ప్రపంచ బ్యాంక్ ర్యాంకింగ్ పైనా అనుమానాలేనా?

Publish Date:Sep 16, 2015

Advertisement

 

భారతదేశంలో వ్యాపారానికి అనువయిన రాష్ట్రాలలో గుజరాత్ ప్రధమ స్థానంలో దాని తరువాత ఆంద్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉన్నట్లు ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. దేశంలో గుజరాత్ తరువాత రెండవ ధనిక రాష్ట్రమని చెప్పుకొంటున్న తెలంగాణాకి ఈ విషయంలో 13వ స్థానంలో ఉన్నట్లు ప్రకటించడంపై తెరాస ప్రభుత్వ మంత్రులు, నేతలు షాక్ అయ్యారు. దానిపై తీవ్ర అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. “ప్రపంచ బ్యాంక్ ఏ ప్రాతిపదికన తమ రాష్ట్రానికి 13వ స్థానం కేటాయించిందో తెలియదు కానీ తమ ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ది కార్యక్రమాలే గీటురాయిగా నిలుస్తాయని” ఆ రాష్ట్ర ఐటి మంత్రి కె.తారక రామారావు అన్నారు.

 

ఆంద్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఇష్టపడని కేంద్రప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకే ప్రపంచ బ్యాంక్ పై ఒత్తిడి చేసి ఈ విధంగా ప్రకటింపజేసి ఉండవచ్చని తెరాస ఎంపీ నర్సయ్య గౌడ్ అభిప్రాయం వ్యక్తం చేసారు. దేశంలో మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాలు దేశ విదేశాల నుండి భారీ పెట్టుబడులు ఆకర్షిస్తూ శరవేగంగా ఆర్ధిక, పారిశ్రామిక అభివృద్ధి చెందుతున్నప్పటికీ వాటిని పక్కనపెట్టి ఝార్ఖండ్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాలే వ్యాపారానికి అనువుగా ఉన్నాయని ప్రపంచ బ్యాంక్ చేత ర్యాంకులు ఇప్పించుకొందని అయన వాదిస్తున్నారు.

 

ఆంద్రప్రదేశ్ కి రెండవ స్థానం దక్కడాన్ని ఆయనతో సహా చాలా మంది తెరాస నేతలు పైకి మెచ్చుకొంటున్నట్లు మాట్లాడుతున్నప్పటికీ, వారి వాదనలు వింటుంటే ఆంద్రప్రదేశ్ కి రెండవ ర్యాంక్ ఇవ్వడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారనే విషయం స్పష్టం అవుతోంది. ఒకవేళ ప్రపంచ బ్యాంక్ తెలంగాణాకి 3 లేదా 4వ స్థానం ఇచ్చి, ఆంద్రప్రదేశ్ కి ఏ ఐదో,ఆరో స్థానం ఇచ్చి ఉండి ఉంటే వారు కూడా ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన ర్యాంకుల గురించి గొప్పగా చెప్పుకొని ఉండేవారు. కానీ అన్ని విధాల చితికిపోయున్న ఏపీకి రెండవ స్థానం ఇచ్చి, తెలంగాణాకు 13వ స్థానం ఇవ్వడం వలననే వారు ఈ ర్యాంకులను అంగీకరించడం లేదని చెప్పవచ్చును.

 

ఒకవేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంతర్జాతీయ సంస్థల ప్రమేయం ఉన్న ఏ అంశంపైనైనా సానుకూల నిర్ణయం తీసుకొన్నట్లయితే, అవి వాటికి అమ్ముడుపోయాయని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తుంటాయి. అదే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచ బ్యాంక్ కి తొత్తులుగా మారిపోయి అవి ఆడించినట్లు ఆడుతున్నాయనే ఆరోపణలు తరచూ వింటూనే ఉంటాము. అటువంటప్పుడు దేశంలో ఏ రాష్ట్రానికి ఎంత ర్యాంక్ ఇవ్వాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచ బ్యాంక్ కి ఏవిధంగా నిర్దేశించగలవు? ఒకవేళ తెరాస నేతలు ఆరోపిస్తున్నట్లు భారత్ ప్రపంచ బ్యాంక్ ని నిర్దేశించే పరిస్థితిలో ఉండి ఉంటే దేశంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేప్పట్టేందుకు రుణాల కోసం ప్రపంచ బ్యాంక్ ని ప్రాధేయపడవలసిన అవసరమే ఉండేది కాదు.

 

సాధారణంగా ఏ రాష్ట్రానికయినా ఇటువంటి ర్యాంకులు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ విద్యుత్, నీటి సౌకర్యం, భూమి ఉపలబ్దత, రవాణా వ్యవస్థలు, మానవ వనరులు, సహజ వనరులు వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొంటుంది. అదే విధంగా రాష్ట్ర ఆర్ధిక, రాజకీయ పరిస్థితులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొని ఉన్న సంబంధాలు, రాష్ట్రాలపై వాటి ప్రభావం, సదరు రాష్ట్రంతో ప్రపంచ దేశాల ఏవిధంగా వ్యవహరిస్తున్నాయి? వంటి అనేక ఇతర అంశాలను కూడా పరిశీలించి ర్యాంకింగ్ ఇస్తుంటుంది. దేశంలో గుజరాత్ తరువాత తెలంగాణా ధనిక రాష్ట్రం అయ్యి ఉండవచ్చును. కానీ నేటికీ విద్యుత్, సాగునీరు, త్రాగు నీరు వంటి తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోంది. వాటిని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చాల కృషి చేస్తున్న మాట వాస్తవం. కానీ అవి ఇంకా పరిష్కరింపబడవలసి ఉంది.

 

ఇక తెలంగాణా-కేంద్రప్రభుత్వాల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వాటిని మెరుగుపరుచుకొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నడూ గట్టిగా ప్రయత్నాలు చేయలేదు అనే కంటే అసలు వాటికి ఆయన ఎన్నడూ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పవచ్చును. కేంద్రంపట్ల ఆయన ఎన్నడూ నిలకడగా ఒకే విధానం అవలంభించలేదు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్టుబడులు, పరిశ్రమలను ఆకర్షించేందుకు విదేశాలలో పర్యటిస్తున్నప్పుడు, ఆయన తెదేపా-బీజేపీల మధ్య, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న బలమయిన అనుబంధం గురించి నొక్కి చెప్పడం మరిచిపోరు. ఆంద్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే కేంద్రప్రభుత్వం కూడా అన్ని విధాల పూర్తి సహకారం అందిస్తుందని ఆయన కేంద్రప్రభుత్వం తరపున పూర్తి భరోసా ఇస్తుంటారు. కానీ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ అటువంటి భరోసా ఇవ్వలేరు. కారణం కేంద్రప్రభుత్వంతో అనిశ్చిత సంబందాలు నెలకొని ఉండటమే.

 

ఇక ఉద్యమ సమయంలో తెరాస నేతలు రాష్ట్రంలో సినీ, వ్యాపార, పారిశ్రామిక తదితర రంగాలకు కల్పించిన తీవ్ర అభద్రతా భావం నేటికీ వారిలో యధాతధంగా నెలకొనే ఉంది. వారిలో నెలకొని ఉన్న ఆ అభద్రతా భావాన్ని దూరం చేసేందుకు తెరాస ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. ఆ అభద్రతా భావం కారణంగానే హైదరాబాద్ లో స్థిరపడిన సినీ ప్రముఖులు నేటికీ తరచూ ముఖ్యమంత్రి చుట్టూ తిరుగుతూ ఆయనని ప్రసన్నం చేసుకొనేందుకు ప్రయత్నిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక నియంతలా పరిపాలిస్తున్నారని ప్రతిపక్షాలు తరచూ ఆరోపించడం అందరూ ఎరిగిన విషయమే. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చివరికి మీడియా కూడా రాష్ట్రంలో మనుగడ సాధించలేదని నిరూపితమయింది. రాష్ర్టంలో ఇటువంటి అభద్రతా భావం నెలకొని ఉన్నప్పుడు అక్కడ వ్యాపారానికి అనుకూలమయిన పరిస్థితులు ఉండవని ఎవరయినా చెప్పగలరు. అదే ముక్క ప్రపంచ బ్యాంక్ కూడా చెప్పినట్లు భావించవచ్చును.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.