Publish Date:Jun 25, 2022
టెక్నాలజీ మానవాళికి ఎంతో మేలు చేస్తున్నది. అదే సమయంలో వ్యక్తుల దౌర్బల్యాలను ఆసరాగా తీసుకుని మోసాలు చేసే వారి సంఖ్యా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నది. అంతర్జాలంలో డేటింగ్ యాప్ ల పేరుతో తమ ఎరలో పడిన వారిని దోచుకుంటున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ యాప్ ల వలలో పడి సర్వం కోల్పోతున్నవారు కొందరైతే.. తామ పని చేస్తున్న సంస్థకే టోపీ వేసి మరీ డబ్బులు పోగొట్టుకోవడంతో పాటు ఉద్యోగాలకూ ఎసరు తెచ్చుకుంటున్నవారు మరి కొందరు.
ఇదిగో సరిగ్గా అలాంటి రెండో కోవకే చెందుతాడీ బ్యాంకు మేనేజర్. డేటింగ్ యాప్ లో పరిచయమైన యువతి వేసిన ఎరకు చిక్కుకుని డబ్బు, పరువు, ఉద్యోగం అన్నీ పోగొట్టుకుని గోడుగోడున విలపిస్తున్నాడు. వివరాలలోకి వెళితే... బెంగళూరుకు చెందిన ఒక బ్యాంకు మేనేజర్ హరిశంకర్ కొద్ది కాలం కిందట తన ఫోన్ లో ఓ డేటింగ్ యాప్ డౌన్ లోడ్ చేసుకున్నాడు. కొన్ని రోజులకు ఆ యాప్ ద్వారా ఓ యువతి పరిచయమైంది. స్వీట్ నథింగ్స్ అంటూ పలు ప్రేమ సందేశాలను ఆ యాప్ ద్వారా పంచుకున్నారు.
వీడియో కాల్స్, మెస్సేజెస్ ద్వారా వారి ప్రేమ గోల కొంత కాలం సందడిగా సాగింది. ఆ తరువాత వ్యాపారం ప్రారంభించాలంటూ ఆ యువతి హరిశంకర్ ను కొంత సొమ్ము ఇవ్వాల్సిందిగా కోరింది. పాపం అతగాడు కరిగిపోయి ఆమె ఖాతాకు 12లక్షల రూపాయలు బదలీ చేశాడు. అది చాలదు మరింత కావాలని కోరడంతో ఏం చేయాలో తోచని హరిశంకర్ తాను పని చేసే బ్యాంకులోని ఒక సీనియర్ సిటిజన్ ఖాతా నుంచి రూ.6 కోట్ల రూపాయలు రుణాన్ని ఆమె పేరిట తీసుకుని తన ఖాతాకు బదలీ చేసుకున్నాడు. ఆ తరువాత అందులో నుంచి 5.69 కోట్ల రూపాయల మొత్తాన్ని తన డేటింగ్ యాప్ ప్రేయసికి బదలీ చేశాడు.
అయితే రుణానికి సంబంధించిన సందేశాలు సీనియర్ సిటిజన్ ఫోన్ కు రావడంతో అనుమానం వచ్చిన ఆమె బ్యాంకుకు వచ్చి ఫిర్యాదు చేయడంతో హరిశంకర్ బండారం బయటపడింది. బ్యాంకు సొమ్ము కాజేశాడంటూ హరిశంకర్ ను పోలీసులు అరెస్టు చేశారు. బ్యాంకు అధికారులు సస్పెండ్ చేశారు. విచారణలో హరిశంకర్ తనను మోసం చేసి ఓ యువతి డబ్బులు తీసుకుని ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిందని వెల్లడించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/women-decieves-bank-manager-for-rs-589crores-39-138389.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది