వివేకా హత్య కేసు దర్యాప్తులో వేగం.. నిందితుల గుండెల్లో భయం!

Publish Date:Nov 19, 2024

Advertisement

గత ఐదేళ్లుగా డాక్టర్ వైఎస్ సునీత అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హంతకులకు చట్ట ప్రకారం శిక్ష పడాలనీ, అలాగే హత్య కుట్రదారులు, సూత్రధారులను చట్టం ముందు నిలబెట్టాలన్న సంకల్పంతో ఆమె గత ఐదేళ్లుగా శ్రమిస్తున్నారు. న్యాయపోరాటం చేస్తున్నారు.  వైఎస్ సునీత న్యాయపోరాటం ఫలితంగానే వైఎస్ వివేకా హత్య జరిగిన నాడు ఎవరైతే అప్పటి విపక్ష నేతలపై ఆరోపణలు గుప్పించారో వాళ్లే ఇప్పుడు నిందితులుగా, అనుమానితులుగా   బోనులో నిలబడాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అప్పట్లో ఆరోపణలు ఎదుర్కొన్నవారికి ఆ కేసుతో  ఏం సంబంధం లేదని  విస్పష్టంగా తేలిపోయింది. అప్పట్లో నారాసుర రక్త చరిత్ర అంటూ ఆరోపణలు గుప్పించిన వారే ఇప్పుడు వివేకా హత్య కేసులో అభియోగాలను ఎదుర్కొంటున్నారు. నిందితులుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అరెస్టయ్యారు. బెయిలుపై తిరుగుతున్న వారూ ఉన్నారు.  

అసలు వివేకా హత్య కేసు దర్యాప్తు అంతు అనేది కనిపించకుండా ఎందుకు సా..గుతూ ఉండడానికి,  ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా  పురోగతి లేకుండా నిలిచిపోవడానికి కారణమేంటి, కారణం ఎవరు అన్న విషయంలో ఇప్పుడు ఎవరికీ ఎలాంటి సందేహాలూ లేకుండా పోవడానికి  కూడా వైఎస్ సునీత అలుపెరుగని పోరాటమే కారణం.  అసలీ కేసు ఇంత వరకూ వచ్చి.. ఒక లాజికల్ ఎండ్ దిశగా సాగుతుండడానికి కారణం కూడా వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత మాత్రమే అనడంలో ఇసుమంతైనా సందేహానికి తావు లేదు.  తన తండ్రి  హంతకులు, వారి వెనుకనున్న ముసుగువీరుల సంగతి తేల్చాలంటూ డాక్టర్ సునీత చేసిన, చేస్తున్న న్యాయ పోరాటం   నిస్సందేహంగా  చారిత్రాత్మకం. ఈ పోరాటంలో ఆమె ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నారు.  స్వయానా పెదనాన్న కుమారుడు, సోదరుడు అయిన జగన్ ముఖ్యమంత్రిగా ఉండి తన న్యాయపోరాటానికి అడుగడుగునా అవరోధంగా నిలిచినా ధైర్యంగా ఎదుర్కొన్నారు. తన తండ్రి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి జగన్ అండగా నిలిచి కాపాడుతూ.. తనను వేధింపులకు గురిచేసినా తట్టుకుని నిలబడ్డారు. 

సరే ఇప్పుడు గత ఐదేళ్ల  జగన్ అరాచక పాలనకు ఇప్పుడు తెరపడింది. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. ఇక వివేకా హత్య కేసు దర్యాపు వేగం పుంజుకుని దోషులకు చట్ట ప్రకారం శిక్ష పడుతుందని అంతా భావించారు. అయితే కూటమి సర్కార్ అధికార పగ్గాలు చేపట్టి ఐదు నెలలైనా వివేకా హత్య కేసు దర్యాప్తు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంది. ఈ లోగా వివేకా హత్య కేసులో అరెస్టైన వారందరికీ బెయిలు వచ్చేసింది. వారు దర్జాగా బయట తిరుగుతున్నారు.  
ఈ పరిస్థితుల్లో డాక్టర్ సునీత మరో సారి న్యాయపోరాటానికి కొంగు బిగించారు. తండ్రి హత్య కేసు పురోగతిపై ఆరా తీస్తున్నారు. సత్వర న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే  ఇటీవల ఆమె  కడప ఎస్పీ విద్యాసాగర్ ను కలిశారు. వివేకా హంతకులకు శిక్ష పడేలా చేయడంలో సహరించాలని కోరారు. దీనికి ఎస్పీ కూడా సానుకూలంగా స్పందించారు. ఆ తరువాత సునీత మంగళవారం (నవంబర్ 19) ఏపీ అసెంబ్లీకి వచ్చి  డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజుతో భేటీ అయ్యారు. ఆయనతో వివేకా హత్య కేసు గురించి చర్చించారు. ఇప్పటికే ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి వంగలపూడి అనిత తో  భేటీ అయ్యారు. తండ్రి హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేసి దోషులకు చట్టప్రకారం శిక్ష పడేలా చేయాలని కోరారు. వారిరువురూ కూడా సానుకూలంగా స్పందించారు.  

తాజాగా అసెంబ్లీలోని పీఎంవో కార్యాలయానికి వెళ్లిన సునీత అక్కడి అధికారులతో తన తండ్రి వివేకా హత్య కేసు పురోగతిపై చర్చించారు. అంతకు ముందు ఇటీవల సచివాలయంలో చంద్రబాబుతో సునీత భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా చంద్రబాబు హుకిల్డ్ బాబాయ్ అన్న సస్పెన్స్ కు తొందరలోనే తెరపడుతుందని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే సునీత అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్, పీఎంవో అధికారులతో భేటీ అవ్వడం తండ్రి హత్య కేసు పురోగతిపై చర్చించడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. నాలుగు రోజుల కిందట కడప ఎస్పీతో భేటీ సందర్భంగా వివేకా హత్య కేసుకు సంబంధించి కొన్ని కేసులు హైదరాబాద్ లో నమోదై ఉన్నాయనీ, వాటిని ఇక్కడకు బదలీ చేసి సత్వర దర్యాప్తు జరిపే దిశగా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పినట్లు తెలిసింది. మొత్తం మీద జగన్ హయాంలో పూర్తిగా నిర్వీర్యంగా మారిపోయిన వ్యవస్థలు ఇప్పుడిప్పుడే జవసత్వాలు కూడగట్టు కుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే వివేకా హత్య కేసు విచారణ, దర్యాప్తులో వేగంగా కదలికలు కనిపిస్తు న్నాయి. డాక్టర్ సునీత అలుపెరుగని పోరాటం ఒక తార్కిక ముగింపునకు వచ్చేలా ఉంది. ఔను త్వరలోనే హు కిల్డ్ బాబాయ్ అన్న ప్రశ్నకు సమాధానం లభించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. 

By
en-us Political News

  
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.