ఎందుకు ఆంధ్రాకి జగనే కావాలి?.. వైసీపీ కొత్త నినాదం

Publish Date:Sep 28, 2023

Advertisement

 ఏంటో పాపం ఎన్ని పేర్లు మార్చినా ఏపీలో వైసీపీకి సౌండ్ పెరగడం లేదు. గడప గడపకి వైసీపీ, జగనే మా నమ్మకం, వైనాట్ 175 ఇలా ఎన్నో కార్యక్రమాలు రూపకల్పన చేసి ప్రజలపై రుద్దాలని చూశారు. కానీ, ప్రజలు వాటిని  పట్టించుకోలేదు. గడప గడపకి కార్యక్రమంలో అయితే ఇళ్లకు వెళ్లిన వైసీపీ నేతలకు, ఎమ్మెల్యేలకు ప్రజలు చుక్కలు చూపించారు. మంత్రులు అని కూడా చూడకుండా ఏం సాధించారని నిలదీశారు. నాలుగేళ్ళ మీ పాలనలో నరకం చూశామంటూ మొహాల మీదనే తిట్టిపోశారు. ఆ దెబ్బతో చాలా మంది నేతలు మొహం చాటేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధిష్టానం ఏమో ఏదోకటి నచ్చ జెప్పండి.. ఒక్కో కుటుంబానికి ఎంత ఇచ్చామో లెక్కలు చెప్పి ప్రజలను మచ్చిక చేసుకోండి అంటూ ఆదేశించినా.. ప్రజల వద్దకు వెళ్లిన నేతల పప్పులు ఉడకనేలేదు. ఇంతిచ్చామని వైసీపీ నేతలు లెక్కలు చెప్తే.. గత ప్రభుత్వం ఏం చేసిందో గణాంకాలతో సహా చూపిస్తూ జనం వైసీపీ నేతలను కడిగి పారేశారు.  ఎన్ని పథకాలు తెచ్చినా.. ఎన్ని కార్యక్రమాలు చేసినా.. చేశామని చెప్పుకుంటున్నా ప్రజలలో వ్యతిరేకతే తప్ప సానుకూలత ఇసుమంతైనా కనిపించకపోవడంతో  వైసీపీ వ్యూహకర్తలు కొత్త కొత్త పథకాలకు రూపకల్పన చేస్తున్నారు. అలా ఇప్పుడు వైసీపీ నుండి వచ్చిన మరో పథకమే 'ఎందుకు ఆంధ్రాకి జగనే కావాలి?'. తాజాగా తాడేపల్లిలో నిర్వహించిన వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ ఛార్జులు, ఎమ్మెల్సీలతో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ స్వయంగా ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు. ఐప్యాక్ సహ వ్యవస్థాపకుడు రిషిరాజ్ ఈ కార్యక్రమంపై ప్రజంటేషన్ కూడా ఇచ్చారు. త్వరలో చేపట్టే ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వెల్లడించిన రిషిరాజ్.. ఈ కార్యక్రమాన్ని ఐదు దశల్లో నిర్వహిస్తామని చెప్పారు. సీఎం జగన్ కూడా ఈ కార్యక్రమంపై పలు వివరాల్ని వెల్లడించగా.. ఈ కార్యక్రమం ద్వారా నాలుగేళ్ళ వైసీపీ పాలనలో ప్రజలకు కలిగిన ప్రయోజనాలను వివరిస్తూ.. ఇదే ప్రయోజనాలు కొనసాగాలంటే మళ్ళీ జగనే కావాలని ప్రజలకు నమ్మకం కలిగించాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో వాలంటీర్లు, జగనన్నగృహ సారథులను భాగస్వాములుగా చేసుకుంటూ గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకూ వైసీపీ నేతలంతా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలని జగన్ ఆదేశించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నవంబరులో గడప గడపకు ప్రోగ్రాం ముగించనున్నట్లు చెప్పిన వ్యూహకర్తలు.. తర్వాత ఎన్నికల ప్రత్యేక కార్యాచరణ ప్రకటిస్తామని.. అందుకు పునాది  'ఎందుకు ఆంధ్రాకి జగనే కావాలి'? కార్యక్రమం ఉంటుందని చెప్పారని అంటున్నారు.  నవంబరు నుండి కొత్త కొత్త కార్యక్రమాలతో నేతలంతా నిత్యం ప్రజల మధ్యనే ఉండేలా ఐప్యాక్ ప్రణాళికలు రచిస్తున్నట్లు తాడేపల్లిలో జరిగిన కార్యక్రమంలో నేతలకు చెప్పిన జగన్.. ఇక నుండి ఎన్నికల వరకూ నిత్యం ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రతి ఒక్కరూ సంసిద్ధంగా ఉండాలని కోరారని చెబుతున్నారు.

కాగా, వైసీపీ కొత్త కార్యక్రమంపై ఇప్పటికే సోషల్ మీడియాతో పాటు రాజకీయ వర్గాలలో ట్రోల్స్ మొదలయ్యాయి. 'ఎందుకు ఆంధ్రాకి జగనే కావాలి' అంటూ వైసీపీ కార్యక్రమం రూపొందిస్తుంటే ప్రత్యర్ధులు 'ఎందుకు ఆంధ్రాకి జగన్ వద్దో' వివరిస్తూ పోస్టులు పెడుతున్నారు. వైసీపీ పరిపాలన మొదలు పెట్టిన రోజులలో కరకట్టపై ఉన్న ప్రజా వేదిక కూల్చివేత నుండి రంగుల కోసం వృధా చేసిన ప్రజా ధనం, అన్న క్యాంటీన్ల మూసివేత, మద్యం ధరలు పెంచి చేసిన ప్రజా దోపిడీ, ఇసుక కోసం ప్రజలు పడిన,పడుతున్న పాట్లు, రాష్ట్రంలో కొరవడిన ఉపాధి, కరోనా సమయంలో ప్రభుత్వ వైఫల్యాలు, వైన్ షాప్ ల వద్ద టీచర్ల కాపలా, మాస్కులు అడిగిన వైద్య సిబ్బందిపై దాడులు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిపై పెట్టిన కేసులు, ఎమ్మెల్యేలు.. మంత్రుల బూతు పురాణాలు, అసెంబ్లీలో వైసీపీ నేతలు వేసిన వెకిలి వేషాలు, రాష్ట్రంలో  గుంతల మయంగా మారిన రోడ్లు, మూడు రాజధానుల పేరిట రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన కుట్రలు, అటకెక్కిన పోలవరం నిర్మాణం, సీపీఎస్ రద్దు పేరిట ఉద్యోగులకు చేసిన మోసం, జాబ్ క్యాలండర్ విడుదల చేస్తామని నిరుద్యోగులను నిలువునా ముంచిన తీరు ఇలా అన్నిటినీ వివరిస్తూ ఎందుకు ఆంధ్రాకి జగన్ వద్దో ఆ పోస్టులలో సవివరంగా పెడుతూ వైసీపీ గాలి తీసేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో   వైసీపీకి ఈ కొత్త నినాదం ఏమేరకు పనికి వస్తుందో చూడాలి. ఇది కూడా మరో గడపగడపకూ కార్యక్రమంలాగే అభాసుపాలు కావడం తథ్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
అంబటి ఏమన్నారంటే.. 2024 ఫలితాలను అర్ధం చేసుకోవడంలో తెలుగుదేశం కూటమి పార్టీలు విఫలమయ్యాయట. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల కారణంగానే కూటమి ఆ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిందట.. ఇప్పుడు ఈ ఏడాదిన్న కాలంలో జనానికి తత్వం బోధపడి.. జగన్ పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారట. అంబటి భాష్యం విన్న వైసీపీయులే ఆశ్చర్యపోతున్నారు.
ఆదివారం తన 53వ పుట్టిన రోజు జరుపుకున్న జగన్ కు చంద్రబాబు, నారా లోకేష్, వైఎస్ షర్మిల తదితరులు సామాజిక మాధ్యమం ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు ప్రతిగా జగన్ కూడా ఒక్క మంత్రి లోకేష్ కు తప్ప మిగిలిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ రిప్లై ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి దయనీయంగా మారిందన్న ఆయన గత పదేళ్ల అధికార గర్వంతో విర్రవీగిన నేతల కండలు ఇప్పుడు కరిగిపోయాయని ఎద్దేవా చేశారు.
రాజకీయ ప్రత్యర్థులే కాదు.. ప్రభుత్వ విధానాలు సరిగా లేవన్న సామాన్యులపై కూడా జగన్ పాలనలో దాడులు జరిగాయి. ఇక అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలూ సరే సరి. సరే జనం విషయం గుర్తించి 2019లో తాము కట్టబెట్టిన అధికారాన్ని 2024 ఎన్నికలలో లాగేసుకుని అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ చంద్రబాబుకు అప్పగించారు.
చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు పేరుకు పాలమూరును దత్తత తీసుకుని, అభివృద్ధి పేరిట శంకుస్థాపన ఫలకాలకే పరిమితమయ్యారనీ, ఆయన హయాంలో శంకుస్థాపన ఫలకాలకు అయిన ఖర్చుతో ఏకంగా ఓ ప్రాజెక్టే కట్టవచ్చంటూ విమర్శలు గుప్పించారు.
ఆదివారం జగన్ పుట్టిన రోజు సందర్భంగా షర్మిల అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆ తెలపడంలోనూ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. చెల్లెలిగా కాకుండా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల వైసీపీ అధ్యక్షుడు జగన్ గారికి అని సంబోధిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలో గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
సోషల్ మీడియాలో జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి. అవన్నీ పక్కన పెడితే తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద వెలసిన ఓ భారీ కటౌట్ ఆసక్తి రేకెత్తిస్తోంది.
ప్రముఖ సినీ నటి ఆమని భారతీయ జనతా పార్టీలో చేరారు.
భారతదేశం మత సామరస్యానికి ప్రతీక అన్న విజయసాయి.. అటువంటి దేశంలో ఉంటూ.. బంగ్లాలో హిందువులు లక్ష్యంగా సాగుతున్న దాడులపై స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ దాడులకు ఖండించని వారు దేశ భక్తులే కాదని విజయసాయి తన ట్వీట్ లో పేర్కొన్నారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ కోర్టుకు వెడదామా? అంటే..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించలేదు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అంటూ జీవోలోనే స్పష్టంగా పేర్కొంది. దీంతో ఆ పాయింట్ మీద కోర్టుకు వెళ్లడం ఎలా అన్నది అర్ధం కాక వైసీపీ మల్లగుల్లాలు పడుతోందని పరిశీలకులు అంటున్నారు.
తాను ప్రత్యక్ష ఎన్నికలో పోటీ చేసిన తొలి సారే పరాజయం పాలైన సంగతిని గుర్తు చేసుకున్న ఆయన, ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని, ఓడిన చోటే గెలవాలన్న పట్లుదలతో పని చేసి ఫలితం సాధించానని లోకేష్ వివరించారు.
ఆ సందర్భంగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు.. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గాన్ని మంగళగిరికి దీటుగా అభివృద్ధి చేస్తానన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.