పుస్తక ప్ర‘పంచ’ సూత్రాలు

Publish Date:Nov 15, 2019

Advertisement

 

ఒకప్పుడు కాలక్షేపానికి పుస్తకం మాత్రమే ఉండేది. అందుకే ఇంట్లో చిన్న నుంచి పెద్దదాకా చదివే పుస్తకాలు మాత్రమే ఉండేవి. పిల్లల పత్రికలు, వార పత్రికలు, మాస పత్రికలు ఎన్నో పుస్తకాలు కాలక్షేపాన్ని, వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించేవి.

మారిన కాలంలో పుస్తకం మరుగున పడిపోతోంది. ఇప్పటికీ పుస్తక ప్రేమికులు చాలా మందే ఉన్నా చదివే అలవాటు క్రమంగా తగ్గుతూ వస్తుందన్నది నిజం. కాలక్షేపాన్ని వినోదాన్ని అందించే సాధనాలు ఎన్నో అందుబాటులో ఉండేసరికి పుస్తాకాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. కాని పుస్తకం చదివే అలవాటు ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది గుర్తించండి అంటున్నారు నిపుణులు.

1. పుస్తకం చదివే అలవాటు ఏకాగ్రతను పెంచుతుంది. రోజుకో అరగంట చదివినా చాలు. ఆసమయంలో మనసు, మెదడు అనుసంధానం జరిగి అదో మెడిటేషన్ లా మారుతుంది.

 

 

2. మతిమరుపు ఇబ్బంది పెడుతుంటే పుస్తకం చదవడం మొదలుపెట్టండి చాలు. మెదడులోని న్యూరాన్లు యాక్టివ్ గా మారుతాయి. చూడటం, చదవడం, గ్రహించడం దానిని స్టోర్ చేసుకోవడం ఇలా అన్నీ ఒక్కసారే జరిగే ప్రక్రియ మెదడుకి ఒక ఛాలెంజ్ లాంటిదే. ఆ ఛాలెంజ్ న్యూరాన్లను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

3. రష్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్ రీసెర్చ్ వయసు ప్రభావం మెదడు మీద లేకుండా చేసే శక్తి పుస్తక పఠనానికి మాత్రమే ఉందని చెప్పింది. బాగా చదివే అలవాటు ఉన్నవారి మెదడు వయసు, వారి శారీరక వయసు కంటే తక్కువగా ఉండటం గుర్తించారు.

 

 

4. మానసిక ధృడత్వం, సమస్యలను ఎదుర్కొనే ధైర్యం ఎమోషనల్ ఇంటెలిజన్స్ ఇలా ఎన్నో జీవన నైపుణ్యాలు ఒక్క పుస్తక పఠనం వల్ల మాత్రమే సాధ్యమవుతుందని గట్టిగా చెపుతున్నారు నిపుణులు.

5. ఒక్క పుస్తకం చేతిలో ఉంటే చాలు ఎందరో మనతో ఉన్నట్టే. మానసిక ప్రశాంతత, ఉత్సాహం అన్నీ లభిస్తాయి. ఒత్తిడికి సులువైన విరుగుడు పుస్తకం. కాబట్టి చదవడం మొదలుపెట్టగానే శరీరం, మనసు రెండూ రిలాక్స్ అవటం మొదలవుతుంది.

 

 

ఇక భాషాజ్ఞానం పెరగడం వంటి లాభాలు, అందరికీ అన్ని విధాలుగా ఎంతో ప్రయోజనం ఈ పుస్తకం పఠనం వల్ల అని తెలిసాక దానితో స్నేహం చేయకుండా ఉండగలమా? ఒకవేళ ఈ మధ్యకాలంలో దానిని పలకరించకపోతే ఒక్కసారి దగ్గర చేయాలనే ఈరోజుని 'పుస్తక దినోత్సవం'గా ప్రపంచవ్యాప్తంగా పాఠిస్తున్నారు. పుస్తకంతో మన అందరి అనుబంధం నూరేళ్లు వర్ధిల్లాలని కోరుకుందాం.

-రమ

By
en-us Political News

  
సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. నేటి బిజీ బిజీ జీవితాలలో మనస్ఫూర్తిగా,  సంతోషంగా గడిపిన క్షణాలు వెతుక్కోవాల్సి వస్తోంది. అందరూ ఉద్యోగాలు చేస్తారు,  వ్యాపారాలు చేస్తారు, సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు....
ప్రపంచంలో అన్ని రకాల మనుషులు  ఉంటారు.  మనుషులకు ఒక్కొక్కరికి ఒక్కో వ్యక్తిత్వం కూడా ఉంటుంది. ప్రపంచంలోని గొప్ప వ్యక్తులను లేదా మన చుట్టూ ఉండే గొప్ప వ్యక్తులు లేదా శక్తివంతమైన వ్యక్తులను గమనిస్తే...
విజయం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక లక్ష్యంగా ఉంటుంది.  చదువు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ప్రతి విషయంలో ఒక లక్ష్యం పెట్టుకుని,  దాన్ని సాధించి,  విజయ బావుటా ఎగరవేయాలని అనుకుంటారు చాలా మంది...
మంచి, చెడు ప్రతి మనిషిలోనూ తప్పకుండా ఉండే గుణాలు.  మనుషులు కొన్ని విషయాల్లో మంచిగా, మరికొన్ని విషయాల్లో చెడ్డగా ఉంటారు. పూర్తీగా మంచితనం ఉన్న మనుషులు, పూర్తీగా చెడ్డగా ఉన్న మనుషులు ఎక్కడా ఉండరు...
అపరాజిత లేదా శంఖు పుష్పాలు నీలం ,  తెలుపు రంగులో ఉంటాయి.  ఈ పువ్వులు  చాలా అందంగా ఉంటాయి. శంఖు పుష్పం మొక్కను దేవతా మొక్కగా పరిగణిస్తుంటారు.  ఈ పువ్వులు  సంతోషం, శ్రేయస్సు,  సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. వేసవిలో...
వేసవి వచ్చేసింది, తీవ్రమైన ఎండ , మండే ఎండలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి.  ఈ ఎండల ఇబ్బందికి తోడు వేసవిలో కరెంట్ కోత కూడా దారుణంగా ఉంటుంది. దీనివల్ల ఇంట్లో ఉండటం చాలా కష్టమవుతుంది.
గుడ్ ఫ్రైడే క్రైస్తవ మతంలో అత్యంత పవిత్రమైన,  భావోద్వేగభరితమైన రోజు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రైస్తవులు యేసు క్రీస్తు శిలువపై మరణించిన సంఘటనను స్మరించుకుంటారు...
పిల్లలను సరిగ్గా పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. ఒక చిన్న పొరపాటు కూడా పిల్లల జీవితాన్ని నాశనం చేయగలదు. సరైన పెంపకం పిల్లలను విజయ శిఖరాలకు చేరుస్తుంది అనడంలో  ఎలాంటి సందేహం లేదు...
నేటి డిజిటల్ ప్రపంచంలో, పిల్లలకు, ముఖ్యంగా టీనేజర్లకు చదువుకునేటప్పుడు ఏకాగ్రత పెట్టడం చాలా కష్టంగా మారుతోంది. స్మార్ట్‌ఫోన్‌లు, గేమ్‌లు, సోషల్ మీడియా,  మరెన్నో విషయాలు వారి చదువుకు చాలా..
వేసవికాలం అలా రాగానే.. అందరికీ చల్లదనం కావాలని అనిపిస్తుంది.  పడుకోవడానికి గది చల్లగా ఉండాలి.. దుకోసం కూలర్లు, ఏసీలు రెఢీ చేసుకుంటారు. అలాగే చల్లగా నీరు తాగాలని అనిపిస్తుంది.  నేటికాలంలో ప్రతి ఇంట్లో ఫ్రిజ్ లు ఉండటం సహజమే అయినా ఫ్రిజ్ లో ఉంచిన నీరు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతుంటారు...
జైనమత 24వ తీర్థంకరుడు మహావీరుడు ఆధ్యాత్మికత ద్వారా తన జీవితాన్ని మార్చుకున్నాడు. యువరాజు వర్ధమానుడు  తన సాధన,  ఆధ్యాత్మిక మార్గం ద్వారా  మహావీరుడిగా  పరివర్తన చెందాడు.  అయితే ఇలా పరివర్తన చెందడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది..
భార్యాభర్తల బంధం చాలా ప్రత్యేకమైనది. నేటికాలంలో భార్యాభర్తల బంధం పెళుసుగా మారిందని చెప్పవచ్చు.  బార్యాభర్తలు గొడవ పడటం అనేది చాలా కామన్ గా మారింది.  అయితే కొన్నిసార్లు గొడవలు కాస్తా బంధాన్ని విచ్చిన్నం చేసే..
వేసవి వచ్చేసింది.. ఈ మండే ఎండల వల్ల ప్రతిఒక్కరూ చాలా ఇబ్బంది పడతారు, వేసవికాలం చాలా ఆరోగ్యపరంగా చాలా   ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన కాలం...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.