Publish Date:Nov 18, 2021
ఊరక రారు మహానుభావులు. ఇక సీఎం కేసీఆర్ అయితే అసలే రారు. ప్రజా ముఖ్యమంత్రిగా ఉండాల్సిన సీఎం.. ప్రగతి భవన్ ముఖ్యమంత్రిగా, ఫామ్హౌజ్ ముఖ్యమంత్రిగా పేరు గాంచారు. ముఖ్యమంత్రి ప్రజలకు కనిపించడమే గగనం. ప్రజల దాకా ఎందుకు.. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకే ఆయన ముఖం చూపించరు. ఈటల రాజేందర్లాంటి నాయకుడినే ప్రగతిభవన్లోకి రానీయ్యలేదు. టీవీల్లో కేసీఆర్ ఫైల్ విజువల్స్ చూడటమే కానీ.. ఆయన నేరుగా దర్శనమిచ్చే సందర్భాలు అతి తక్కువే. ఇంత తక్కువగా ప్రజలకు ముఖం చూపించే సీఎం.. బహుషా దేశంలో కేసీఆర్ ఒక్కరేనేమో.
అలాంటి కేసీఆర్ ప్రగతిభవన్ నుంచి ధర్నాచౌక్ వరకూ దిగొచ్చారు. నేను సైతమంటూ ఇందిరాపార్క్ దగ్గర మహాధర్నాకు కూర్చున్నారు. కేసీఆర్ అంతటి వారే.. స్వయానా ముఖ్యమంత్రే.. కేంద్రానికి వ్యతిరేకంగా ధర్నా చేయడమంటే మామూలా? అందుకే మీడియా ఫోకస్ మొత్తం ఆయనపైనే. నేషనల్ మీడియాలోనూ కవరేజ్ వచ్చింది. అదే కదా కేసీఆర్కు కావలసింది.. అందుకే కదా ముఖ్యమంత్రి హోదాలో ధర్నాకు దిగింది. ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే.. కేంద్రం దిగొచ్చే వరకూ రైతు పక్షాన పోరాడుతూనే ఉంటాం.. అంటూ పెద్ద పెద్ద స్టేట్మెంట్లూ ఇచ్చేశారు.
ఉద్యమం సమయంలోనూ ఇలానే రాజకీయ ప్రసంగాలు ఇచ్చేవారు కేసీఆర్. కానీ, అంత ఉద్వేగ పోరులోనూ ఎన్నడూ ఇలా ధర్నాకు కూర్చున్నది లేదు. పార్టీతో, ప్రజలతో ధర్నాలు చేయించే వారే కానీ, కేసీఆరే స్వయంగా ఇలా ధర్నాకు దిగిన సందర్భాలు అత్యంత అరుదు. అలాంటిది.. ఇప్పుడు ఏమంత అవసరం వచ్చిందో ఏమో గానీ, ముఖ్యమంత్రి హోదాలో ధర్నాచౌక్లో యావత్ మంత్రివర్గ పరివారాన్ని వెంటేసుకొని మరీ మహాధర్నా చేపట్టడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
కేసీఆర్ను ప్రగతి భవన్ నుంచి బయటకు లాగిన ఘనత మాదేనని బీజేపీ వర్గాలు ఆ క్రెడిట్ను తమ ఖాతాలో వేసుకుంటున్నాయి. హుజురాబాద్ ఓటమి భయంతోనే కేసీఆర్ ఇలా ధర్నా పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ అయితే.. కేసీఆర్-బీజేపీ కలిసి ఆడుతున్న ధర్నా డ్రామా ఇదంతా అంటూ మండిపడుతున్నాయి. ఎవరు ఏమన్నా.. సీఎం కేసీఆర్ ధర్నాకు దిగడం మాత్రం హైలైట్ అనే చెబుతున్నారు. ఇదంతా రాజకీయ ఎత్తుగడేనని అంతా భావిస్తున్నారు. ధర్నాలు చేయడం కాదు.. ముందు వరిపై దగా చేయడం మానండంటూ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడుతున్నారు రైతులు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/why-cm-kcr-doing-maha-dharna-25-126616.html
మరో సార్వత్రిక ఎన్నికలకు కేవలం ఐదు రోజులు మాత్రమే ఉండటంతో ఉద్యో గుల కోసం పోస్టల్ బ్యాలెట్ సౌలభ్యం ఉంది. ఈ నెల 9 వరకు గడువు విధించినట్లు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.
ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేశ్ కుమార్ మీనా ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు.
భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో మరచిపోలేని తిరుగుబాటు స్వరం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. చిన్నవయసులోనే మహోజ్వల శక్తిగా మారి భరతమాత దాస్యశృంఖలాల విముక్తి కోసం పోరాడిన మన్యం వీరుడు. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్ర్యం వస్తుందని నమ్మి, తన ప్రాణాలర్పించిన విప్లవ వీరుడు.
కీలెరిగి వాత పెట్టినట్లుగా చిరంజీవి జగన్ మైండ్ బ్లాక్ అయ్యేలా ఎన్డీయే కూటమి అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తున్నారు. అసలే బలహీనంగా ఉన్న జగన్ కు చిరంజీవి తెలుగుదేశం కూటమికి బాహాటంగా మద్దతు ఇవ్వడం మరింత బలహీనం చేస్తుందనడంలో సందేహం లేదు. ఇప్పటి వరకూ చిరంజీవి ప్రత్యక్షంగా తన రాజకీయ మొగ్గు ఎటువైపు అన్నది ప్రకటించలేదు. కానీ మిత్రులు అంటూ అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్, అలాగే జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ లకు ఓటు వేయండి అంటూ ఆయన ఒక వీడియో సందేహం ద్వారా ప్రజలకు పిలుపు నిచ్చారు.
దేశంలోనే పేరుపొందిన పారిశ్రామిక ప్రాంతం శ్రీ సిటీ ఇక్కడే ఉంది. అక్కడ కూడా సమస్యల కుప్పగా మారిపోయింది. ఎవరూ పట్టించుకునే వారు లేకపోవడంతో, ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. మరో వైపు, ఒకప్పటి టీడీపీ కంచుకోటగా వున్న సూళ్లూరుపేటలో సంచలన విజయం సాధించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు.
నేచురల్ స్టార్ నాని జనసేనాని పవన్ కల్యాణ్ కు మద్దతు ప్రకటించారు. ఈ ఎన్నికలలో ఇప్పటి వరకూ సినీ పరిశ్రమ నుంచి ఎవరూ తమ మద్దతు ఫలానా పార్టీకి, ఫలానా అభ్యర్థికి అంటూ బాహాటంగా బయటకు వచ్చిన దాఖలాలు లేవు. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్ జనసేన పార్టీలో చేరి ఆ పార్టీకి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
మళ్ళీ జగన్ అధికారంలోకి రావడం అనేది అసంభవం. అయినప్పటికీ ఇంకా చాలా కొద్దిమంది జగన్ మాయలో వుండే అవకాశం వుంది. వాళ్ళు మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తాడేమో
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చాక ప్రముఖులను ఇమిటేట్ చేస్తూ వీడియోలు చేయడం సాధారణమైపోయింది.
జగన్ నోట ఓటమి మాట వచ్చేసింది. ఔను ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరుగుతాయా అన్న అనుమానం కలుగుతోంది. తనను అడ్డుకోవడానికి వాళ్లు సొమ్ములు నిలిపివేస్తున్నారు. అధికారులను ఇష్టారాజ్యంగా మార్చేస్తున్నారు అంటూ జగన్ మాట్లాడారు.
వీళ్ళకి అవసరమైతే కాళ్ళు కూడా పట్టుకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం వున్నప్పుడు బెయిల్ కోసం జగన్ ఎవరి కాళ్ళ బేరానికి వెళ్ళాడో, గత పదేళ్ళుగా ఎవరి కాళ్ళు పట్టుకుంటున్నాడో అందరికీ తెలిసిందే. కనీసం కోర్టు హియరింగ్కి కూడా హాజరు కాకుండా హాయిగా తిరుగుతున్నాడు.
ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అడ్డు ఎవరు వచ్చినా వారిని టార్గెట్ చేయడం ఆనవాయితీ. స్వంత బాబాయి వివేకానందరెడ్డి హత్య చేసినట్టు ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. స్వంత బాబాయిని హత్య చేయించిన ఘనుడు జగన్ అని చెల్లెలు వైఎస్ షర్మిల విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం ఆమెను చిక్కులు తెచ్చి పెట్టింది.
ఉత్తరాంధ్రలో అధికార వైసీపీకి ఎదురుగాలి వీస్తున్నది. ఈ ప్రాంతంలోని మూడు జిల్లాలలోనూ వైసీపీ అభ్యర్థులు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా విశాఖలో అయితే ఆ పార్టీకి ఘోర పరాభవం తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
గత ఎన్నికలలో వైసీపీ నెల్లూరు జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది. ఆ జిల్లాలోని మొత్తం పదికి పది అసెంబ్లీ స్థానాలలోనూ విజయకేతనం ఎగుర వేసింది. అయితే ఐదేళ్లు గిర్రున తిరిగే సరికి వైసీపీ పరిస్థితి జిల్లాలో పూర్తిగా దిగజారింది. పరిశీలకుల విశ్లేషణలైతే జిల్లాలో గత ఎన్నికలలో వచ్చిన ఫలితం ఈ సారి రివర్స్ అయినా ఆశ్చర్యం లేదన్నట్లుగా సాగుతున్నాయి.
తమకంటే వేరే ఎవరూ గొప్పగా, ఛరిష్మా కలిగిన వ్యక్తుల్లా వుండటం ఇష్టం వుండదు. అలా ఎవరికైనా తనకంటే ఎక్కువ ఛరిష్మా వుంటే, అలాంటి వాళ్ళని తన కాళ్ళ దగ్గరకి రప్పించుకుంటాడు.