వరద ముంపునకు శాశ్వత పరిష్కారమేది?

Publish Date:Jul 19, 2022

Advertisement

గోదావరి నదిలో ఉవ్వెత్తున వరదనీరు పోటెత్తి ప్రహిస్తోంది. దీంతో ఇరు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు వరద ముంపుతో అల్లాడిపోతున్నారు. వరద విలయంతో వందలాది లంక గ్రామాల వాసులు గజగజలాడుతున్నారు. తినడానికి తిండి లేక, తాగేందుకు నీరు లేక, తలదాచుకోవడానికి చోటు లేక తల్లడిల్లిపోతున్నారు. లక్షల కోట్ల రూపాయల పంటలు నీటమునిగాయి. వేలాది పశువులు, పెంపుడు పక్షులు, సామాగ్రి వరద ఉధృతిలో కొట్టుకుపోయాయి.

తెలంగాణలోని పవిత్ర పుణ్య క్షేత్రం భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వెళ్లేందుకు నిర్మించిన శబరినదిపై వంతెన పైనుంచి కూడా వరదనీరు ప్రవహిస్తోంది. భద్రాచలం క్షేత్రంలో వరదనీరు ముంచెత్తేసింది. భద్రచాలం వద్ద గోదావరి నీటిమట్టం అత్యంత ప్రమాదకర స్థాయిలో 71 అడుగులకు చేరుకుంది. నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు వద్ద కూడా వరద గోదావరి ఉవ్వెత్తున ప్రవహిస్తోంది. దిగువన తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద వరద పోటెత్తి ప్రవహిస్తోంది. ధవళేశ్వరం వద్ద గోదావరి వరదనీరు సుమారు 21 అడుగులకు చేరింది. దీంతో అధికారులు 175 బ్యారేజీ గేట్లు ఎత్తివేసి సముద్రంలోకి  23 లక్షల 94 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో వందేళ్ల చరిత్రలో 41 పర్యాయాలు గోదావరి నదిలో భారీ వరదలు ముంచెత్తాయి. వరద పోటెత్తినప్పుడల్లా వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు అన్నింటినీ పోగొట్టుకుని అతలాకుతలం అయిపోతూనే ఉన్నారు. 1853 నుంచీ చూసుకుంటే.. ధవళేశ్వరం వద్ద రికార్డు స్థాయిలో అత్యధికంగా 1986 ఆగస్టు 16న 35.1 లక్షల క్యూసెక్కుల వరదనీరు ప్రవహించినట్లు రికార్డయింది. అంతకు ముందు 1953 ఆగస్టు 19న రెండో అత్యధిక వరదగా నమోదై 30 లక్షల క్యూసెక్కులు ప్రవహించింది. 2006 ఆగస్టు 7వ తేదీన ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 28.5 లక్షల క్యూసెక్కుల వరద రికార్డయింది. 1990 ఆగస్టు 25న 27.8 లక్షల క్యూసెక్కుల వరదనీరు, 2010 ఆగస్టు 9న 20.1 లక్షల క్యూసెక్కుల వరదనీరు నమోదైంది. ఇక తాజాగా గోదావరికి వచ్చిన వరద 21 నుంచి 22 లక్షల క్యూసెక్కులకు చేరుతుందని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేశారు. అంటే.. గోదావరి నది చరిత్రలో 41 సార్లు వచ్చిన వరదల్లో ఈసారా నాలుగో లేదా ఐదో అతిపెద్ద వరదగా రికార్డు అవుతుందని అధికారులు చెబుతున్నారు.

అయితే.. పదుల సార్లు గోదావరి వరదలు పోటెత్తి గ్రామాలకు గ్రామాలనే ముంచేసి, లక్షల కోట్ల ఆస్తులకు నష్టం కలిగిస్తున్నా.. వేలు, లక్షల మూగజీవాలు మృత్యువాత పడుతున్నా ముందస్తు చర్యలు తీసుకోకుండా ప్రభుత్వాలు ఏమి చేశాయనే ప్రశ్న తలెత్తుతోంది. ఇంటికి చుట్టం వచ్చిన తర్వాత పొయ్యి వెలిగించినట్టు ఏవో తాత్కాలిక చర్యలే తప్ప వరదలతో జననష్టం, ఆస్తి నష్టం జరగనివిధంగా ప్రభుత్వాలు శాశ్వతంగా చేసిన ప్రయత్నాలేవీ లేవనేది బాధితులందరి నోటా వినిపిస్తున్న విమర్శ. వరదలు ముంచెత్తుకు వచ్చిన తర్వాత నది కరకట్టలపై కొన్ని ఇసుకబస్తాలు వేయడమే తప్ప ఏటి గట్లను పటిష్టంగా ఏర్పాటు చేసే దిశగా ఏ ఒక్క ప్రభుత్వమూ చర్యలు చేపట్టలేదనేది వాస్తవం అంటున్నారు.

వరదనీరు ఊళ్లను ముంచెత్తిన తర్వాత బాధిత గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వారికి అరకొరగా భోజన, వసతి సౌకర్యాలు కల్పించి, ప్రభుత్వాలు చేతులు దులుపుకుంటున్నాయనే విమర్శలు ఉన్నాయి. వరదపోటు ఎక్కువైనప్పుడు ఆర్మీని, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపుతున్నాయి తప్ప బాధితుల కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపెట్టకుండా ఉపేక్షిస్తున్నాయంటున్నారు. ఇప్పటికైనా వరద కష్టాల నుంచి తమను శాశ్వతంగా బయటపడేసేందుకు సరైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాలను బాధితులు వేడుకుంటున్నారు.

By
en-us Political News

  
పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను ఇంత కాలం వ్యతిరేకిస్తూ వచ్చిన లొంగిపోయిన మావోయిస్టు నేతలు ఇప్పుడు అదే వ్యవస్థ ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని భావిస్తున్నారు. ఇందుకు తాజాగా మావోయిస్టు మాజీ అగ్రనేత మల్లోజుల ఇక ఆయుధాలు చేపట్టబోమంటూ చేసిన ప్రకటనే సాక్ష్యంగా నిలుస్తోంది.
దానం విషయంలో మాత్రం ఆయన అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం, ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీలోకి దిగడంతో.. ఇవే కోర్టులో , అలాగే స్పీకర్ ఎదుట తిరుగులేని ఆధారాలుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో దానంపై అనర్హత వేటు పడటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
మొత్తం మీద ఆ కేసులో కీలక మలుపునకు ఈ పెన్ డ్రైవ్ ఆధారం అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని దర్యాప్తు అధికారులు అంటున్నారు. ఈ కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి నివేదికను కోర్టుకు సమర్పించాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో 9 మంది అధికారులతో కలిసి ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
పార్టీ పగ్గాలు చేపట్టడానికీ, ప్రధాని మంత్రి పదవిని అధిష్టించడానికి కాంగ్రెస్ లో సమర్థత ఉన్న నేత తన సతీమణి ప్రియాంక వధేరా గాంధీ మాత్రమేనంటూ రాబర్ట్ వధేరా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఈ కార్యక్రమానికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. అలాగే వైఎస్ కుటుంబీకులంతా హాజరయ్యారు. అయితే ఈ వేడుకలకు వైఎస్ తనయ వైఎస్ షర్మిల మాత్రం హాజరు కాలేదు.
తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ పార్టీలకు ఫండ్స్ బాగానే గిట్టుబాటయ్యాయి. అయితే.. ఏపీలో పవర్‌లో ఉన్న టీడీపీ, జనసేన కంటే వైసీపీ కలెక్షన్లే ఎక్కువగా ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది.
అంబటి ఏమన్నారంటే.. 2024 ఫలితాలను అర్ధం చేసుకోవడంలో తెలుగుదేశం కూటమి పార్టీలు విఫలమయ్యాయట. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల కారణంగానే కూటమి ఆ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిందట.. ఇప్పుడు ఈ ఏడాదిన్న కాలంలో జనానికి తత్వం బోధపడి.. జగన్ పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారట. అంబటి భాష్యం విన్న వైసీపీయులే ఆశ్చర్యపోతున్నారు.
ఆదివారం తన 53వ పుట్టిన రోజు జరుపుకున్న జగన్ కు చంద్రబాబు, నారా లోకేష్, వైఎస్ షర్మిల తదితరులు సామాజిక మాధ్యమం ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు ప్రతిగా జగన్ కూడా ఒక్క మంత్రి లోకేష్ కు తప్ప మిగిలిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ రిప్లై ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి దయనీయంగా మారిందన్న ఆయన గత పదేళ్ల అధికార గర్వంతో విర్రవీగిన నేతల కండలు ఇప్పుడు కరిగిపోయాయని ఎద్దేవా చేశారు.
రాజకీయ ప్రత్యర్థులే కాదు.. ప్రభుత్వ విధానాలు సరిగా లేవన్న సామాన్యులపై కూడా జగన్ పాలనలో దాడులు జరిగాయి. ఇక అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలూ సరే సరి. సరే జనం విషయం గుర్తించి 2019లో తాము కట్టబెట్టిన అధికారాన్ని 2024 ఎన్నికలలో లాగేసుకుని అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ చంద్రబాబుకు అప్పగించారు.
చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు పేరుకు పాలమూరును దత్తత తీసుకుని, అభివృద్ధి పేరిట శంకుస్థాపన ఫలకాలకే పరిమితమయ్యారనీ, ఆయన హయాంలో శంకుస్థాపన ఫలకాలకు అయిన ఖర్చుతో ఏకంగా ఓ ప్రాజెక్టే కట్టవచ్చంటూ విమర్శలు గుప్పించారు.
ఆదివారం జగన్ పుట్టిన రోజు సందర్భంగా షర్మిల అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆ తెలపడంలోనూ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. చెల్లెలిగా కాకుండా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల వైసీపీ అధ్యక్షుడు జగన్ గారికి అని సంబోధిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలో గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.