Publish Date:Apr 24, 2024
ఇది యావత్ భర్తలు సానుభూతిని వ్యక్తం చేయాల్సిన ఘటన. ఇలాంటి పరిస్థితి తమకూ రాకూడదని ప్రార్థించాల్సిన ఘటన. భర్త భార్యని కొడితే వార్త కాదు.. భార్య భర్తని కొడితే వార్త. అలాంటి వార్త వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్లోని కొంపల్లె ప్రాంతానికి చెందిన నగేష్ అనే వ్యక్తికి కొన్నేళ్ల క్రితం పెళ్ళయింది. (చాలామంది భార్యలు ఆమెని సంప్రదించి, భర్తని కొట్టడం ఎలా అనే పాఠాలు నేర్చుకునే ప్రమాదం వుంది కాబట్టి, సదరు భార్య పేరు గానీ, ఆమె వివరాలు గానీ ఇవ్వడం లేదు.. ఇది భర్తలకు మావంతుగా మేం అందిస్తున్న సహకారం). వీళ్ళ దాంపత్యానికి గుర్తుగా ఇద్దరో ముగ్గురో పిల్లలు కూడా వున్నారు. పిల్లలు పుట్టేవరకూ బాగానే వుందిగానీ, ఆ తర్వాత ఏం తేడా వచ్చిందో ఏమో, సదరు నగేష్ భార్య భర్తని చావబాదడం ప్రారంభించింది. తనకు ఎప్పుడు కోపమొస్తే అప్పుడు భర్తకి బడితపూజ చేసేది. చేతికి ఏది దొరికితే దానితో చావబాదే పెళ్ళాం ధాటికి తట్టుకోలేక, ఇక జీవించి వృధా అని నగేష్ ఏం చేశాడంటే, తన ఇంటికి దగ్గర్లోనే వున్న చెరువులోకి దిగాడు. ఇది గమనించిన వారు, పెద్దగా అరిచి నగేష్ని ఆపారు. చెరువులో ఎందుకు దూకావని అడిగితే, నగేష్ తన కష్టాన్నీ చెప్పుకుని బాధపడ్డాడు.
తన భార్య తనను ప్రతిరోజూ టైమ్ టేబుల్ తప్పకుండా కొడుతుందని, అప్పుడప్పుడు వాతలు కూడా పెడుతుందని చెప్పుకొచ్చి భోరుమన్నాడు. తన మాటలు జనం నమ్ముతారో లేదోనని చొక్కా విప్పి మరీ తన ఒంటి మీద వున్న వాతలు చూపించాడు. తన పిల్లలని తన దగ్గరకి రానివ్వదని, తన పిల్లల కోసం ఐస్క్రీమ్ కొని తీసుకెళ్తే, తన భార్య దాన్ని పిల్లలకు పెట్టకుండా తానే తినేస్తుందని చెప్పి లబోదిబోమన్నాడు. భార్య టార్చర్ భరించలేక తాను అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళడం కూడా మానుకుంటానని చెప్పాడు. అలాంటి సందర్భాల్లో తన పిల్లలు డాడీ ఎక్కడకి వెళ్ళాడమ్మా అని తన పిల్లలు అడిగితే, తన భార్య చచ్చిపోయాడు అని కూల్గా చెబుతుందని చెప్పి నగేష్ బావురుమన్నాడు. తన భార్య నుంచి తనకు విడాకులు కావాలని వేడుకున్నాడు. విడాకులు ఇప్పించకపోతే చచ్చిపోతానని చెప్పాడు. దాంతో స్థానికులు అతనికి నచ్చజెప్పారు. తాడు వేసి అతన్ని చెరువులోంచి పైకి లాగాడు. పరిస్థితులు మెల్లగా చక్కబడతాయిలే అని అతనికి చెప్పి ఇంటికి పంపించారు. నగేష్ ఇంటికి వెళ్ళాడు. మరి పరిస్థితులు చక్కబడతాయో... భార్య చేతిలో ఇంకో రౌండ్ కోటా పడుతుందో ఆ పైవాడికే తెలియాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/wife-beating-husband-39-174463.html
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ గట్టిగా చెబుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమనీ ప్రజల భూములను దోచుకునేందుకు కుట్రపూరితంగా జగన్ సర్కార్ దీనిని తీసుకువచ్చిందని విమర్శిస్తున్నారు.
అబూజ్ మడ్ దట్టమైన అటవీ ప్రాంతం. కేవలం రెండు నెలల వ్యవధిలో ఇక్కడ జరిగిన ఎన్కౌంటర్లలో 90 మంది చనిపోవడమంటే.. కచ్చితంగా ఈ అబూజ్ మడ్ పైనే సర్కార్ సీరియస్ గా దృష్టి సారించినట్టు అర్థం చేసుకోవచ్చు.
ఏపీ ఇన్ చార్జ్ డీజీపీ రాజేంద్రనాథ్ పై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన విషయం విధితమే. ఈ క్రమంలో కొత్త డీజీపీ నియామకం కోసం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ముగ్గురి పేర్లతో కూడిన జాబితాను పంపారు. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీశ్ కుమార్ గుప్తా పేర్లను సీఎస్ ఈసీకి పంపారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ , బిజెపిలు పాలు నీళ్లలో కలిసి ఉండేవారు. బిజెపి బి టీం బిఆర్ఎస్ అని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ భారీ పరాజయంతో రెండు పార్టీల మధ్య అగాథం బాగా పెరిగాపోయింది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్లు వైసీపీ ప్రభుత్వంతో పూర్తిగా తెగతెంపులు చేసేసుకున్నారా? మరో సారి జగన్ ను నమ్మే పరిస్థితి లేదని విస్పస్టంగా చెప్పేశారా? అంటే పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవడం కోసం వారు దరఖాస్తు చేసుకుంటున్న తీరును బట్టి ఔనని అనక తప్పదు.
వైసీపీ నాయకుడు జగన్కున్న మానసిక వ్యాధి పేరు ‘నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్’ అని, దాన్ని షార్ట్కట్లో ‘నార్సి’ అంటారని,
మామూలు ఓట్లతో మెజారిటీలు సాధిస్తే పోస్టల్ బ్యాలెట్ లెక్కించినా నామమాత్రం అవుతుంది. కానీ ఈసారి నెక్ టూ నెక్ గా ఏపీలో పోరాటం ఉంది. వంద, యాభై, పాతిక, పదీ ఓట్ల తేడాతో కూడా అభ్యర్ధుల గెలుపు ఉండనుంది. దాంతో అపుడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లే డిసైండ్ ఫ్యాక్టర్ గా మారనున్నాయి. అందుకే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కి ఎన్నడూ లేనంతగా ప్రాధాన్యత పెరిగింది.
మాట తప్పను మడమ తిప్పను అనే జగన్ ఇచ్చిన మాటకు పూచిక పుల్లంత విలువ కూడా ఇవ్వరన్న సంగతి ఈ ఐదేళ్ల కాలంలో పదే పదే రుజువైంది. మాట ఇవ్వడం మడమ తప్పటం అన్నది జగన్ నైజంగా జనం భావించే పరిస్థితికి వచ్చేశారు.
నార్సీ వ్యాధికి వున్న కొన్ని లక్షణాలను ఫస్ట్ పార్ట్.లో చెప్పడం జరిగింది. ఈ మానసిక వ్యాధిగ్రస్థులకి వుండే మరికొన్ని లక్షణాలను చూద్దాం.
మనీలాండరింగ్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఇప్పట్లో ఊరట లభించే అవకాశాలు కనిపించడం లేదు. ఇదే కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే . గత ఏడాది ఫిబ్రవరి 26న అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ సిఎం మనీష్ సిసోడియాకు ఇంత వరకు బెయిల్ లభించలేదు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. అసలు స్వరూపం ఏమిటో మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ బట్టబయలు చేశారు. ఆ యాక్ట్ ను తీసుకువచ్చేసి.. ఇంకా అమలులోకి రాలేదు. పరిశీలనలో ఉంది అంటూ ఏపీ మంత్రులు చేస్తున్న ప్రకటనల డొల్ల తనాన్ని ఆయన ఒకే ఒక్క ట్వీట్ తో బయటపెట్టేశారు. తాను ప్రత్యక్ష బాధితుడిని అంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు రాష్ట్రంలో దుమారం రేపుతోంది. జగన్ ప్రభుత్వ దొడ్డిదారి యవ్వారాల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
జగన్కి వున్న మానసిక వ్యాధి గుట్టు రట్టయింది.. ఆ వ్యాధి పేరు ‘నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్’, షార్ట్కట్లో ‘నార్సీ’ అంటారు.
హైదరాబాద్ బిజెపి అభ్యర్థి మాధవిలత తరపున కేంద్ర హోం మంత్రి అమిత్ షా రోడ్ షో తర్వాత కాంగ్రెస్, ఎంఐఎం ఒక్కటయ్యాయి. ప్రత్యర్థి బిజెపి అభ్యర్థిని ఎదుర్కోవడానికి ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించాలని నిర్ణయించాయి.