కౌన్ బనేగా ఎస్ఈసీ?

Publish Date:Mar 24, 2021

Advertisement

వడ్డించే వాడు మనవాడైతే.. పదవులు కోరి వరిస్తాయి. ఏపీలో అదే జరుగుతోంది. కీలక పదవుల్లో తన అనునాయులనే నియమించుకుంటున్నారు సీఎం జగన్. ఐఏఎస్‌లు ఎల్వీ సుబ్రహ్మణ్యం, శ్రీలక్ష్మిలు ఇలా ప్రధాన్య పోస్టులు పొందినవారే. ఇప్పుడు ఆ కోవలోనే.. కాబోయే ఎస్‌ఈసీ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. గతంలో ఎస్ఈసీ అంటే లూప్ లైన్ పోస్టుగా ఉండేది. కానీ, నిమ్మగడ్డ ఎపిసోడ్‌తో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అంటే ఖతర్నాక్ అనే రేంజ్‌లో ఆ పదవికే పవర్ తీసుకొచ్చారు రమేశ్‌కుమారు. ఈ రెండేళ్లలో సీఎం జగన్‌కు ముచ్చెమటలు పట్టించి, మూడు చెరువుల నీళ్లు తాగించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క ఎస్ఈసీనే. అంతటి పవర్‌ఫుల్ పోస్టులో నెక్ట్స్ ఎవరు రాబోతున్నారనేది మరింత ఇంట్రెస్టింగ్ పాయింట్. 

ఎస్ఈసీగా నిమ్మగడ్డ మార్చి 31న రిటైర్ కాబోతున్నారు. ఇప్పటికే ముగ్గురు పేర్లతో ప్యానెల్‌ రెడీ చేశారు. ఇటీవల పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రికి ప్రధాన సలహాదారు నీలం సాహ్ని.. నవరత్నాల పర్యవేక్షణ సలహాదారు శామ్యూల్‌.. ఏపీ పునర్విభజన చట్టం అమలు బాధ్యతలు నిర్వహిస్తున్న రిటైర్డ్‌ అధికారి ఎల్‌.ప్రేమ్‌చంద్రారెడ్డి పేర్లతో జాబితా సిద్ధం చేశారు. ఈ ముగ్గురిలో శామ్యూల్ రేసులో ముందున్నారు. సీఎం జగన్ సైతం శామ్యూల్‌పైనే ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది. 

శామ్యూల్.. వాన్‌పిక్‌ స్కాం కేసులో నిందితుడు. ఆయన 2014లోనే రిటైర్ అయ్యారు. అప్పట్లోనే శామ్యూల్ చీఫ్ సెక్రటరీ పోస్టుకు పోటీ పడినా.. వాన్‌పిక్‌ కేసులో సహనిందితుడిగా ఉండడంతో అప్పటి ప్రభుత్వం ఆయన్ను సీఎస్‌ పోస్టుకు పరిగణనలోకి తీసుకోలేదు. ఆ విషయంలో ఆయన కేంద్ర అడ్మినిస్ర్టేటివ్‌ ట్రైబ్యునల్‌కు వెళ్లిన ఫలితం లేకుండా పోయింది. దీంతో.. సీసీఎల్‌ఏగానే పదవీ విరమణ చేశారు శామ్యూల్‌. జగన్‌ సీఎం అయిన కొద్దిరోజులకే ముఖ్యమంత్రి సలహాదారుడిగా మళ్లీ యాక్టివ్ అయ్యారు శామ్యూల్. వైసీపీ ఎన్నికల హామీ అయిన నవరత్నాల పథకాల పర్యవేక్షణ బాధ్యతలు ఆయనకు అప్పగించారు. ఇప్పుడు ఎస్ఈసీ రేసులో నిలిచారు.

ఎస్ఈసీ జాబితాలో ఉన్న మరో ఇద్దరూ కీలకమైన అధికారులే. సీఎస్‌గా పనిచేసి, ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన సలహాదారుగా ఉన్న నీలం సాహ్నితో పాటు ఇటీవలే రెండేళ్ల సర్వీసు పొడిగింపు పొందిన ప్రేమ్‌చంద్రారెడ్డి ప్యానెల్‌లో ఉన్నారు. ముగ్గురూ సమర్థులైన అధికారులే కావడంతో వీరిలో ఎవరిని ఎస్ఈసీ వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

ఎస్ఈసీ ఎంపిక అధికారం రాష్ట్ర గవర్నర్‌దే. ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చట్టప్రకారం.. ప్రభుత్వ సలహా మేరకు ఎన్నికల కమిషనర్‌ను గవర్నర్‌ నియమించాలి. అయితే, ఇందులో వయసుకు సంబంధించి వివాదమూ ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఓ చట్టం ప్రకారం.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవీకాలం ఐదేళ్లు లేదా 65 ఏళ్ల వయసు. ఇందులో ఏది ముందైతే అది. దీని ప్రకారం శామ్యూల్, ప్రేమ్‌చంద్రారెడ్డిల వయసు 67 ఏళ్లు. నీలం సాహ్ని ఏజ్ మాత్రం 65 ఏళ్లలోపే. ఒకవేళ గవర్నర్ ఏపీ చట్టాల ప్రకారం నియామకం చేపడితే ఎస్ఈసీగా శామ్యూల్‌‌కు అవకాశం దక్కొచ్చు. అదే, కేంద్ర నిబంధనల ప్రకారమైతే నీలం సాహ్నికి ఆ పదవి వరిస్తుంది. ముగ్గురిలో ఎవరికి వచ్చినా.. వారు ప్రభుత్వానికి అనుకూలమే అంటున్నారు. ఆ ఒక్కరు ఎవరనేది త్వరలోనే తేలనుంది. 

By
en-us Political News

  
తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ పార్టీలకు ఫండ్స్ బాగానే గిట్టుబాటయ్యాయి. అయితే.. ఏపీలో పవర్‌లో ఉన్న టీడీపీ, జనసేన కంటే వైసీపీ కలెక్షన్లే ఎక్కువగా ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది.
అంబటి ఏమన్నారంటే.. 2024 ఫలితాలను అర్ధం చేసుకోవడంలో తెలుగుదేశం కూటమి పార్టీలు విఫలమయ్యాయట. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల కారణంగానే కూటమి ఆ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిందట.. ఇప్పుడు ఈ ఏడాదిన్న కాలంలో జనానికి తత్వం బోధపడి.. జగన్ పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారట. అంబటి భాష్యం విన్న వైసీపీయులే ఆశ్చర్యపోతున్నారు.
ఆదివారం తన 53వ పుట్టిన రోజు జరుపుకున్న జగన్ కు చంద్రబాబు, నారా లోకేష్, వైఎస్ షర్మిల తదితరులు సామాజిక మాధ్యమం ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు ప్రతిగా జగన్ కూడా ఒక్క మంత్రి లోకేష్ కు తప్ప మిగిలిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ రిప్లై ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి దయనీయంగా మారిందన్న ఆయన గత పదేళ్ల అధికార గర్వంతో విర్రవీగిన నేతల కండలు ఇప్పుడు కరిగిపోయాయని ఎద్దేవా చేశారు.
రాజకీయ ప్రత్యర్థులే కాదు.. ప్రభుత్వ విధానాలు సరిగా లేవన్న సామాన్యులపై కూడా జగన్ పాలనలో దాడులు జరిగాయి. ఇక అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలూ సరే సరి. సరే జనం విషయం గుర్తించి 2019లో తాము కట్టబెట్టిన అధికారాన్ని 2024 ఎన్నికలలో లాగేసుకుని అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ చంద్రబాబుకు అప్పగించారు.
చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు పేరుకు పాలమూరును దత్తత తీసుకుని, అభివృద్ధి పేరిట శంకుస్థాపన ఫలకాలకే పరిమితమయ్యారనీ, ఆయన హయాంలో శంకుస్థాపన ఫలకాలకు అయిన ఖర్చుతో ఏకంగా ఓ ప్రాజెక్టే కట్టవచ్చంటూ విమర్శలు గుప్పించారు.
ఆదివారం జగన్ పుట్టిన రోజు సందర్భంగా షర్మిల అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆ తెలపడంలోనూ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. చెల్లెలిగా కాకుండా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల వైసీపీ అధ్యక్షుడు జగన్ గారికి అని సంబోధిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలో గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
సోషల్ మీడియాలో జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి. అవన్నీ పక్కన పెడితే తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద వెలసిన ఓ భారీ కటౌట్ ఆసక్తి రేకెత్తిస్తోంది.
ప్రముఖ సినీ నటి ఆమని భారతీయ జనతా పార్టీలో చేరారు.
భారతదేశం మత సామరస్యానికి ప్రతీక అన్న విజయసాయి.. అటువంటి దేశంలో ఉంటూ.. బంగ్లాలో హిందువులు లక్ష్యంగా సాగుతున్న దాడులపై స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ దాడులకు ఖండించని వారు దేశ భక్తులే కాదని విజయసాయి తన ట్వీట్ లో పేర్కొన్నారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ కోర్టుకు వెడదామా? అంటే..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించలేదు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అంటూ జీవోలోనే స్పష్టంగా పేర్కొంది. దీంతో ఆ పాయింట్ మీద కోర్టుకు వెళ్లడం ఎలా అన్నది అర్ధం కాక వైసీపీ మల్లగుల్లాలు పడుతోందని పరిశీలకులు అంటున్నారు.
తాను ప్రత్యక్ష ఎన్నికలో పోటీ చేసిన తొలి సారే పరాజయం పాలైన సంగతిని గుర్తు చేసుకున్న ఆయన, ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని, ఓడిన చోటే గెలవాలన్న పట్లుదలతో పని చేసి ఫలితం సాధించానని లోకేష్ వివరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.