చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్.. ప్రపంచం చూపు ఏపీ వైపు

Publish Date:Nov 1, 2024

Advertisement

ప్రపంచం మొత్తం  ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది. రాష్ట్ర విభజన తో అప్పులు వినా ఆస్తులు లేని రాష్ట్రంలో, కనీసం రాజధాని కూడా లేని రాష్ట్రంగా అన్నిటికీ మించి రెవెన్యూ లోటుతో విభజిత ఆంధ్రప్రదేశ్ ఒక అనాధలా మిగిలింది. అలాంటి రాష్ట్రాన్ని ప్రగతి బాట పట్టించి దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా రూపుదిద్దగలిగేది ఒక్క చంద్రబాబునాయుడు మాత్రమేనని విశ్వసించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు  2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి విజయాన్ని కట్టబెట్టారు. నవ్యాంధ్రప్రదేశ్  తొలి ముఖ్యమంత్రిగా  చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచీ సన్ రైజ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అంటూ రాష్ట్ర ప్రగతికి బాటలు పరిచారు. రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతి తొలి అడుగులు పడ్డాయి. రాష్ట్రానికి జీవనాడి వంటి పోలవరం నిర్మాణం ఆరంభం కావడమే కాదు.. నిర్మాణ పనులు వేగంగా జరిగాయి. మూడు వంతుల ప్రాజెక్టు పూర్తయ్యింది. అంతే కాదు.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో చంద్రబాబు ఐదేళ్ల హయాంలో మూడేళ్లు దేశంలోనే నంబర్ వన్ గా నిలిచింది. ప్రజలకు విద్యుత్ కష్టాలు లేవు. ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు అందాయి.పింఛనర్లకూ అదే తేదీన ఠంచనుగా పించన్లు అందాయి. 
ప్రపంచం నలుమూలల నుంచీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ముందుకు వచ్చారు. కియా వంటి పలు పరిశ్రమలు గ్రౌండ్ అయ్యాయి. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లకు దీటుగా ఏపీలో ఐటీ పుంజుకుంది. ఇక ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారడానికి ఎంతో కాలం పట్టదని అంతా భావిస్తున్న సమయంలో 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది. 
వైసీపీ విజయం సాధించి.. జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు అందుకున్నారు. ఆ నాటి నుంచి ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ లో అంధయుగం నడుస్తున్నదా అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. చంద్రబాబు విజన్ కారణంగా, చంద్రబాబు కష్టం కారణంగా రాష్ట్రంలో గ్రౌండింగ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న ఎన్నో పరిశ్రమలు ముఖం చాటేశాయి. అప్పటికే గ్రౌండ్ అయిన మరిన్న పరిశ్రమలు రాష్ట్రం దాటి వెళ్లిపోయాయి. ఎన్నో ఏళ్లుగా రాష్ట్రంలో ఉన్న అమరరాజా బ్యాటరీస్ వంటి సంస్థలు సైతం రాష్ట్రంలో కొనసాగడం మా వల్ల కాదని పొరుగు రాష్ట్రానికి తరలిపోయాయి. రాష్ట్రంలో అరాచక పాలన ఐదేళ్ల పాటు యథేచ్ఛగా కొనసాగింది. సమాజంలోని ఏ ఒక్క వర్గాన్నీ వదలకుండా జగన్ సర్కార్ వేధింపులకు గురి చేసింది. పాలన కక్ష సాధింపు, దోపిడీ, దౌర్జన్యం, అవినీతే అన్నట్లుగా జగన్ హయాంలో రాష్ట్రంలో పాలన సాగింది. 

2024 ఎన్నికలలో జనం జగన్ దుర్మార్గ పాలనకు చరమ గీతం పాడారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావించే చంద్రబాబు నాయకత్వానికి పట్టం కట్టారు. చరిత్ర కనీవినీ ఎరుగని రీతిలో తెలుగుదేశం కూటమికి పట్టం కట్టారు. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి కొలువుదీరింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచే రాష్ట్రంలో ప్రొగ్రసివ్ వైబ్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రపంచం చూపు మళ్లీ ఏపీ వైపు మళ్లింది. తరిలిపోయిన పరిశ్రమలు ఒక్కటొక్కటిగా మళ్లీ రాష్ట్రానికి రావడం మొదలైంది.పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ దిగ్గజ సంస్థలు ఆంధ్రప్రదేశ్ లో  తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి, విస్తరించడానికి ఆసక్తి చూపుతున్నాయి. 
తెలుగుదేశం కూటమి కొలువుదీరిన నాలుగు నెలల వ్యవధిలోనే ఇంతటి మార్పు కనిపించడానికి ప్రధాన కారణం విజనరీ చంద్రబాబు. ఆయన ప్రూవెన్ ఎబిలిటీ. 

చంద్రబాబు ముఖ్యమంత్రిగా  బాధ్యతలు చేపట్టిన తరువాత ఏపీ ముఖచిత్రం మారిపోయింది. టాటా చైర్మన్ తో  రాష్ట్ర ఐటీ మంత్రి కేవలం గంటన్నర భేటీతోనే రాష్ట్రానికి టీసీఎస్ వచ్చింది. ఒక్క ఈమెయిల్ తో సత్య నాదెళ్ల అప్పాయింట్ మెంట్ ఖరారైంది.  లోకేష్ వారంరోజుల అమెరికా పర్యటనలో  ఆయనకు దిగ్గజ పరిశ్రమలన్నీ రెడ్ కార్పెట్ పరియాయి. కేవలం ఏదో కలిశాం, వచ్చేశాం అన్నట్లుగా కాకుండా నారా లోకేష్ సమావేశమైన దిగ్గజ కంపెనీలన్నీ రాష్ట్రంలో పెట్టుబడులకు సానుకూలంగా స్పందించాయి. అసలు నారా లోకేష్ కు అమెరికాలో పారిశ్రామిక వేత్తలు రెడ్ కార్పెట్ పరిచారంటే అందుకు కారణం ఆయన ఎఫిషియెన్సీకి చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ తోడు కావడమే. చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ కారణంగానే ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది.     

By
en-us Political News

  
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసౌధలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే.. పాతిక మంది ఎమ్మెల్యేలు ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ భేటీ జరగడం సంచలనం సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదిక 16వ సంచికలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
జనసేన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఈసారి దూరం జరిగింది.
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్‌ రెండుసార్లు, కాంగ్రెస్‌ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవ‌ల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ త‌గిలి తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డారు. కోలుకుని ఆయ‌న మండ‌లికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాద‌రంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడ‌లు బండ్లు అవుతాయి. బండ్లే ఓడ‌ల‌వుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవ‌స‌రం తీరిపోయిన త‌ర్వాత విసిరేసిన తెడ్డే.. చివ‌రికి ప‌డ‌వ బోల్తా ప‌డ్డ‌ప్పుడు దిక్క‌వుతుంది. అన్న‌దానికి జ‌గ‌న్ అప‌రిప‌క్వంతో కూడుకున్న రాజ‌కీయ విధానాలే ఉదాహ‌ర‌ణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జ‌రుగుతుందో పవన్ కల్యాణ్ విడ‌మ‌ర‌చి చెప్పారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.