ఉగ్రవాదులకు మనం ఎటువంటి సంకేతాలు పంపుతున్నాము?

Publish Date:Jul 30, 2015

Advertisement

 

యాకుబ్ మీమన్ ముస్లిం అయినందునే అతనిని ఉరి తీస్తున్నారని కొందరు వితండవాదం చేసారు. చివరికి సల్మాన్ ఖాన్ వంటి వ్యక్తి కూడా అతనిని సమర్దిస్తూ ట్వీట్ చేసాడు. కానీ యాకుబ్ మీమన్ 257 మంది ప్రజల మరణానికి, 650 మంది గాయపడటానికి కారకుడనే విషయం విస్మరించడం విస్మయం కలిగిస్తోంది. సుమారు దశాబ్దంపాటు సాగిన సుదీర్ఘమయిన న్యాయవిచారణలో అతను దోషిగా దృవీకరించిన తరువాతనే అతని కోర్టులు మరణశిక్ష వేసాయి. అన్నేళ్లపాటు కోర్టులో న్యాయపోరాటం చేయగలిగిన అతనికి అన్యాయం జరిగిందని వాదించడం అర్ధరహితమే. అసలు అతనికి అన్నేళ్లపాటు పోరాడేందుకు అవకాశం కల్పించడం ద్వారానే అతని పట్ల మన న్యాయవ్యవస్థలు ఎటువంటి వివక్ష చూపలేదని స్పష్టం అవుతోంది.

 

అతనికి అండగా నిలబడ్డవారు న్యాయం కోరుతూ మళ్ళీ నిన్న అర్దరాత్రి సుప్రీంకోర్టు తలుపులు తడితే సుప్రీంకోర్టు చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఈరోజు తెల్లవారు జామున 3.00-4.30 గంటల వరకు సుప్రీం త్రిసభ్య ధర్మాసనం వారి వాదనలను వింది. అటువంటప్పుడు అతనికి అన్యాయం జరిగిందని ఏవిధంగా అనగలరు. సుప్రీంకోర్టు అతనికి మరణ శిక్ష ఖరారు చేసిన తరువాత, రాష్ట్రపతి అతని క్షమాభ్క్ష పిటిషన్ని తిరస్కరించిన తరువాత కూడా మళ్ళీ అతని కేసుని సుప్రీం కోర్టు రెండుసార్లు పునర్విచారించింది. మళ్ళీ రాష్ట్రపతి అతని క్షమాభిక్ష పిటిషన్ని పునః పరిశీలించారు. సుప్రీం ధర్మాసనం, రాష్ట్రపతి రెండవసారి కూడా అతనికి ఈ కేసులో మరణశిక్షకి అర్హుడేనని భావించిన తరువాతనే అతనికి మరణ శిక్ష అమలుచేసారు.

 

నిజానికి భారత పౌరులను బలిగొన్న ఒక నేరస్తుడు ఈకేసు కోసం భారత రాష్ట్రపతిని అర్దరాత్రి వరకు, సుప్రీంకోర్టుని తెల్లవారుజాము వరకు కూడా పనిచేయించగలిగాడంటే అతను ఎంత శక్తివంతుడో, అతనికి ఎంత అంగబలం, అర్ధబలం, పలుకుబడి ఉందో స్పష్టమవుతోంది. అటువంటి శిక్షలు పడిన సాధారణ ఖైదీలెవ్వరికీ ఇటువంటివి సాధ్యం కాదు. కానీ యాకుబ్ మీమన్ వెనుక అసాధారణమయిన బలం, చాలా పలుకుబడి గల శక్తులు ఉన్నందునే అతను చివరి నిమిషం వరకు న్యాయపోరాటం చేయగలిగాడని స్పష్టం అవుతోంది.

 

కానీ మన న్యాయస్థానాలు ఎంతటి ఉగ్రవాదికయినా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకొనేందుకే చివరి వరకు అన్ని అవకాశాలు కల్పిస్తే దానినే మన మేధావులు తప్పుపడుతున్నారు. అతని తరపున అంతపోరాటం జరిగిన తరువాత కూడా అతనిని ఉరి తీయడం అన్యాయం అని అంటే అంతకంటే అన్యాయం మరొకటి ఉండదు. అతనిని ఉరి తీసిన తరువాత కూడా అతనివల్ల భారత్ చాలా ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్దపడవలసివస్తోంది అంటే భారత వ్యతిరేక శక్తులు దేశంలో ఎంతగా వ్రేళ్ళూనుకొని ఉన్నాయో అర్ధమవుతోంది.

 

భారతదేశంపై దాడులకు పాల్పడిన వారిని ఉపేక్షించబోమని భారత ప్రభుత్వం, మన న్యాయవ్యవస్థలు ఉగ్రవాదులకు బలమయిన సందేశం ఇవ్వాలని భావిస్తే, అటువంటి ఉగ్రవాదులను విద్యావంతులు, మనవ హక్కుల సంఘాల నేతలు, న్యాయవాదులు, మత పెద్దలు, రాజకీయనాయకులు సమర్ధించడం ఉగ్రవాదులకు మరింత దైర్యం కల్పిస్తోంది. తమకు భారత్ లో మద్దతు ఇచ్చేవారు చాలా మందే ఉన్నారని, కనుక భారత్ పై దాడులు చేసేందుకు ఏ మాత్రం సంకోచించనవసరంలేదని వారు భావించేలా చేస్తోంది.

 

మొన్న పంజాబ్ లో పోలీస్ స్టేషన్ పై ఉగ్రవాదులు దాడి చేసి తొమ్మిది మందిని చంపారు. అంతకంటే ముందుగా వారు పఠాన్ కోట్ రైల్వే ట్రాక్ పై ఐదు బాంబులు కూడా అమర్చారు. ఒకవేళ అవి ప్రేలి ఉంటే వందలాది మంది ప్రయాణికులు మరణించేవారు. అటువంటి చర్యలను ఖండించడానికి మన మేధావులు, మత పెద్దలు, మనవ హక్కుల సంఘాలు ముందుకు రావు. కానీ ఉగ్రవాదులు ఎవరయినా పట్టుబడి ఈవిధంగా ఉరిశిక్షకు గురయితే మాత్రం చాలా ఆందోళనపడిపోతారు. తమ శక్తి యుక్తులన్నిటినీ వినియోగించి అటువంటి వారిని కాపాడేందుకు చివరి నిమిషం వరకు కూడా పోరాడుతారు. అందుకు అవసరమయితే మన రాష్ట్రపతిని, న్యాయవ్యవస్థలను కూడా రేయింబవళ్ళు పనిచేయించగల సమర్ధులు. ఈ విదంగా వ్యవహరిస్తూ మన దేశంపై దాడులు చేసి ప్రజల ప్రాణాలు హరిస్తున్న ఉగ్రవాదులకు ఇంతకీ మనం ఏమి చెప్పదలచుకొన్నాము? అని అందరూ ఆలోచించవలసిన సమయమిది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.