Publish Date:Nov 28, 2021
తెలంగాణలో ప్రస్తుతం అన్ని సమస్యలే. రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, కార్మికులు... ఇలా అన్ని వర్గాల వారు కేసీఆర్ సర్కార్ పై ఆగ్రహంగా ఉన్నారు. అందుకే ప్రస్తుతం రాష్ట్రంలో విపక్షాలన్ని దూకుడు పెంచాయి. కేసీఆర్ టార్గెట్ చేస్తూ వరుసగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. వరి ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలంటూ బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ జిల్లాలు తిరిగి వరి కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. కాంగ్రెస్ కూడా నిరుద్యోగుల విషయంలో పెద్ద ఎత్తున ఉద్యమించింది. వరి అంశంపై జోరుగా జనంలోకి వెళుతోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనదైన శైలిలో ఉద్యమాలు చేస్తూ కాంగ్రెస్ కేడర్ లో జోష్ నింపుతున్నారు. వామపక్షాలు కూడా తమకు పట్టున్న ప్రాంతాల్లో ప్రజా సమస్యలపై పోరాడుతున్నాయి.
తెలంగాణలో ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తుండగా.. మరో విపక్ష పార్టీ అయిన తెలుగు దేశం పార్టీ మాత్రం కనిపించడం లేదు. రాష్ట్రంలో బోలెడు సమస్యలు ఉన్నా ఎక్కడా తెలంగాణ తమ్ముళ్లు స్పందించడం లేదు. దీంతో తెలంగాణలో ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ ఉందా లేదా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఎల్ రమణ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తరుచూ సమస్యలపై స్పందించేవారు. కొన్ని నిరసన కార్యక్రమాలు నిర్వహించేవారు. ప్రెస్ మీట్లు పెట్టి కేసీఆర్ సర్కార్ ను నిలదీసేవారు. ఎల్ రమణ టీడీపీని వీడి కారెక్కడంతో తెలుగుదేశం పార్టీ పూర్తిగా డీలా పడింది. ఆ ప్రభావం ప్రస్తుతం కనిపిస్తుందని అంటున్నారు.
ఎల్ రమణ పార్టీ నుంచి వెళ్లిన తర్వాత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, దళిత నేత బక్కని నర్సింహులును అధ్యక్షుడిగా నియమించారు చంద్రబాబు. కొత్త కమిటిని కూడా వేశారు. అయితే బక్కని టీమ్ అనుకున్నతంగా స్పందించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రజా క్షేత్రంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించలేకపోతున్నారని అంటున్నారు. రాష్ట్రంలో తీవ్రమైన సమస్యలు ఉన్నా... టీటీడీపీ ఒక్క పెద్ద కార్యక్రమం నిర్వహించలేదంటే.. ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చు. హైదరాబాద్ లోనూ చిన్నపాటి నిరసన కార్యక్రమాలు నిర్వహించలేకపోతోంది. గ్రేటర్ పరిధిలో బలమైన నాయకుడు లేకపోవడమే ఇందుకు కారణమంటున్నారు.
తెలంగాణలో ఇప్పటికీ టీడీపీకి బలమైన కేడర్ ఉంది. నేతలు పార్టీలు మారిన కార్యకర్తలు మాత్రమే అలానే ఉన్నారు. అయితే నడిపించే నాయకుడు లేకపోవడం వల్లే తమ్ముళ్లు రోడ్లపైకి రాలేకపోతున్నారనే అభిప్రాయ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఫైర్ బ్రాండ్ లీడర్లు వస్తే టీడీపీ కేడర్ సత్తా చూపిస్తుందని చెబుతున్నారు. ఇప్పుడు అలాంటి నేతలు లేకపోవడంతో బయటికి రాలేకపోతున్నారని తెలుస్తోంది. మొత్తంగా తెలంగాణలో టీడీపీ పరిస్థితి రోజురోజుకు మరింత దిగజారిపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పరిస్థితి ఇలానే ఉంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పోటీ చేసే అభ్యర్థులు కూడా టీడీపీకి దొరకకపోవచ్చని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/why-ttdp-silent-in-telangana-39-127286.html
మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించిన ఆయనకు తన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కమ్ ఇంటికి సంబంధించిన వాస్తు దోషాలను సెట్ చేసుకుంటే సరిపోతుందని ఆలోచన వచ్చింది.
తెలంగాణ ఉద్యమం అయిపోలేదు. తెలంగాణ పునర్నిర్మాణం ఇంకా మిగిలే ఉందంటారు కేసీఆర్. ఎన్నికల్లో ఓటమి అనేది టెంపరరీ సెట్ బ్యాక్ మాత్రమే. రాజకీయాల్లో ఉన్న వాళ్లకు నిబ్బరం ఉండాలి. గెలిచినా, ఓడినా ప్రజల కోసం పనిచేస్తూనే ఉండాలని కేసీఆర్ తన క్యాడర్కు హితబోధ చేస్తూ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు.
ఎవరు ఎంత అధికారంలో అయినా వుండవచ్చు... మా మాటకు ఎదురు లేదు.. మేం చేసిన దానికి తిరుగులేదు అనే ధీమాలో వుంటే వుండొచ్చు..
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వారం రోజుల వ్యవధిలోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార పార్టీ వైసీపీకి కొమ్ముకాస్తూ ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్న అధికారుల జాబితాను రెడీ చేసుకున్న ఈసీ ఆ జాబితాలో ఒక్కొక్కరి పై బదిలీ వేటు వేస్తూ వస్తున్న. ఇప్పటికే పలువురు అధికారులపై బదిలీ వేటు వేసిన ఈసీ.. ఆదివారం (మే6) రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు వేసింది.
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎపిలో నూతన డిజిపి నియామకమయ్యారు. అంతటితో ఆగకుండా ఎన్నికల కమిషన్ దూకుడు పెంచింది.
ఏపీలో ఎన్నికలు వారం రోజుల వ్యవధిలోకి వచ్చేశాయి. అధికార వైసీపీ ఈ ఐదేళ్ల కాలంలో చేసిందేమిటన్నది చెప్పుకోవడానికి ఏమీ లేక.. చెప్పుకునే గొప్పలు జనం నమ్మడం లేదని ఖరారు కావడంతో ఇక విపక్షాలపై దుష్ప్రచారం, అబద్ధాల వ్యాప్తికి డిస్పరేట్ గా ప్రయత్నిస్తోంది.
‘ఒకే ఒక్కడు’ సినిమాలో ఒక కీలక సీన్ వుంటుంది. ముఖ్యమంత్రి పోస్టులో వున్న రఘువరన్ని జర్నలిస్టు పాత్రలో అర్జున్ ఇంటర్వ్యూ చేస్తాడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ గట్టిగా చెబుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమనీ ప్రజల భూములను దోచుకునేందుకు కుట్రపూరితంగా జగన్ సర్కార్ దీనిని తీసుకువచ్చిందని విమర్శిస్తున్నారు.
అబూజ్ మడ్ దట్టమైన అటవీ ప్రాంతం. కేవలం రెండు నెలల వ్యవధిలో ఇక్కడ జరిగిన ఎన్కౌంటర్లలో 90 మంది చనిపోవడమంటే.. కచ్చితంగా ఈ అబూజ్ మడ్ పైనే సర్కార్ సీరియస్ గా దృష్టి సారించినట్టు అర్థం చేసుకోవచ్చు.
ఏపీ ఇన్ చార్జ్ డీజీపీ రాజేంద్రనాథ్ పై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన విషయం విధితమే. ఈ క్రమంలో కొత్త డీజీపీ నియామకం కోసం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ముగ్గురి పేర్లతో కూడిన జాబితాను పంపారు. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీశ్ కుమార్ గుప్తా పేర్లను సీఎస్ ఈసీకి పంపారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ , బిజెపిలు పాలు నీళ్లలో కలిసి ఉండేవారు. బిజెపి బి టీం బిఆర్ఎస్ అని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ భారీ పరాజయంతో రెండు పార్టీల మధ్య అగాథం బాగా పెరిగాపోయింది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్లు వైసీపీ ప్రభుత్వంతో పూర్తిగా తెగతెంపులు చేసేసుకున్నారా? మరో సారి జగన్ ను నమ్మే పరిస్థితి లేదని విస్పస్టంగా చెప్పేశారా? అంటే పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవడం కోసం వారు దరఖాస్తు చేసుకుంటున్న తీరును బట్టి ఔనని అనక తప్పదు.
వైసీపీ నాయకుడు జగన్కున్న మానసిక వ్యాధి పేరు ‘నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్’ అని, దాన్ని షార్ట్కట్లో ‘నార్సి’ అంటారని,