ప్రాణాలను మింగేసే అధిక రక్తపోటు ఎందుకు వస్తుంది.. దాన్ని అదుపు చేయడం ఎలాగంటే!

Publish Date:May 17, 2023

Advertisement

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న తీవ్రమైన ఆరోగ్య సమస్యలలో అధిక రక్తపోటు ఒకటి. హైపర్ టెన్షన్ గా పేర్కొనే ఈ సమస్య హృదయ సంబంధ వ్యాధులకు దారితీయవచ్చు. రక్తపోటు పెరగడం అనేది  వృద్ధాప్య సమస్య అని ఇంతకుముందు అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం హైపర్ టెన్షన్ కు యువత కూడా బాధితులుగా మారుతున్నారు.  

ఒక అంచనా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ కంటే ఎక్కువ మందికి రక్తపోటు సమస్యలు ఉన్నాయి, ప్రతి నలుగురిలో ఒకరు రక్తపోటు బాధితులు. అధిక రక్తపోటు గురించి అవగాహన కల్పించడానికి, నివారణ చర్యలను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం మే 17న ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని జరుపుకుంటారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనా ప్రకారం భారతదేశంలోని ప్రతి నలుగురిలో ఒకరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు, అయితే వారిలో 12% మంది మాత్రమే తమ రక్తపోటును నియంత్రించగలుగుతున్నారు. రక్తపోటును నిరంతరం పర్యవేక్షిస్తూ, అదుపులో ఉంచుకోవడమే అందరూ చేయాల్సిన ప్రథమ కర్తవ్యం అని అంటున్నారు వైద్యులు. అసలు యువతలో అధిక రక్తపోటు ఎందుకు వస్తుంది, దానికి గల కారణాలు ఏంటి?? దాన్ని అదుపులో ఉంచుకోవడానికి ఏమి చేయాలి?? తెలుసుకుంటే..

అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా, యువకులు రక్తపోటు సమస్యకు గురవుతున్నారు. క్రమం తప్పకుండా శారీరక వ్యాయామాలు చేయకపోవడం, ఆహారంలో సోడియం అధికంగా తీసుకోవడం, జంక్-ఫాస్ట్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది. గర్భధారణ సమయంలో కూడా అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది. ఈ రకమైన జీవనశైలిని గడుపుతున్నట్లయితే, జాగ్రత్తగా ఉండాలి, అది రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. 

మీరు మీ దినచర్యలో కొన్ని సాధారణ మార్పులు చేయడం ద్వారా కూడా ఈ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

బరువును అదుపులో ఉంచుకోవాలి..

ఆరోగ్యకరమైన బరువును మైంటైన్ చేయడం వలన అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ఊబకాయం సమస్య మధుమేహం, అధిక రక్తపోటుతో పాటు అనేక ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. శారీరకంగా చురుగ్గా ఉండడంతోపాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల బరువు అదుపులో ఉంచుకోవచ్చు.  బరువు పెరుగుతున్నట్లయితే, దానిని నియంత్రించడానికి ప్రయత్నించాలి. 

సమతుల్య ఆహారం, సోడియం తీసుకోవడం తగ్గించడం.. 

సమతుల్య ఆహారం మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. ఆహారంలో సోడియం, చక్కెర మరియు అనారోగ్యకరమైన కొవ్వుల పరిమాణాన్ని తగ్గించడం ద్వారా మీరు రక్తపోటును నియంత్రించవచ్చు. రక్తపోటును అదుపులో ఉంచడానికి, ఇతర వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి ఆహారంలో కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, గింజల పరిమాణాన్ని పెంచాలి. మిమ్మల్ని  మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎంతో  అవసరం. ఆహారంలో  ఎక్కువ ఉప్పు తీసుకుంటే అది ప్రమాదాలను పెంచుతుంది.

వ్యాయామం చాలా ముఖ్యం

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం గొప్ప అలవాటు.  ఈ అలవాటు రక్తపోటు ప్రమాదం నుండి రక్షించడంలో సహాయపడుతుంది. గుండె జబ్బులు-మధుమేహం, దాని సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నిస్సారమైన జీవనశైలిని కలిగున్న వ్యక్తులకు ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి..

డైలీ లైఫ్ స్టైల్ ను  సరిగ్గా పాటిస్తే.. హైపర్ టెన్షన్ ను అదుపులోకి తీసుకురావచ్చు. తద్వారా దీర్ఘయుష్షు సొంతమవుతుంది.  

                                   ◆నిశ్శబ్ద.

By
en-us Political News

  
ఆరోగ్యం కోసం,  శరీరానికి కావలసిన ప్రోటీన్,  పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తింటుంటారు.  వీటిలో వాల్నట్స్ కూడా ముఖ్యమైనవి...
సాయంత్రం అనగానే పనులన్నీ ముగించుకుని హాయిగా ఇంట్లో కూర్చుని కాఫీ, టీ, పాలు.. లాంటి పానీయాలు తాగుతూ ఎంచక్కా  ఏవైనా స్నాక్స్ తినడం గుర్తు వస్తుంది అందరికీ.  అవకాశం దొరకాలే కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుని సాయంత్రం స్నాక్స్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు...
వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మల్టిగ్రైన్ బ్రెడ్ అంటూ వివిధ రకాలు తీసుకుంటారు. ఇక మరి కొందరు సింపుల్ బ్రేక్ పాస్ట్ పేరుతో బ్రెడ్ ను అల్పాహారంగా తీసుకుంటారు. అయితే ప్రతి రోజూ బ్రెడ్ ను ఆహారంలో బాగంగా తీసుకోవడం మంచిదేనా అంటే.. అస్సలు మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు.
చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగుతూ ఉంటారు. ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నమ్ముతారు. బరువు పెరగకుండా ఉండటానికి,  అజీర్ణం చేయకుండా...
సమతుల, పోషకాహార లిస్ట్ లో చికెన్ ఎప్పుడూ ఉంటుంది. నేటికాలంలో చాలామంది చికెన్ తినడానకి ఇష్టపడతారు. చికెన్ తినడానికే కాదు....
అల్యూమినియం ఫాయిల్ నేటి కాలంలో వంటింట్లో చాలా కీలకంగా మారింది. ధర పరంగా చూసినా, వాడకం పరంగా చూసినా సిల్వర్ ఫాయిల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది  ఆహారాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది...
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు...
ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు..
శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు...
రక్తంలో  చక్కెర శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటాన్ని చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ అని అంటారు. ప్రపంచ దేశాలలో చక్కెర వ్యాధి బాధితులు భారతదేశంలోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం...
భారతీయులకు టీ అంటే ఒక ఎమోషన్. అయితే టీ తో పాటు స్నాక్స్ కూడా తినడం చాలామంది అలవాటు. టీ పాటు తీసుకునే స్నాక్స్ లో చాలా వరకు బిస్కెట్లు తినేవారు ఎక్కువ.  అయితే పోషకాహార నిపుణులు మాత్రం..
ప్రతి ఒక్కరూ ఎక్కువ కాలం బ్రతకాలని అనుకుంటారు. కానీ చాలామందికి అది కలగా ఉంటోంది. నేటికాలంలో సగటు మానవుడి ఆయుష్షు చాలా క్షీణించింది.  ఒకప్పుడు మన ఋషులు, మహర్షులు కేవలం వంద కాదు.. కొన్ని వందల ఏళ్ళు బ్రతికారు....
మందారం పువ్వులు ప్రతి ఇంటి పెరట్లో  ఖచ్చితంగా ఉంటాయి.  ఎర్రగా ముద్దొచ్చే మందారాలలో బోలెడు ఔషద గుణాలు కూడా ఉంటాయి.  మందారాలను ఎక్కువగా పూజలలోనూ,  హెయిర్ కేర్ లోనూ ఉపయోగిస్తుంటారు. అయితే కేవలం జుట్టులో పెట్టుకోవడానికో లేదా జుట్టు సంరక్షణ కోసం మందారం నూనె లేదా హెయిర్ ప్యాక్ లోనో మాత్రమే కాదు....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.