Publish Date:Jul 18, 2022
దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ జరుగుతోంది. తెలంగాణలో ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఓటు వేసి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క.. ఓటింగ్లో భాగంగా తప్పిదం చేశారు.
తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత జరిగిన రాష్ట్రపతి ఎన్నిక ఇదే మొదటిది కావడం, ఓటింగ్లో అప శృతి దేనికి దారితీస్తుందా అని కాంగ్రెస్ వర్గాలు ఆందోళలో పడ్డాయి. ప్రతిపక్షాలు బలపరిచిన యశ్వంత్ సిన్హాకు ఓటు వేయాల్సిన సీతక్క పొరపాటున ఎన్డిఏ బలపరిచిన ద్రౌపది ముర్ముకు ఓటువేశారు. ఇది నిజంగానే సాంకేతిక తప్పిదంలా జరిగిపోయిందనే అంటున్నారు. అంటే ఓటింగ్ విధానంలోని సాంకే తికత ఆమెను కాస్తంత కంగారుపెట్టిందనే అనుకోవాలి. ఎందుకంటే ఆమె ఆ తర్వాత మీడియాతో పొర పాటు పడినట్టే చెప్పారు.
అంతే కాదు.. తాను పొరపాటున ఒకరికి వేయాల్సిన తొలి ప్రాధాన్యతా ఓటు మరొకరికి వేశాననీ, తన బ్యాలెట్ క్యాన్సిల్ చేసి మరొకటి ఇవ్వాలని రిటర్నింగ్ అధికారిని కోరారు కూడా. అయితే ఆయన నిరాకరించడంతో చేసేది లేక తొలి ప్రాధాన్యతా ఓటు ముర్ముకు వేసిన బ్యాలెట్ పేపర్ నే ఓటు బాక్సులో వేశారు. ప్రతిపక్షాలన్నీ యశ్వంత్ సింగ్ వంటి రాజకీయానుభవం మెండుగా వున్న వ్యక్తిని రాష్ట్రపతి గా చూడాలని ఎంతో ఆశిస్తున్నారు. బిజెపీ స్వార్ధ ప్రయోజనాలకు ముర్మును రాష్ఠ్రపతి అభ్యర్ధిగా ప్రకటించి దేశమంతా భారీ ప్రచారం చేశారు. ఆమె కేవలం వెనుకబడిన తరగతులకు చెందిన మహిళగానే కాకుండా జార్ఖండ్ గవ ర్నర్ గాను, బిజెపి సీనియర్ల అభిమానిగాను విజయావకాశాలున్నాయనే ప్రచారం వుంది. కానీ యశ్వంత్ కే అవకాశాలు మెండుగా వున్నాయన్నది విపక్షాలు అంచనాలు బాగా ప్రచారంలో వున్నాయి.
2014లో తెలుగు రాష్ట్రాలు విడిపోవడంతో ఇపుడు రాష్ట్రపతి ఎన్నికలకు ప్రత్యేకంగా ఓటు విలువ నిర్ధారించవలసి వచ్చింది. దీని ప్రకారం తెలంగాణా నుంచి ఎన్నికయిన 119 ఎమ్మెల్యేల ఓటు విలువ 15,708 అని అంచనా. కాగా ఏపీ నుంచి ఎన్నికయిన 175 మంది ఎమ్మెల్యేల ఓటు విలువ 27,825 వుంది. ఎంపీల విషయానికి వస్తే, తెలంగాణా నుంచి 17 లోక్సభ, 7 రాజ్యసభ మంది సభ్యులు న్నారు. అంటే మొత్తం ఓటు విలువ 16,992 . ఆంధ్రాకు సంబంధించి 25 మంది లోక్సభ, 11 మంది రాజ్యసభ సభ్యుల విలువ 25,488.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/will-sitakka-mistake-show-any-effect-on-president-election-39-140006.html
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.