రాజాసింగ్ ను  పొగడ్తలతో ముంచెత్తిన బండి సంజయ్  మతలబేంటి? 

Publish Date:Apr 6, 2025

Advertisement

తెలంగాణ బిజెపి సారథి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి టార్గెట్ గా హైద్రాబాద్ కు చెందిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్  చేసిన విమర్శల నేపథ్యంలో పార్టీలో అంతర్యుద్దం  మొదలైంది. రాజాసింగ్ వ్యాఖ్యలను పార్టీ ఇంతవరకు ఖండించలేదు. నేతలంతా మౌనంగానే ఉంటున్నారు. రాజాసింగ్ కు సంఘీభావంగా ఎవరూ నిలబడలేదు. అయినా కేంద్రమంత్రి బండి సంజయ్ రాజాసింగ్ వ్యాఖ్యలను తప్పు పట్టలేదు సరి కదా  ఆయనకు సపోర్ట్ గా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. రాజాసింగ్ గొప్ప దేశభక్తుడని  హిందూ మతాన్ని పరిరక్షిస్తున్న నేత అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. పార్టీ అధ్యక్షుడైన కిషన్ రెడ్డిని విమర్శించిన రాజాసింగ్ ను పొగడ్తలతో ముంచెత్తడం వెనక మతలబేంటి అనే చర్చ ప్రారంభమైంది.  మహమ్మద్ ప్రవక్త మీద వ్యాఖ్యలు చేయడంతో రాజాసింగ్ ను కేంద్ర నాయకత్వం గత ఎన్నికల ముందే సస్పెండ్ చేసింది. వరుసగా గోషామహల్ నియోజకవర్గం నుంచి గెలుస్తూ వచ్చిన రాజాసింగ్ హైద్రాబాద్ కు చెందిన ఏకైక ఎమ్మెల్యే. అయినప్పటికీ పార్టీ కేంద్ర నాయకత్వం  ఆయనను సస్పెండ్ చేయడంతో పార్టీలో  ఏ ఒక్కరూ ఆయన వెన్నంటి నడవలేదు. కనీసం ఆయనకు కలవడానికి కూడా ఇష్టపడలేదు. గత ఎన్నికల ముందు రాజాసింగ్ బర్తేడే వేడుకలు జరుపుకున్నప్పుడు ఏ ఒక్క నేత రాజాసింగ్ కు బర్త్ డే విషెస్ చెప్పలేదు. కానీ  తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో     బండి సంజయ్ రాజాసింగ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. బండి సంజయ్ ను తెలంగాణ అధ్యక్ష పదవి నుంచి తప్పించినప్పుడు కూడా రాజాసింగ్ బండి సంజయ్ వెంటే నిలిచారు. తాజాగా  హైద్రాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల  బిజెపి అభ్యర్థిగా  గౌతం రాజును పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించగానే రాజాసింగ్ మండిపడ్డారు. మేకప్ మెన్ లు, టేబుళ్లు తుడిచే వారికి టికెట్లు ఇస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్ వ్యాఖ్యలను బండి సంజయ్ తప్పు పట్టకుండా పైగా పొగడ్తలతో ముంచెత్తడం చర్చనీయాంశమైంది.  తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి రేసులో బండి సంజయ్ ఉన్నారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. రాజాసింగ్ ను వెనక నుంచి ఎవరో ప్రోత్సహించడం వల్లే నేరుగా కిషన్ రెడ్డిపై రాజాసింగ్ వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. రాజాసింగ్ కు గోషామహల్ ఎమ్మెల్యే టికెట్ కూడా బండి సంజయ్ ఇప్పించినట్లు ప్రచారంలో ఉంది. తాజా ఘటనలో కూడా పార్టీ అధిష్టానం రాజాసింగ్ పై చర్య తీసుకోకుండా బండి సంజయ్ అడ్డు గోడగా నిలుస్తున్నట్లు  ప్రచారంలో ఉంది. 

By
en-us Political News

  
తెలుగు రాష్ట్రాల్లో టెండరింగ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందనీ, కేవలం మైనింగ్ మాత్రమే కాకుండా, విద్యుత్, ఇరిగేషన్, రోడ్లు ఇలా ప్రతి రంగంలోనూ నచ్చిన వారికి కాంట్రాక్టులు కట్టబెడుతూ అడ్డగోలు దోపిడీకి తలుపులు బార్లా తెరిచారని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
జగన్ పాలనా వైఫల్యాలు అంటూ వైసీపీయులు కలలో కూడా అంగీకరించడానికి సాహసించని మాటలను పేర్ని నాని నోటి వెంట రావడం రాజకీయవర్గాలలో చర్చనీయాంశంగా మారింది. జగన్ పాలనా వైఫల్యం కారణంగానే 2019 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని ఘోరపరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందని పేర్ని నాని యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంగీకరించేశారు.
రాజకీయాల్లో నాయకులపై విమర్శలు, ఆరోపణలు సహజం. వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవడం అన్నది సాధారణంగా అధకారంలో ఉన్న వారిపై కంటే అధికారంలో లేని వారిపైనే ఎక్కువగా జరుగుతుంటుంది. అయితే ఈ పద్ధతిని బ్రేక్ చేసి.. ఇది ప్రజాస్వామ్యం, తన, పర తేడా లేకుండా ఎవరిపై ఆరోపణలు వచ్చినా విచారణ జరుపుతామని,తప్పు చేశారని నిర్ధారణ అయితే చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ చెబుతున్నారు.
ముంబైపై పట్టు సాధించడమే లక్ష్యంగా థాక్రే బదర్స్ కలవడం ప్రాథాన్యత సంతరించుకుంది. ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ-షిండే కూటమి విజయం సాధించే అవకాశం ఉందని తెలినప్పటికీ, థాక్రేల కలయిక నేపథ్యంలో ఫలితం ఎలా ఉంటుందన్న ఉత్కంఠ ముంబై వాసులలోనే కాకుండా, దేశ వ్యాప్తంగా వ్యక్తం అవుతోంది.
రాష్ట్రంలో మునిసిపోల్స్ దగ్గర పడుతున్న తరుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా శుక్రవారం నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నిర్మల్ జిల్లాలో సదర్ ఘాట్ బ్యారేజీకి, అలాగే ఆదిలాబాద్ జిల్లాలో చనాక-కోరట పంప్ హౌస్ కు ప్రారంభోత్సవం చేయనున్నారు.
రాయలసీమ లిఫ్ట్ విషయంలో మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఆ ప్రాంతానికి ద్రోహం చేశారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు.
తెలుగువన్ ఎండీ రవిశంకర్ కంఠమనేని సారథ్యంలో వాస్తవ వేదిక ఎనిమిదో ప్రోమో విడుదలైంది.
అనంతపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత దగ్గుబాటి ప్రసాద్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.
తెలంగాణలో ఒక రైల్వే అండర్ బ్రిడ్జి పనుల శంకుస్థాపన సమయంలో ఈ బ్రిడ్జి పనులకు నిధులు తెచ్చింది తామంటే తామంటూ బీజేపీ, బీఆర్ఎస్ లు క్రెడిట్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ వ్యవహారం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డిగా మారింది.
స్కిల్ కేసు పేరుతో జగన్ సర్కార్ 2023 సెప్టెంబర్ 9నచంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 53 రోజుల పాటు రాజమహేంద్రవరం జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు ఆ తరువాత హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆధునిక శుక్రాచార్యుడిగా అభివర్ణించారు. శుక్రాచార్యుడు రాక్షసుల గురువన్న సంగతి తెలిసిందే. ఇక కేటీఆర్ ను అయితే ఆయన ఏకంగా మారీచుడిగా అభివర్ణించారు.
మేడారంలో తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ నెల 28 నుంచి మేడారం జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో మేడారం వేదికగా కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
పండగైనా, పబ్బమైనా చంద్రబాబుకు ప్రజా సమస్యల పరిష్కారంపైనే దృష్టి ఉంటుందన్న సంగతి తెలిసిందే. అలాగే ప్రగతి అడుగులు నెమ్మదించకూడదన్న పట్టుదలా ఉంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.