పేర్ని నాని ఫ్యూచర్ ఏంటో?

Publish Date:May 4, 2022

Advertisement

పేర్ని నాని.. ఏపీలో తాజా మాజీ మంత్రి.. రవాణా, సమాచార శాఖలు నిర్వహించారు.మూడేళ్లు మంత్రి పదవిని అనుభవించారు. సీఎం జగన్ కోరిక మేరకు ఒక్కసారిగా మాజీగా మారిపోయారు. మంత్రి పదవిలో ఉన్నంత కాలం నానిలో మంచి చమత్కారే కనిపించాడు. మీడియా నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు కాస్త వాస్తవాన్నీ.. మరికాస్త వ్యంగ్యాన్ని జోడించి జవాబులిచ్చేవారు. అయితే.. చేతిలో పవర్ పోవడంతో ఆయన ఇప్పుడు కోరలు పీకేసిన పాము మాదిరిగా అయిపోయారంటున్నారు. తనను పదవి నుంచి పీకేయడంతో పేర్ని నాని అలిగిన వైనం స్పష్టంగా బయటపడకపోయినా.. మౌనం అయితే వహించిన దాఖలాలే కనిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన నియోజకవర్గానికి వస్తే.. పేర్ని నాని ఆయన పర్యటన దరిదాపుల్లోకి రాకపోవడం అందరి దృష్టికీ వచ్చింది.

పేర్ని నాని తన తండ్రి పేర్ని కృష్ణమూర్తి వారసుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1999లో కాంగ్రెస్ అభ్యర్థిగా మచిలీపట్నంలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2004, 2009లో జరిగిన ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2011లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ విఫ్ గా పనిచేశారు. 2013లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. 2014లో జరిగిన ఎన్నికల్లో పేర్ని నాని టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర చేతిలో 16 వేలకు పైబడి ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో నానికి 59 వేల 403 ఓట్లు పోలయ్యాయి. ఇక 2019 ఎన్నికలు వచ్చే సరికి పేర్ని నాని మళ్లీ పుంజుకుని మచిలీపట్నం నుంచే సుమారు 6 వేల ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర పైనే గెలిచారు. అప్పుడాయనకు 66 వేల 141 ఓట్లు వచ్చాయి.

పేర్ని నాని మంత్రి పదవిలో ఉన్నప్పుడు తన సామాజికవర్గానికే చెందిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై బాగా విరుచుకుపడేవారు. పవన్ కళ్యాణ్ ను పార్ట్ టైం పొలిటీషియన్ అని.. బీజేపీని ప్రేమిస్తూ.. చంద్రబాబుకు కన్నుకొడుతున్నారంటూ.. పవన్ మాటలు మారుస్తారని, నిలకడ లేని రాజకీయ నేత అని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూతో పోల్చిన పవన్ కళ్యాణ్ బీజేపీ చంక ఎక్కారని ఘాటు విమర్శలు చేశారు. అలాగే ప్రజా సమస్యలపై గళమెత్తుతున్న టీడీపీ పైనా పేర్ని నాని ఒంటికాలిపై లేచి మరీ విమర్శలు గుప్పించారు.

మచిలీపట్నం నియోజకవర్గం ఓటర్లలో సగానికి పైగా బీసీలు ఉన్నారు. పేర్ని నాని సామాజికవర్గం ఓటర్లు కూడా అధిక సంఖ్యలోనే ఉంటారు. కొన్ని గ్రామాల్లో అయితే.. కాపులదే పైచేయి. అయితే.. పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్ల కారణంగా ఆ సామాజికవర్గం ఓటర్లు పేర్ని నానిపై ఈ సారి బాగా గుర్రుగా ఉన్నారంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక పేర్ని నానికి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని వారు తెగేసి చెబుతున్నారట. ఇక మచిలీపట్నంలో నియోజకవర్గంలో టీడీపీకి మంచి పట్టు ఉంది. టీడీపీ అభ్యర్థిగా కొల్లు రవీంద్ర గతంలో మంచి మెజార్టీతోనే నెగ్గారు. ఈ సారి మళ్లీ మచిలీపట్నంలో టీడీపీకే మెజార్టీ ఓట్లు లభించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఒక పక్కన పవన్ కళ్యాణ్ ను కించపరిచేలా కామెంట్లు చేయడం, మరో పక్కన ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగల సంఖ్యలో బీసీ సామాజికవర్గాలు ఉండడం కూడా పేర్ని నానికి ఈ సారి విజయావకాశాలు తగ్గిపోయే చాన్స్ ఉందంటున్నారు. నియోజకవర్గం అభివృద్ధికి పేర్ని నాని చేసిందేమీ లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు పేర్ని నాని, కొడాలి నాని ఇసుక లారీలు యధేచ్ఛగా తిరిగాయని, వారిద్దరూ ఇసుక దోపిడీ చేశారని స్థానికంగా చెబుతున్నారు. మచిలీపట్నం చుట్టుకప్కల తోడేసిన ఇసుకను హైదరాబాద్ వరకు తరలించుకుపోయేవారనే విమర్శలు ఉన్నాయి. పేర్ని నాని మంత్రి అయిన తర్వాత సొంత ఆస్తులు బాగా కూడబెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

దానికి తోడు జగన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏపీ ఆర్థికంగా దిగజారిపోవడం, అభివృద్ధి జాడే లేకపోవడం, ఓటర్లకు కావాల్సిన కనీస అవసరాలు కూడా కల్పించలేక చతికిలపడిపోయిన వైసీపీకి వ్యతిరేకత పెరిగిపోతుండడం కూడా పేర్ని నానికి చేదు అనుభవాన్ని మిగిల్చే అవకాశం ఉందంటున్నారు. వీటితో పాటు మచిలీపట్నం నియోజకవర్గంలో సమస్యలు కూడా మూడేళ్లు మంత్రిగా పనిచేసిన పేర్ని నాని అంతగా పరిష్కరించలేదనే విమర్శలు ఉన్నాయి.

మొత్తం మీద ఎన్నో వ్యతిరేకతలను నెత్తిన మూటకట్టుకున్న పేర్ని నానికి ఈ సారి మచిలీపట్నం నియోజకవర్గంలో గెలుపు అవకాశాలు కనుచూపు మేరలో కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

By
en-us Political News

  
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి.
రాజకీయం గురించి కాదు. పార్టీ గురించి కాదు.ఒక నాయకుడి గురించి కూడా కాదు....ఒక తరం గురించి. విజృంభించిన లాఠీల్లో రక్తం చిందించిన ఈ తరం గురించి.
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలతో చెలరేగిన వల్లభనేని వంశీ తాజా లేఖలో మాత్రం చంద్రబాబుకు గౌరవం ఇస్తూ అయ్యా చంద్రబాబుగారూ అని మర్యాదగా సంభోధించారు. అంతే కాకుండా చంద్రబాబు చొరవను, రైతుల పట్ల ఆయనకు ఉన్న అక్కరనూ ప్రశంసలతో ముంచెత్తారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు తిలోదకాలిచ్చి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు కేసుల చిక్కుల్లో నిండా ఇరుక్కుంది. అధికారంలో ఉండగా చట్టాలకు మనం అతీతులం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఒక్కరొక్కరుగా పోలీసు కేసులను, సీఐడీ విచారణలను ఎదుర్కొంటూ, అరెస్టులు, బెయిళ్లు అంటూ న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి పరిస్థితిలో ఉన్నారు.
ఆయన రాజీనామాకు యువత పట్టుబడుతోంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న యువత డిమాండ్ ను పట్టించుకోవడం లేదు. నీట్ పై తొలి సారిగా స్పందించి, సోషల్ మీడియా వేదికగా న్యాయం చేస్తాననీ, లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షిస్తామనీ, అందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామనీ చెప్పిన మోడీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీమానా చేయాలన్న యువత డిమాండ్ ను ఇసుమంతైనా పరిగణనలోకి తీసుకోలేదు.
గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటిని, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంపై విచారణ వేగం పుంజుకుందన్న ఆయన.. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి సరిగ్గా రెండు నెలల ముందు ముంబైలో ఉన్న కాదంబరి జత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి.. ఫోర్జరీ భూలావాదేవీల కేసు సాకుగా చూపి దాదాపు 40 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు.
గత ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ సాధించిన చారిత్రాత్మక విజయం ఆయనకు రాజకీయంగా పెద్ద మైలేజీని ఇచ్చింది. గతంలో ఓటమిని చవిచూసిన చోటే ఐదేళ్ల పాటు నిరంతరం ప్రజల్లో ఉంటూ, సమగ్ర ప్రచారంతో విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మలుపుగా మారింది.
ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ పట్ల దురుసుగా వ్యవహరించి గాయపరచడాన్ని ఖండిచిన ఆయన రక్త గాయమైనా రాహుల్ గాంధీ వెనక్కు తగ్గకుండా పోరాట పటిమ చూపారని కొనియాడిన రేవంత్ రె్డి.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే ప్రాథమిక హక్కులపై కేంద్రం ప్రత్యక్ష దాడికి పాల్పడిందని విమర్శించారు.
తోపులాటలో రాహుల్ గాంధీ గాయపడ్డారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్తం కారింది. పోలీసులు ఆయనను బలవంతంగా నిలువరిస్తున్న సమయంలో ఆయన ముక్కుకు గాయమై రక్తం కారుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి. దీనిపై సర్వ్రతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
మద్యం కుంభకోణంలో ఈడీ విచారణ.. ప్రధాన లబ్ధిదారుడికి చేరువ అవుతోందనీ, ఈ నేపథ్యంలోనే జగన్ పేరు ప్రచారంలోకి వచ్చిందని అంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఈడీ తనకు నోటీసులు పంపే అవకాశం ఉందన్న సమాచారంతోనే మోడీ, అమిత్ షాల అప్పాయింట్ మెంట్ కోసం జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాపు సామాజికవర్గ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పార్టీ లైన్ ను ఇసుమంతైనా ఖాతరు చేయకుండా కాపు ఐక్యత జెండాను భుజానకెత్తుకోవడం పార్టీలో కలకలం రేపింది. ఒక వైపు వైసీపీ అధినేత జగన్.. అంబటి రాంబాబును పార్టీలో కాపు సామాజికవర్గ ఐకాన్ గా ప్రమోట్ చేస్తుంటే.. తోట త్రిమూర్తులు ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలను వేదిక చేసుకుని పార్టీలతీతంగా కాపు నేతలందరూ ఐక్యం కావాలని పిలుపునివ్వడం పార్టీలో కలకలం రేపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.