగిల్ గానా, పొత్తుతోనా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
గతంలో ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ నుండి గానీ, అంతకుముందు రెండుసార్లు గెలిచిన జార్ఖండ్ నుండి గానీ, లేదా ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ నుండి గానీ ఈసారి అభ్యర్థిత్వం లభించలేదు. దేశంలోనే అత్యంత శక్తిమంతమైన రిలయన్స్ కార్పొరేట్ లాబీయింగ్ పప్పులు మారిన రాజకీయ సమీకరణాల ముందు ఉడకలేదు.
పవన్ రాజకీయ అవగాహనారాహిత్యానికి ఆయన వ్యాఖ్యలే తార్కానమన్నారు. ప్రపంచ పరిణామాలు ఏదిశగా నడుస్తున్నాయో కూడా ఆయనకు అర్థం కావడం లేదన్న వీ శ్రీనివాసరావు. . తమిళనాడులో సినీ నటుడు విజయ్ గెలుపు తర్వాత పవన్ కల్యాణ్పై ఒత్తిడి తీవ్రంగా ఉండడంతో ఆయన నిస్పృహనకు లోనవుతూ.. దీనివల్ల ఆయన ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.
తమిళనాట విజయ్ సునామీ ప్రకంపనలు సద్దుమణగక ముందే, తమిళనాట మరో సీనియర్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు పొలిటికల్ స్క్రీన్ పైకి రావడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.