మనిషికి దుఃఖం నేర్పేది ఏమిటి?

Publish Date:Aug 6, 2025

Advertisement

జీవితంలో మనిషి సుఖాన్ని మాత్రమే కోరుకుంటాడు. బాధకలుగుతుందంటే భయపడతాడు. శారీరక బాధకు మానసికమైన ఆదుర్దా, భయమూ గనక జోడించకపోతే, కేవలం శారీరక బాధ బాధాకరం కాదు. ఒకవేళ ఎక్కువగా ఉన్నప్పటికీ ఆధునిక వైద్యవిధానంలో ఈ బాధను చాలావరకు ఉపశమింపచేయగలిగి ఉన్నారు.

కానీ బాధను ఓర్చుకోడం కూడా కొంత నేర్చుకోవాలి. అసలు ఓర్వలేనంటూ బాధకలిగి కలగకముందే పెయిన్ కిల్లర్ వేసేసుకుంటే ఇక బాధ ద్వారా ప్రకృతి మనిషికి నేర్పగలిగింది కానీ, మనిషి నేర్చేదికానీ ఏమీ వుండదు. బాధ నేర్పేదేమిటనే ప్రశ్న కలగవచ్చు. నిజానికి జీవితంలో మనం నేర్చుకునేది చాలామటుకు బాధద్వారే గానీ సుఖం ద్వారా కాదు. సుఖం మనిషిని మత్తులో ముంచుతుంది. బాధ ఏ రంగంలో ఏ అవయవంలో మనకు కలుగుతుందో, ఆ విషయం మొత్తం విశదంగా తేట తెల్లంగా సంపూర్ణంగా మనకు తెలియజేస్తుంది. 

ప్రేయసీ ప్రియుల హృదయాలు విరహవేదనను అనుభవించినప్పుడే ప్రేమ నిజంగా ప్రకటితమవుతుంది. స్త్రీ పురిటినొప్పులు పడినప్పుడు కానీ నూతనసృష్టి ప్రారంభం కాదు. గౌతముడు దుఃఖాగ్నిని అనుభవించినందునే సత్యాన్వేషకుడైనాడు. ఒక శ్వేతజాతీయుడు దక్షిణాఫ్రికాలో మోహన్ దాస్ కరంచంద్ గాంధీ అనే వ్యక్తిని అర్థరాత్రి రైలునుండి బయటికి తోసేస్తే, చలిలో వణుకుతూ స్టేషన్లో కూర్చున్నందునే గాంధీ హృదయంలో శ్వేత జాత్యహంకారాన్ని నిర్మూలించాలనే అకుంఠిత దీక్ష బయలుదేరింది.

పురాణకాలం నుండీ ఆధునిక కాలం వరకూ బాధలేకుండా ప్రయోజనకరమైన పని ఏదీ జరగలేదు. ప్రజలు బాధలకు గురియైన తర్వాతగానీ అవతార పురుషులుగా మార్లు చెందలేదు.  మనిషి బాధపడిన తర్వాతగానీ జ్ఞానము ఉదయించదు. బాధనెరగని జీవితం పరిపూర్ణమైన జీవితం కానేకాదు.

బాధకీ, భక్తికీ దగ్గర సంబంధమని తోస్తుంది. “బాధలకొరకే బ్రతికించితివా” అనే పాటను సక్కుబాయి నిజజీవితంలో పాడినా పాడకపోయినా, ఆ బాధామయ జీవితంలోనే ఆవిడ అనేకసార్లు మూర్ఛిల్లడం, అనేకమార్లు ఆవిడకు పాండురంగ విఠల్ దర్శనమివ్వడం జరిగింది. పరమాత్ముడైన శ్రీకృష్ణుణ్ణి మరచిపోకుండా వుండడానికి తరచూ తనకు బాధలు కలిగించమని ప్రార్థించింది కుంతీదేవి.

బాధలోగానీ భగవంతుడు కనిపించడన్నమాట, “ఎంత బాధపడ్డానో, దేవుడు కనిపించాడనుకోండి” అని వారూ, వీరూ ఉత్తుత్తగా అనడం వింటుంటాం. నిజంగా అంత బాధపడివుండరు. దేవుడు కనిపించీ వుండడు. కానీ నిజంగా బాధపడితే దేవుడు కనిపించడం కూడా యథార్థమే అయివుండాలి. భక్తరామదాసుకు అలాగే కనిపించాడు. హృదయవేదనకు గురైన త్యాగరాజుకు అలాగే కనిపించాడు. ఆవేదనలో నుండే అద్భుతమైన భక్తి సంగీత సాహిత్యాలు వెల్లువలై పొంగి ప్రవహించాయి.

మామూలు మనిషికి బాధ అంటే ఎంత భయమో, మరణం ఆసన్నమవుతోంది అంటే అంతకు పదిరెట్లు భయం. కానీ స్థిరచిత్తులైన వారికి మరణం సమీపిస్తున్నదంటే, తాము నిర్ణయించుకున్న కర్తవ్యం పూర్తి చేయాలనే పట్టుదల అధికమవుతుంది. ప్రఖ్యాత జర్మన్ సంగీత స్రష్ట ఫ్రెడరిక్ షోపోన్ ఆరోగ్యం క్షీణిస్తున్న రోజులలో ఇక తన జీవితకాలం సమాప్తం కానున్నదనే సంకోచం ఏర్పడింది. అందుకని మరింత పూనికతో సంగీతాన్ని కంపోజ్ చేస్తుండేవాడు.

తరచూ తీవ్రమైన అనారోగ్యానికి గురవడం వల్ల షోపోన్ ఇక బ్రతకడేమోననే అనుమానం ఊరివారందరికీ తరచూ కలుగుతుండేది. షోపోన్ మరణించాడనే వార్త వ్యాపించినా అందరూ ఇట్టే నమ్మేవారు.

షోపోన్ తన వైద్యులిచ్చిన రిపోర్టుల సంగ్రహాన్ని ఇలా తెలియజేసుకున్నాడు. " ఒక వైద్యుడు నేను ఖాయంగా చనిపోతానని తెలియజేశాడు. మరొక వైద్యుడు ఇక నేను మరణించడానికి అట్టే కాలవ్యవధి లేదన్నాడు. మూడో వైద్యుడు నేను గతించాననే ప్రకటించేశాడు. ఏంచేయను?" అని తన నిస్సహాయతను ప్రకటించాడు. తన పరిస్థితి తరచూ అంతగా విషమంగా లేదన్నమాట.

షోఫోన్ బాధతోనే గతించాడు. అయితేనేమి ఈ భూలోకవాసులకు గాంధర్వ గానమందించి వెళ్ళాడు. నిజానికి షోపోన్ యొక్క అలౌకిక సంగీతం అతడి బాధాతప్త హృదయం నుండి జనించింది. షోపోన్ మూలుగే మహాద్భుతమైన మ్యూజిక్ అయింది.

ఇదీ మనిషికి బాధ, దుఃఖం, కష్టం నేర్పించే గొప్ప పాఠం, అది అందించే గొప్ప బహుమానం.                      

                                     ◆నిశ్శబ్ద.

By
en-us Political News

  
కొందరు చాలా లోతుగా ఆలోచిస్తారు.  ఈ కారణంగా చాలా విషయాలు వారిలో సందేహాలుగానో,  నిర్ణయాలుగానో, అబిప్రాయాలుగానో ఉంటాయి.  వాటిని బయటకు చెప్పాలంటే ఏదో సంకోచం ఉంటుంది...
కొత్త అనే పదంలోనే బోలెడంత ఆశ ఉంటుంది.  ప్రతి ఒక్కరూ తమకు కొత్త అనే పదం నుండి ఎంతో గొప్ప మేలు జరుగుతుందని అనుకుంటారు.  అలా జరగాలని కూడా కోరుకుంటారు.  అందుకే రేపు అనే రోజు మీద కూడా చాలా ఆశ ఉంటుంది అందరికీ...
మత విశ్వాసాల ప్రకారం యేసుక్రీస్తు డిసెంబర్ 25న జన్మించారు. క్రైస్తవ మతంలో యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా భావిస్తారు. ఆయన ప్రపంచానికి ప్రేమ, క్షమ, సేవ, త్యాగం యొక్క మార్గాన్ని చూపించాడు. బైబిల్ ప్రకారం ఆయన బెత్లెహెంలో జన్మించాడు.
ప్రపంచంలోని దేశాలన్నీ జరుపుకునే వేడుకలలో క్రిస్మస్ కూడా ఒకటి.  భారతదేశంలో కంటే విదేశాలలోనే క్రిస్మస్ వేడుకలు మరింత గొప్పగా, వైభంగా,  సాంప్రదాయంగా జరుగుతాయి.  అయితే ఈ వేడుకలు కూడా..
తెలివి లేని వెధవ.. ఇలా ఎవరైనా అంటే వెంటనే కోపం వస్తుంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫీలవుతారు. మరీ ముఖ్యంగా తాము తెలివైన వాళ్లం అని నిరూపించడానికి ఏదో ఒకటి చేస్తారు.  సమయం సందర్భం...
గణితం ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. చిన్న పిల్లల నుండి చదువు రాని వారి వరకు ప్రతి ఒక్కరు రోజువారి జీవితంలో గణితాన్ని ఉపయోగిస్తూనే ఉంటారు. కానీ పెద్దవుతున్న కొద్ది చాలామందిలో గణితం అనేది ఒక భయం కింద నాటుకుపోతుంది. కానీ గణితంతో గమ్మత్తులు చేసి ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టిన గణిత మేథావి, శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజ్ డిసెంబర్ 22వ తేదీన జన్మించారు. ఈ సందర్బంగానే ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తేదీని జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే....
ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని అపార్థాలు ఎదురైనా, ఎంత అరుచుకున్నా.. బంధాలు విడిపోకుండా వాటిని కలిపి ఉంచేది ప్రేమ మాత్రమే.  ప్రేమ లేనప్పుడు అన్ని ఉన్నా ఏమీ లేనట్టే ఉంటుంది...
పెళ్లయ్యాక భార్యభర్తల మద్య గొడవలు అనేవి చాలా సహజం.  చాలా మంది భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు ఇంటి గొడవలు అని చెబుతారు. అవి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే గొడవలే అయినా,  ఇంటికి, కుటుంబానికి సంబంధించినవి అయినా టోటల్ గా ప్రతి భార్యభర్త జంట..
నేటి కాలంలో అమ్మాయిలు అబ్బాయిలతో సహా అన్ని రంగాలలో రాణిస్తున్నారు.  అన్ని పనులు చేయగలుగుతున్నారు. కొన్ని సందర్బాలలో అబ్బాయిల కంటే ధైర్యాన్ని చూపగలుగుతున్నారు. అయినా సరే అమ్మాయిల విషయంలో సమాజం నుండి ఇంటి వరకు ప్రతి చోట ఒక చిన్నతనం కనిపిస్తుంది....
ఉద్యోగం చేస్తున్నాం అయినా సంపాదన సరిపోవడం లేదు.. ఈ మాట చాలామంది చెబుతూ ఉంటారు.  ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో అవసరాలు,  ఖర్చు,  కలలు ఎక్కువ.. కానీ సంపాదన మాత్రం అరకొరగానే ఉంటుంది. వచ్చే సంపాదన సరిపోక మెరుగైన సంపాద వచ్చే  ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటారు.
తల్లిదండ్రులను, తోడబుట్టిన వారిని ఎవరూ ఎంచుకోలేరు.  అవి దేవుడు ఇచ్చే బందాలు.  కానీ ప్రతి వ్యక్తి స్నేహితులను ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. మంచి స్నేహితులు ఉన్న వారి జీవితం చాలా బాగుంటుంది. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితులు...
ప్రతి మనిషి వేర్వేరు వ్యక్తిత్వం కలిగి ఉంటాడు.  ఒకే ఇంట్లో, ఒకే తల్లి కడుపున పుట్టిన వ్యక్తులే వేర్వేరు స్వభావాలను కలిగి ఉన్నప్పుడు బయటి వ్యక్తుల స్వభావం ఒకే విదంగా ఉండటం అనేది జరగదు.  అయితే బయట కొందరిని చూస్తే వీళ్లు అచ్చు మనలాగే ఉన్నారే...
ప్రేమ,  భార్యాభర్తల బంధం,  సహజీవనం.. ఏదైనా సరే.. మనసులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది కీ పాయింట్ గా ఉంటుంది. నేటికాలంలో బంధాలు చాలా పెళుసుగా మారాయి.  చాలా తొందరగా బ్రేకప్ లు  జరుగుతున్నాయి...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.