మహమ్మద్ ప్రవక్త  మేకలు  ఎందుకు పెంచుకున్నాడు?

Publish Date:Sep 27, 2024

Advertisement

జాఫర్ బాయ్ ఒక రోజు మౌలానా దగ్గరికి వచ్చాడు.
జాఫర్ భాయ్: సలాం వాలేకూం  మౌలానా సాబ్ 
మౌలానా: వాలేకూం సలాం జాఫర్ భాయ్ 
జాఫర్ భాయ్: నా చిన్న కొడుకు సిరాజ్  సతాయిస్తున్నాడు. కుక్క కోసం  నాతో గొడవపడుతున్నాడు మౌలానాసాబ్ 
మౌలానా దివాన్ ఖానాలో  జాఫర్ భాయ్ ను కూర్చోబెట్టి  తన తక్రీర్ ప్రారంభించాడు. 

 మౌలానా:  అల్లా సందేశాన్ని మానవాళికి చేరవేసిన వ్యక్తి మహమ్మద్ ప్రవక్త. ఇటీవలె ఆయన జన్మదినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నాం. మహమ్మద్  ప్రవక్త దగ్గర అనేక రకాల  పెంపుడు జంతువులు ఉండేవి. . వీటిలో కుక్క లేదు. కుక్క విశ్వాసం గల జంతువు కాని పెంచుకునే జంతువు కాదు. కుక్క వల్ల మనిషికి అనర్థాలు కూడా ఎక్కువే. కుక్క మాంసాహారి. మాంసాహార జంతువుల్లో కోపం కూడా ఎక్కువ. కోపం ఎక్కువైతే యజమానినే కొరుక్కు తింటుంది. చాలాదేశాల్లో కుక్క వల్ల యజమాని చనిపోయిన వార్తలు పత్రికల్లో చూస్తున్నాం. కుక్క మల మూత్రాల వల్ల దాన్ని పెంచుకున్న యజమానులు అనారోగ్యపాలవుతారు. మహమ్మద్ ప్రవక్త మేకల మందను మేపే వాడు. మేకల వల్ల అనేక లాభాలున్నాయి. మేకలు పెంచుకోవడం వల్ల ఓపిక, సహనం పెరుగుతుంది. అల్లాతో ప్రేమ పెంచుకున్నవాళ్లమవుతాం. మేకలు పెంచుకోవడం వల్ల ఇంట్లో చెత్తా చెదారం మాయమవుతుంది. కిచెన్ వేస్ట్ తిని పెట్టి మేకలు మనకు మేలు చేస్తాయి. మేక వ్యర్థాల వల్ల అనారోగ్యం చెందే అవకాశం లేదు. మేకలు పెంచుకునే క్రమంలో సహనం పెంచుకునే అవకాశముంది. ప్రకృతికి ఎంత దూరం ఉంటే అనారోగ్యాలు అంత దగ్గర అవుతాయి. మేకలు ప్రకృతి ఇచ్చిన వరం. మేకలు అన్ని రకాల ఆకు కూరలు, గడ్డి తింటాయి. కాబట్టి అన్ని రకాల పోషకాలు మేకలకు అందుతాయి. పేద కుటుంబాలు అవసరం కొద్దీ అమ్ముకుంటే ఆర్థిక చేయూత నిస్తాయి. మేకలు ఉన్నాయంటే ఎటిఎమ్ కార్డు మన వద్ద ఉన్నట్టు భావించాలి. కోళ్లు పెంచుకోవడం కూడా ఇస్లాంలో హలాల్ అని చెప్పొచ్చు. వేకువ జామున కోడిపుంజు పెట్టే కూతకు మేలుకుంటాం. ఫజర్ నమాజు (ప్రాత: కాల నమాజు) చేసుకోవచ్చు. కోడిగుడ్ల వల్ల ఆరోగ్యానికి చాలా మేలు. పౌల్ట్రీ ఫాంలో లక్షలాది కోళ్లు చనిపోయినా మనిషి ఆరోగ్యానికి ఎటువంటి నష్టం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పేద ప్రజలకు మేకలు, కోళ్లు ఆర్థికంగా చేయూతనిస్తున్నాయి. షోకుల కోసం కుక్కలను పెంచుకుంటున్నారు. దానివల్ల లాభం కన్నా నష్టం ఎక్కువ.   ఇస్లాం కేవలం ఎనిమిది రకాల పెంపుడు జంతువులకు అనుమతించింది. అందులో కుక్క , పిల్లి వంటి జంతువులు లేవు.  మహమ్మద్ ప్రవక్త కూడా మేకలు పెంచుకున్నాడు.  కాబట్టి మహమ్మద్ ప్రవక్త బాటలో మనమూ వెళ్లాలి. ప్రతీ ముస్లిం ఐదుసార్లు నమాజు చేయాలి. అల్లాకు దగ్గరవ్వాలి. ఇస్లాం మే  హలాల్ జాన్వర్ కో పాలో, హరామ్ జాన్వర్ కో మత్ పాలో . బక్రీ అప్నీ కిద్మత్ కే లియే హై...   కుదాఫీస్ అంటూ మౌలానా తన తక్రీర్ ముగించాడు. 

                                                                                            బదనపల్లి శ్రీనివాసాచారి

By
en-us Political News

  
పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా ప్రకటించారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఉద్యోగం అడిగిన యువకుడికి చంద్రబాబు ఆటో ఇస్తానని చెప్పినట్లుగా రెండు వేర్వేరు సందర్భాలను కలిపి ఎడిట్ చేశారు. ఉద్యోగం అడిగితే ఆటోతో సరిపెట్టుకోమన్నారనే అర్థం వచ్చేలా ఈ వీడియోను సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి లోకేశ్ వైసీపీ తన పాత అలవాట్లను మానుకోవడం లేదనీ.. బురదజల్లే రాజకీయాలే పరమావధిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
ప‌సుపు ఒక మ‌హిళ‌కు ఎంత ముఖ్య‌మో తెలిసిందే. ఆపై నీలం అంటే ద‌ళిత సందేశం ఇస్తుంది. ఇక పోతే ఆకుప‌చ్చ అంటే అది భార‌త జెండాలో ఒక భాగం. ముస్లీం మైనార్టీల‌ను ఏకం చేసేది. కాబ‌ట్టి క‌విత జెండా రంగుల్లో ఇవి ప్ర‌ముఖంగా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. దీంతో క‌విత ప్ర‌క‌టించ‌బోయే పార్టీ జెండా రంగులు, గుర్తు ఆల్రెడీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నారు.
బెంగాల్ ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, ఓటింగ్ శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 1969లో కేవలం 70 శాతంగా ఉన్న ఓటింగ్, 1987 నాటికి 78 శాతానికి చేరింది. ఆ తర్వాత 1996లో 80 శాతం, 2011లో 84 శాతంగా నమోదైంది. గత 2021 ఎన్నికల్లో 82 శాతానికి పరిమితమైన ఓటింగ్.. ఇప్పుడు 2026లో ఏకంగా 92 శాతాన్ని దాటి సరికొత్త రికార్డును సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జగిత్యాల వేదికగా జరిగిన సభ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాజకీయ చరిత్రను పరిశీలిస్తే నాదెండ్ల భాస్కరరావుకు, చంద్రబాబు నాయుడుకు మధ్య సుదీర్ఘమైన రాజకీయ వైరం ఉంది. 1984లో ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన సమయంలో జరిగిన రాజకీయ పరిణామాలు, ఆపై నాదెండ్ల ముఖ్యమంత్రి కావడం వంటి సంఘటనలు తెలుగు రాజకీయాల్లో ఒక కీలక మలుపు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు.
న్టీఆర్ అమెరికాలో గుండె ఆపరేషన్ చేయించుకుని తిరిగి వచ్చేలోపు, నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ క్లిష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ చెల్లాచెదురు కాకుండా, ఎమ్మెల్యేలను ఏకం చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. పార్టీని కాపాడిన రక్షకుడి ఇమేజ్ ఆయనకు అప్పుడే వచ్చింది.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిథి స్టాలిన్, టీవీకే అధినేత విజయ్, బీజేపీ నాయకురాలు ఖుష్బు, కమల్ హాసన్, రజనీకాంత్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.