వివేకా హత్య కేసు దర్యాప్తులో వేగం.. నిందితుల గుండెల్లో భయం!

Publish Date:Nov 19, 2024

Advertisement

గత ఐదేళ్లుగా డాక్టర్ వైఎస్ సునీత అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హంతకులకు చట్ట ప్రకారం శిక్ష పడాలనీ, అలాగే హత్య కుట్రదారులు, సూత్రధారులను చట్టం ముందు నిలబెట్టాలన్న సంకల్పంతో ఆమె గత ఐదేళ్లుగా శ్రమిస్తున్నారు. న్యాయపోరాటం చేస్తున్నారు.  వైఎస్ సునీత న్యాయపోరాటం ఫలితంగానే వైఎస్ వివేకా హత్య జరిగిన నాడు ఎవరైతే అప్పటి విపక్ష నేతలపై ఆరోపణలు గుప్పించారో వాళ్లే ఇప్పుడు నిందితులుగా, అనుమానితులుగా   బోనులో నిలబడాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అప్పట్లో ఆరోపణలు ఎదుర్కొన్నవారికి ఆ కేసుతో  ఏం సంబంధం లేదని  విస్పష్టంగా తేలిపోయింది. అప్పట్లో నారాసుర రక్త చరిత్ర అంటూ ఆరోపణలు గుప్పించిన వారే ఇప్పుడు వివేకా హత్య కేసులో అభియోగాలను ఎదుర్కొంటున్నారు. నిందితులుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అరెస్టయ్యారు. బెయిలుపై తిరుగుతున్న వారూ ఉన్నారు.  

అసలు వివేకా హత్య కేసు దర్యాప్తు అంతు అనేది కనిపించకుండా ఎందుకు సా..గుతూ ఉండడానికి,  ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా  పురోగతి లేకుండా నిలిచిపోవడానికి కారణమేంటి, కారణం ఎవరు అన్న విషయంలో ఇప్పుడు ఎవరికీ ఎలాంటి సందేహాలూ లేకుండా పోవడానికి  కూడా వైఎస్ సునీత అలుపెరుగని పోరాటమే కారణం.  అసలీ కేసు ఇంత వరకూ వచ్చి.. ఒక లాజికల్ ఎండ్ దిశగా సాగుతుండడానికి కారణం కూడా వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత మాత్రమే అనడంలో ఇసుమంతైనా సందేహానికి తావు లేదు.  తన తండ్రి  హంతకులు, వారి వెనుకనున్న ముసుగువీరుల సంగతి తేల్చాలంటూ డాక్టర్ సునీత చేసిన, చేస్తున్న న్యాయ పోరాటం   నిస్సందేహంగా  చారిత్రాత్మకం. ఈ పోరాటంలో ఆమె ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నారు.  స్వయానా పెదనాన్న కుమారుడు, సోదరుడు అయిన జగన్ ముఖ్యమంత్రిగా ఉండి తన న్యాయపోరాటానికి అడుగడుగునా అవరోధంగా నిలిచినా ధైర్యంగా ఎదుర్కొన్నారు. తన తండ్రి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి జగన్ అండగా నిలిచి కాపాడుతూ.. తనను వేధింపులకు గురిచేసినా తట్టుకుని నిలబడ్డారు. 

సరే ఇప్పుడు గత ఐదేళ్ల  జగన్ అరాచక పాలనకు ఇప్పుడు తెరపడింది. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. ఇక వివేకా హత్య కేసు దర్యాపు వేగం పుంజుకుని దోషులకు చట్ట ప్రకారం శిక్ష పడుతుందని అంతా భావించారు. అయితే కూటమి సర్కార్ అధికార పగ్గాలు చేపట్టి ఐదు నెలలైనా వివేకా హత్య కేసు దర్యాప్తు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంది. ఈ లోగా వివేకా హత్య కేసులో అరెస్టైన వారందరికీ బెయిలు వచ్చేసింది. వారు దర్జాగా బయట తిరుగుతున్నారు.  
ఈ పరిస్థితుల్లో డాక్టర్ సునీత మరో సారి న్యాయపోరాటానికి కొంగు బిగించారు. తండ్రి హత్య కేసు పురోగతిపై ఆరా తీస్తున్నారు. సత్వర న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే  ఇటీవల ఆమె  కడప ఎస్పీ విద్యాసాగర్ ను కలిశారు. వివేకా హంతకులకు శిక్ష పడేలా చేయడంలో సహరించాలని కోరారు. దీనికి ఎస్పీ కూడా సానుకూలంగా స్పందించారు. ఆ తరువాత సునీత మంగళవారం (నవంబర్ 19) ఏపీ అసెంబ్లీకి వచ్చి  డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజుతో భేటీ అయ్యారు. ఆయనతో వివేకా హత్య కేసు గురించి చర్చించారు. ఇప్పటికే ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి వంగలపూడి అనిత తో  భేటీ అయ్యారు. తండ్రి హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేసి దోషులకు చట్టప్రకారం శిక్ష పడేలా చేయాలని కోరారు. వారిరువురూ కూడా సానుకూలంగా స్పందించారు.  

తాజాగా అసెంబ్లీలోని పీఎంవో కార్యాలయానికి వెళ్లిన సునీత అక్కడి అధికారులతో తన తండ్రి వివేకా హత్య కేసు పురోగతిపై చర్చించారు. అంతకు ముందు ఇటీవల సచివాలయంలో చంద్రబాబుతో సునీత భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా చంద్రబాబు హుకిల్డ్ బాబాయ్ అన్న సస్పెన్స్ కు తొందరలోనే తెరపడుతుందని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే సునీత అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్, పీఎంవో అధికారులతో భేటీ అవ్వడం తండ్రి హత్య కేసు పురోగతిపై చర్చించడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. నాలుగు రోజుల కిందట కడప ఎస్పీతో భేటీ సందర్భంగా వివేకా హత్య కేసుకు సంబంధించి కొన్ని కేసులు హైదరాబాద్ లో నమోదై ఉన్నాయనీ, వాటిని ఇక్కడకు బదలీ చేసి సత్వర దర్యాప్తు జరిపే దిశగా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పినట్లు తెలిసింది. మొత్తం మీద జగన్ హయాంలో పూర్తిగా నిర్వీర్యంగా మారిపోయిన వ్యవస్థలు ఇప్పుడిప్పుడే జవసత్వాలు కూడగట్టు కుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే వివేకా హత్య కేసు విచారణ, దర్యాప్తులో వేగంగా కదలికలు కనిపిస్తు న్నాయి. డాక్టర్ సునీత అలుపెరుగని పోరాటం ఒక తార్కిక ముగింపునకు వచ్చేలా ఉంది. ఔను త్వరలోనే హు కిల్డ్ బాబాయ్ అన్న ప్రశ్నకు సమాధానం లభించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. 

By
en-us Political News

  
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.