మల్కాజ్‌గిరిలో సత్తా చాటేది ఎవరు? ఓటరు ఎటు వైపు?

Publish Date:Apr 25, 2024

Advertisement

మల్కాజ్ గిరి పై పట్టుకోసం రాజకీయపార్టీలు హోరా హోరీగా త‌ల‌ప‌డుతున్నాయి.  ఇక్క‌డ మూడు పార్టీల మ‌ధ్య ఆసక్తికరమైన పోరు నెల‌కొంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో  దేశంలోని అన్ని రాష్ట్రాల, ప్రాంతాల ప్ర‌జ‌లు ఉంటారు. అందుకే మ‌ల్కాజ్ గిరి అంటే మినీ ఇండియాగా పేరుంది. పైగా దేశంలోని అతిపెద్ద లోక్ స‌భ సెగ్మెంట్ల‌లో కూడా మ‌ల్కాజ్ గిరి ఒక‌టి. సీఎం రేవంత్ రెడ్డి మొన్న‌టి వ‌ర‌కు ఇక్క‌డి నుండే ప్రాతినిధ్యం వ‌హించారు. ఇప్పుడు  బీఆర్ ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్ నేత‌లంతా ఫోక‌స్ చేస్తున్నారు. మ‌ల్కాజ్‌గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్య‌ర్థి రాగిడి ల‌క్ష్మారెడ్డి బ‌రిలో వున్నారు. ఇత‌నికి అండ‌గా మ‌ల్లారెడ్డి వున్నారు. 

మ‌ల్కాజ్ గిరి ప‌రిధిలోని మేడ్చ‌ల్, మ‌ల్కాజ్ గిరిలో మ‌ల్లారెడ్డి, ఆయ‌న అల్లుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వీరికి భారీ అనుచ‌ర‌గ‌ణం కూడా ఉండ‌గా, గ‌తంలో మ‌ల్కాజ్ గిరి నుండి మ‌ల్లారెడ్డి ఎంపీగా కూడా ప‌నిచేశారు.  మ‌ల్కాజ్‌గిరి ఎంపీ నియోజ‌క‌వ‌ర్గంలో ఏడుగురు ఎమ్మెల్యేలు మ‌న ద‌గ్గ‌ర్నే ఉన్నారు. 200 మందికి పైగా కార్పొరేట‌ర్లు కూడా బీఆర్ఎస్ కు చెందిన వారే ఉన్నారు.  ప‌దేండ్ల నిజానికి, వంద రోజుల అబ‌ద్దానికి, మ‌రో ప‌దేండ్ల విధ్వంస కేంద్ర పాల‌న‌కి  మ‌ధ్య యుద్దం అంటూ బీఆర్ ఎస్ ప్ర‌చారం చేస్తోంది.  ఈటెల‌కు, ప‌ట్నం సునీతాకు ఇంగ్లీషు, హిందీలో మాట్లాడ‌డం రాదు. వాళ్ళు పార్ల‌మెంట్‌కు వెళ్ళి ఏం మాట్లాడ‌తారాని బీఆర్ ఎస్ నిల‌దీస్తోంది.

అదే రాగిడి ల‌క్ష్మారెడ్డికి ఇంగ్లీష్, హిందీలో అద్భుతంగా మాట్లాడుతారు.. ప‌క్కా లోకల్ వ్య‌క్తి అయిన‌ అత‌ను మీ గొంతుక‌గా పార్ల‌మెంట్‌లో మాట్లాడుతారని బీఆర్ ఎస్ ప్ర‌చారం చేస్తోంది.  తెలంగాణ‌కు బీజేపీ ప్ర‌భుత్వం చేసిందేమీ లేదని చెప్పారు కేటీఆర్ ప‌దే ప‌దే చెబుతున్నారు. దేశంలో వివిధ రాష్ట్రాలకు ఎన్నో మెడిక‌ల్ కాలేజీలు ఇచ్చిన కేంద్రం, తెలంగాణకు మాత్రం గుండు సున్నా చుట్టిందని, కనీసం ఒక్క న‌వోద‌య పాఠ‌శాల కూడా ఇవ్వ‌లేదని, కొత్త‌గా ఒక్క విద్యాసంస్థ ఇవ్వ‌కుండా ప్ర‌ధాని కాల‌యాప‌న చేశారని అన్నారు.  

కాంగ్రెస్ నుండి ప‌ట్నం సునీతా మ‌హేంద‌ర్‌రెడ్డి పోటీ లో ఉన్నారు. మంత్రి తుమ్మ‌ల‌కు ఇక్క‌డ ఇంచార్జ్ ఇవ్వ‌టంతో గెలుపుపై కాంగ్రెస్ న‌మ్మ‌కంగా ఉంది.  సిట్టింగ్ సీటుపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. గ‌త ఎన్నిక‌ల్లో రేవంత్ రెడ్డి గెలుపొందిన నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో మల్కాజిగిరి సీటును కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎట్టి ప‌రిస్థితుల్లోనైనా ఈ స్థానంలో విజయం సాధించడమే కాంగ్రెస్ లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతోంది.  అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్ల‌మెంట్ ప‌రిధిలో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానం కూడా గెల‌వ‌క పోవడం కొంచెం మైనస్. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీచినా, ఇక్కడి ప్రజలు మాత్రం బీఆర్ఎస్ కు జై కొట్టారు. చేవెళ్ల నుంచి అనుకున్న అభ్యర్థిని, ఎందుకో మల్కాజిగిరిలో బరిలో దింపారు. గ‌త ఎన్నిక‌ల్లో జ‌రిగిన త‌ప్పిదాలు జ‌ర‌గ‌కుండా, విజ‌య‌కేత‌నం ఎగుర‌వేయాల‌ని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. తాము గెలిస్తేనే నియోజకవర్గం అభివృద్ధి సాధ్యం అంటూ కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది.

ఈ నియోజ‌క‌వ‌ర్గంలో కూక‌ట్‌ప‌ల్లి, కుత్బుల్లాపూర్‌, మేడ్చల్‌, మ‌ల్కాజ్‌గిరి, ఉప్పల్‌, ఎల్బీన‌గ‌ర్, కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో అంత‌ర్భాగ‌మైన ఈ నియోజకవర్గాలు కీలక ప్రాంతాలు. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 7 స్థానాలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మల్కాజిగిరి నియోజ‌క‌వ‌ర్గంలో దేశ ర‌క్షణ‌ రంగానికి చెందిన ఏయిర్ ఫోర్స్‌, ఆర్మీ స్థావరాలతో పాటు పారిశ్రామిక‌రంగం, విద్యారంగానికి సంబంధించిన ప్రతిష్టాత్మకమైన యూనిర్శిటీలకు  కేరాఫ్ అడ్రస్‌గా ఉంది.  ఈ నియోజ‌క‌వ‌ర్గంలో దాదాపు 38 ల‌క్షల ఓట‌ర్లు ఉన్నారు.  
 
నార్త్ ఇండియా నుండి ఎక్కువ మంది నివాస‌ముంటున్న సీటు కావ‌టంతో గెలుపు ఈజీ అవుతుంద‌న్న ఆశ‌ల్లో బీజేపీ నేత‌లు ఉన్నారు. ఇటీవ‌ల గ‌జ్వేల్, హుజురాబాద్ నుండి పోటీ చేసిన ఈట‌ల రాజేంద‌ర్  బీజేపీ అభ్య‌ర్థిగా ఎన్నిక‌ల బ‌రిలో ఉన్నారు.  మ‌ల్కాజిగిరి ఎంపీ స్థానాన్ని నెగ్గాలని బీజేపీ సైతం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొని వ్యూహాలు రచిస్తోంది. మోదీ ప్రధానిగా హ్యాట్రిక్ కొడతారని చెబుతూ పార్లమెంట్ స్థానాలను గెలిపించాలని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ప్రధాని న‌రేంద్ర మోదీ ఇటీవల మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో రోడ్ షో సైతం నిర్వహించారు. మోదీ ప్రజాద‌ర‌ణ క‌లిసొస్తుంద‌ని అధిష్టానం ధీమాతో ఉంది. బీజేపీ నుంచి మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్ వంటి బ‌ల‌మైన అభ్యర్థి బరిలో ఉన్నారు. ఒక్కసారి కూడా మ‌ల్కాజిగిరి సీటు నెగ్గకపోవడంతో తో ఈసారి ఖ‌చ్చితంగా సాధించాలని ప‌ట్టుద‌ల‌తో ఉంది.  ఈసారి మాత్రం మోదీ మేనియాతో నెగ్గాలని ప్లాన్ చేస్తోంది. సిట్టింగ్ సీటు కోసం కాంగ్రెస్ ఫోకస్ చేస్తుండగా, కనీసం ఒక్కసారైనా మల్కాజిగిరిపై తమ జెండా ఎగరేయాలని బీఆర్ఎస్, బీజేపీ భావిస్తున్నాయి. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్‌గిరిలో బీజేపీకి మంచి ఓట్‌ బ్యాంక్‌ ఏర్పడింది. వ్యక్తిగతంగా తనకున్న ఇమేజ్‌, పార్టీ సపోర్ట్‌.. ఈ రెండు కలిసివచ్చే అంశాలు ఉన్నట్లు ఈటెల లెక్కలు వేసుకుంటున్నారట.  

తెలంగాణవాదుల్లో ఉదారవాదిగా ఉన్న ఈటల రాజేందర్ రెండు ప్రాంతాల ప్రజలు, గ్రేటర్ హైదరాబాద్‌లో కలిసిమెలిసి జీవించాలని కోరారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 14 శాతం ఓట్లు, 8 సీట్లు సాధించడంలో కీలకమయ్యారు. ఈటల ప్రచారం నిర్వహించిన చోట్ల బీజేపీ అభ్యర్థులకు ఘననీయంగా ఓట్లు రావడం కూడా ఆయన పట్ల తెలంగాణ ప్రజల్లో ఉన్న క్రేజ్‌ను చాటుతోంది.  గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ నినాదాన్ని బీజేపీ తీసుకోడానికి ముఖ్య కారణం ఈటల అని గుర్తుంచుకోవాలి. ఈ లోకసభ ఎన్నికల్లో 10 స్థానాలు గెలుచుకోవాలని, 35 శాతం ఓట్లు రాబట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.   ఇక్క‌డ పోటీ  కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఉండటం, దేశ వ్యాప్తంగా బీజేపీకి ఉన్న సానుకూలత కలిసి వస్తాయన్న అభిప్రాయం ఉంది. ఈటల రాజేందర్ ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సన్నిహితంగా ఉండటం కూడా ఎన్నికల్లో కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు. హైదరాబాద్‌లో మరీ ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో హిందుత్వం, బీజేపీకి అడ్వాంటేజ్ అన్న భావన ఉంది.

 - ఎం.కె.ఫ‌జ‌ల్‌

By
en-us Political News

  
రిజల్ట్స్ కౌంట్‌డౌన్ కొటేషన్-11
ఆంధ్రప్రదేశ్ లో మార్పు ఖాయమని తేలిపోయింది. మార్చి 13న రాష్ట్ర ప్రజలు మొక్కవోని ధైర్యంతో, మార్పు కావాలన్న సంకల్పంతో ఎన్నో అవరోధాలు ఎదుర్కొని మరీ పోలింగ్ బూత్ లకు వచ్చి గంటల తరబడి నిలబడి మరీ ఓటు వేశారు. తమ ఓటు హక్కు వినియోగించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి కాముకుడి చేతుల్లో పెట్టాలన్న పట్టుదలతో రాష్ట్రాలు, దేశాలలో స్థిరపడి కొలువులు చేసుకుంటున్నవారు కూడా స్వస్థలాలకు ఎన్నో వ్యయప్రయాశలకు ఓర్చి మరీ వచ్చారు. దీంతో రాష్ట్రంలో భారీగా పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్ సరళి వైసీపీ పెద్దల మైండ్ బ్లాక్ చేసింది.
మధ్యం మత్తులో యువతీ యువకుల అరాచ‌కాల‌కు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. డ్రగ్స్ , గంజాయి తదితర మత్తుపదార్ధాలకు అలవాటుపడి నేషనల్ హైవే రోడ్ పై, ప‌బ్లిక్ ప్లేస్‌ల‌లోనే గొడవపడుతున్నారు.
తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో బాలికలదే పై చేయిగా నిలిచింది. ఈ నేపథ్యంలో  తెలంగాణలో పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. రెండు విడుతల్లో కౌన్సెలింగ్ ఉండనుంది. జూన్ 20న పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది.
ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ఆయన నేర చరిత్ర ఒక్క ఆర్మూర్ ప్రజలకే కాకుండా హైదరాబాద్ శివారు ప్రాంత వాసులకు కూడా బోధపడింది. ఇప్పటికే ఆర్మూరులో భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న జీవన్ రెడ్డి చేవెళ్ల నియోజకవర్గంలో కూడా భూ కబ్జాలు చేసిన ఆరోపణతో  కొత్త చరిత్ర సృష్టించారు. 
ఎపిలో కూటమి ప్రభుత్వం అధికారంలో వస్తుందని కన్ఫర్మ్ అయ్యింది. వచ్చే నెల నాలుగో తేదీన వచ్చే ఫలితాల తర్వాత టిడిపి జాతీయాధ్యక్షుడు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి పదవి అధిరోహిస్తున్న నేపథ్యంలో తప పరిపాలనలో ఇబ్బందులు లేకుండా జాగ్రత్త పడుతున్నారు.   టీడీపీ అధినేత చంద్రబాబు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)కి లేఖ రాశారు. ఐఏఎస్ కన్ఫర్మేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని కోరారు. 
ప్రముఖ పుణ్యక్షత్రం కేదార్‌నాథ్‌లో హెలికాప్టర్ ప్రమాదం జస్ట్ మిస్సయింది.
తిరుమలలో వేసవి రద్దీ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేశస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. వారాంతాలలో వీఐపీ బ్రేక్ దర్శనాన్ని రద్దు చేసింది. వచ్చే నెల 30వ తేదీ వరకూ శుక్ర, శని, ఆదివారాలలో వీఐపీ బ్రేక్ దర్శనాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఆ ఒక్కపదం.. తెలుగువారందరికీ నచ్చుతుంది కానీ, జగన్‌కి మాత్రం ఎంతమాత్రం నచ్చదు.. ఆ ఒక్కపదం మరేదో కాదు... అమరావతి.
సాధారణంగా నాయకులు ఎన్నికలు పూర్తయిన తరువాత కౌంటింగ్ కు మధ్య ఉన్న సమయంలో విదేశాలకు వెళ్లి సేదతీరుతూంటారు. నిర్విరామంగా ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న అలసట నుంచి తేరుకోవడానికి విదేశీ పర్యటనలు పెట్టుకుంటారు. అయితే తెలుగుదేశం నాయకుడు, మాజీ మంత్రి పొంగూరు నారాయణ మాత్రం అటువంటి వారికి భిన్నం.
విజయసాయి.. సామాజిక మాధ్యమంలో ప్రత్యర్థులపై విషం కక్కుతూ, అనుచిత భాషలో పోస్టులు పెట్టడంలో సిద్ధహస్తుడు. విజయసాయి తాజా ఎన్నికలలో తొలి సారిగా పోటీ చేశారు. ఆయన మూడేళ్లకు పైగా విశాఖ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పని చేశారు. అక్కడ నుంచి పోటీ చేయాలని ఆశించారు. అయితే తానోటి తలిస్తే.. పార్టీ అధినేత మరోటి తలిచి చివరి క్షణంలో ఆయనను నెల్లూరు లోక్ సభ సరిధిలో దింపారు.
  మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తనయ కవితకు ఇప్పట్లో బెయిల్ లభించే సూచనలు కనిపించడం లేదు 
షామీర్ పేట మండలం బ్రోమాసిపేట చెరువు ఆక్రమణలకు గురైందని ఫిర్యాదులందుతున్న నేపథ్యంలో రెవిన్యూ అధికారులు స్పందించారు. తరచుగా భూ వివాదాలతో వార్తల్లోకెక్కిన మాజీ మంత్రి మల్లారెడ్డి తాజాగా బ్రోమాసిపేట ఫుల్ ట్యాంక్ లెవల్ లో అక్రమ నిర్మాణాలను  చేపట్టారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.