Publish Date:Apr 26, 2026
సైబరాబాద్ కమిషనరేట్లో నార్సింగి సీఐ హరికృష్ణ రెడ్డి పై స్వాతి అనే యువతి ఫిర్యాదు చేసింది. విజయనగరం జిల్లాకు చెందిన సాయికిరణ్ పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి కొంతకాలం సహజీవనం చేపి మోసం చేశాడనీ, దీంతో తాను గత ఏడాది అక్టోబర్లో నార్సింగి పోలీస్ స్టేషన్లో సాయి కిరణ్పై ఫిర్యాదు చేసినట్లు స్వాతి పేర్కొంది. అయితే నార్సింగ్ సీఐ హరికృష్ణ రెడ్డి ఇన్ని నెలలు గడిచినా కూడా సాయి కిరణ్ పై సరైన విచారణ జరగలేదని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. తాను సాయి కిరణ్ వాళ్ల ఊరు విజయనగరం కు వెళితే... అక్కడ అతని తండ్రి రాజకీయ కార్యకర్త కావడంతో ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు తనపై దాడి చేశారని స్వాతి ఆరోపించారు.
ఇక్కడ ఉన్నది మా ప్రభుత్వం.. కేసు పెట్టినా ఏం జరగదు.. చంపేస్తామంటూ బెదరించారని ఆవేదన వ్యక్తం చేసింది. తాను అక్కడ పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేయబోతే.. వారు హైదరాబాద్ లోనే ఫిర్యాదు చేయమన్నారని పేర్కొన్న స్వాతి.. గత ఆరు నెలలుగా తాను నార్సింగి పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగలేదని పేర్కొంది. నాన్బెయిలబుల్ సెక్షన్లు ఉన్నప్పటికీ నిందితుడిని అరెస్ట్ చేయకుండా సీఐ వెసులుబాటు కల్పిస్తున్నా రని ఆరోపించింది. కేసును రీ-ఇన్వెస్టిగేషన్ చేసి నిష్పాక్షికంగా విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని బాధితురాలు విజ్ఞప్తి చేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/woman-files-complaint-against-narsingi-ci-at-cyberabad-commissionerate-36-218311.html
విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్పోర్టు కోసం భూములు ఇచ్చిన రైతులే ఉత్తరాంధ్ర కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారని సీఎం చంద్రబాబు అన్నారు.
దేశవ్యాప్తంగా వాణిజ్య ఎల్పీజీ వినియోగదారులకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తీపి కబురు అందించాయి.
మోదీ వికసిత్ భారత్... సీబీఎన్ విజన్ ప్రతిరూపం భోగాపురం..!
ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి మహత్తర అడుగు పడింది.
పెళ్లైన నెలలకే షాక్..ఆస్ట్రేలియా ఉద్యోగం పేరుతో ఘరానా మోసం..!
స్వాగతం పలికిన గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు..!
భారతదేశపు మొట్టమొదటి ఆర్ఈఐటీ ఇండెక్స్ ఫండ్ ఆగస్టు 2026లో లాంచ్ కానుంది. ఎడెల్వీస్ నిఫ్టీ REITs & రియాల్టీ ఇండెక్స్ ఫండ్ NFO వివరాలు, రాబడుల విశ్లేషణ మరియు పన్ను ప్రయోజనాల గురించి క్లియర్గా తెలుసుకోండి.
ఆగస్టు 1న దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్, విజయవాడ సహా ప్రధాన నగరాల్లో 24K, 22K, 18K బంగారం నేటి రేట్లు, మార్కెట్ విశ్లేషణల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
పెరిగిపోతున్న ఓటీటీ, క్లౌడ్ సబ్స్క్రిప్షన్ ఛార్జీల నుండి విముక్తి పొందేందుకు హోమ్ సర్వర్లు ఎలా సహాయపడతాయో తెలుసుకోండి. పాత పీసీలతో సొంతంగా డిజిటల్ క్లౌడ్ క్రియేట్ చేసుకుని నెలకు వేల రూపాయలు ఆదా చేసే సులభమైన గైడ్.
మానవ DNAలో దాగి ఉన్న రహస్య గోస్ట్ లినేజ్ ఆనవాళ్ళను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 8 లక్షల సంవత్సరాల నాటి ఈ అజ్ఞాత మానవ జాతి డిఎన్ఏ మన శరీరంలోకి ఎలా వచ్చింది? పరిశోధనలో తేలిన సంచలన గణాంకాలు మరియు నిజాలు ఇవే!
ప్రముఖ సౌండ్ ఇంజనీర్ కుర్ట్ మార్టినెజ్ తన ఇంటి వెనుక ఉన్న 2.5m x 3.5m గార్డెన్ షెడ్ను ప్రపంచ స్థాయి డాల్బీ ఆట్మాస్ మ్యూజిక్ స్టూడియోగా ఎలా మార్చారో, అందులో వాడిన స్పీకర్లు, అకౌస్టిక్ టెక్నాలజీ మరియు ఆశ్చర్యపరిచే నిజాలు ఇక్కడ తెలుసుకోండి.
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అర్ధాంగి అన్నా కొణిదెల తన పుట్టినరోజు సందర్భంగా సమాజానికి స్ఫూర్తిదాయకమైన నిర్ణయం తీసుకున్నారు.