మాజీ మిత్రులపై సిన్హా ఆశలు ... కమలం ఓటు క్రాస్ అవుతుందా?

Publish Date:Jun 28, 2022

Advertisement

ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్ధిగా రాష్ట్రపతి ఎన్నికల బరిలో దిగిన, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా, నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా, ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఒక్కప్పుడు  బీజేపీలో ఉన్న  సిన్హా, ఆ  పార్టీలో ఉన్న మాజీ మిత్రుల మద్దతు కోరతానని చెప్పారు. నిజమే, రాష్ట్రపతి ఎన్నికల్లో, రాజకీయ పార్టీలు విప్. జారీ చేయవు. ఎలెక్టోరల్ కాలేజీలో ఓటర్లుగా ఉండే ఎంపీలు, ఎమ్మెల్యేలు తమకు ఇష్టం వచ్చిన వారికి ఓటు వేసేందుకు సంపూర్ణ స్వేఛ్చ ఉంటుంది. అయితే, సహజంగా పార్టీ నిర్ణయం ప్రకారమే, ఓటింగ్ ఉంటుంది.అక్కడక్కడా క్రాస్ ఓటింగ్ జరిగిన సందర్భాలు లేక పోలేదు. కానీ, క్రాస్ ఓటింగ్’ అన్ని సందర్భాలో అయ్యే పని కాదు. ఇంతవరకు  దేశ చరిత్రలో,  క్రాస్ ఓటింగ్’తో, రాష్ట్రపతి అభ్యర్ధి గెలిచిన సందర్భం ఒకే ఒక్కటి కనిపిస్తుంది. 

1969 రాష్ట్రపతి ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ నీలం సంజేవ్  రెడ్డిని తమ అభ్యర్ధిగా పోటీకి దించింది. అయితే, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ, స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో దిగిన వీవీగిరికి మద్దతుగా ఆత్మప్రభోదం పిలుపు ఇవ్వడంతో, అధికార కాంగ్రెస్ అభ్యర్ధి సంజీవ రెడ్డి ఓడి పోయారు. స్వతంత్ర అభ్యర్ధి వీవీ గిరి విజయం సాధించారు. అందుకే, రాష్ట్ర పతి ఎన్నికల్లో అదొక వైచిత్రిగా నిలిచి పోయింది. అయితే, కాంగ్రస్ పార్టీ రెండుగా చీలిపోయిన నేడ్పహయ్మ్లో జరిగిన ఆ  ఎన్నికాలో తప్ప, ఇకేప్పుడు అలాంటి సందర్భం ఎదురు కాలేదు. 

అదలా ఉంటే, ఇప్పుడు యశ్వంత్ సిన్హా సహజంగా అందరితోపాటుగా బీజేపీ మద్దతు కూడా కోరతానని అంటే, అదొక రకం, అందరూ చేసేదే, రేపు ఎన్డీఎ అభ్యర్ధి  ద్రౌపది ముర్ము కూడా, కాంగ్రెస్ సహా, అన్నిపార్టీల నాయకులను కలిసి, మద్దతు కోరతారు.కానీ, యశ్వంత్ సిన్హా, ప్రత్యేకించి బీజేపీ  మిత్రులను మద్దతు కోరతానని చెప్పడం, రాజకీయ చర్చకు  తెర తీసింది  ఇటు అధికార కూటమిలో అటు విపక్ష కూటమిలోనూ ఆసక్తికర చర్చకు జరుగుతోంది, అనుమనాలూ  వ్యక్తమవుతున్నాయి. 

ఓ వంక ప్రతిపక్ష కూటమికి సారధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్  గాంధీ,  సహా సిన్హాకు మద్దతు ఇస్తున్న పార్టీలు, “రాష్ట్రపతి ఎన్నిక.. ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ కాదు  రెండు సిద్ధాంతాల మధ్య జరిగే పోరు” గా చూస్తున్నారు. రాహుల్ గాంధీ అయితే, మరో అడుగు ముందుకేసి, రాష్ట్రపతి ఎన్నిక, ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ భావజాలానికి వ్యతిరేకంగా  జరుగుతన్న విపక్షాల ఉమ్మడి పోరాటంగా అభివర్ణించారు.

మరో వంక యశ్వంత్ సిన్హా, బీజేపీలో అంతర్గత ప్రజాస్వామ్యం లోపించడం వల్లనే తాను పార్టీ వదిలివచ్చానని చెప్పడం ద్వారా, తనకు సంఘ్ పరివార్’ సిద్ధాంతాలతో విభేదాలు లేవని  చెప్పకనే చెప్పారు. అది చాలా వరకు నిజం కూడా మంత్రి పదవి ఆశించి, రాలేదన్న దుగ్ధతో అయన బీజేపీని వదిలేశారనే ఆరోపణలు లేక పోలేదు.  మరోవంక సిన్హా బీజేపీలోని మిత్రుల మద్దతు కోరతానని ప్రకటించారు. ఈ అన్నిటినీ మించి, అయన కుమారుడు జయంత్ సిన్హా ఇప్పటికీ  బీజేపీలో కీలక బాధ్యతల్లో ఉన్నారు. కొంతకాలం  మోడీ మంత్రివర్గంలోనూ ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు కూడా బీజేపీ ఎంపీగా, ఆర్ధిక మంత్రిత్వ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. అంటే, యశ్వంత్ సిన్హా బీజేపీ నుంచి బయటకు వచ్చినా, ‘ఇంగువ కట్టిన  గుడ్డకు వాసనా వదలనట్లు సంఘ పరివార్ వాసనలు మాత్రం ఇంకా పూర్తిగా పోలేదని అనుకోవచ్చని అంటున్నారు. 

అదోకకటి అలా ఉంటే, పాత వాసనలు యశ్వంత్ సిన్హాకు మేలు చేస్తాయా అంటే, అనుమానమే అంటున్నారు. యశ్వత్ సిన్హానే అన్నట్లు, అప్పడు ఆయన ఉన్నప్పుడు ఉన్న బీజేపీకి ఇప్పుడున్న బీజేపీకి పొంతనే లేదు. సో.. వ్రతం  చెడ్డా సిన్హాకు ఫలితం దక్కక పోవచ్చని, ముఖ్యంగా మహారాష్ట్ర పరిణామాలు, ఇటీవల జరిగిన, రాజ్య సభ ఎన్నికల ఫలితాలు, కొద్ది రోజుల క్రితం యూపీ సహా మరికొన్ని రాష్ట్రాలలో జరిగిన లోక్ సభ, అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాల నేపధ్యంలో బీజేపీలోని అసంతృప్తులు క్రాస్ ఓటింగ్’ కు పాల్పడే సాహసం చేయక పోవచ్చని, పరిశీలకులు అంటున్నారు.

By
en-us Political News

  
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.