ప్రజాప్రతినిథుల విందు వెనుక లోకేష్ ప్లానేంటి?

Publish Date:Feb 27, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, అనుసరిస్తున్న విధానాలు, అలాగే  రాష్ట్రంలో రానున్న రోజులలో రాజకీయపరిస్థితులు ఎలా మారబోతున్నాయి. క్వాంటం, ఏఐ అంటూ సాంకేతికతపై చంద్రబాబు సర్కార్  చూపుతున్న ప్రాధాన్యత తదితర విషయాలపై ‘వాస్తవ వేదిక’తో తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ చర్చించారు. అత్యంత విశ్లేషణాత్మకంగా సాగిన ఈ చర్చలో  నారా లోకేష్ ఆత్మీయ విందుపై డోలేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

లోకేష్ డిన్నర్ డిప్లమసీని తాను గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి ఒక మార్గంగా ఎంచుకున్నారన్నారు.  నారా లోకేష్ గత కొన్నేళ్లుగా ఎమ్మెల్యేలతో, పార్టీ సీనియర్లతో పెరిగిన దూరాన్ని తగ్గించుకోవడానికి ఆత్మీయ విందును ఒక దౌత్య మార్గంగా లోకేష్ ఎంపిక చేసుకున్నారన్నారు. అంతే కాకుండా ముందుముందు ఆయన సీఎం కావడానికి ఈ ఆత్మీయ విందు కార్యక్రమం పీఆర్ ఎక్సర్ సైజ్ గా డోలేంద్ర ప్రసాద్ అభివర్ణించారు. గతంలో నారా లోకేష్ తనకంటూ ఓ టీమ్ ను ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో భాగంగా పార్టీ సీనియర్లను దూరం చేసుకున్నారనీ, ఇప్పుడు ఆ దూరాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నారనీ ఆయన పేర్కొన్నారు.

అందుకు డిన్నర్ డిప్లమసీని ఎంచుకున్నారని అభిప్రాయపడ్డారు. అంతే కాకుండా ఈ కార్యక్రమం భవిష్యత్ లో లోకేష్ సీఎం కావడానికి దోహదపడుతుందన్నారు. ఈ దశలో కంఠంనేని రవిశంకర్ లోకేష్ సీఎంగా ఉండేందుకు పవన్ కల్యాణ్ ఇష్టపడతారా అని ప్రశ్నించారు.  దీనికి డోలేంద్ర ప్రసాద్.. లోకేష్ సీఎం కావాలంటే కావలసింది పవన్ కల్యాణ్ సమ్మతి కాదనీ, ప్రధాని నరేంద్ర మోడీ అంగీకరమని అంటూ.. పవన్ కల్యాణ్ ను రాజ్యసభకు పంపి, కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు లేకపోలేదన్నారు. పైగా ఈ ప్రతిపాదన ఢిల్లీ నుంచే వచ్చిందన్న సమాచారం ఉందన్నారు.  ప్రస్తుత పరిస్థితుల్లోపవన్ కల్యాణ్ సమ్మతి లేకుండా లోకేష్ సీఎం అవ్వడం కష్టసాధ్యమనీ, అందుకే ఆయనకు కేంద్ర మంత్రిపదవి అంటూ మోడీ ద్వారా నరుక్కువస్తున్నారని డోలేంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు.  

అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి మాత్రమే బిల్ గేట్స్ తాజా పర్యటన ఉపయోగపడుతుంది తప్ప మరోటి కాదన్నారు. గతంలో బిల్ గేట్స్ ఏపీ పర్యటన మైక్రోసాఫ్ అధినేతగా ఉన్నప్పుడు జరిగిందనీ, అయితే ఇప్పుడు ఆయన ఆ ఉద్యోగంలో లేరని గుర్తు చేశారు. పైగా ఇప్పుడు డిల్ గేట్స్  తన ఛారిటీ ద్వారా దాతృత్వ కార్యక్రమాలపై  దృష్టి సారించారనీ, అందువల్ల ఇప్పపటి ఆయన పర్యటన, విద్య, ఆరోగ్యం, పాలనలో టెక్నాలజీకి సహకారం అందే అవకాశం అయితే ఉందని డోలేంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు.  ఇక చంద్రబాబు ఘనంగా, గొప్పగా చెప్పుకుంటున్న క్వాంటం వల్ల రాష్ట్రానికి సాంకేతిక గుర్తింపు లభిస్తుంది తప్ప సామాన్య ప్రజలపై, ఐటీ ఉద్యోగాలపై ఇది ఇప్పటికిప్పుడు చూపే ప్రభావం చాలా చాలా పరిమితమన్నారు. ఇక తక్షణ ప్రయోజనం కూడా దాదాపు శూన్యమేనని డోలేంద్రప్రసాద్ అభిప్రాయపడ్డారు. 

వాస్తవ వేదిక పూర్తి చర్చను తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో ఈ కింది లింక్ ద్వారా వీక్షించండి

 

By
en-us Political News

  
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై  చార్జ్‌షీట్‌  విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్  ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.  తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే..  మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి  సొంత నియోజకవర్గానికే  ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.  
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో  గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన  బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న  నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి. 
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.