కేసీఆర్ సారూ ఢిల్లీ ఎందుకు పోలేదు ?

Publish Date:Apr 30, 2022

Advertisement

దేశ రాజదాని ఢిల్లీలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సు జరుగుతోంది.ఈ కార్యక్రమంలో చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌.వి. రమణతో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు పాల్గొన్నారు. అదే విధంగా ఢిల్లీ, ఆంధ్ర ప్రదేశ్ సహా చాలా వరకు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్ మాత్రం ఢిల్లీ వెళ్ళలేదు. సమావేశంలో పాల్గొనలేదు. రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, న్యాయశాఖ అధికారులు సదస్సులో పాల్గొన్నారు. 
ఈ నేపధ్యంలో, ఇదిగో అంటే ఢిల్లీ అదిగో అంటే ఢిల్లీ వెళ్లి వచ్చే  ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ ఎందుకు వెళ్ళలేదు, అనే విషయంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మధ్య అయిన దానికి కానీ దానికి కేంద్ర ప్రభుత్వంపై కత్తులు దూస్తున్న విషయం తెలిసిందే. హుజురాబాద్ ఓటమి మొదలు ముఖ్యమంత్రి, కేంద్ర ప్రభుత్వం మెడ మీద కత్తిపెట్టి రాష్ట్రంలో బీజేపీని దెబ్బ కొట్టేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ వచ్చారు. ఈ ఐదారు నెలలో ముఖ్యమంత్రి, తెరాస మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఢిల్లీ పై ఒకటి రెండు పర్యాయాలు దండయాత్ర చేశారు. గత ఏడెనిమిది ఏళ్ళలో ఎప్పుడూ లేని విధంగా వరి ధాన్యం కొనుగోలును వివాదం చేసి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ధర్నాలు ఆందోళనలు చేశారు. అయినా, ఢిల్లీ ( కేంద్రం) దిగిరాలేదు. దీంతో చివరకు చేసేది లేక, రాష్ట్ర ప్రభుత్వం  ధాన్యం సేకరించేందుకు అంగీకరించింది. సరే అది వేరే విషయం వేరే చర్చ. 
అదొకటి ఆలా ఉంటే, జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించి, ఆ దిశగానూ ముఖ్యమంత్రి  కొంత ప్రయత్నం చేశారు. ముంబై వెళ్లి ఎన్సీపీ అధినేత శరద్ పవార్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్దవ్ థాకరేతో చర్చలు జరిపారు. అలాగే, చెన్నై వెళ్లి తమిళనాడు ముఖ్యమత్రి స్టాలిన్’ను ఝార్ఖండ్ వెళ్లి ఆ రాష్ట ముఖ్యమంత్రి సోరెన్’ ను కలిసి చర్చలు జరిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్’ ని కలిసేందుకు ఢిల్లీ అయితే వెళ్ళారు కానీ. ఎన్ని రోజులు వెయిట్ చేసిన కేజ్రీవాల్’ అప్పాయింట్మెంట్ ఇవ్వలేదో ఏమో, కానీ, ఆయన్ని కలవ కుండానే హైదరాబాద్ వాపస్ వచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడికి వెళ్లారు, ఎవరిని కలిశారు అనే విషయం పక్కన పెడితే, ఫ్రంట్  ప్రయత్నం కూడా దిగ్విజయంగా అటకెక్కింది. ఆ విఃయాన్ని స్వయంగా ఆయనే, మొన్నటి తెరాస ప్లీనరీలో బయట పెట్టారు. ఫ్రంట్లు, టెంట్లు కాదు, దేశంలో గుణాత్మక మార్పు కోసం  ప్రత్యన్మాయ విధానాలను రూపొందిస్తామని, కొత్త పల్లవి అందుకున్నారు. 
మరోవంక ముచ్చటగా మూడవ సారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు, ఎన్నికల వ్యూహ ప్రశాంత్  కిశోర్’ ను నమ్ముకుని కోట్ల రూపాయల డీల్ కుడుర్చుకున్నా, ఆ పీకే ఎప్పుడు చక్రం తిప్పుతాడో అనే భయం వెంటాడుతోంది. ఓ వంక తెరాసతో డీల్ కుదుర్చుకుని ఢిల్లీలో కాంగ్రెస్’ తో చేతులు కలిపేందుకు చర్చలు జరిపారు. మంచికో చెడుకో ఆ చర్చలు విఫల మయ్యాయి. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్దమయిన పీకే ఎందుకనో ప్రస్తుతానికి అయితే వెనకడుగు వేశారు.అయితే,ఎప్పుడైనా పీకే చేయిచ్చే ప్రమాదం ఉందనే సంకేతాలు ఉండడం వల్లనో ఏమో, ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తమ పంథా మార్చుకుంటున్నారు అని అంటున్నారు. 
ఇలా హుజురాబాద్ ఉప ఎన్నికలో మొదలైన వరస ఓటముల  నేపధ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, డెల్లి వెళ్లి మళ్ళీ నవ్వుల పాలు అవడం ఎందుకని, న్యాయ సదస్సుకు డుమ్మా కొట్టారని విస్వసనీయ వర్గాల  సమాచారం. నిజానికి, ఇక ఇప్పట్లో ముఖ్యమంత్రి ఢిల్లీ వైపు కన్నెత్తి అయినా చూడరని, జాతీయ రాజకీయ అజెండాకు చాప చుట్టేసినట్లేనని అంటున్నారు. అయితే, రాష్ట్రలో  బీజేపీ టార్గెట్ చేసేందుకు, కేంద్రంపై విమర్శలు మాత్రం కొనసాగుతాయని అంటున్నారు. అయితే, ఉద్యమ కాలం నుంచీ కూడా కేసీఆర్ బ్లో కోల్డ్ బ్లో హాట్’ థియరీనే ఫాలో అవుతున్నారని, సమయానుకూలంగా వ్యూహాలు మార్చుకుంటారని పార్టీ నేఅత  ఒకరు గుర్తుచేశారు.అయితే, న్యాయసదస్సు విషయంలోనూ కేసీఆర్, రాజకీయ కోణంలో చూడడం, ప్రధాని మోడీకి, ఇతర నాయకులాకు ముఖం చాటు చేసేందుకు, కీలకమైన సమావేశానికి డుమ్మా కొట్టడం ఏమిటనే ప్రశ్నలు సహజంగానే వినవస్తున్నాయి.  అదలా ఉంటే సదస్సు ప్రారంభంలోనే  భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ‘మన కర్తవ్యాలను నిర్వర్తిస్తున్నప్పుడు మనకున్న లక్ష్మణ రేఖను కూడా గుర్తుంచుకోవాలని’ చేసిన వ్యాఖ్య కేసీఆర్’ నో మరోకరినో ఉద్దేశించి చేసిన వ్యాఖ్య కాకపోయినా, ఆయనకు అతికినట్లు సరిపోతుందని అంటున్నారు.

By
en-us Political News

  
రాజకీయం గురించి కాదు. పార్టీ గురించి కాదు.ఒక నాయకుడి గురించి కూడా కాదు....ఒక తరం గురించి. విజృంభించిన లాఠీల్లో రక్తం చిందించిన ఈ తరం గురించి.
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలతో చెలరేగిన వల్లభనేని వంశీ తాజా లేఖలో మాత్రం చంద్రబాబుకు గౌరవం ఇస్తూ అయ్యా చంద్రబాబుగారూ అని మర్యాదగా సంభోధించారు. అంతే కాకుండా చంద్రబాబు చొరవను, రైతుల పట్ల ఆయనకు ఉన్న అక్కరనూ ప్రశంసలతో ముంచెత్తారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు తిలోదకాలిచ్చి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు కేసుల చిక్కుల్లో నిండా ఇరుక్కుంది. అధికారంలో ఉండగా చట్టాలకు మనం అతీతులం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఒక్కరొక్కరుగా పోలీసు కేసులను, సీఐడీ విచారణలను ఎదుర్కొంటూ, అరెస్టులు, బెయిళ్లు అంటూ న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి పరిస్థితిలో ఉన్నారు.
ఆయన రాజీనామాకు యువత పట్టుబడుతోంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న యువత డిమాండ్ ను పట్టించుకోవడం లేదు. నీట్ పై తొలి సారిగా స్పందించి, సోషల్ మీడియా వేదికగా న్యాయం చేస్తాననీ, లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షిస్తామనీ, అందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామనీ చెప్పిన మోడీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీమానా చేయాలన్న యువత డిమాండ్ ను ఇసుమంతైనా పరిగణనలోకి తీసుకోలేదు.
గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటిని, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంపై విచారణ వేగం పుంజుకుందన్న ఆయన.. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి సరిగ్గా రెండు నెలల ముందు ముంబైలో ఉన్న కాదంబరి జత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి.. ఫోర్జరీ భూలావాదేవీల కేసు సాకుగా చూపి దాదాపు 40 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు.
గత ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ సాధించిన చారిత్రాత్మక విజయం ఆయనకు రాజకీయంగా పెద్ద మైలేజీని ఇచ్చింది. గతంలో ఓటమిని చవిచూసిన చోటే ఐదేళ్ల పాటు నిరంతరం ప్రజల్లో ఉంటూ, సమగ్ర ప్రచారంతో విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మలుపుగా మారింది.
ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ పట్ల దురుసుగా వ్యవహరించి గాయపరచడాన్ని ఖండిచిన ఆయన రక్త గాయమైనా రాహుల్ గాంధీ వెనక్కు తగ్గకుండా పోరాట పటిమ చూపారని కొనియాడిన రేవంత్ రె్డి.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే ప్రాథమిక హక్కులపై కేంద్రం ప్రత్యక్ష దాడికి పాల్పడిందని విమర్శించారు.
తోపులాటలో రాహుల్ గాంధీ గాయపడ్డారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్తం కారింది. పోలీసులు ఆయనను బలవంతంగా నిలువరిస్తున్న సమయంలో ఆయన ముక్కుకు గాయమై రక్తం కారుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి. దీనిపై సర్వ్రతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
మద్యం కుంభకోణంలో ఈడీ విచారణ.. ప్రధాన లబ్ధిదారుడికి చేరువ అవుతోందనీ, ఈ నేపథ్యంలోనే జగన్ పేరు ప్రచారంలోకి వచ్చిందని అంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఈడీ తనకు నోటీసులు పంపే అవకాశం ఉందన్న సమాచారంతోనే మోడీ, అమిత్ షాల అప్పాయింట్ మెంట్ కోసం జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాపు సామాజికవర్గ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పార్టీ లైన్ ను ఇసుమంతైనా ఖాతరు చేయకుండా కాపు ఐక్యత జెండాను భుజానకెత్తుకోవడం పార్టీలో కలకలం రేపింది. ఒక వైపు వైసీపీ అధినేత జగన్.. అంబటి రాంబాబును పార్టీలో కాపు సామాజికవర్గ ఐకాన్ గా ప్రమోట్ చేస్తుంటే.. తోట త్రిమూర్తులు ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలను వేదిక చేసుకుని పార్టీలతీతంగా కాపు నేతలందరూ ఐక్యం కావాలని పిలుపునివ్వడం పార్టీలో కలకలం రేపింది.
ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేతగా, చంద్రబాబు ఇప్పుడు హస్తిన పర్యటనలో పార్లమెంటులో ఈ బిల్లుల ఆమోదానికి అవసరమైన మెజారిటీ కూడగట్టడం కోసం.. వివిధ పార్టీల నాయకులతో చర్చలు జరిపేందుకు ఆయన హస్తినకేగుతున్నారన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
మాస్కుల కొరతపై మాట్లాడిన కొద్ది రోజులకే విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం రహదారిపై డాక్టర్ సుధాకర్‌ను పోలీసులుఆయనను అదుపులోనికి తీసుకుని, చొక్కా లేకుండా ఉన్న ఆయన చేతులను వెనక్కి విరిచి కట్టడం, వీధిలో ఈడ్చుకెళ్లి ఆటోలో పడేయడం వంటి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి జాతీయ స్థాయిలో నిరసనలకు దారితీశాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.