పవన్ కళ్యాణ్ పయనమెటు?

Publish Date:Jul 15, 2022

Advertisement

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో, అందరికంటే అధికంగా కష్టాల్లో ఉన్న నాయకుడు ఎవరంటే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి,  అనో .. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు.. అనో .అనుకుంటే అదిపొరపాటే అవుతుందని పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే, అందరికంటే అవస్థలు పడుతోంది.. అయోమయానికి గురవుతోంది. అవమానాలను ఫేస్ చేస్తోంది ఆ ఇద్దరూ కాదు. ఆ ఇద్దరికి ఎవరి వ్యూహం వారికుంది, ఎవరి ప్రణాళికలు వారికున్నాయి. కానీ, ఒక నిర్దిష్ట వ్యూహం, ఒక ప్రణాళిక, ఒక  లక్ష్యం ఏదీ స్పష్టంగా లేకుండా, అయోమయంగా దిక్కులు చూస్తున్న నాయకుడు,ఎవరైనా ఉన్నారంటే అది, జన సేన అధినేత పవన్ కళ్యాణ్ అంటున్నారు.

అవును, ఏపీ రాజకీయాల్లో అందరి కంటే అధికంగా మధన పడుతున్న నాయకుకుడు పవన్ కళ్యాణ్. ఆయనకు ఏవేవో ఆలోచనలున్నాయి.కానీ,ఆ ఆలోచనల ఆచరణకు అవసరమైన ఆలంబన లేదు. పవన్ కళ్యాణ్ కు పార్టీ వుంది, కానీ పార్టీ నిర్మాణం లేదు. అయినా కూడా నటుడిగా ఆయనకున్న ఇమేజ్ కారణంగానో లేక క్యాస్ట్ బేస్ ఆధారంగానో ఆయనకు కొంత ప్రజాబలం, ఓటు బలం వుంది.  అయినా, రాజకీయాల్లో మాత్రం ఆశించిన రీతిలో పవన్ ముందడుగు వేయలేక పోతున్నారు. ఆయన అడుగులు ముందుకు పడడం లేదు.  అదలా ఉంచి ప్రస్తుతంలోకి వస్తే, గడచిన నాలుగైదు నెలల్లో పవన్ కళ్యాణ్ వార్తల్లో ప్రముఖంగా కనిపిస్తున్నారు.

కానీ, ఆదే సమయంలో ఆయన ఇటు రాజకీయాల్లో, అటు అభిమానులు, ప్రజల్లో కూడా పలచన అవుతున్నారు. నిజానికి, సమయం సందర్భంగా లేకుండా ఆయన పొత్తుల తేనె తుట్టెను కదిపారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానంటూ చాలా గంభీర ప్రకటన చేశారు. అంతే కాదు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉంచేందుకు బీజేపీ జాతీయ నాయకత్వాన్ని ఒప్పించే బాధ్యత కూడా ఆయన ఎంతో విశ్వాసంగా భుజానికి ఎత్తు కున్నారు. అలాగే, బీజేపే జాతీయ నాయకత్వం ఇచ్చే రోడ్ మ్యాప్ కోసం ఎదురు చుస్తున్నానని మరో పొంతన లేని ప్రకటన చేశారు.  

అయితే, అప్పటి  నుంచి ఇప్పటి వరకు, బీజేపీ జాతీయ నాయకత్వం ఆయన్ని పిలిచిందీ లేదు. మాట్లాడిందీ లేదు. ఎప్పుడో మూడు నెలల క్రితం పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీ అప్పాయింట్మెంట్ కోరారు. కానీ ఇంతవరకు, ప్రధాని కార్యాలయం నుంచి జవాబు లేదు. ఒక్క ప్రధాని మోడీ మాత్రమే కాదు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సహా ఆ పార్టీ జాతీయ నాయకులు ఎవరి నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. బీజేపీ నాయకులు ఎవరూ పవన్ ఆశించిన రోడ్ మ్యాప్ ఊసే ఎత్తడం లేదు. అయితే రాష్ట్ర నాయకులు మాత్రం మీడియా చర్చల్లో ఇప్పటికీ, జనసేనను మిత్ర పక్షం గానే, పేర్కొంటున్నారు. ఇద్దరం కలిసి దుమ్ము దులుపుతామని గంభీర ప్రకటనలు చేస్తున్నారు.  అందుకే, రాజకీయ విశ్లేశకులు ఒకరు, రాష్ట్రంలో బీజేపీకి ఎదిగే అవకాశం, ఆశ రెండూ లేవు కాబట్టి తమ లాగే, జనసేన కూడా ఎదగరాదని అనుకుంటున్నట్లుదని అన్నారు.  సరగాగానే కావచ్చును ఆయన, బీజేపే ధోరణి. వెనకటికో బాల్య వితంతు బామ్మ గారు, కొత్త పెళ్లి కూతురును,నాకు లాగా వర్ధిల్లమని దీవించి నట్లుందని,అన్నారు. అదే విధంగా బీజేపీ మిత్ర పక్షం ముసుగులో జనసేన ఎదుగుదలకు అడ్డుపడుతున్నట్లు ఉందని అంటున్నారు.

అదొకటి అలా ఉంటే, జాతీయ నాయకుల రాష్ట్ర పర్యటనలలో పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా అయినా పలకరించ లేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్ర పర్యటన సందర్భంగా, పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించాలని, జన సైనికులు రోడ్డెక్కి మరీ  డిమాండ్ చేశారు. ప్రదర్శనలు నిర్వహించారు. అయినా,  నడ్డా ఆ డిమాండ్ ను అసలు పట్టించుకోలేదు. రాష్ట్ర పర్యటనలో ఎక్కడా నడ్డా బీజేపీ, జనసేన పొత్తు గురించి ఒక్క ముక్క మాట్లాడలేదు. అసలు పవన్ కళ్యాణ్ పేరు కూడా నడ్డా ప్రస్తావించలేదు.  అలాగే, పుండు మీద కారం చల్లిన విధంగా, ఇటీవల భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు శత జయంతి  ఉత్సవాలలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ కార్యకమానికి, చిరంజీవి సహా చాలా మందికి ఆహ్వానాలు అందాయి, కానీ పవన్ కళ్యాణ్ కు మాత్రం పిలుపు రాలేదు. అంతే కాదు, ప్రధాని మోడీ స్వయంగా చిరంజీవి దగ్గరకు వెళ్లి, ఆలింగనం చేసుకున్నారు. ఆత్మీయంగా పలకరించారు. ఇది ఒక విధంగా పవన్ కళ్యాణ్ ను హర్ట్ చేసిందని, అంటున్నారు.

ఈ నేపధ్యంలోనే పవన్ కళ్యాణ్ మరో సోదరుడు, నాగ బాబు, అల్లూరి జయంతి వేడుకల స్టేజి మీద ఒక్క చిరంజీవి తప్ప అందరు అద్భుతంగా నటించారని, ట్వీట్ చేసి, వివాదానికి తెర తీశారు. జనసేన పార్టీలో క్రియాశీలంగా ఉన్న నాగబాబు, ప్రధానిని ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు సహజంగానే, వివాదంగా మారాయి. నాగబాబు వ్యాఖ్యలను బీజేపీ సీరియస్ గా తీసుకుందని అంటున్నారు.   అదలా ఉంటే, మరీ రీసెంట్ గా బీజేపీ నాయకత్వం పవన్ కళ్యాణ్ ను మరోమారు అవమానించిందని , జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్త పరుస్తున్నారు. బీజేపీ/ఎన్డీఎ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపతి ముర్ము ఏపీ పర్యటన సందర్భంగానూ బీజేపీ నాయకులు పవన్ కళ్యాణ్ ను పట్టించుకోలేదు.ప్రాక్టికల్ గా కాకపోయినా టెక్నికల్ గా జనసేనకు ఒక ఎమ్మెల్యే ఉన్నారు. అదీ కాక పోయినా, మిత్ర పక్ష అధ్యక్షునిగా అయినా, ఆయన్ని పిలిస్తే, బీజేపీకి పోయేదేమీ లేదు. కానీ, పిలవలేదు. ఇది కూడా జనసేన అధినేత గుండెల్లో గుచ్చుకుందని, ఇలా అవమానాలు భరిస్తూ బెజేపీతో కలిసి కాపురం చేసేకంటే, వదిలేసి తమదారి తాము చుకోవడం ఉత్తమమనే ఆలోచన పవన్ కళ్యాణ్  చేస్తున్నారని అంటున్నారు. ఈ నేపధ్యంలోనే పవన్ కళ్యాణ్ తమ సన్నిహితుల వద్ద, బీజేపీకి తమ అవసరం లేదేమో, అని అన్నట్లు తెలుస్తోంది.

ఈ నేపధ్యంలో  పవన్ కళ్యాణ్ మరోమారు, బీజేపీతో కటీఫ్ కు రంగం సిద్దచేసుకున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. దసరా పండగ తర్వాత,అక్టోబర్ లో పవన్ కళ్యాణ్ రాష్ట్ర యాత్ర మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారు. అదే సమయానికి బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలని నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. నిజానికి, పవన్ కళ్యాణ్, మార్చిలో జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పార్టీ క్యాడర్ ముందు మూడు ఆప్షన్స్ ఉంచారు. ఇక ఇప్పుడు, రాష్ట్రంలో వైసీపీ, జగన్ రెడ్డి అరాచక పాలనను అంతమొందించేందుకు, 2024 ఎన్నికలలో, తెలుగు దేశం  పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే నాల్గవ ఆప్షన్ ముందుకు తెస్తున్నారని అంటున్నారు. నిజం వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించాలన్నా, జనసేన అసెంబ్లీలో అడుగు పెట్టలన్నా అది టీడీపీతో పొత్తుతో మాత్రమే సాధ్యమవుతుంది, కానీ  బీజేపీతో పొత్తు వలన అయ్యే పని కాదు. ఇది అందరికీ తెలిసిన వాస్తవం. అందుకే పవన్ కళ్యాణ్  అక్టోబర్ యాత్రకు ముందే, కమలానికి గుడ్ బై చెప్పి సైకిల్ తో జట్టు కటడం ఖాయమని అటు పార్టీ వర్గాలు, ఇటు రాజకీయ పరిశీలకులు కూడా గట్టిగా భావిస్తున్నారు.

By
en-us Political News

  
జములమడుగులో ఊహించిన దానికంటే అత్యధికంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని వివరించారు. వైసిపి అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి వైఖరిని తూర్పారబట్టారు.. ప్రజలను కన్ఫ్యూజ్ చేసి మేలు పొందాలని ప్రయత్నిస్తున్నారంటూ జగన్ పై విమర్శలు కురిపించారు. పకృతిలో పంచభూతాల కూడా తన అధీనంలోనే ఉన్నాయని చెప్పుకునే పెను భూతంగా ఆయన జగన్ రెడ్డిని అబివర్ణించారు.
ఈ కీలక పరిణామం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఐదు కోట్ల ఆంధ్రుల చిరకాల కోరిక నేడు నెరవేరిందని పేర్కొన్నారు. అమరావతి చట్టానికి ఆమోదం తెలిపి రాష్ట్ర భవిష్యత్తుకు భరోసానిచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రజల తరఫున ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ చట్ట సవరణకు ఆమోదముద్ర వేయడంతో, కేంద్ర న్యాయశాఖ తుది నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ పరిణామంతో అమరావతికి పూర్తిస్థాయిలో చట్టబద్ధత లభించినట్లయింది.
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.
రాజకీయం అంటే కేవలం అధికారంలో ఉండటం మాత్రమే కాదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని వైసీపీకి హితవు పలుకుతున్నట్లుగా మాట్లాడుతూనే.. ఆ పార్టీకి కర్తవ్యబోధ చేశారు.
బిజెపికి 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్‌తో పునాదులు పడ్డాయి. అక్క‌డి నుంచి ఈ పార్టీ అంచ‌లంచ‌లుగా ఎదిగి నేడీ స్థితికి చేరుకుంది. గ‌తంలో వాజ్ పేయి ఈ పార్టీకి అధికార వాస‌న రుచి చూప‌డంతో.. ఇప్పుడు వ‌రుస‌గా మూడు ప‌ర్యాయాల పాటు అధికారం చేజిక్కించుకుని.. ప్ర‌స్తుతం అప్ర‌తిహాత జైత్ర యాత్ర చేస్తోంది.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఎండలు మండిపోతాయి. వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది.
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.