పిల్ల సజ్జలకు జైలేనా?

Publish Date:Feb 21, 2025

Advertisement

వైసీపీ హయాంలో సకల శాఖల మంత్రిగా సజ్జల రామకృష్ణారెడ్డి ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగింది. ఒక విధంగా చెప్పాలంటే ఆయనే డిఫాక్టో సీఎంగా రాజ్యమేలారు. జగన్ మాటలను ఆయన తన నోటితో వినిపించారు. ఆయన ఆదేశాలను తన చేతులతో అమలు చేశారు. జగన్ హయాంలో కేబినెట్ అన్నది నామమాత్రమే అయిపోయింది. మంత్రివర్గ శాఖల సమీక్షలు కూడా సజ్జలే చేశారు. మంత్రులకు బదులుగా మీడియా ముందుకూ ఆయనే వచ్చే వారు. ఆ అధికారాన్ని అడ్డు పెట్టుకునే సజ్జల రామకృష్ణారెడ్డి తన కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డికి వైసీపీ సోషల్ మీడియా వింగ్ బాధ్యతలను అప్పగించారు. 

పిల్ల సజ్జల చేతికి వైసీపీ సోషల్ మీడియా వింగ్ పగ్గాలు వచ్చిన క్షణం నుంచి ఆయన పేనుకు పెత్తనం ఇస్తే.. అన్నట్లుగా చెలరేగిపోయారు. పేనుకు పెత్తనం ఇస్తే.. అన్న సామెత చందంగా వ్యవహ రించారు.  తెలుగుదేశం పార్టీ,   ఆ పార్టీ నాయకులు, ఆ పార్టీలోని మహిళా నేతలు, ఆ పార్టీ అధినేత చంద్రబాబు కుటుంబ సభ్యులపై అత్యంత దారుణమైన, అసభ్యకరమైన పోస్లులతో రెచ్చిపోయారు. సజ్జల భార్గవ రెడ్డి హయాంలో వైసీపీ సోషల్ మీడియా వెర్రి పుంతలు తొక్కింది. సరే వైసీపీ ఘోర పరాజయంలో ఆ పార్టీ సోషల్ మీడియా పాత్ర కూడా గణనీయంగానే ఉందనడంలో సందేహం లేదు. వైసీపీ పరాజయం తరువాత సజ్జల భార్గవ్ రెడ్డిని కేసుల నుంచి తప్పించేందుకు ఆయన తండ్రి సజ్జల రామకృష్ణారెడ్డి చేయగలిగినంతా చేశారు. పార్టీ ఓటమి పాలు కాగానే చడీ చప్పుడూ లేకుండా ఆయనను సోషల్ మీడియా పదవి నుంచి తప్పించి.. రాష్ట్రం దాటించేశారు. ఫోన్ లో కూడా అందుబాటులో లేకుండా చేశారు.  ఎన్ని చేసినా చేసినా కర్మ ఫలం అనుభవించాల్సిందేగా?  

 సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల వ్యవహారంలో  తనపై నమోదైన కేసులో అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు కోసం పిల్ల సజ్జల ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  సజ్జల భార్గవ్ రెడ్డి యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ పై హైకోర్టు శుక్రవారం ( ఫిబ్రవరి 21) విచారించింది. ఆ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యలను గమనిస్తే పిల్ల సజ్జలకు యాంటిసిపేటరీ బెయిలు లభించడం అనేమానమే అని న్యాయనిపుణులు చెబుతున్నారు.  పిల్ల సజ్జల కటకటాలు లెక్కించక తప్పదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. నెటిజనులు సైతం పిల్ల సజ్జలకు బెయిలా? జైలా అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.  పిల్ల సజ్జల యాంటిసిపేటరీ బెయిలు విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.  సోషల్ మీడియా వేదికగా వస్తున్న అసభ్యకర పోస్టులను కట్టడి చేయాల్సిందేనని కుండబద్దలు కొట్టింది.  వ్యక్తుల ప్రతిష్ఠకు భంగం కలిగేలా అసభ్య పోస్టులు పెట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అలాగే  సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల నిరోధానికి చర్యల వివరాలను తమకు నివేదించాలని ఆదేశించింది. 

పిల్ల సజ్జల యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ ను వ్యతిరేకిస్తూ పోలీసుల తరఫున వాదనలు వినిపించిన పీపీ లక్ష్మీనారాయణ  తప్పుడు పోస్టులు పెట్టేందుకు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ సోషల్‌ మీడియా కార్యాలయంలో 400 మందికి పైగా పని చేశారని తెలిపారు. ప్రధాన కార్యాలయం నుంచి వచ్చిన పోస్టులు, ఫొటోలను వివిధ గ్రూపుల్లో పోస్టు చేసేవారని దానికి డబ్బులు చెల్లించేవారని నివేదించారు. అలాగే  నచ్చని   వ్యక్తిని, వర్గాన్ని వదిలిపెట్టకుండా ఇష్టారీతిగా చెలరేగిపోయారని,  న్యాయమూర్తులను, చివరికి దేవుడిని సైతం వదిలిపెట్టలేదని పేర్కొన్నారు. పిటిషనర్లు నిరక్షరాస్యులు కాదని, బాగా చదువుకున్న వారేనని పేర్కొన్నారు. వ్యక్తిత్వ హననం, ప్రతిష్ఠలను దెబ్బతీయడం, అపకీర్తి పాలు చేయడం, బెదిరించడంలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారని తెలిపారు. వాదనల తరువాత హైకోర్టు ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.  

By
en-us Political News

  
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది...
ఈ సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే.
కేసీఆర్ పేరు చెప్పుకుని కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
ఈ సారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రేవంత్ కూడా ప్రతి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.