బీహార్ బాబు నితీష్ ఇన్నింగ్స్ ముగిసినట్లేనా?

Publish Date:Apr 11, 2025

Advertisement

బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయం సమీపిస్తోంది. ఈ సంవత్సరం  అక్టోబర్-నవంబర్‌ నెలల్లో ఎన్నికలు జరిగవలసి వుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఎన్నికల సన్నాహాలకు శ్రీకారం చుట్టింది. మరోవంక రాజకీయ పార్టీలూ ఎన్నికల పోరుకు సిద్దమవుతున్నాయి.  ఇటు అధికార ఎన్డీఎ కూటమి, అటు విపక్ష ఇండియా కూటమి ఎన్నికల కసరత్తు ప్రారంభించాయి. ప్రధానంగా పొత్తులు, ఎత్తుల  గురించిన చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిజానికి పొత్తుల పరంగా చూస్తే, అటు ఎన్డీఏలో ఇటు ఇండియా కూటమిలోనూ ఇప్పటివరకు అయితే 2020 పొత్తులలో మార్పు లేదు.   
అలాగే, ఇరు కూటముల నాయకులు, ముఖ్యంగా, మధ్యలో ఇటు నుంచి అటు నుంచి ఇటు దూకిన, జేడీయు అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి ఆ ‘తప్పు’ చేయనని స్పష్టం చేశారు. గత నెల (మార్చి) చివర్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటించిన సమయంలో నితీష్ కుమార్  షా సమక్షంలో  గతంలో రెండు సార్లు చేసిన తప్పు మరో సారి చేయనని, ఎన్డీఏను  వీడనని, స్పష్టం చేశారు. 

అలాగే  ఎన్డీఎ కూటమిమలోని ఇతర పార్టీల నేతలు  ఎల్జీపీ ( పాశ్వాన్) అధ్యక్షుడు కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్, హిందుస్తానీ అవామ్ మోర్చా (లౌకిక) అధ్యక్షడు జితన్ రామ్ మాంఝీ కూడా ఎన్డీఎతో కొనసాగుతామని ప్రకటించారు. అంతే కాకుండా ఇటీవల బీజీపీ అధ్యక్షుడు జేపీ నడ్డా బీహార్  ఎన్డీఏ నేతలతో ఢిల్లీలో సమావేశమై ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. ఈ సందర్భంగా చిరాగ్ పాశ్వాన్  మీడియాతో మాట్లాడుతూ బీహార్ అసెంబ్లీ  ఎన్నికల్లో ఎన్డీఏ విజయం  పట్ల  విశ్వాసం ప్రకటించారు. అంతకుముందు పశ్చిమ చంపారన్ జిల్లాలో జరిగిన ఎన్డీఏ కార్యకర్తల సంయుక్త సమావేశంలో మొత్తం 243 సీట్లలో 225 ఎన్డీఏ గెలుచుకుంటుందని నాయకులు ప్రకటించారు.ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల  రాష్ట్ర అధ్యక్షులు అందరూ ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

మరో వంక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  ఈ నెల 24 న  మూడు నెలల్లో రెండవ సారి రాష్ట్రంలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఆ రోజు, మధుబనిలో జరిగే పంచాయతీ రాజ్ కార్యక్రమంలో పాల్గొని దేశంలోని పంచాయతీ ప్రతినిధులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు. అలాగే  పాట్నా విమానాశ్రయంలో కొత్తగా నిర్మించిన టెర్మినల్‌ను ప్రారంభిస్తారు. అంతకు ముందు  ఫిబ్రవరి 24న, ప్రధాని మోదీ భాగల్పూర్‌ నుంచి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం  19వ విడత నిధులను విడుదల చేశారు. ఆ సందర్భంగా రైతులతో సంభాషించడంతో పాటు విమానాశ్రయ మైదానంలో జరిగిన బహిరంగ సభలో కూడా ప్రసంగించారు.

మరో వంక బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో  ఒంటరిగా పోటీ చేసే ఆలోచన లేదని  ఇండియా కూటమి  భాగస్వామ్య పార్టీలన్నీ ఒకటిగానే పోటీ చేస్తాయని కాంగ్రెస్ క్లారిటీ ఇచ్చింది. హర్యానా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసిన నేపధ్యంలో  బీహార్ లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రచారం జరుగతున్న నేపధ్యంలో కాంగ్రెస్  నేతలు అలాంటి ఆలోచన లేదని స్పష్టత ఇచ్చారు. అయితే  ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై సమిష్టి నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ చెబుతోంది. కానీ  ఆర్జేడీ మాత్రం  మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్  కూటమి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఇప్పటికే ప్రచారం ప్రారంభించింది.  మరో వంక  రాజకీయ నాయకుని అవతారం ఎత్తిన ఎన్నికల వ్యూహ కర్త  ప్రశాంత్ కిశోర్ ఇండియా కూటమితో జట్టు కట్టే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోది. ఆయన స్థాపించిన  జన సూరజ్ పార్టీ ఇండియా కూటమిలో చేరుతుందని ఎఐసీసీ కార్యదర్శి, బీహార్ రాష్ట్ర ఇంచార్జ్  దేవేంద్ర యాదవ్  అంటున్నారు. 

ఈ పరిణామాలను గమనిస్తే.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల యుద్దానికి రంగం సిద్ధమైంది చెప్పాల్సి ఉంటుంది. బీజేపీ- జేడీయు సారధ్యంలోని ఎన్డీఏ, కాంగ్రెస్-ఆర్జేడీ సారధ్యంలోని ఇండియా కూటమి సేనలు అస్త్ర శస్త్రాలతో యుద్ధానికి సిద్దమవుతున్నారు. అయితే  ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే ప్రశ్న కంటే.. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజకీయ భవితవ్యం ఏమిటి? అనే ప్రశ్నేకీలకంగా మారింది.  ఓ వంక ఆయన కుమారుడు నిశాంత్ కుమార్ రాజకీయ అరంగేట్రం గురించి రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రముఖంగా చర్చ జరుగుతోంది.  మరో వంక నితీష్ కుమార్ మరో మారు ముఖ్యమంత్రి అవుతారా? అనే ప్రశ్న  రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనే కాదు, జాతీయ స్థాయిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. అవును  అయారామ్, గయారామ్ రాజకీయాలకు పెట్టింది పేరుగా నిలిచిన బీహార్ రాజకీయాల్లోనూ నితీష కుమార్  తన  విలక్షణత నిలబెట్టుకున్నారు. 

రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరికంటే ఎక్కువ కాలం పదవిలో కొనసాగిన ముఖ్యమంత్రి గానే, కాదు, ఎక్కువ సార్లు  (9సార్లు)  ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రిగానూ చరిత్ర సృష్టించారు. నితీష్ కుమార్ 2005 నుంచి 2014 వరకు, తిరిగి   కొద్ది కాలం, ఆ తర్వాత  2015 నుంచి నేటి వరకు, మొత్తం మీద రెండు దశాబ్దాలకు కొంచెం అటూఇటుగా ముఖ్యమంత్రి కుర్చీకి అతుక్కు పోయారు. ‘ఫెవికాల్’ సిఎం’ అనిపించుకున్నారు.  అయితే  ఈ ఫెవికాల్ బంధం కొనసాగుతుందా? బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్  పదవ సారి  ప్రమాణ స్వీకారం చేస్తారా?  అనేది  ఇప్పడు అందరి ముందున్న ప్రశ్న. 
నిజానికి  2020 ఎన్నికల్లో ఎన్డీఎ 37.23 శాతం ఓట్లతో 125 స్థానాలు గెలుచుకుంది. అందులో నితీష్ కుమార్ పార్టీ జేడీయుకు వచ్చింది కేవలం 43 సీట్లు మాత్రమే.  బీజేపీ 74 స్థానాలు గెలుచుకుంది. అయితే ఎన్డీఎ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ముందుగానే నితీష్ కుమార్ పేరును ప్రకటించినందున  నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యారు. ఎక్కువ సీట్లు వచ్చినా బీజేపీ  ఇచ్చిన  మాటకు  కట్టుబడి ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకుంది. 

అయితే ఈసారి ముందుగానే ఎన్డీఎ ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటించేందుకు బీజేపీ అంత సుముఖంగా ఉన్నట్లు లేదు. అంటే ఎన్డీఎకి  మెజారిటీ వస్తే మహారాష్ట్ర తరహాలో  ఎక్కువ సీట్లు ఎవరికీ వస్తే వారికే ముఖ్యమంత్రి పదవి అనే ఫార్ములాను  బీహార్ లోనూ  అమలుచేసే ఆలోచనలో బీజేపీ ఉందని అనుకోవచ్చని అంటున్నారు. అయితే  ఇందుకు సంబంధించి బీజేపీ నాయకులను ప్రశ్నిస్తే.. కర్ర విరగదు, పాము చావదు, అన్నట్లు  "మేము ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వంలో ఎన్నికల్లో పోటీ చేస్తాము" అని సమాధానం ఇస్తున్నారు. మరో వంక ఇదే ప్రశ్నను కేంద్ర హోం మంత్రి అమిత్ షాను అడిగినప్పుడు, ‘ఇక్కడ’ చెప్పే విషయం కాదు అంటూ మీడియా ప్రశ్నను దాటవేశారు. సో.. ఎన్డీఏ అధికారంలోకి వచ్చి గత ఎన్నికల్లోలాగా ఎక్కువ సీట్లు కమల దళానికి దక్కితే.. ముఖ్యమంత్రి కుర్చీని వదులు కునేందుకు బీజేపీ సుముఖంగా లేదనేది స్పష్టంగానేతెలుస్తోందని అంటున్నారు. 

మరోవంక గతంలోనే  బీజేపీ సీనియర్ నాయకుడు సుశీల్ కుమార్ మోదీ, ముఖ్యమంత్రి  నితీష్ కుమార్ ఉప రాష్ట్రపతి కావాలనేది తన కోరిక అంటే, తాజాగా  నిన్న మొన్న మరో బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి అశ్విని కుమార్ చౌబే.  నితీష్ కుమార్ ను  ఉప ప్రధానిగా చూడాలనేది తన కోరిక అని పార్టీ మనసులో మాటను బయట పెట్టారు. అంటే  నితీష్ కుమార్’కు, బీజేపీ ఢిల్లీ ఫ్లైట్  టికెట్ బుక్  చేసినట్లే అనుకోవచ్చని అంటున్నారు.  

అంటే  ఎన్డీఎ గెలిచినా, ఓడినా  నితీష్ కుమార్  కు మరో మారు  బీహార్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఇంచు మించుగా లేనట్లే అంటున్నారు. అలాగే, నితీష్ కుమార్ కు ముఖ్యమంత్రి పీఠంతో ఉన్న ఫెవికాల్ బంధం...ఉంటుందా, ఊడుతుందా ? అంటే, అనుమానమే అన్న సమాధానమే వస్తోంది. అయితే.. హంగ్ వస్తే? మళ్ళీ నితీష్ కుమారే సిఎం అయినా కావచ్చు. ప్రస్తుతం అదే ఆసక్తికర ముక్తాయింపుగా పరిశీలకులు పేర్కొంటున్నారు.

By
en-us Political News

  
సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. మూడు నెలల్లోపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు సూచించినప్పటికీ.. ఆ ఆదేశాలను అమలు చేయలేదని బీజేపీ తన పిటిషన్ లో పేర్కొంది. ఈ మేరకు స్పీకర్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని కోరుతూ తెలంగాణ బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మేడారంలో జరిగిన కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా సచివాలయంలో కాకుండా మేడారంలో కేబినెట్ సమావేశం ఏర్పాటైందన్నారు. ములుగు ఎమ్మెల్యే, మంత్రి సీతక్క ఇందుకు చొరవ తీసుకున్నారని, మేడారంలో కేబినెట్ భేటీ విషయంలో అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చారని వివరించారు.
దాదాపు 500 కిలోమీటర్ల ఈ పాదయాత్ర సాగనుంది. తాను తిరుమలకు పాదయాత్ర చేస్తున్నది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అభిమానంతోనేనన్నారు. ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆశీస్సులతోనే ముందడుగు వేస్తున్నానని చెప్పారు.
ఇప్పటికే ఇదే కేసులో ఎంపీ మిధున్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన బెయిలుపై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఏపీ లిక్కర్ స్కామ్‌లో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని ఈడి అనుమానిస్తోంది. లిక్కర్ వ్యాపారానికి సంబంధించిన లావాదేవీల్లో హవాలా మార్గంలో భారీ ఎత్తున జరిగిన నగదు చలామణి లో మిథున్ రెడ్డి పాత్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి.
అవినీతి మరక ఉన్నప్పటికీ బీజేపీ ఎంట్రీకి అదేమంత అడ్డంకి కాదని గతంలో పలువురి విషయంలో రుజువైంది. అయితే మిథున్ రెడ్డి విషయంలో మాత్రం కమలనాథులు కండీషన్లు పెట్టారనీ, అందుకే మిథున్ రెడ్డి బీజేపీ ఎంట్రీకి బ్రేక్ పడటానికి కారణమంటున్నారు.
వెనిజులాలో ఎంతో భారీగా ప్రజాదరణతో ఎన్నికైన తర్వాత.. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ అధిపతులు ఇంతమంది చుట్టూ ఉన్నా.. ఆ దేశ అధ్యక్షుడిని, అతడి భార్యని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుంచి అమెరికా ఎలాంటి ప్రతిఘటనా లేకుండా ఎత్తుకుపోయిందని విజయసాయి రెడ్డి గుర్తుచేశారు.
తెలంగాణ సీనియర్‌ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
దేవర తలచుకుంటే ఊరేం ఖర్మ దేశమే పేరు మార్చుకుంటుంది. భరతావని మనది. జండా పట్టుకుని చాలా చక్కగా నవ్వుతూ నిలబడి ఉంటుంది.
రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీల్లో ఎస్టీలకు 5, ఎస్సీలకు 17, బీసీలకు 38 మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవులను కేటాయించారు. అలాగే మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి.
ఈ కేసులో విజయసాయి కూడా ఇప్పటికే సిట్, ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. ఇప్పుడు తాజాగా ఈ నెల 22 విచారణకు రావాల్సిందిగా విజయసాయికి ఈడీ నోటీసులు పంపడం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అలాగే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే మాకనూరు సంజయ్ లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఈ ముగ్గురిలో కూడా దానం నాగేందర్ పరిస్థితి ఒకింత భిన్నంగా ఉంది. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ టికెట్ పై విజయం సాధించిన తరువాత కాంగ్రెస్ కండువా కప్పుకోవడమే కాకుండా, ఆ పార్టీ తరపఫున లోక్ సభ ఎన్నికలలో పోటీకి కూడా దిగారు.
ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం అనుసరిస్తున్న తీరు వల్ల ప్రజలలో ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం సడలిపోతోందని రాహుల్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఇటీవల ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు ఈ ఆరుగురు ఎమ్మెల్యేలూ డుమ్మా కొట్టడమే ఈ ప్రచారానికి కారణం. ఈ నెల 13న పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన దహీ-చూరా విందుకు ఈ ఆరుగురు ఎమ్మెల్యేలూ గైర్హాజరయ్యారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.