ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ నియోజకవర్గాలవారీగా వైసీపీ క్యాడర్తో పార్టీ అధినేత జగన్ సమావేశాలు గురువారం ఆరంభించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పంతో ఆయన ఈ సమావేశాలకు శ్రీకారం చుట్టారు. కుప్పంలో పార్టీ విజయానికి అందరూ శక్తికి మించి కృషి చేయాలని క్యాడర్కు లక్ష్యాన్ని నిర్దేశించారు. కుప్పంలో బాబుపై గెలిచిన వారికి మంత్రి పదవి ఇస్తానని జగన్ ప్రకటించారు.
కుప్పం తన స్వంత నియోజకవర్గంగా భావిస్తున్నానని, నియోజకవర్గం అభివృద్ధికి అన్నివిధాల కృషి చేస్తా మన్నారు. మరోరెండు రోజుల్లో కుప్పం మునిసిపాలిటీకి రూ.65 కోట్లు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. నియోజక వర్గం లో అన్ని పనులు సత్వరం ఆరంభమయ్యేలా చూస్తామని జగన్ హామీ ఇచ్చారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హాయాంలో కుప్పం అభివృద్ధితో ప్రస్తుత పరిస్థితులను పోలుస్తూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కుప్పంలో ఊహించని అభివృద్ధి జరిగిందని, అది గమనించే ప్రజలు మునిసిపల్ ఎన్నికల్లోనూ వైసీపీకి పట్టం కట్టారనీ జగన్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో కుప్పం వైసీపీ అభ్యర్థి భరత్ ను గెలిపించండి, ఆయనకు మంత్రిపదవి ఇస్తా నని జగన్ క్యాడర్ కు చెప్పారు. కాగా, కప్పం ఆర్ ఇ ఎస్ ఓ చైర్మన్ సెందిల్ కుమార్కు కీలక బాధ్యత అప్పగించనున్నట్టు చెబుతూ, వచ్చే ఎన్ని కల్లో భరత్ చంద్రబాబును ఓడిస్తే సెందిల్కు ఎమ్మెల్సీ సీటు ఇస్తానని అన్నారు.
ఇదిలా ఉండగా, హంద్రీనీవా బ్రాంచి కెనాల్ నిర్మాణ పనులను నిలువరించడంపై బిజెపి ఎంపీ సీఎం రమేష్ పై భరత్ మండిపడ్డారు. వాస్తవానికి కెనాల్ నిర్మాణపనులు రమేష్ చేపట్టి చంద్రబాబునాయుడికి మేలు జరగాలన్న ఆకాంక్షతోనే పనులను మధ్యలో రమేష్ వదిలేశారని భరత్ విమర్శించారు. కాగా, జగన్ ఆ కెనాల్ కాంట్రాక్ట్ ను రద్దు చేసి మళ్లీ టెండర్లకు వీలుకల్పించనున్నారనీ, పనులు పూర్తయితే కుప్పం నియోజకవర్గంలో వైసీసీ గ్రాఫ్ మరింత పెరుగుతుందని ఎమ్మెల్సీ భరత్ ఆశాభావం వ్యక్తం చేశారు.
అయితే ఈ సమావేశంలోనే మాజీ సర్పంచ్ వైసీపీ నేత మురళి పార్టీ వ్యవహారాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కుప్పంలో ప్రముఖ కుటుంబాలు పార్టీ కీలక పాత్ర వహిస్తున్నాయని, పార్టీకోసం రాత్రింబవళ్లూ కృషిచేస్తున్న సాధారణ కార్యకర్తలు నిరాదరణకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగయితే, వచ్చే ఎన్నికల్లో వైసీపీ 75 స్థానాలుకూడా గెలవలేదన్నారు. కాగా మురళి వాదనను అటుంచి, జగన్ కుప్పం నియోజకవర్గంలో భారీ మెజారిటీతో పార్టీ గెలవడం మీదనే అందరూ దృష్టి కేంద్రీకరించాలని ఆదేశించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/work-for-victory-in-kuppam-jagan-directs-cader-39-141307.html
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.