యాకుబ్ మీమన్ కి ఉరి అమలు

Publish Date:Jul 29, 2015

Advertisement

 

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ యాకుబ్ మీమన్ రెండవసారి పెట్టుకొన్న క్షమాబిక్ష పిటిషన్ని కూడా తిరస్కరించడంతో అతనిని ఈరోజు ఉదయం 7గంటలకి నాగపూర్ సెంట్రల్ జైల్లో ఉరి తీశారు. సుప్రీంకోర్టు చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని విధంగా నిన్న అర్ధరాత్రి తరువాత మళ్ళీ యాకుబ్ కేసును విచారణకు చేప్పట్టింది.

 

యాకుబ్ ఉరి శిక్షను నిలిపి వేయాలని కోరుతూ అతని తరపున లాయర్ ప్రశాంత్ భూషణ్, రాజు రామచంద్రన్‌ తదితరులు మళ్ళీ నిన్న అర్ధరాత్రి తరువాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్.యల్. దత్తు ఇంటి తలుపులు తట్టడంతో ఆయన మళ్ళీ ఈ కేసును నిన్న విచారించి తీర్పు చెప్పిన త్రిసభ్య ధర్మాసనాన్ని వారి అభ్యర్ధనను పరిశీలించి తీర్పు చెప్పమని కోరడంతో ఈరోజు తెల్లవారు జామున 3-4.30 గంటల వరకు దీనిపై సుప్రీం త్రిసభ్య బెంచి పునర్విచారణ చేప్పట్టింది.

 

యాకుబ్ ని ఉరి తీసే ముందు కనీసం ఏడు రోజుల ముందు ‘డెత్ వారెంట్’ అందించాలని కానీ ఆవిధంగా చేయనందున అతని హక్కుల ఉల్లంఘన జరిగిందని కనుక అతని ఉరి శిక్షను నిలిపివేయాలని అతని న్యాయవాదులు వాదించారు. కానీ అతనికి టాడా కోర్టు ఉరి శిక్ష విధించినప్పుడే డెత్ వారెంట్ జారీ చేసిందని కనుక మళ్ళీ కొత్తగా మరోమారు డెత్ వారెంట్ జారీ చేయవలసిన అవసరం లేదని భారత అడ్వకేట్ జనరల్ ముకుల్ రోహాత్గీ వాదించారు. ఏదో విధంగా యాకుబ్ ఉరి శిక్షను వాయిదా వేయించాలనే ఉద్దేశ్యంతోనే అతని న్యాయవాదులు ఈవిధంగా పదేపదే పిటిషన్లు వేస్తూ మైండ్ గేమ్స్ ఆడుతున్నారని, వాటిని సుప్రీం ధర్మాసనం అనుమతించరాదని, యాకుబ్ కి ఉరి శిక్షని నిలిపివేయరాదని ఆయన వాదించారు. తెల్లవారు జామున సుమారు 4.30 గంటల వరకు ఇరుపక్షాల వాదనలు విన్న త్రిసభ్య బెంచి యాకుబ్ మీమన్ కేసు విషయంలో ఎక్కడా తప్పు జరుగలేదని అతనికి ఉరి శిక్ష వేయడం సమంజసమేనని తీర్పు చెప్పింది.

 

అప్పటికే యాకుబ్ మీమన్ ఉరి శిక్ష అమలుకు నాగపూర్ జైలు అధికారులు ఏర్పాట్లు మొదలు పెట్టారు. పద్ధతి ప్రకారం చివరి సారిగా నిన్న రాత్రి అతని కుటుంబ సభ్యులతో అతనిని మాట్లాడనిచ్చారు. అతనికి ఇష్టమయిన కిచిడిని ఇచ్చారు. అతను దానిని కొద్దిగా మాత్రమే తిన్నాడు. అవతల సుప్రీం ధర్మాసనంలో అతని ఉరిశిక్షపై వాదోపవాదాలు జరుగుతుంటే మరోవైపు జైలు అధికారులు అతనిని ఉరి శిక్షకు సన్నధం చేస్తున్నారు. సుప్రీం ధర్మాసనం అతని ఉరి శిక్షను ఖరారు చేసినట్లు దృవీకరించుకొన్న తరువాతనే అతనిని డిజిపి, మేజిస్ట్రేట్ సమక్షంలో ఈరోజు ఉదయం 7గంటలకు ఉరి తీశారు. అనంతరం అతని శవానికి పోస్ట్ మార్టం నిర్వహించి అతని కుటుంబ సభ్యులకు అందజేస్తారు.

 

ఇదివరకు ఎన్నడూ లేనంతగా యాకుబ్ ఊరిపై దేశంలో తీవ్ర వాదోపవాదాలు జరిగాయి, భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అతనిని ఉరి తీసినందుకు ఉగ్రవాదులు ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉంది కనుక ఇంటలిజెన్స్ విభాగం దేశ వ్యాప్తంగా హై అలెర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా మహారాష్ట్ర అంతటా ప్రధానంగా నాగపూర్, ముంబైలలో పోలీసులను మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేయడంతో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకు తగ్గట్లుగానే భద్రతని మరింత కట్టుదిట్టం చేసింది.

By
en-us Political News

  
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది. తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.
అసెంబ్లీ, మండలిలో పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలను నియామస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు
ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల్లో లభించిన విజయానికి కొనసాగింపు సాధ్యమైనంత త్వరగా మునిసిపోల్స్ నిర్వహించేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.
ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు సందర్భంగా పొటేళ్ల‌ను బ‌లిచ్చి ఆయ‌న‌ ఫోటోల‌కు ఆ ర‌క్తాన్ని త‌ర్ప‌ణం చేశారు వైసీపీ అభిమానులు. అంతేనా హింసాత్మ‌క కామెంట్లను ఫ్లెక్సీల‌పై పోస్ట్ చేసి.. వీరంగం ఆడారు.
అధికారం అండ చూసుకుని మంచి, చెడు, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలతో చెలరేగిపోయారు. అటువంటి నేతలంతా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నాటి తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన మార్పు కానవచ్చింది. సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.
ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు.
సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.