వైసీపీలో ఇక మిగిలేదెవరు?

Publish Date:Jan 24, 2025

Advertisement

వైసీపీకి విజయసాయి బిగ్ షాక్ ఇచ్చారు. పార్టీ ఆవిర్భావం నుంచీ జగన్ తో అడుగు కలిపి నడిచిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి.. కష్టకాలంలో జగన్ కు చేయిచ్చారు. ఒకప్పుడు పార్టీలో నంబర్ 2గా ఓ వెలుగు వెలిగిన విజయసాయి.. ఆ తరువాత ఆ స్థానం కోల్పోయినప్పటికీ పార్టీలో మాత్రం అత్యంత కీలకమైన నేత అనడంలో సందేహం లేదు.

అటువంటి విజయసాయిరెడ్డి ఇప్పుడు హఠాత్తుగా పార్టీకీ, రాజ్యసభ సభ్యత్వానికీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం జగన్ కు తేరుకోలేని షాకేనని అంటున్నారు. శనివారం (జనవరి 25) ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న విజయసాయి రెడ్డి, పార్టీ ఆవిర్భావం నుంచీ జగన్ కు కుడి భుజంగా మెలిగిన విజయసాయిరెడ్డి రాజీనామా నిర్ణయం వైసీపీ నాయకులు, శ్రేణులను ఆయోమయంలో పడేసింది. తన రాజీనామా నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతం,  ఎవరి ఒత్తిడీ లేదని ప్రకటించినప్పటికీ.. జగన్ అక్రమాస్తుల కేసులతో పాటు.. వైసీపీ అధికారంలో ఉండగా తాను వెలగబెట్టిన దందాలకు సంబం ధించిన కేసులు మెడమీద వేళాడుతుండటంతో విజయసాయి రాజకీయ సన్యాసం నిర్ణయం తీసుకుని ఉంటారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

రాజకీయాలకు గుడ్ బై చెప్పినంత మాత్రాన కేసుల ఉచ్చు నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. ఈ విషయం విజయసాయికి తెలియంది కాదు. అయినా రాజకీయాలకు దూరం కావడంతో వాటి సీరియస్ సెన్ ఒకింత తగ్గుతుందన్ని ఆయన ఆశిస్తున్నట్లు కనిపిస్తోంది. అన్నిటికీ మించి జగన్ అక్రమాస్తుల కేసులో తాను అప్రూవర్ గా మారితే శిక్షల బెడద ఉండదని ఆయన భావిస్తుండవచ్చు. ఇప్పటికే పులివెందుల తెలుగుదేశం నాయకుడు బీటెక్ రవి.. విజయసాయి అప్రూవర్ గా మారడం ఖాయం, జగన్ కు శిక్ష పడటం తధ్యం అని ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతే కాదు.. జగన్ పై అనర్హత వేటు పడుతుందనీ, పులివెందులకు ఉప ఎన్నిక వస్తుందనీ కూడా ఆయన జోస్యం చెప్పారు. ఆ సంగతి అలా ఉంచితే...

తాను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటున్నట్లు చేసిన ట్వీట్ లో ఆయన తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ లకు పరోక్షంగా అపాలజీ కూడా చెప్పారు. రాజకీయంగా తెలుగుదేశంతో విభేదించానే తప్ప వ్యక్తిగతంలో చంద్రబాబు పట్ల తనకు గౌరవం ఉందని పేర్కొన్నారు. అలాగే జనసేనాని చిరంజీవితో తనకు చిరకాల స్నేహం ఉందనీ సెలవిచ్చారు. అదే సమయంలో  వైఎస్ కుటుంబానికి, జగన్ కు కృతజ్ణతలు చెప్పారు.  తన భవిష్యత్ కార్యాచరణను కూడా విజయసాయి ప్రకటించేశారు. ఇక సేద్యం చేసుకుంటాననీ రాజకీయాల జోలికి రాననీ పేర్కొన్నారు. తాను ఏ పార్టీలోనూ చేరడం లేదని స్పష్టం చేశారు. 

తన రాజకీయ సన్యాసంపై విజయసాయి చేసిన ప్రకటన వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.  జగన్ అక్రమాస్తుల కేసులో నంబర్ 2 అయిన విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం ప్రకటన వెనుక కారణాలపై రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  బాంబు వెనుక ఏదో కారణముందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నారు. వైసీపీలో తన ప్రాధాన్యత తగ్గిపోవడం, 2024 ఎన్నికలలో ఓటమికి ప్రధాన కారణమైన సజ్జల రామకృష్ణారెడ్డికే జగన్ మళ్లీ పార్టీ కన్వీనర్ గా నియమించడంతో తీవ్ర అసంతృప్తికి లోనై విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారని అంటున్నారు.  అన్నిటికీ మించి కాకినాడ పోర్టు కేసులో నిండా మునిగిన విజయసాయి రాజీనామా నిర్ణయానికి వచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  కినాడ పోర్ట్ కేసులో ఈడీ ఆయనను ఇటీవల విచారించిన సంగతి తెలిసిందే. తన కారణంగా తన కుటుంబ వ్యాపారం దెబ్బతిని కూడదని విజయసాయి రాజకీయ సన్యాసం నిర్ణయానికి వచ్చి ఉంటారని అంటున్నారు. ఏది ఏమైనా విజయసాయి రెడ్డి రాజీనామా వైసీపీకి కోలుకోలేని దెబ్బ అని చెప్పడానికి ఇసుమంతైనా సందేహించాల్సిన అవసరం లేదు. విజయసాయిరెడ్డే పార్టీలో ఉండలేక, జగన్ నాయకత్వాన్ని భరించలేక రాజీనామా చేశారంటే.. రానున్న రోజులలో ఇక పార్టీలో మిగిలే వారెవరుంటారన్న సందేహం వైసీపీ శ్రేణులలో వ్యక్తం అవుతోంది.   

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎండగట్టారు. అమరావతిని జగన్ నిరంతరం ప్రయత్నిస్తున్నారనీ, ఇప్పుడు కొత్తగా మావిగన్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు
ఏపీకి రాజధాని ఏది? అమరావతి శాశ్వతమా లేక మావిగాన్ అంటూ జగన్ చేసిన ప్రతిపాదనతో మళ్లీ రాజధానిపై జనంలో అనుమానాలు మొదలయ్యాయా? అన్న చర్చ మొదలైంది. ఏపీ రాజధాని విషయంలో మరో ప్రయోగం మొదలుకాబోతోందా? అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబా ఫూలే 200వ జయంతి వేడుకలు దేశరాజధానిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్లమెంటు ఆవరణలోని ప్రేరణా స్థల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేశాధినేతలు, రాజకీయ దిగ్గజాలు ఒకే వేదికపైకి వచ్చారు. రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొని ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
బీజేపీకి ఓటేస్తే.. సామాజిక న్యాయానికి పాడె కట్టడమేనన్నారు. రాష్ట్రంలోని బీజేపీని అడుగుపెట్టనీయవద్దని, ఒక్క సీటు కూడా వారికి ఇవ్వకుండా తమిళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరకాల కోరారు.
అమరావతికి సాక్షాత్తూ పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధ రాజధానిగా గుర్తింపు లభించిన తరువాత కూడా సజ్జల మౌలిక వసతులు లేని ప్రాంతంలో వేలకోట్టు కుమ్మరిస్తోందంటూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఇప్పుడు కూడా అమరావతి అభివృద్ధి కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నా.. గ్రాఫిక్స్ రాజధాని అంటూ పాత పాటే పాడారు సజ్జల.
ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన ఈ సమావేశం అత్యంత ఆత్మీయంగా, భావోద్వేగాల మధ్య సాగింది. చాలా కాలం తర్వాత తన పాత మిత్రుడిని కలిసిన జీవన్ రెడ్డి ఒ ఉద్వేగానికి లోనయ్యారు.
గత కొంతకాలంగా తనపై సాగుతున్న అభిశంసన ప్రక్రియ, అలాగే నివాసంలో లభించిన లెక్కకు రాని నగదు వివాదం నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.
రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన అనంతరం నితీశ్ కుమార్ ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి పదవికి మరో మూడు నాలుగు రోజుల్లో రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. తాను లేని పక్షంలో రాష్ట్ర బాధ్యతలను కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల బృందం సమర్థవంతంగా నిర్వహిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
వైసీపీ సోషల్ మీడియా మాజీ కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డిపై జారీ అయిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. విచారణలో భాగంగా న్యాయమూర్తులు రాజకీయ ఫ్లెక్సీలపై స్పందిస్తూ.. ఎవరిని ధ్వంసం చేయాలని చూస్తున్నారు? 2029లో రాష్ట్రాన్నా లేక ప్రజలనా? అంటూ ప్రశ్నించారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తమకు ఉన్న అనుబంధం ఎంతో గొప్పదని చెప్పుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. వైఎస్ మరణం వెనుక వైఎస్ జగన్ హస్తం ఉందంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై బొత్స తీవ్రంగా స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురైన రోజున జరిగిన పరిణామాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేరాలని ఆహ్వానించారన్నారు.
ల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కడప జిల్లా నేతలలైన పుట్టా సుధాకర్, వరదరాజులు రెడ్డి, మాధవి రెడ్డిపై లోకేష్ ఫైరయ్యారు. ఈ నెల మొదటి వారంలో జరిగిన సమీక్షలో, నారా లోకేష్ కడప జిల్లా నేతలపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా ఫిర్యాదుల విన్నపం కార్యక్రమాలకు ఈ నేతలు హాజరుకాకపోవడంపై నిలదీసినట్లు చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.