లగడపాటి మంత్రాంగం.. రాజ‌కీయ క‌ల‌క‌లం..

Publish Date:Apr 25, 2022

Advertisement

‘ఆంధ్రా ఆక్టోపస్’, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, ఎన్టీఆర్ జిల్లా మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ బేటీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అలాగే వారి భేటీ పలు అనుమానాలకు కూడా అవకాశం ఇస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలు కాకుండా ఉండాలని అప్పుడు కాంగ్రెస్ ఎంపీగా ఉన్న లగడపాటి సమైక్య నినాదాన్ని బలంగా వినిపించారు. రాష్ట్రం విడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పినట్లే ఆయన చాన్నాళ్లుగా రాజకీయంగా కనుమరుగయ్యారు. అయితే.. శని, ఆదివారాల్లో ఎన్టీఆర్ జిల్లా నందిగామ, చందర్లపాడులో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి లగడపాటి హాజరయ్యారు. అక్కడితో ఆగకుండా వసంత కృష్ణప్రసాద్ తో భేటీ అయ్యారు. నందిగామ, జగ్గయ్యపేట నియోజవర్గాల్తోని కాంగ్రెస్, వైసీపీ నేతలతో కూడా సమావేశమయ్యారు. రాజకీయ సన్యాసం తీసుకున్న లగడపాటి రెండు రోజుల పాటు ఇలా హల్ చల్ చేయడాన్ని పలువురు పలు రకాలుగా విశ్లేషిస్తున్నారు.

ఏపీ సీఎం కొద్ది రోజుల క్రితం ఏర్పాటు చేసిన రెండో కేబినెట్ లో సామాజిక సమీకరణలో భాగంగా అయినా వసంత కృష్ణప్రసాద్ కు స్థానం కల్పించి ఉండాల్సింది. తొలి కేబినెట్ లో మంత్రిగా వ్యవహరించిన కమ్మ సామాజికవర్గానికే చెందిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి పొడిగింపు ఇవ్వలేదు. కొడాలి నానికి పొడిగింపు ఉందడనే విషయం ముందుగానే లీకులు వచ్చాయి. అలాంటి పరిస్థితుల్లో రెండో కేబినెట్ లో సామాజిక సమీకరణలో భాగంగా తనకు బెర్త్ కోసం కృష్ణప్రసాద్ బాగా ఆశలు పెంచుకున్నారు. అయితే.. ఆయనకు మొండిచెయ్యి చూపించారు సీఎం జగన్. అప్పటి నుంచీ కృష్ణప్రసాద్ అసహనానికి, ఆవేదనకు గురయ్యారనే వార్త వచ్చాయి. అసలే వైసీపీ అధిష్టానంపై ఆగ్రహంతో ఉన్న వసంత కృష్ణప్రసాద్ తో అదే సామాజికవర్గానికి చెందిన లగడపాటి రాజగోపాల్ భేటీ కావడం, ప్రత్యేకంగా ఇద్దరూ చర్చించుకోవడం అందరి దృష్టినీ ఆకర్షించింది.

2019 నుంచీ రాజకీయాలకు దూరంగా ఉంటున్న రాజగోపాల్ మళ్లీ చైతన్యవంతం అవుతారా? అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. లేదంటే తన కుమారుడు అశ్రిత్ చేత పొలిటికల్ ఎంట్రీ చేయించేందుకు పావులు కదుపుతున్నారా? అనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి. లగడపాటి మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తే... విజయవాడ లోక్ సభా స్థానం నుంచి తాను బరిలో దిగి, తన కుమారుడి చేత ఎమ్మెల్యేగా పోటీ చేయించాలనే వ్యూహం ఏదో పన్నుతున్నారని, ఆ క్రమంలోనే వసంత కృష్ణప్రసాద్ తో పాటు కాంగ్రెస్, వైసీపీ రాజకీయ నేతలతో చర్చలు జరిపారంటున్నారు. విజయవాడ టీడీపీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న దేవినేని ఉమకు గట్టి ప్రత్యర్థి అయిన వసంత కృష్ణ ప్రసాద్ తో లగడపాటి భేటీ దేనికి దారితీస్తుందనే చర్చ నడుస్తోంది.

రాజగోపాల్ మళ్లీ యాక్టివ్ అవ్వాలని, అందుకు పొలిటికల్ ప్లాట్ఫాం కోసం వసంత కృష్ణప్రసాద్ ద్వారా వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు యత్నించే క్రమంలోనే ఈ సమావేశం జరిగిందని కొందరు అంచనా వేస్తున్నారు. మంత్రి పదవి దక్కలేదనే బాధలో ఉన్న కృష్ణప్రసాద్ ను వైసీపీ అధిష్టానంపై ఉసిగొల్పే రాజకీయ ప్రయత్నానికేమైనా తెర లేపారా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతుండడం గమనార్హం. లగడపాటి- వసంత కృష్ణప్రసాద్ మధ్య సాన్నిహిత్యం ఉంది. దాంతో పాటు వారి మధ్య వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయని అంటారు. ఈ క్రమంలో వసంత కృష్ణ ప్రసాద్ కు మద్దతుగా నిలవడం, ఆయన భవిష్యత్ వ్యూహ రచనకు తోడ్పాటు అందించడానికి కూడా లగడపాటి భేటీ అయ్యారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఒకవేళ లగడపాటి వైసీపీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తే.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు వెంటనే ఓకే చెబుతారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే విజయవాడలో గత రెండు లోక్ సభ ఎన్నికల్లోనూ టీడీపీ తరఫున కేశినేని నాని గెలిచారు. అయితే.. ఇప్పుడాయన టీడీపీతో కాస్త అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారంటున్నారు. కేశినేనిపై 2019లొ వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన పొట్లూరి వరప్రసాద్ ఇప్పుడు సైలెంట్ గా ఉంటున్నారు. దీంతో విజయవాడ స్థానంలో అటు టీడీపీ నుంచి ఇటు వైసీపీ నుంచి కూడా వ్యాక్యూమ్ ఉంది. ఈ సమయంలో లగడపాటి వస్తానంటే నేనొద్దంటానా? అని వైఎస్ జగన్ అంటారంటున్నారు.

ఏదేమైనా వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, లగడపాటి రాజగోపాల్ సమావేశం ఇప్పుడు రాజకీయవర్గాల్లో రకరకాల ఊహాగానాలకు, అంచనాలకు, అనుమానాలకు అవకాశం ఇచ్చింది.

By
en-us Political News

  
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్.. తాను గ్రౌండ్ రియాలటీని గత ఎన్నికల సమయంలో చెప్పినా నమ్మలేదనీ, తాను 2014 ఎన్నికల్లోనూ, మొన్నటి 2024 ఎన్నికల్లోనూ కూడా ఆరు నెలల ముందే చంద్రబాబు, లోకేష్‌లకు సీట్ల మార్జిన్ గురించి కచ్చితమైన అంచనాలు చెప్పినా వినలేదని.. తీరా చూస్తే క్షేత్రస్థాయిలో తాను చెప్పిన ఫలితాలే వచ్చాయని ఉదహరించారు.
తాజాగా గుడివాడలో కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. యూట్యూబర్ రావణ్ అరెస్ట్ ఉదంతంపై.. తనదైన శైలిలో తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో కొత్త రాజకీయ కుట్ర సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా, రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవాన్ని తీసుకురావడమే ధ్యేయంగా సాగిన ఈ పర్యటన ఏపీ యువతకు ఉపాధి అవకాశాల వెల్లువను తీసుకురానుంది. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ అనే మూడు సూత్రాల 3ఎస్ మోడల్ తో పారదర్శక పాలన అందిస్తామని కొరియా దిగ్గజాలకు లోకేష్ భరోసా ఇచ్చారు.
2020 ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ ఏకంగా 56 స్థానాలను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ 48 స్థానాలతో గట్టి పోటీ ఇవ్వగా, ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించి పట్టు నిలుపుకుంది. కానీ, నాటి అధికార పీఠం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 2 స్థానాలకే పరిమితమైంది.
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్‌మెన్‌లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.