రాచమల్లుకు ఎదురుగాలి.. ప్రొద్దుటూరులో తెలుగుదేశందే పై చేయి!

Publish Date:May 3, 2024

Advertisement

కడప పేరు చెప్పగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది వైఎస్ కుటుంబం. ఆ జిల్లాపై ఆ కుటుంబం ఆధిపత్యం. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఆ కుటుంబం నిట్టనిలువుగా చీలిపోయింది.  ఆ ప్రభావం జిల్లాలో ఆ కుటుంబం ఆధిపత్యంపై కూడా పడింది. వైఎస్ మరణం తరువాత కడప జిల్లా మొత్తం కాంగ్రెస్ ను వీడి  జగన్ కు మద్దతుగా నిలిచింది. 2014 ఎన్నికలలో జగన్ పార్టీ పరాజయం పాలైనా కడప జిల్లా మాత్రం ఆయనకూ, ఆయన పార్టీకే జై కొట్టింది. అయితే 2019 ఎన్నికలలో జగన్ విజయం సాధించి ముఖ్యమంత్రి అయిన తరువాత పరిస్థితులు వేగంగా మారిపోయాయి. ఉమ్మడి కడప జిల్లాలో వైఎస్ జగన్ పునాదులు కదులుతున్న పరిస్థితి గోచరిస్తోంది. ముఖ్యంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని ఆ పార్టీ వర్గాలే బాహాటంగా చెబుతున్నాయి. 

ఆ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా ఎనిమిది పదుల వయస్సున్న వరదరాజులు రెడ్డి పోటీలో ఉన్నారు. చంద్రబాబు ప్రొద్దుటూరు నియోజకవర్గ అభ్యర్థిగా వరదరాజులు రెడ్డిని ఎంపిక చేయడంపై అందరూ విస్మయం వ్యక్తం చేశారు. ఆయితే ఆయన తనక ఇవే చివరి ఎన్నికలు అంటూ చేస్తున్న ప్రచారం ప్రజలలో సానుకూలతకు కారణమైంది. అన్నిటికీ మించి ప్రొద్దుటూరు సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఆయన సమీప బంధువు బంగారురెడ్డిల అరాచకాలు, దౌర్జన్యాలతో విసిగిపోయిన స్థానికులు, వ్యాపారులు వరదరాజులురెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారు. అలాగే నియోజకవర్గంలో తెలుగుదేశం బలం, వైసీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతా అన్నీ కలిసి వచ్చాయని చెప్పవచ్చు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో రాచమల్లు అరాచకత్వం అన్ని వర్గాల ప్రజలలో ఆయన పట్ల అసహనానికీ, అసంతృప్తికీ కారణమైంది. దీంతో  ప్రొద్దుటూరులో తెలుగుదేశం వైపు మొగ్గు కనిపిస్తోంది. 

ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేకు సొంత పార్టీ నేతలూ, క్యాడర్ తో సమన్వయం కరవైంది. ఆయన పూర్తిగా ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు తనకే ఓటు వేస్తారన్న భావనలో ఉన్నారు. అన్నిటికీ మించి వైఎస్ షర్మిలపై రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రజలలో మరీ ముఖ్యంగా మహిళల్లో ఆయన పట్ల వ్యతిరేకతకు కారణమయ్యాయి. వీటన్నిటికీ అదనంగా నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్న మైనారిటీలు కాంగ్రెస్ వైపు చూస్తుండటం రాచమల్లు విజయావకాశాలను దారుణంగా దెబ్బతీసిందని పరిశీలకులు అంటున్నారు. మొత్తంగా ఉమ్మడి కడప జిల్లాలో వైఎస్ షర్మిల ప్రభావం వైసీపీకి ప్రతికూలంగా మారిందంటున్నారు. ప్రొద్దుటూరు పరిస్థితి కడప జిల్లాలో మారిన రాజకీయ ముఖచిత్రానికి అద్దంపడుతోందని చెబుతున్నారు. ప్రచారం నుంచి ప్రజా స్పందన వరకూ  తెలుగుదేశం కూటమికి సానుకూలత కనిపిస్తోందని చెబుతున్నారు. దీంతో ప్రొద్దుటూరులో రాచమల్లుకు ఎదురీత తప్పదని విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ పార్టీలకు ఫండ్స్ బాగానే గిట్టుబాటయ్యాయి. అయితే.. ఏపీలో పవర్‌లో ఉన్న టీడీపీ, జనసేన కంటే వైసీపీ కలెక్షన్లే ఎక్కువగా ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది.
అంబటి ఏమన్నారంటే.. 2024 ఫలితాలను అర్ధం చేసుకోవడంలో తెలుగుదేశం కూటమి పార్టీలు విఫలమయ్యాయట. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల కారణంగానే కూటమి ఆ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిందట.. ఇప్పుడు ఈ ఏడాదిన్న కాలంలో జనానికి తత్వం బోధపడి.. జగన్ పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారట. అంబటి భాష్యం విన్న వైసీపీయులే ఆశ్చర్యపోతున్నారు.
ఆదివారం తన 53వ పుట్టిన రోజు జరుపుకున్న జగన్ కు చంద్రబాబు, నారా లోకేష్, వైఎస్ షర్మిల తదితరులు సామాజిక మాధ్యమం ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు ప్రతిగా జగన్ కూడా ఒక్క మంత్రి లోకేష్ కు తప్ప మిగిలిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ రిప్లై ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి దయనీయంగా మారిందన్న ఆయన గత పదేళ్ల అధికార గర్వంతో విర్రవీగిన నేతల కండలు ఇప్పుడు కరిగిపోయాయని ఎద్దేవా చేశారు.
రాజకీయ ప్రత్యర్థులే కాదు.. ప్రభుత్వ విధానాలు సరిగా లేవన్న సామాన్యులపై కూడా జగన్ పాలనలో దాడులు జరిగాయి. ఇక అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలూ సరే సరి. సరే జనం విషయం గుర్తించి 2019లో తాము కట్టబెట్టిన అధికారాన్ని 2024 ఎన్నికలలో లాగేసుకుని అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ చంద్రబాబుకు అప్పగించారు.
చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు పేరుకు పాలమూరును దత్తత తీసుకుని, అభివృద్ధి పేరిట శంకుస్థాపన ఫలకాలకే పరిమితమయ్యారనీ, ఆయన హయాంలో శంకుస్థాపన ఫలకాలకు అయిన ఖర్చుతో ఏకంగా ఓ ప్రాజెక్టే కట్టవచ్చంటూ విమర్శలు గుప్పించారు.
ఆదివారం జగన్ పుట్టిన రోజు సందర్భంగా షర్మిల అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆ తెలపడంలోనూ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. చెల్లెలిగా కాకుండా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల వైసీపీ అధ్యక్షుడు జగన్ గారికి అని సంబోధిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలో గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
సోషల్ మీడియాలో జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి. అవన్నీ పక్కన పెడితే తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద వెలసిన ఓ భారీ కటౌట్ ఆసక్తి రేకెత్తిస్తోంది.
ప్రముఖ సినీ నటి ఆమని భారతీయ జనతా పార్టీలో చేరారు.
భారతదేశం మత సామరస్యానికి ప్రతీక అన్న విజయసాయి.. అటువంటి దేశంలో ఉంటూ.. బంగ్లాలో హిందువులు లక్ష్యంగా సాగుతున్న దాడులపై స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ దాడులకు ఖండించని వారు దేశ భక్తులే కాదని విజయసాయి తన ట్వీట్ లో పేర్కొన్నారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ కోర్టుకు వెడదామా? అంటే..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించలేదు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అంటూ జీవోలోనే స్పష్టంగా పేర్కొంది. దీంతో ఆ పాయింట్ మీద కోర్టుకు వెళ్లడం ఎలా అన్నది అర్ధం కాక వైసీపీ మల్లగుల్లాలు పడుతోందని పరిశీలకులు అంటున్నారు.
తాను ప్రత్యక్ష ఎన్నికలో పోటీ చేసిన తొలి సారే పరాజయం పాలైన సంగతిని గుర్తు చేసుకున్న ఆయన, ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని, ఓడిన చోటే గెలవాలన్న పట్లుదలతో పని చేసి ఫలితం సాధించానని లోకేష్ వివరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.