మంత్రిగా ఉంటూ ఈ చిల్లర చేష్టలేంటి రోజా మేడమ్?

Publish Date:Oct 18, 2022

Advertisement

‘వేసిన రాయినల్లా ఒప్పుకుంటే.. వెర్రోడే గెలిచాడని’ సామెత ఒకటి ఉంది. అంటే.. ఆ మాదిరిగా ఉంది ఏపీ పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా తీరు అని పలువురు రాజకీయ నేతలు, ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.  విశాఖపట్నం విమానాశ్రయంలో రోజా ప్రవర్తించిన తీరుతో అనేక మంది ఆమెపై  అగ్గిమిద గుగ్గిలం అవుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ ఎయిర్ పోర్టుకు వస్తున్న సందర్భంగా ఆయనకు అఖండ స్వాగతం పలికేందుకు వచ్చిన జనసేన శ్రేణులు, నేతలను రెచ్చగొట్టే విధంగా మంత్రి రోజా ‘వేలు’ చూపించడంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది. మంత్రై ఉండీ అలాంటి చిల్లర చేష్టలేమిటని ప్రశ్నిస్తున్నారు.

అమరావతే ఏకైక రాజధాని అన్న  డిమాండ్ తో ఆ ప్రాంత రైతులు అమరావతి టూ అరసవిల్లి మహా పాదయాత్ర ఉత్తరాంధ్రకు సమీపిస్తున్న క్రమంలో ‘విశాఖ గర్జన’ పేరుతో అధికార వైసీపీ ఆధ్వర్యంలో నాన్ పొలిటికల్ జేఏసీ పేరుతో శనివారం (అక్టోబర్ 15) జరిగిన కార్యక్రమంలో ఆ గర్జనలో మంత్రి రోజాతో సహా పలువురు ఇతర మంత్రుల, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలను అమరావతి రైతులపై రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేశారు. ఆ తర్వాత తిరిగి వెళ్లేందుకు రోజా సహా వైసీపీ నేతలు, కొందరు మంత్రులు కూడా విశాఖ విమానాశ్రయానికి వెళ్లారు.

అదే సమయంలో ఉత్తరాంధ్రలో మూడు రోజుల పర్యటన కోసం, ‘జనవాణి’ కార్యక్రమం నిర్వహించేందుకు వస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ను స్వాగతించేందుకు జనసేన నేతలు, శ్రేణులు ఇసుక వేస్తే రాలనంత సంఖ్యలో ఎయిర్ పోర్టుకు వచ్చారు. ఆ సందర్భంగా ఎయిర్ పోర్టు ఆవరణలో రోజా తన వేలు చూపిస్తూ వారిని రెచ్చగొట్టారు. దాంతో జనసైనికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకోవడం.. మంత్రులకు, వైసీపీకీ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరిగింది. ఆ సందర్భంగానే మంత్రుల కార్లపై దాడి జరిగింది.

మంత్రులు విశాఖ ఎయిర్ పోర్టుకు వచ్చేటపుడు తాను అక్కడే ఉన్నానని, జనసేన నేతలు, కార్యకర్తలు హుందాగా వ్యవహరించారని టీడీపీ నేత బుద్దా వెంకన్న మంగళవారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. జనసైనికులకు మంత్రి రోజా వేలు చూపించారు. వేలు చూపించడానికి అర్థం ఏమిటో రోజాయే చెప్పాలి అని బుద్దా వెంకన్న అన్నారు. ఇటు జనసైనికులు కూడా రోజా వ్యవహరించిన తీరుపై కారాలు మిరియాలు నూరుతున్నారు. రోజా మరీ  హద్దుమీరి  వ్యవహరిస్తున్నారంటూ ఫైరవుతున్నారు. రోజా వేలు చూపించిన వీడియో క్లిప్పింగ్ చూసిన పలువురు ముక్కున వేలు వేసుకుంటున్నారు. ఓ మహిళ అయి ఉండీ, పైగా మంత్రి పదవిలో ఉండీ ఆమె అటువంటి చేష్టలకు పాల్పడటాన్ని తప్పుపడుతున్నారు.  

రోజా ఇలా అసభ్యంగా ప్రవర్తించడం ఇదే తొలిసారి కాదని జనం గుర్తుచేసుకుంటున్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు.. అప్పటి సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా.. అప్పటి మంత్రి పీతల సుజాతపైన కూడా ‘వడ్డాణం’ అంటూ ఆమె ప్రదర్శించిన హావభావాలు చూసిన ప్రతి ఒక్కరూ తప్పుపట్టారు. అలాగే అసెంబ్లీలోనే  టీడీపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడి వైపు చూస్తూ  ‘… కోస్తా’ అంటూ ఆమె చేసిన విన్యాసం కూడా పలువురిని విస్మయా నికి గురిచేసింది.   మంత్రి పదవి  చేపట్టిన తరువాత  అయినా హుందాగా ప్రవర్తించకుండా ఇలాంటి చిల్లర చేష్టలకు పాల్పడుతుండాన్ని జనం అసహ్యించుకుంటున్నారు. రోజాకు ఇప్పటికైనా కాస్త ఇంగితం వస్తే బాగుండు అని వ్యాఖ్యానిస్తున్నారు.

By
en-us Political News

  
2022 నవంబర్ లో అప్పటి వైసీపీ సర్కార్ రోడ్డు విస్తరణ పేరుతో మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఇప్పటం అనే కుగ్రామంలో ఇళ్ల ను కూల్చివేసింది. ఆ సమయంలో పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటించి బాధితులకు అండగా నిలిచారు. అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ గ్రామాన్ని సందర్శిస్తానని అప్పట్లో మాట ఇచ్చారు.
పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను ఇంత కాలం వ్యతిరేకిస్తూ వచ్చిన లొంగిపోయిన మావోయిస్టు నేతలు ఇప్పుడు అదే వ్యవస్థ ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని భావిస్తున్నారు. ఇందుకు తాజాగా మావోయిస్టు మాజీ అగ్రనేత మల్లోజుల ఇక ఆయుధాలు చేపట్టబోమంటూ చేసిన ప్రకటనే సాక్ష్యంగా నిలుస్తోంది.
దానం విషయంలో మాత్రం ఆయన అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం, ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీలోకి దిగడంతో.. ఇవే కోర్టులో , అలాగే స్పీకర్ ఎదుట తిరుగులేని ఆధారాలుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో దానంపై అనర్హత వేటు పడటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
మొత్తం మీద ఆ కేసులో కీలక మలుపునకు ఈ పెన్ డ్రైవ్ ఆధారం అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని దర్యాప్తు అధికారులు అంటున్నారు. ఈ కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి నివేదికను కోర్టుకు సమర్పించాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో 9 మంది అధికారులతో కలిసి ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
పార్టీ పగ్గాలు చేపట్టడానికీ, ప్రధాని మంత్రి పదవిని అధిష్టించడానికి కాంగ్రెస్ లో సమర్థత ఉన్న నేత తన సతీమణి ప్రియాంక వధేరా గాంధీ మాత్రమేనంటూ రాబర్ట్ వధేరా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఈ కార్యక్రమానికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. అలాగే వైఎస్ కుటుంబీకులంతా హాజరయ్యారు. అయితే ఈ వేడుకలకు వైఎస్ తనయ వైఎస్ షర్మిల మాత్రం హాజరు కాలేదు.
తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ పార్టీలకు ఫండ్స్ బాగానే గిట్టుబాటయ్యాయి. అయితే.. ఏపీలో పవర్‌లో ఉన్న టీడీపీ, జనసేన కంటే వైసీపీ కలెక్షన్లే ఎక్కువగా ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది.
అంబటి ఏమన్నారంటే.. 2024 ఫలితాలను అర్ధం చేసుకోవడంలో తెలుగుదేశం కూటమి పార్టీలు విఫలమయ్యాయట. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల కారణంగానే కూటమి ఆ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిందట.. ఇప్పుడు ఈ ఏడాదిన్న కాలంలో జనానికి తత్వం బోధపడి.. జగన్ పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారట. అంబటి భాష్యం విన్న వైసీపీయులే ఆశ్చర్యపోతున్నారు.
ఆదివారం తన 53వ పుట్టిన రోజు జరుపుకున్న జగన్ కు చంద్రబాబు, నారా లోకేష్, వైఎస్ షర్మిల తదితరులు సామాజిక మాధ్యమం ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు ప్రతిగా జగన్ కూడా ఒక్క మంత్రి లోకేష్ కు తప్ప మిగిలిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ రిప్లై ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి దయనీయంగా మారిందన్న ఆయన గత పదేళ్ల అధికార గర్వంతో విర్రవీగిన నేతల కండలు ఇప్పుడు కరిగిపోయాయని ఎద్దేవా చేశారు.
రాజకీయ ప్రత్యర్థులే కాదు.. ప్రభుత్వ విధానాలు సరిగా లేవన్న సామాన్యులపై కూడా జగన్ పాలనలో దాడులు జరిగాయి. ఇక అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలూ సరే సరి. సరే జనం విషయం గుర్తించి 2019లో తాము కట్టబెట్టిన అధికారాన్ని 2024 ఎన్నికలలో లాగేసుకుని అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ చంద్రబాబుకు అప్పగించారు.
చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు పేరుకు పాలమూరును దత్తత తీసుకుని, అభివృద్ధి పేరిట శంకుస్థాపన ఫలకాలకే పరిమితమయ్యారనీ, ఆయన హయాంలో శంకుస్థాపన ఫలకాలకు అయిన ఖర్చుతో ఏకంగా ఓ ప్రాజెక్టే కట్టవచ్చంటూ విమర్శలు గుప్పించారు.
ఆదివారం జగన్ పుట్టిన రోజు సందర్భంగా షర్మిల అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆ తెలపడంలోనూ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. చెల్లెలిగా కాకుండా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల వైసీపీ అధ్యక్షుడు జగన్ గారికి అని సంబోధిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.