లోకేష్, జగన్ వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు?

Publish Date:Jul 9, 2026

Advertisement

వాస్తవ వేదిక.. తెలుగువన్ ఎక్స్ క్లూజివ్

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పడు  కిచెన్ క్యాబినెట్,  కోటరీ అనే అంశాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏపీలో వైసీపీ అధినేత   జగన్ మోహన్ రెడ్డి, తెలుగుదేశం యువనేత నారా లోకేష్ చుట్టూ ఉన్న ఆ ముఠాలు ఎవరు?  గ్రౌండ్ రియాలిటీకి, ప్రజా కోణానికి వారు పార్టీల  నేతలను ఎంత దూరం చేస్తున్నారు? అనే అంశాలపై తెలుగువన్ వాస్తవ వేదికలో   జమీన్ రైతు, డోలేంద్ర  ప్రసాద్ ' తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంక్ లు విశ్లేషణాత్మక చర్చ జరిపారు.   రాజకీయ వ్యూహకర్తలు, కోటరీలు ప్రజాస్వామ్యానికి చేస్తున్న అపకారంపై వారు కూలంకషంగా చర్చించారు. 

గతంలో  ఇందిరా గాంధీ, పి.వి.నరసింహారావు వంటి అగ్రనేతలు క్షేత్రస్థాయి నుంచి నేరుగా ఫీడ్‌బ్యాక్ తీసుకునేవారన్న డోలేంద్ర ప్రసాద్.. ఒక సాధారణ వ్యక్తి ఎదురైనా పిలిచి మాట్లాడి రాష్ట్రాల రాజకీయ పరిస్థితులను తెలుసుకునే ఓపెన్ మైండ్ నాటి ప్రధానులకు ఉండేదన్నారు. ఎప్పుడైతే రాజీవ్ గాంధీ తన పాత కోటరీని పక్కన పెట్టి అరుణ్ నెహ్రూ, అరుణ్ సింగ్ వంటి కార్పొరేట్ మైండ్స్ ఉన్న వ్యక్తులను కిచెన్ క్యాబినెట్‌లో పెట్టుకున్నారో, అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు డిస్కనెక్ట్ అయి తీవ్రంగా నష్టపోయిందని  ఉదాహరణలతో వివరించారు.

ఇప్పుడు ఇదే తరహా కోటరీ సంస్కృతి   ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసిస్తోందన్నారు డోలేంద్ర ప్రసాద్. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలం నాటి నమ్మకస్తులైన, రాజకీయ అనుభవజ్ఞులైన కోటరీని  జగన్ పూర్తిగా పక్కన పెట్టేసి భూస్థాపితం చేశారని విమర్శించారు. మరోవైపు నారా లోకేష్ కూడా చంద్రబాబు నాయుడు నాటి సీనియర్లను కాదని, తన చుట్టూ ఒక కొత్త కోటరీని ఏర్పాటు చేసుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని పేర్కొన్నారు.

 కిచెన్ క్యాబినెట్లలో ఉన్న వ్యక్తులకు కనీసం ఒక పంచాయతీ వార్డు మెంబర్‌గా గెలిచిన అనుభవం కూడా లేదన్నారు.  ప్రజలతో, క్షేత్రస్థాయి కార్యకర్తలతో ఎలాంటి సంబంధం లేని ఈ సరికొత్త నాయకులు కేవలం పగలు పైరవీలు, రాత్రికి డిన్నర్ పార్టీలకే పరిమితమవుతున్నారన్నారు ఇలాంటి వారి వల్ల ప్రజలకు,  నేతలకు మధ్య ఉండాల్సిన కనెక్టివిటీ పూర్తిగా తెగిపోతోందని విశ్లేషించారు.

రాబిన్ శర్మ, ప్రశాంత్ కిశోర్, సునీల్ వంటి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ టీమ్‌లు ప్రజాస్వామ్యానికి తీవ్రమైన అపకారం చేస్తున్నాయన్నారు. వీరు  మ్యానుఫ్యాక్చర్డ్ పబ్లిక్ ఒపీనియన్ అంటే కృత్రిమ ప్రజాభిప్రాయాన్ని సృష్టిస్తూ సోషల్ మీడియా, కంట్రోల్డ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా లేని ప్రజాదరణను ఉన్నట్లు చూపిస్తున్నారనీ,  ఈ తప్పుడు నివేదికలను, గ్రాఫ్ లను  అధినేతలు మాత్రమే నమ్ముతున్నారని, కానీ క్షేత్రస్థాయిలో అసలైన ప్రజాభిప్రాయం వేరుగా ఉంటుందని డోలేంద్ర ప్రసాద్ అన్నారు.

ఈ దశలో తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్..  తాను గ్రౌండ్ రియాలటీని గత ఎన్నికల సమయంలో చెప్పినా నమ్మలేదనీ,  తాను  2014 ఎన్నికల్లోనూ, మొన్నటి 2024 ఎన్నికల్లోనూ కూడా ఆరు నెలల ముందే చంద్రబాబు, లోకేష్‌లకు సీట్ల మార్జిన్ గురించి కచ్చితమైన అంచనాలు చెప్పినా వినలేదని.. తీరా చూస్తే క్షేత్రస్థాయిలో తాను చెప్పిన ఫలితాలే వచ్చాయని ఉదహరించారు. దీనికి డోలేంద్రప్రసాద్..   రాజకీయాల్లో వందల కోట్లు ఖర్చు పెట్టి కార్పొరేట్ సంస్థల చేత సర్వేలు చేయించుకునే నేతలు..  నిజాయితీగా గ్రౌండ్ రియాలిటీ చెప్పే విశ్లేషకుల మాటలను నమ్మే స్థితిలో లేరన్నారు.  అధినేతలు ఇప్పటికైనా కృత్రిమ కోటరీలను పక్కన పెట్టి, ప్రజలతో మమేకమయ్యే నేతలను దగ్గరకు చేర్చుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర  నష్టాలు తప్పవని చెప్పారు. 

AP Politics, YS Jagan Coterie, Nara Lokesh Kitchen Cabinet, Political Analyst Dorendra Prasad, Teluguone MD Ravishankar, Telugu One News Political Debate

By
en-us Political News

  
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.