పవన్ వర్సెస్ ఉదయనిథి స్టాలిన్.. ఎవరు బెటరంటే?

Publish Date:Oct 8, 2024

Advertisement

లడ్డూ వివాదం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఉప ముఖ్యమంత్రుల ప్రస్తావన తెరమీదకు వచ్చింది. నటుడు ప్రకాశ్ రాజ్ ఈ ప్రస్తావన తీసుకువచ్చారు. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి సమానత్వం గురించి మాట్లాడుతుంటే.. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సనాతన ధర్మం అంటూ ఏవోవో మాట్లాడుతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. ఆయనీ వ్యాఖ్యలలో పవన్ కల్యాణ్ పేరు, ఆంధ్రప్రదేశ్ పేరు ప్రస్తావించకపోయినా సనాతన ధర్మం అనడంతో ఆయన వ్యాఖ్యలు పరోక్షంగా కాదు ప్రత్యక్షంగానే పవన్ కల్యాణ్ ను ఉద్దేశించేనని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నటుడు ప్రకాశ్ రాజ్ తన వ్యాఖ్యలతో ఒక విధంగా ఇరు రాష్ట్రాల మధ్యా రచ్చకు కారణమయ్యారని చెప్పవచ్చు. 
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాజకీయాలకు ఒక సారూప్యత ఉంది. రెండు రాష్ట్రాలలోనూ సినీమా, రాజకీయాలకు విడదీయరాని, విడదీయలేని సంబంధం ఉంది. తమిళనాట ఎంజీఆర్, తెలుగునాట ఎన్టీఆర్ ముఖ్యమంత్రులుగా పని చేశారు. వీరు తమ పదవీ కాలంలో ఆయా రాష్ట్రాలలో రాజకీయాలనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా రాజకీయాలను ప్రభావితం చేశారు. తమిళనాట ఎంజీఆర్ రాజకీయ వారసురాలిగా జయలలిత కూడా తనదైన ముద్ర వేశారు. ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ తరువాత తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబునాయుడు ముందుండి నడిపిస్తున్నారు. ఇక సినీ రంగం నుంచే రాజకీయ ప్రవేశం చేసిన కరుణానిథి కూడా తమిళనాడు రాజకీయాలలో కీలక భూమిక పోషించారు. ఆయన వారసుడిగా స్టాలిన్ ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇటీవలే ఆయన కుమారుడు ఉదయనిథి స్థాలిన్ తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఉమ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 

ఇప్పుడు రెండు రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులదీ సినీమా నేపథ్యమే. అయితే ఉదయనిథి స్టాలిన్ రాజకీయ ప్రవేశం నుంచి ఎదిగి ఉపముఖ్యమంత్రి పదవీ చేపట్టడం వరకూ ఆయన తండ్రి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అండదండలు, మార్గదర్శకత్వం ఉన్నాయి. అయితే పవన్ కల్యాణ్ విషయానికి వస్తే ఆయన రాజకీయాలలో ప్రతి అడుగూ ఆయనకు ఆయన నిర్దేశించుకుని వేసినదే. ఆయనకు రాజకీయంగా ఎవరి అండదండలూ లేవు.  

2014 ఎన్నికల నాటికే పవన్  కల్యాణ్ సొంతంగా జనసేన పార్టీని స్థాపించారు. అయితే విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని విభజిత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికే అగ్రతాంబూలం అంటూ ఆ నాడు పార్టీని ఎన్నికలకు దూరంగా ఉంచారు. తెలుగుదేశం, బీజేపీ కూటమికి బయట నుంచి మద్దతు ఇచ్చారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, అప్పటి ప్రధాని అభ్యర్థి, బీజేపీ నేత మోడీతో కలిసి రాష్ట్రంలో కూటమికి మద్దతుగా ప్రచారం చేశారు. 

ఇక 2019 ఎన్నికల నాటికి వచ్చే సరికి ఆయన ఎన్నికల బరిలో దిగారు. అయితే ఫలితం మాత్రం ప్రతికూలంగా రావడమే కాకుండా, స్వయంగా తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాలలోనూ పరాజయం పాలయ్యారు. 2019 ఎన్నికలలో ఆయన జనసేన పార్టీ కేవలం ఒక్కటంటే ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది. పార్టీ తరఫున గెలిచిన ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా  ఆ తరువాత అప్పటి అధికార పార్టీ వైసీపీలోకి జంప్ చేసేశారు. అయితే అంతటి ఘోర పరాజయాన్ని కూడా తట్టుకుని ఆయన జనసేనను ముందుకు నడిపించారు.  

2024 ఎన్నికల నాటికి గట్టిగా పుంజుకున్నారు. తెలుగుదేశం, బీజేపీల మధ్య సఖ్యత ఏర్పడేందుకు మధ్యవర్తిత్వం నెరిపారు. 2024 ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు కుదరడంలో కీలకంగా వ్యవహరించారు. అంతే కాకుండా ఆ ఎన్నికలలో పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాలలో పార్టీని గెలిపించి వంద శాతం ఫలితాన్ని సాధించారు.  ఒక రకంగా ఉదయనిథి  తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుని ఎదిగితే.. పవన్ కల్యాణ్ మాత్రం స్వశక్తిని నమ్ముకుని ఒంటరిగా రాజకీయ అడుగులు వేసి ఈ స్థాయికి చేరుకున్నారు.  అందుకే పరిశీలకులు పవన్ కల్యాణ్ ఈజ్ ఫార్ బెటర్ దేన్ ఉదయనిధి అంటున్నారు. 

By
en-us Political News

  
ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది.
బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నార‌న్న ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణ‌లో తీన్మార్ మ‌ల్ల‌న్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భార‌త్ పర్యటనకు వ‌చ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంట‌ర్వ్యూలో కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.