వివేకా హత్య కేసులో ఎ9 ఎవరు?

Publish Date:Jun 10, 2023

Advertisement

మాజీ మంత్రి, ముఖ్యమంత్రి  జగన్ స్వంత బాబాయ్ వైఎస్ వివేకా హత్య కేసు ఇప్పుడు ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాదు దేశ వ్యాప్తంగా ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టును తప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు, పదే పదే న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ అరెస్టును వాయిదా వేయించుకుంటున్న తీరు తీవ్ర చర్చనీయంశమైంది.

ఇక తెలంగాణ హై కోర్టు అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిలు మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ సునీత సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం విచారణకు రానుంది. సుప్రీం కోర్టు ముందస్తు బెయిలుపై ఏ నిర్ణయం తీసుకుంటుందన్న విషయం పక్కన పెడితే.. ఈ కేసులో సీబీఐ అవినాష్ ముందస్తు బెయిలు పిటిషన్ ను వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ లో నూ, భాస్కర్ రెడ్డి బెయిలు పిటిషన్ ను వ్యతిరేకిస్తూ సీబీఐ కోర్టులో దాఖలు చేసిన అఫడివిట్ లోనూ జగన్ పేరు ప్రస్తావించడం సంచలనం సృష్టించింది. వివేకా హత్య కేసు దర్యాప్తునకు ఏపీలో అడుగడుగునా అడ్డంకులు ఎదురు కావడం వెనుక జగన్ హస్తం ఉందన్న అనుమానాలు చాలా కాలంగా వ్యక్తమౌతున్నాయి.

సొంత బాబాయ్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని కాపాడేందుకు జగన్ తన సర్వశక్తులూ ఒడ్డి ప్రయత్నిస్తున్నారన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. అవినాష్ రెడ్డిని సీబీఐ విచారణకు పిలిస్తే చాలు జగన్ ఢిల్లీ వెళ్లి మరీ సీబీఐ వేగం మందగించేలా కార్యం చక్కబెట్టుకు వచ్చేవారని స్వయంగా వైసీపీ శ్రేణులే చెప్పుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే  వివేకా హత్య కేసులో జగన్ కూడా విచారణకు హాజరు కాక తప్పదన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.  వైఎస్ వివేకానంద రెడ్డి హత్య సమాచారం, అందరికంటే ముందే జగన్ మోహన్ రెడ్డి కి తెలుసు. ఆయనకు ఆ విషయాన్ని అవినాష్ రెడ్డే చేరవేశారన్నది తమ అనుమానంగా సీబీఐ చెబుతోంది.

అందుకే అవినాష్ రెడ్డి కస్టోడియల్ విచారణ అవసరమని కోర్టుకు స్పష్టంగా చెప్పింది.  ఈ నేపథ్యంలోనే జగన్ మోహన్ రెడ్డి సీబీఐ విచారణను ఎదుర్కొనాల్సి రావడం అనివార్యమన్న భావన ఆ వర్గాల్లో వ్యక్తమౌతోంది.   కేసు ఇంత వరకూ రావడానికీ, జగన్ పేరు సీబీఐ ప్రస్తావించక తప్పని పరిస్థితి ఏర్పడడానికీ వివేకా కుమార్తె  సునీత  అలుపెరుగని న్యాయపోరాటమే కారణమని వేరే చెప్పనవసరం లేదు. అసలు సునీత పట్టుబట్టి తన తండ్రి హత్య కేసులో సీబీఐ దర్యాప్తును సాధించినప్పటి నుంచే వైసీపీ పునాదులు కదలడం ప్రారంభమయ్యాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ కేసులో సూత్రధారులు, పాత్రధారుల వరకూ దర్యాప్తు రాకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే అధికారం చేపట్టగానే జగన్ సీబీఐ దర్యాప్తు అవసరం లేదన్నారన్న విశ్లేషణలు పరిశీలకుల నుంచి వస్తున్నాయి.  

అందుకే పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసీ.. ఈ కేసులో తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని కాపాడేందుకు జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఇదే కేసులో ఇలాంటి ఆరోపణలే ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి తండ్రి భాస్కరరెడ్డిని పట్టించుకోకుండా ఒక్క అవినాష్ రెడ్డి విషయంలోనే జగన్ అతి శ్రద్ధ చూపడం అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. ఒక ఎంపీ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటుంటే.. ఏ ముఖ్యమంత్రైనా సరే చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నట్లుగా కలగ జేసుకోకుండా ఉంటారని, ఢిల్లీ మద్యం కుంభకోణంలో సాక్షాత్తూ ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్టైతే కేజ్రీవాల్ ఆ అరెస్టును ఆపడం కోసం కేంద్రం చుట్టూ ప్రదక్షిణలు చేయలేదనీ, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టేందుకు సిద్ధపడలేదనీ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. కానీ అందుకు భిన్నంగా జగన్ మాత్రం అవినాష్ కు ఇలా సీబీఐ నోటీసులు అందితే.. అలా హస్తిన  పర్యటనకు వెళుతున్నారనీ, అర్ధరాత్రి సమావేశాలతో  అవినాష్ ను కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ ఆరోపణలు కచ్చితంగా పార్టీపైనా, ప్రభుత్వంపైనా ప్రజలలో వ్యతిరేకతను పెంచుతున్నాయి. ఇక ఇప్పుడు సీబీఐ వివేకా హత్య కేసులో ఏ8గా అవినాష్ రెడ్డిని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో ఎ9 ఎవరు అన్న చర్చ రాష్ట్రంలో జోరందుకుంది. వివేకా హత్య వెనుక విస్తృత రాజకీయ కోణం, కుట్ర ఉందని కూడా సీబీఐ పేర్కొనడంతో ఇప్పుడు అందరి చూపులూ తాడేపల్లి ప్యాలెస్ వైపు మళ్లడంతో ఎ8 అవినాష్ రెడ్డి అయితే ఎ9 ఎవరన్న దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది.  ఆ చర్చలో ఈ కేసులో కీలక సాక్షులైన గంగాధరరెడ్డి, శ్రీనివాసరెడ్డిలు అనుమానాస్పద స్థితిలో మరణించడం ప్రస్తావనకు వస్తోంది. అలాగే  ఈ కేసు విచారణ ఏపీలో జరుగుతున్న సమయంలో సీబీఐ అధికారులపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేయడాన్ని ప్రస్తావనకు వస్తున్నాయి.  

By
en-us Political News

  
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.